పారిశుద్ధ్య కార్మికులకు మూడుసార్లు హాజరు
నగరంలో పారిశుద్ధ్య కార్మికుల నుంచి ఇకపై రోజుకు మూడుసార్లు హాజరు తీసుకునేలా జీహెచ్ఎంసీ నిబంధన తీసుకొచ్చింది.
ఈనాడు, హైదరాబాద్: నగరంలో పారిశుద్ధ్య కార్మికుల నుంచి ఇకపై రోజుకు మూడుసార్లు హాజరు తీసుకునేలా జీహెచ్ఎంసీ నిబంధన తీసుకొచ్చింది. కొందరు ఎస్ఎఫ్ఏ(శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్)లు నకిలీ కార్మికులతో జీతాలను కొల్లగొడుతున్న ఘటనలు వెలుగులోకి రావడంతో.. కొత్త నిబంధన తీసుకొచ్చామని ఐటీ విభాగం గురువారం ప్రకటించింది. ఇప్పటికే వేలి ముద్రలతో హాజరు తీసుకునే పాత పద్ధతిని రద్దుచేసి, ముఖాన్ని స్కానింగ్ చేసే విధానం ప్రవేశపెట్టామని అధికారులు తెలిపారు.కొందరు సూపర్వైజర్లు, సహాయ వైద్యాధికారులు ముఖాన్ని స్కాన్చేసే సాఫ్ట్వేర్లోని లోపాలను కూడా సొమ్ము చేసుకుంటున్న ఉదంతాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకొచ్చింది. అనంతరం సాఫ్ట్వేర్లోని లోపాలను పరిష్కరించారు. మరింత జాగ్రత్త కోసం.. ‘మొత్తం 18వేల మంది పారిశుద్ధ్య కార్మికులు.. ఏడుగురు చొప్పున గ్రూపులుగా విధులు నిర్వర్తిస్తుంటారు. ఒక్కో గ్రూపులో రోజూ ఐదు నుంచి ఆరుగురు ఉంటారు. అందులోని ఇద్దరి నుంచి ఉదయం, మధ్యాహ్నంతో పాటు మధ్యలో 10గంటల సమయంలోనూ హాజరు తీసుకునేలా నిబంధన తీసుకొచ్చాం. దీంతో ఉదయం, మధ్యాహ్నం హాజరు తీసుకుని ఇంటికి వెళ్లిపోయే కార్మికులను కట్టడి చేయగలం’’ అని అధికారులు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..
[ 07-07-2024]
కోటి మంది నగరవాసుల పక్షాన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశం తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రతి మూడు నెలలకోసారి గ్రేటర్ పాలకమండలి సమావేశం జరగాల్సి ఉండగా.. -
ఆషాఢం.. అమ్మోరికి బోనం
[ 07-07-2024]
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణం పట్టే బోనాల ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. నగరంలో ఆషాఢమాసంలో నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగే బోనాల ఉత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. -
విద్యార్థులే లక్ష్యంగా ఈ-సిగరెట్ల విక్రయం!
[ 07-07-2024]
నగరంలో పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో విద్యార్థులే లక్ష్యంగా నిషేధిత ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న తాడ్బన్కు చెందిన మహ్మద్ జాఫర్(25)ను అరెస్ట్ చేసినట్టు టీజీన్యాబ్ డైరెక్టర్ సందీప్శాండిల్య శనివారం తెలిపారు. -
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 07-07-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాలైన ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. -
జీఐఎస్ సర్వేతో.. రూ.1,500 కోట్ల ఆదాయం
[ 07-07-2024]
జీహెచ్ఎంసీ ముందు అనేక సవాళ్లున్నాయని వాటిలో ఆర్థిక సమస్యలు ప్రధానమైనవని కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. -
విద్యుత్తు యాప్.. బహుళ ప్రయోజనకరం
[ 07-07-2024]
కరెంటు బిల్లులు చెల్లించేందుకు వినియోగదారులు ఎక్కువ మంది టీఎస్ఎస్పీడీసీఎల్ యాప్ను వినియోగిస్తున్నారు. ఈ నెలలో శనివారం నాటికి 1.92 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. -
తాగునీటితో మురుగు దోస్తీ
[ 07-07-2024]
‘చాలా రోజులుగా తాగునీటిని పట్టుకునేటప్పుడు పైపుల నుంచి తొలుత మురుగు వస్తోంది. భరించలేని దుర్వాసన వెలువడుతోంది. అధికారుల దృష్టికి పదేపదే తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. -
ఫిలింనగర్ సొసైటీ ఎన్నికల ప్రక్రియను కొనసాగించండి: హైకోర్టు
[ 07-07-2024]
ఫిలింనగర్ సహకార హౌసింగ్ సొసైటీ లిమిటెడ్కు గత ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ప్రక్రియ కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
రాజకీయాలు, పదవులపైనే కాంగ్రెస్కు శ్రద్ధ: ఈటల
[ 07-07-2024]
కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలు, పదవులపైన ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. -
వాళ్లు మా పూర్వ విద్యార్థులు
[ 07-07-2024]
గంజాయి కొంటూ దొరికిన ఇద్దరు వైద్యులు తమ కళాశాల పూర్వ విద్యార్థులని, ప్రస్తుతం వారికి కళాశాలతో సంబంధం లేదని ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపారు. -
రాజ్తరుణ్ సహనటుడు మాత్రమే..
[ 07-07-2024]
రాజ్తరుణ్ తనకు దగ్గరయ్యాడనే విషయంలో నిజం లేదని, ఆయనతో తనకెలాంటి సంబంధం లేదని, తన సహ నటుడు మాత్రమేనని సినీనటి మాల్వి మల్హోత్రా పేర్కొన్నారు. -
చెట్టును ఢీ కొట్టిన కారు.. విద్యార్థి దుర్మరణం
[ 07-07-2024]
అతి వేగంగా కారు నడిపి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం కీసర మండలం బోగారం సమీపంలో జరిగింది. -
ఇన్ఫెక్షన్లు.. రోడ్డు ప్రమాదాలతో మూత్రనాళ సమస్యలు
[ 07-07-2024]
యూరినరీ ఇన్ఫెక్షన్లు, రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో మూత్ర నాళాల సమస్యలు అధికమవుతున్నాయని, ఈ క్రమంలో వాటి శస్త్ర చికిత్సలూ పెరుగున్నాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. -
అత్యంత వైభవంగా ఆషాఢ బోనాలు: మంత్రి
[ 07-07-2024]
తెలంగాణ ఆషాడ మాస బోనాల దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ మంత్రి కొండా సురేఖ తెలిపారు. -
ఇద్దరి అవయవదానం.. పలు జీవితాల్లో వెలుగులు
[ 07-07-2024]
రోడ్డు ప్రమాదంలో జీవన్మృతులైన ఇద్దరి అవయవదానం పలువురి జీవితాల్లో వెలుగులు నింపింది. హనుమకొండ నగరం వడ్డేపల్లి, టీచర్స్ కాలనీకి చెందిన సిరికొండ ప్రసాద్ (36) ఎన్ఐటీ వరంగల్లో ఒప్పంద ప్రతిపాదికన ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నాడు. -
తాళం వేేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 07-07-2024]
నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరితో పాటు వీరికి సహకరించిన మరొకరిని ఫిల్మ్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.27 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. -
న్యాయవిద్యలో భారత్ది ప్రపంచ నాయకత్వ పాత్ర
[ 07-07-2024]
న్యాయవిద్యలో భారత్ ప్రపంచ నాయకత్వ పాత్రను పోషిస్తోందని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అన్నారు. శనివారం గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ లా స్కూల్లో ఏర్పాటు చేసి మూట్కోర్టును ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
తాజా వార్తలు (Latest News)
-
సూరత్లో కుప్పకూలిన భవనం.. ఏడుకు చేరిన మృతులు
-
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ
-
సినీ ప్రొడక్షన్ విభాగ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఆత్మహత్య
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
నెల్లూరు మేయర్ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి
-
కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసు దోషులను నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు