మూడేళ్ల పాప అపహరణ
మూడేళ్ల చిన్నారి అపహరణ కేసును మార్కెట్ పోలీసులు ఛేదించి నిందితులను రిమాండుకు తరలించారు.మార్కెట్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ కథనంప్రకారం..
సీసీ ఫుటేజీతో కేసును ఛేదించిన పోలీసులు
రెజిమెంటల్బజార్, న్యూస్టుడే: మూడేళ్ల చిన్నారి అపహరణ కేసును మార్కెట్ పోలీసులు ఛేదించి నిందితులను రిమాండుకు తరలించారు.మార్కెట్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ కథనంప్రకారం.. మహారాష్ట్రకు చెందిన నంద ఉత్తమ్పవార్, ఉత్తమ్ పవార్ దంపతులకు ఆరుగురు పిల్లలు సంతానం. కొన్నాళ్లక్రితం భర్త చనిపోవడంతో ఉన్నఊళ్లో ఉపాధిలేక పిల్లలతో కలిసి నగరానికి వచ్చిన తల్లి ఫుట్పాత్పై ఉంటూ భిక్షాటన చేస్తోంది. గతనెల 26న ఉదయం ముగ్గురు పిల్లలను భిక్షాటనకు పంపింది. వెళ్లిన ముగ్గురిలో దుర్గ(3) తిరిగిరాకపోవడం, వెతికినా ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేసింది. వారు సీసీకెమెరాల ఫుటేజీ ఆధారంగా అడ్డగుట్టలో ఉంటున్న పల్నాడుజిల్లా దాచేపల్లికి చెందిన నిందితురాలు గంగమ్మ(35), ఆమె కుమార్తె(16)ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరు అడ్డగుట్ట వద్ద గుడిసెల్లో ఉంటూ కూలీ పనులు, భిక్షాటన చేసుకొంటున్నారు. పాపతో భిక్షాటన చేయిస్తే ఎక్కువ డబ్బు వస్తుందనే ఉద్దేశంతో చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు అంగీకరించారు. పాపను పోలీసులు చైల్డ్హోమ్కు తరలించారు.
భార్య, అత్త దాడి.. భర్త హతం
కందుకూరు, న్యూస్టుడే: కట్టుకున్న భార్య, అత్త దాడి చేసి భర్తను హతమార్చారు. కందుకూరు సీఐ సీతారాం వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం వట్టిపల్లికి చెందిన కంచుగట్ల పరమేశ్(37)కు కందుకూరు మండలం కొత్తగూడకు చెందిన గాంధారీ సుక్కమ్మ కూతురు స్వప్నకు 12ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. కూలి పని చేసుకుని జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు. భార్యాభర్తల మధ్య కలహాలతో మూడేళ్లుగా స్వప్న పుట్టింట్లో ఉంటోంది. భర్త అప్పుడప్పుడూ వచ్చి వెళుతున్నాడు. బుధవారం పరమేశ్ రాగా.. ఇద్దరిమధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రాత్రి స్వప్న, సుక్కమ్మ కట్టెలతో అతడిపై దాడిచేశారు. అపస్మాకర స్థితిలోకి వెళ్లిన అతడ్ని కొంతదూరం లాక్కెళ్లి విద్యుత్తు స్తంభం వద్ద వదిలేయగా అక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తుచేస్తున్నట్లు సీఐ తెలిపారు.
యువ వైద్యురాలి ఆత్మహత్య
నాగోలు, న్యూస్టుడే: డిప్రెషన్తో బాధపడుతున్న ఓ యువ వైద్యురాలు ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నాగోలు పోలీసుల కథనం ప్రకారం... నాగోలు బండ్లగూడలోని సహభావన రాజీవ్ స్వగృహ టౌన్షిప్ ఎనిమిదో అంతస్తులో నివసిస్తున్న నిహారికారావు(29), మనోహర్షలకు రెండేళ్ల కిందట వివాహమైంది. ఇద్దరు వైద్యులే. నిహారిక పీజీ చదువుతోంది. కరోనా కాలంలో తీవ్ర పనిఒత్తిడి కారణంగా మానసిక అనారోగ్యానికి గురైంది. అప్పటినుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మనోహర్ష ఆర్నెళ్లనుంచి దిల్లీలోని ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. నిహారిక తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తూ.. 8వ అంతస్తునుంచి కిందికి దూకింది. వెంటనే కామినేని ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదుతో నాగోలు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 07-07-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాలైన ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. -
జీఐఎస్ సర్వేతో.. రూ.1,500 కోట్ల ఆదాయం
[ 07-07-2024]
జీహెచ్ఎంసీ ముందు అనేక సవాళ్లున్నాయని వాటిలో ఆర్థిక సమస్యలు ప్రధానమైనవని కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. -
విద్యుత్తు యాప్.. బహుళ ప్రయోజనకరం
[ 07-07-2024]
కరెంటు బిల్లులు చెల్లించేందుకు వినియోగదారులు ఎక్కువ మంది టీఎస్ఎస్పీడీసీఎల్ యాప్ను వినియోగిస్తున్నారు. ఈ నెలలో శనివారం నాటికి 1.92 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. -
తాగునీటితో మురుగు దోస్తీ
[ 07-07-2024]
‘చాలా రోజులుగా తాగునీటిని పట్టుకునేటప్పుడు పైపుల నుంచి తొలుత మురుగు వస్తోంది. భరించలేని దుర్వాసన వెలువడుతోంది. అధికారుల దృష్టికి పదేపదే తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. -
ఫిలింనగర్ సొసైటీ ఎన్నికల ప్రక్రియను కొనసాగించండి: హైకోర్టు
[ 07-07-2024]
ఫిలింనగర్ సహకార హౌసింగ్ సొసైటీ లిమిటెడ్కు గత ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ప్రక్రియ కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
రాజకీయాలు, పదవులపైనే కాంగ్రెస్కు శ్రద్ధ: ఈటల
[ 07-07-2024]
కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలు, పదవులపైన ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. -
వాళ్లు మా పూర్వ విద్యార్థులు
[ 07-07-2024]
గంజాయి కొంటూ దొరికిన ఇద్దరు వైద్యులు తమ కళాశాల పూర్వ విద్యార్థులని, ప్రస్తుతం వారికి కళాశాలతో సంబంధం లేదని ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపారు. -
రాజ్తరుణ్ సహనటుడు మాత్రమే..
[ 07-07-2024]
రాజ్తరుణ్ తనకు దగ్గరయ్యాడనే విషయంలో నిజం లేదని, ఆయనతో తనకెలాంటి సంబంధం లేదని, తన సహ నటుడు మాత్రమేనని సినీనటి మాల్వి మల్హోత్రా పేర్కొన్నారు. -
చెట్టును ఢీ కొట్టిన కారు.. విద్యార్థి దుర్మరణం
[ 07-07-2024]
అతి వేగంగా కారు నడిపి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం కీసర మండలం బోగారం సమీపంలో జరిగింది. -
ఇన్ఫెక్షన్లు.. రోడ్డు ప్రమాదాలతో మూత్రనాళ సమస్యలు
[ 07-07-2024]
యూరినరీ ఇన్ఫెక్షన్లు, రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో మూత్ర నాళాల సమస్యలు అధికమవుతున్నాయని, ఈ క్రమంలో వాటి శస్త్ర చికిత్సలూ పెరుగున్నాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. -
విద్యార్థులే లక్ష్యంగా ఈ-సిగరెట్ల విక్రయం!
[ 07-07-2024]
నగరంలో పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో విద్యార్థులే లక్ష్యంగా నిషేధిత ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న తాడ్బన్కు చెందిన మహ్మద్ జాఫర్(25)ను అరెస్ట్ చేసినట్టు టీజీన్యాబ్ డైరెక్టర్ సందీప్శాండిల్య శనివారం తెలిపారు. -
అత్యంత వైభవంగా ఆషాఢ బోనాలు: మంత్రి
[ 07-07-2024]
తెలంగాణ ఆషాడ మాస బోనాల దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ మంత్రి కొండా సురేఖ తెలిపారు. -
ఇద్దరి అవయవదానం.. పలు జీవితాల్లో వెలుగులు
[ 07-07-2024]
రోడ్డు ప్రమాదంలో జీవన్మృతులైన ఇద్దరి అవయవదానం పలువురి జీవితాల్లో వెలుగులు నింపింది. హనుమకొండ నగరం వడ్డేపల్లి, టీచర్స్ కాలనీకి చెందిన సిరికొండ ప్రసాద్ (36) ఎన్ఐటీ వరంగల్లో ఒప్పంద ప్రతిపాదికన ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నాడు. -
తాళం వేేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 07-07-2024]
నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరితో పాటు వీరికి సహకరించిన మరొకరిని ఫిల్మ్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.27 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. -
న్యాయవిద్యలో భారత్ది ప్రపంచ నాయకత్వ పాత్ర
[ 07-07-2024]
న్యాయవిద్యలో భారత్ ప్రపంచ నాయకత్వ పాత్రను పోషిస్తోందని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అన్నారు. శనివారం గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ లా స్కూల్లో ఏర్పాటు చేసి మూట్కోర్టును ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
-
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!
-
హిమాచల్ను ముంచెత్తుతున్న వర్షాలు.. ధర్మశాలలో 214.6మి.మీ వర్షపాతం
-
ఓటీటీలో ఫహద్ ఫాజిల్ ‘ధూమం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?