నిపుణులున్నా.. సదుపాయాల్లేవ్
అవయవ మార్పిడిలో రాజధాని ముందుంటోంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటులోనే ఈ శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ప్రైవేటు దవాఖానాల్లోనే ఎక్కువ శస్త్రచికిత్సలు
అవయవ మార్పిడికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎదురుచూపులు
గాంధీలో కొనసాగుతున్న మాడ్యులర్ థియేటర్ పనులు
ఈనాడు, హైదరాబాద్: అవయవ మార్పిడిలో రాజధాని ముందుంటోంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటులోనే ఈ శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి. 2013 నుంచి ఇప్పటివరకు నిమ్స్లో కేవలం 32 అవయవ మార్పిడి చికిత్సలు జరగ్గా.. గాంధీలో ఒక్కటే చేశారు. ఉస్మానియాలో తొమ్మిది వరకు చేశారు. ఆసుపత్రుల్లో నిపుణులకు కొరత లేకున్నా ..మాడ్యులర్ థియేటర్లు, ఇతర అధునాతన వసతులు లేకపోవడంతో ఎక్కువ శాతం ప్రైవేటుకు వెళ్తున్నారు.
వందల మంది నిరీక్షణ.. కాలేయ మార్పిడికి ఉస్మానియాలో వంద మందికి పైగా నిరీక్షిస్తున్నారు. సరైన మౌలిక వసతులు లేకపోవడంతో ప్రభుత్వం గతంలో గాంధీలో కేంద్రీకృత అవయవ మార్పిడి కేంద్రం నిర్మాణాన్ని ప్రారంభించింది. రూ.30 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆరు మాడ్యులర్ థియేటర్లు నిర్మిస్తున్నారు.
ప్రైవేటులో పేదలకు భారమే...
ప్రైవేటులో మూత్రపిండాల మార్పిడికి ఆరేడు లక్షలు, అదే కాలేయ మార్పిడికి రూ.20 లక్షలపైనే ఖర్చవుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీఎంఆర్ఎఫ్ కింద ఉచితంగా చేస్తున్నారు. గాంధీ, ఉస్మానియాలో ఎక్కువ శాతం బ్రెయిన్డెడ్ కేసులు నమోదవుతుంటాయి. ఒక బ్రెయిన్డెడ్ అయిన బాధితుడి నుంచి ఏడుగురికి పునర్జన్మ ప్రసాదించవచ్చు. ఎక్కడ బ్రెయిన్డెడ్ అయితే..ఆ ఆసుపత్రికే తొలి ప్రాధాన్యం ఉంటుంది. మూడు అవయవాల వరకు ఆ ఆసుపత్రికి కేటాయిస్తారు.
గుండె నుంచి క్లోమగ్రంథి వరకు...
దీనిపై గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యాలతో గాంధీలో అవయవ మార్పిడి కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె కవాటాలు, మూత్రపిండాలు, క్లోమగ్రంథి..ఇలా అన్ని రకాల అవయవాలు ఒకచోట మార్పిడి చేయవచ్చన్నారు. ఈ కేంద్రం ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నామని తెలిపారు.
జనవరి నుంచి ఇప్పటివరకు జరిగిన మార్పిడిలు..
- మొత్తం దాతలు - 85
- మూత్రపిండాలు - 140
- లివర్ - 82
- గుండె - 13
- కార్నియా - 80
- ఊపిరితిత్తులు - 35
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హుకుం జారీ చేసినా.. ఊహూ
[ 06-07-2024]
రాజధాని పరిధిలో ప్రతిపక్ష భారాసలో అసలేం జరుగుతోంది? పార్టీ అధిష్ఠానం మాటలను కార్పొరేటర్లు, ఇతర నేతలు పెడచెవిన పెడుతున్నారా? పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తోందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే చెబుతున్నారు. -
నీళ్లు పట్టుకున్నందుకు కొట్టి చంపారు
[ 06-07-2024]
దప్పిక తీర్చుకునేందుకు టీ దుకాణం వద్ద మంచి నీళ్లు పట్టుకునేందుకు వెళ్లిన క్రమంలో నెలకొన్న స్వల్ప వివాదం అమాయకుడి ప్రాణాలు బలి తీసుకుంది.మియాపూర్ ఠాణా పరిధిలో శుక్రవారం ఈ దారుణ ఘటన జరిగింది. -
మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధికి రక్షణ శాఖ స్థలాలు!
[ 06-07-2024]
మూసీ నది పరివాహక అభివృద్ధి కోసం పథకాన్ని రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం నదికి అటు, ఇటు ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు కార్యాచరణ చేపట్టింది. -
భూమికి భూమి ఎక్కడ కేటాయించాలో ?
[ 06-07-2024]
రాజీవ్ రహదారిలోని జింఖానా మైదానం నుంచి హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్, తూంకుంట, శామీర్పేట ఓఆర్ఆర్ వరకు మొత్తం 11.12 కిలోమీటర్ల పరిధిలో 300 ప్రైవేటు నిర్మాణాలను గుర్తించారు -
మాట్లాడుతుండగా ఫోన్ లాక్కున్నాడని హత్య
[ 06-07-2024]
ఫోన్ కోసం జరిగిన గొడవతో మద్యం మత్తులో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ అనుదీప్, స్థానికుల వివరాల ప్రకారం.. -
ఏకరూప దుస్తులు.. ఎప్పటికి అందేనో?
[ 06-07-2024]
పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోపు ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు అందరికీ ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన విద్యాశాఖ అధికారులు తరగతులు మొదలై ఇరవై రోజులైనా ఇంకా పంపిణీ కొనసాగిస్తున్నారు -
మోడల్ మార్కెట్ను అందుబాటులోకి తీసుకురండి
[ 06-07-2024]
కర్మన్ఘాట్ నిరుపయోగంగా ఉన్న మోడల్ మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు -
వాసన లేకుండా.. వ్యర్థాల నిర్వహణ
[ 06-07-2024]
చెత్త నుంచి బయోగ్యాస్, సేంద్రియ ఎరువు తయారుచేసే ఆధునిక పద్ధతిపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది -
ఓయూలో విద్యార్థుల అరెస్టు
[ 06-07-2024]
పలు నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఓయూ పోలీసులు విద్యార్థి నేతలను ముందస్తు అరెస్టుచేశారు. క్యాంపస్లోని వసతిగృహాలకువెళ్లి అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. -
అనిశా వలలో సర్కిల్ ఏఈ
[ 06-07-2024]
గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ఏఈ బలవంత్రెడ్డి శుక్రవారం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు చిక్కాడు. -
వసతి..ఏంటీ దుర్గతి..?
[ 06-07-2024]
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులను హాస్టల్ ఫీజులు బెంబేలెత్తిస్తున్నాయి. -
వేళకు రారు.. వేదన తప్పదు
[ 06-07-2024]
వికారాబాద్ పురపాలక సంఘంలో ఉద్యోగులు వేళకు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలు దాటినా విధులకు హాజరు కాలేదు. -
20 మంది గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
[ 06-07-2024]
అపరిశుభ్ర పరిసరాలు, కలుషిత ఆహారం విద్యార్థుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. వికారాబాద్ పట్టణ శివారు అనంతగిరిపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఇదే దుస్థితి నెలకొంది -
తొలగిన అవరోధం.. విస్తరణకు మోక్షం!
[ 06-07-2024]
హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి ఇరుకుగా, మలుపులతో ప్రమాదకరంగా మారింది. -
మనస్తాపంతో రైతు ఆత్మహత్య
[ 06-07-2024]
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఏఎస్ఐ మల్లేషం, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం మండలంలోని బూచన్పల్లికి చెందిన మహిపాల్రెడ్డి (41) వ్యవసాయం, కూలీ పనులు చేస్తుంటాడు.