కరెంట్ కట్.. రోగుల కటకట
ఉస్మానియా ఆసుపత్రిలో బుధవారం మధ్యాహ్నం విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది. సుమారు అర గంట పాటు సరఫరా నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడ్డారు.
ఉస్మానియాలో అరగంట నిలిచిన విద్యుత్తు సరఫరా
కొద్దిసేపు మొరాయించిన జనరేటర్
ఉస్మానియా ఆసుపత్రి, న్యూస్టుడే: ఉస్మానియా ఆసుపత్రిలో బుధవారం మధ్యాహ్నం విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది. సుమారు అర గంట పాటు సరఫరా నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడ్డారు. ఆపరేషన్ థియేటర్లలో శస్త్ర చికిత్సలు జరుగుతున్న సమయంలో ఇది జరగడంతో వైద్యులు, సిబ్బంది సైతం చేసేదేమీలేక మిన్నకుండిపోయారు. బుధవారం ఉదయం కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేస్తుండగా సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలోనే జనరేటర్ కొద్దిసేపు మొరాయించడంతో సమస్య మరింత జటిలంగా మారింది. ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో మూడు రోజులుగా తరచూ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని సిబ్బంది తెలిపారు. మంగళవారం తెల్లవారుజాము రెండు, మూడుసార్లు నిలిచిపోయింది. ఓపీలోని అత్యవసర వార్డులు, కులీకుతుబ్షా భవనంలోని పలు వార్డుల్లో కృత్రిమ శ్వాస ద్వారా చికిత్స పొందుతున్న రోగులు ఇబ్బందులకు గురయ్యారు. వీరికి ప్రత్యామ్నాయంగా ‘అంబూబ్యాగ్’ సాయంతో రోగి సహాయకులే దగ్గరుండి సాయం చేయాల్సి ఉంటుంది. పాతకాలం నాటి విద్యుత్తు వ్యవస్థను ఆధునికీకరించకపోవడంతో ఏటా వర్షాకాలంలో అంతరాయం కలుగుతోంది. అంతర్గత సమస్య ఉన్నట్లు గుర్తించిన ఆసుపత్రి ఎలక్ట్రీషియన్లు తొలుత ప్రత్యామ్నాయంగా జనరేటర్ సహాయంతో సరఫరా పునరుద్ధరించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
సాంకేతిక లోపంతోనే..
సాంకేతిక లోపం తలెత్తడంతో సరఫరా నిలిచిపోయిందని విద్యుత్తు శాఖ అధికారులు గుర్తించారు. టీజీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఆసుపత్రికి చేరుకొని మరమ్మతులు చేసి సరఫరా పునరుద్ధరించారు. రోగులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నాం. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 15 నిమిషాలు సరఫరా నిలిచిపోయింది.
డా.నాగేందర్, సూపరింటెండెంట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్బాబును కలిసిన భారాస ఎమ్మెల్యేలు
[ 06-07-2024]
రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్బాబును శనివారం పలువురు భారాస ఎమ్మెల్యేలు కలిశారు. -
కాళేశ్వరం పంప్ హౌస్ ఇంజినీర్లను విచారించనున్న పీసీ ఘోష్ కమిషన్
[ 06-07-2024]
కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ ఇంజినీర్లను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించనుంది. -
సికింద్రాబాద్‑గోవా బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైలు.. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన కిషన్రెడ్డి
[ 06-07-2024]
సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బై-వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు నడపనున్నారు. -
శామీర్ పేట్లో చోరీ ముఠా అరెస్ట్
[ 06-07-2024]
శామీర్పేట్లోని చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు సభ్యులను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నిమ్స్ ప్రొఫెసర్ ప్రాచీకార్ ఆత్మహత్య
[ 06-07-2024]
నిమ్స్లో విధులు నిర్వర్తించే అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకార్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. -
భూమికి భూమి ఎక్కడ కేటాయించాలో ?.. రక్షణ శాఖకు అప్పగించేందుకు అన్వేషిస్తున్న హెచ్ఎండీఏ
[ 06-07-2024]
రాజీవ్ రహదారిలోని జింఖానా మైదానం నుంచి హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్, తూంకుంట, శామీర్పేట ఓఆర్ఆర్ వరకు మొత్తం 11.12 కిలోమీటర్ల పరిధిలో 300 ప్రైవేటు నిర్మాణాలను గుర్తించారు -
హుకుం జారీ చేసినా.. ఊహూ
[ 06-07-2024]
రాజధాని పరిధిలో ప్రతిపక్ష భారాసలో అసలేం జరుగుతోంది? పార్టీ అధిష్ఠానం మాటలను కార్పొరేటర్లు, ఇతర నేతలు పెడచెవిన పెడుతున్నారా? పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తోందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే చెబుతున్నారు. -
నీళ్లు పట్టుకున్నందుకు కొట్టి చంపారు
[ 06-07-2024]
దప్పిక తీర్చుకునేందుకు టీ దుకాణం వద్ద మంచి నీళ్లు పట్టుకునేందుకు వెళ్లిన క్రమంలో నెలకొన్న స్వల్ప వివాదం అమాయకుడి ప్రాణాలు బలి తీసుకుంది.మియాపూర్ ఠాణా పరిధిలో శుక్రవారం ఈ దారుణ ఘటన జరిగింది. -
మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధికి రక్షణ శాఖ స్థలాలు!
[ 06-07-2024]
మూసీ నది పరివాహక అభివృద్ధి కోసం పథకాన్ని రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం నదికి అటు, ఇటు ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు కార్యాచరణ చేపట్టింది. -
మాట్లాడుతుండగా ఫోన్ లాక్కున్నాడని హత్య
[ 06-07-2024]
ఫోన్ కోసం జరిగిన గొడవతో మద్యం మత్తులో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ అనుదీప్, స్థానికుల వివరాల ప్రకారం.. -
ఏకరూప దుస్తులు.. ఎప్పటికి అందేనో?
[ 06-07-2024]
పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోపు ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు అందరికీ ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన విద్యాశాఖ అధికారులు తరగతులు మొదలై ఇరవై రోజులైనా ఇంకా పంపిణీ కొనసాగిస్తున్నారు -
మోడల్ మార్కెట్ను అందుబాటులోకి తీసుకురండి
[ 06-07-2024]
కర్మన్ఘాట్ నిరుపయోగంగా ఉన్న మోడల్ మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు -
వాసన లేకుండా.. వ్యర్థాల నిర్వహణ
[ 06-07-2024]
చెత్త నుంచి బయోగ్యాస్, సేంద్రియ ఎరువు తయారుచేసే ఆధునిక పద్ధతిపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది -
ఓయూలో విద్యార్థుల అరెస్టు
[ 06-07-2024]
పలు నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఓయూ పోలీసులు విద్యార్థి నేతలను ముందస్తు అరెస్టుచేశారు. క్యాంపస్లోని వసతిగృహాలకువెళ్లి అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. -
అనిశా వలలో సర్కిల్ ఏఈ
[ 06-07-2024]
గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ఏఈ బలవంత్రెడ్డి శుక్రవారం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు చిక్కాడు. -
వసతి..ఏంటీ దుర్గతి..?
[ 06-07-2024]
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులను హాస్టల్ ఫీజులు బెంబేలెత్తిస్తున్నాయి. -
వేళకు రారు.. వేదన తప్పదు
[ 06-07-2024]
వికారాబాద్ పురపాలక సంఘంలో ఉద్యోగులు వేళకు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలు దాటినా విధులకు హాజరు కాలేదు. -
20 మంది గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
[ 06-07-2024]
అపరిశుభ్ర పరిసరాలు, కలుషిత ఆహారం విద్యార్థుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. వికారాబాద్ పట్టణ శివారు అనంతగిరిపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఇదే దుస్థితి నెలకొంది -
తొలగిన అవరోధం.. విస్తరణకు మోక్షం!
[ 06-07-2024]
హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి ఇరుకుగా, మలుపులతో ప్రమాదకరంగా మారింది. -
మనస్తాపంతో రైతు ఆత్మహత్య
[ 06-07-2024]
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఏఎస్ఐ మల్లేషం, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం మండలంలోని బూచన్పల్లికి చెందిన మహిపాల్రెడ్డి (41) వ్యవసాయం, కూలీ పనులు చేస్తుంటాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
హిమాచల్ను ముంచెత్తుతున్న వర్షాలు.. ధర్మశాలలో 214.6మి.మీ వర్షపాతం
-
తెలంగాణలో ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష
-
ఆసియా కప్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
-
ఓటీటీలో ఫహద్ ఫాజిల్ ‘ధూమం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!
-
కమిటీల ద్వారా విభజన సమస్యలకు పరిష్కార మార్గాలు: భట్టి విక్రమార్క