క్షేత్రస్థాయిలో పర్యటించి.. సమస్యలు తెలుసుకొని
నగర పారిశుద్ధ్యం, పరిపాలన వ్యవహారాలను చక్కదిద్దడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి దృష్టిపెట్టారు.
స్వచ్ఛ ఆటోల విషయమై విద్యార్థినితో మాట్లాడుతున్న ఆమ్రపాలి
ఈనాడు, హైదరాబాద్: నగర పారిశుద్ధ్యం, పరిపాలన వ్యవహారాలను చక్కదిద్దడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి దృష్టిపెట్టారు. బుధవారం ఉదయాన్నే పారిశుద్ధ్యంపై ఆకస్మిక తనిఖీ, అనంతరం ఆమె కార్యాలయంలో విభాగాధిపతులతో సమీక్ష, సాయంత్రం సందర్శకులు, ఉద్యోగుల సమస్యలపై వినతులు స్వీకరించారు. నారాయణగూడ క్రాస్ రోడ్డు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశుద్ధ్య విభాగం అదనపు కమిషనర్ రవికిరణ్, ఇతర అధికారులతో కలిసి చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో చెత్త కుప్పలు, మురుగునీరు నిలవడం గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్మఠ్ వద్ద చెత్త తరలింపు వాహనం డ్రైవరుతో మాట్లాడారు. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినితో మాట్లాడి స్వచ్ఛ ఆటోలకే చెత్త ఇవ్వాలని, తోటి వారికి, కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కోరారు.
సమాచారాన్ని సిద్ధం చేయండి.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం జరగనున్న సర్వ సభ్య సమావేశం సన్నద్ధతపై ఆమ్రపాలి దృష్టిపెట్టారు. విభాగాధిపతులతో నిర్వహించిన సమీక్షలో.. ఎవరెవరు ఏయే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, అభివృద్ధి, పనులు, నిర్వహణ పనులను అడిగి తెలుసుకున్నారు.
సమస్యలు ఆలకించి.. సాయంత్రం జీహెచ్ఎంసీ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు ఊదరి గోపాల్, ఇతర నేతలు బల్దియా ఉద్యోగుల సమస్యలను ఆమ్రపాలికి వివరించారు. గుత్తేదారుల సమస్యలపై సంఘం నేతలు సాయి, శ్రీశైలం వినతిపత్రం ఇచ్చారు. నిర్మాణ అనుమతులు, ఇతరత్రా సమస్యలపై ప్రజలు ఆమెను కలిసి పరిష్కారం కోరారు.
నిలోఫర్లో సూపరింటెండెంట్ ఉషారాణితో మాట్లాడుతున్న కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
రెడ్హిల్స్, న్యూస్టుడే: నిలోఫర్ ఆసుపత్రిని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం సందర్శించారు. అక్కడి ఇంటెన్సివ్ బ్లాక్, డయాగ్నొస్టిక్ ల్యాబ్, క్వాలిటీ కంట్రోల్ రూమ్, ఫిజియోథెరఫీ, పీడియాట్రిక్ సర్జికల్ వార్డు, ఆపరేషన్ థియేటర్లు, ఎస్ఎన్సీయూ లాక్టేషన్ మేనేజ్మెంట్, నవజాత శిశువుల వార్డు తదితర విభాగాలను చూశారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్ను పరిశీలించారు. ఆసుపత్రికి ఎంఆర్ఐ యంత్రం రాలేదని, పీజీ వసతిగృహం అవసరమని సూపరింటెండెంట్ డా.ఉషారాణి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నాణ్యమైన ఆధునిక వైద్యం నిలోఫర్లో ఉచితంగా అందించడం గొప్ప విషయమన్నారు. పుట్టుక లోపాలతో జన్మించే పిల్లల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వారి సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంకటి, నిలోఫర్ ఆర్ఎంఓ(సీఎస్) జ్యోతి, లాలూప్రసాద్ రాథోడ్, కల్యాణి శ్రీనివాస్, డి.గంగాప్రసాద్ ఉన్నారు.
ప్రభుత్వాసుపత్రి పరిసరాలను పరిశీలిస్తున్న శశాంక
శంషాబాద్: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని జిల్లా పాలనాధికారి శశాంక పేర్కొన్నారు. బుధవారం శంషాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేసి పరిసరాలను పరిశీలించారు. విధులకు సకాలంలో హాజరు కాని వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రోగులకు చేసే వైద్య పరీక్షల వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. శంషాబాద్ తహసీల్దార్ కొప్పెర నాగమణి, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హుకుం జారీ చేసినా.. ఊహూ
[ 06-07-2024]
రాజధాని పరిధిలో ప్రతిపక్ష భారాసలో అసలేం జరుగుతోంది? పార్టీ అధిష్ఠానం మాటలను కార్పొరేటర్లు, ఇతర నేతలు పెడచెవిన పెడుతున్నారా? పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తోందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే చెబుతున్నారు. -
నీళ్లు పట్టుకున్నందుకు కొట్టి చంపారు
[ 06-07-2024]
దప్పిక తీర్చుకునేందుకు టీ దుకాణం వద్ద మంచి నీళ్లు పట్టుకునేందుకు వెళ్లిన క్రమంలో నెలకొన్న స్వల్ప వివాదం అమాయకుడి ప్రాణాలు బలి తీసుకుంది.మియాపూర్ ఠాణా పరిధిలో శుక్రవారం ఈ దారుణ ఘటన జరిగింది. -
మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధికి రక్షణ శాఖ స్థలాలు!
[ 06-07-2024]
మూసీ నది పరివాహక అభివృద్ధి కోసం పథకాన్ని రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం నదికి అటు, ఇటు ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు కార్యాచరణ చేపట్టింది. -
భూమికి భూమి ఎక్కడ కేటాయించాలో ?
[ 06-07-2024]
రాజీవ్ రహదారిలోని జింఖానా మైదానం నుంచి హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్, తూంకుంట, శామీర్పేట ఓఆర్ఆర్ వరకు మొత్తం 11.12 కిలోమీటర్ల పరిధిలో 300 ప్రైవేటు నిర్మాణాలను గుర్తించారు -
మాట్లాడుతుండగా ఫోన్ లాక్కున్నాడని హత్య
[ 06-07-2024]
ఫోన్ కోసం జరిగిన గొడవతో మద్యం మత్తులో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ అనుదీప్, స్థానికుల వివరాల ప్రకారం.. -
ఏకరూప దుస్తులు.. ఎప్పటికి అందేనో?
[ 06-07-2024]
పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోపు ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు అందరికీ ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన విద్యాశాఖ అధికారులు తరగతులు మొదలై ఇరవై రోజులైనా ఇంకా పంపిణీ కొనసాగిస్తున్నారు -
మోడల్ మార్కెట్ను అందుబాటులోకి తీసుకురండి
[ 06-07-2024]
కర్మన్ఘాట్ నిరుపయోగంగా ఉన్న మోడల్ మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు -
వాసన లేకుండా.. వ్యర్థాల నిర్వహణ
[ 06-07-2024]
చెత్త నుంచి బయోగ్యాస్, సేంద్రియ ఎరువు తయారుచేసే ఆధునిక పద్ధతిపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది -
ఓయూలో విద్యార్థుల అరెస్టు
[ 06-07-2024]
పలు నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఓయూ పోలీసులు విద్యార్థి నేతలను ముందస్తు అరెస్టుచేశారు. క్యాంపస్లోని వసతిగృహాలకువెళ్లి అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. -
అనిశా వలలో సర్కిల్ ఏఈ
[ 06-07-2024]
గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ఏఈ బలవంత్రెడ్డి శుక్రవారం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు చిక్కాడు. -
వసతి..ఏంటీ దుర్గతి..?
[ 06-07-2024]
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులను హాస్టల్ ఫీజులు బెంబేలెత్తిస్తున్నాయి. -
వేళకు రారు.. వేదన తప్పదు
[ 06-07-2024]
వికారాబాద్ పురపాలక సంఘంలో ఉద్యోగులు వేళకు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలు దాటినా విధులకు హాజరు కాలేదు. -
20 మంది గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
[ 06-07-2024]
అపరిశుభ్ర పరిసరాలు, కలుషిత ఆహారం విద్యార్థుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. వికారాబాద్ పట్టణ శివారు అనంతగిరిపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఇదే దుస్థితి నెలకొంది -
తొలగిన అవరోధం.. విస్తరణకు మోక్షం!
[ 06-07-2024]
హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి ఇరుకుగా, మలుపులతో ప్రమాదకరంగా మారింది. -
మనస్తాపంతో రైతు ఆత్మహత్య
[ 06-07-2024]
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఏఎస్ఐ మల్లేషం, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం మండలంలోని బూచన్పల్లికి చెందిన మహిపాల్రెడ్డి (41) వ్యవసాయం, కూలీ పనులు చేస్తుంటాడు.