Drugs: మత్తు ఊబిలో ఎంబీఏ విద్యార్థులు.. డ్రగ్ రాకెట్ను ఛేదించిన టీజీ న్యాబ్ పోలీసులు
గరంలో వ్యాపారులు, విద్యార్థులే లక్ష్యంగా ఖరీదైన మాదకద్రవ్యాలు చేరవేస్తున్న డ్రగ్ రాకెట్ను టీజీ న్యాబ్, కార్ఖానా పోలీసులు ఛేదించారు.
ఈనాడు, హైదరాబాద్ రెజిమెంటల్బజార్, న్యూస్టుడే: నగరంలో వ్యాపారులు, విద్యార్థులే లక్ష్యంగా ఖరీదైన మాదకద్రవ్యాలు చేరవేస్తున్న డ్రగ్ రాకెట్ను టీజీ న్యాబ్, కార్ఖానా పోలీసులు ఛేదించారు. బుధవారం సికింద్రాబాద్ ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో టీజీ న్యాబ్ ఏసీపీ చల్లా శ్రీధర్, తిరుమలగిరి ఏసీపీ జి.రమేష్, ఇన్స్పెక్టర్లు రమేష్రెడ్డి, వి.రామకృష్ణలతో కలసి టీజీ న్యాబ్ ఎస్పీ సాయిచైతన్య, ఉత్తర మండల డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
నగరానికి చెందిన మహ్మద్ అక్రం(28), సి.ఎస్.ప్రణయ్(26), రోహన్ విలియమ్స్(23) మిత్రులు. డబ్బు సంపాదనకు మత్తుపదార్థాల సరఫరాను మార్గంగా ఎంచుకున్నారు. ఒక్క డోస్తో ఎక్కువ ఇచ్చే ఓజీ(ఓషన్ గ్రోన్), ఎల్ఎస్డీ బ్లాట్స్ను సరఫరా చేసే స్మగ్లర్కు దగ్గరయ్యారు. అతడి ద్వారా విదేశాల్లో మాత్రమే పండే ఓజీ గంజాయి ఎల్ఎస్డీ బ్లాట్స్ను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. ఓజీ గ్రాము రూ.4వేలు, ఎల్ఎస్డీ బ్లాట్ ఒక్కోటి రూ.3వేలకు విక్రయించేవారు. ఆరు నెలలుగా దందా సాగిస్తున్నారు. షాద్నగర్లోని ప్రముఖ విద్యాసంస్థలోని ఎక్కువ మంది విద్యార్థులు ఓజీకి అలవాటుపడినట్టు టీజీ న్యాబ్కు సమాచారం అందటంతో నిఘా ఉంచారు. ముగ్గురు నిందితులతో సహా డ్రగ్స్ వాడుతున్న నిరుద్యోగి బి.భరణికుమార్(26), వ్యాపారులు రోషన్సింగ్(28), పి.నిఖిల్రెడ్డి(29), ఎన్.సూర్యతేజ(29), బి.సాయిచరణ్రెడ్డి (29), బి.పృధ్వీసాయినాథ్రెడ్డి(26), విద్యార్థులు బి.అర్జున్చౌదరి(19), సి.ఆదినారాయణరెడ్డి(20)ను అరెస్ట్ చేశారు. ప్రముఖులు, సంపన్నవర్గాల పిల్లలు కూడా.. ఈ ముఠా నుంచి షాద్నగర్లోని ప్రముఖ విద్యాసంస్థలో చదువుతున్న 20 మంది విద్యార్థులు ఓజీ,ఎల్ఎస్డీ బ్లాట్స్ కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులు నిర్దారించారు. తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎవరా కీలకసూత్రధారి?.. ఓజీ రకం గంజాయిని ఇంత సులువుగా నగరానికి చేరవేస్తున్న కింగ్పిన్పై పోలీసులు దృష్టి సారించారు. ఖరీదైన డ్రగ్స్ దందాతో రోజుకు రూ.2-3లక్షల వ్యాపారం సాగిస్తున్న ఇతడు పట్టుబడితే కీలక సమాచారం వెలుగుచూసే అవకాశం ఉంది. పోలీసులకు పట్టుబడకుండా ఈ ముఠా సామాజిక మాధ్యమాల వేదికగా లావాదేవీలు నిర్వహిస్తోంది.
సమాచారమిస్తే రూ.2లక్షల నజరానా.. వంద కిలోల కంటే ఎక్కువ గంజాయికి సంబంధించిన సమాచారం అందజేస్తే రూ.2లక్షల నజరానా ఇస్తామని ప్రకటించారు. ఫోన్ నంబర్ 87126 71111, సామాజిక మాధ్యమాల ద్వారా వివరాలు తెలియజేయాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూమికి భూమి ఎక్కడ కేటాయించాలో ?.. రక్షణ శాఖకు అప్పగించేందుకు అన్వేషిస్తున్న హెచ్ఎండీఏ
[ 06-07-2024]
రాజీవ్ రహదారిలోని జింఖానా మైదానం నుంచి హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్, తూంకుంట, శామీర్పేట ఓఆర్ఆర్ వరకు మొత్తం 11.12 కిలోమీటర్ల పరిధిలో 300 ప్రైవేటు నిర్మాణాలను గుర్తించారు -
హుకుం జారీ చేసినా.. ఊహూ
[ 06-07-2024]
రాజధాని పరిధిలో ప్రతిపక్ష భారాసలో అసలేం జరుగుతోంది? పార్టీ అధిష్ఠానం మాటలను కార్పొరేటర్లు, ఇతర నేతలు పెడచెవిన పెడుతున్నారా? పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తోందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే చెబుతున్నారు. -
నీళ్లు పట్టుకున్నందుకు కొట్టి చంపారు
[ 06-07-2024]
దప్పిక తీర్చుకునేందుకు టీ దుకాణం వద్ద మంచి నీళ్లు పట్టుకునేందుకు వెళ్లిన క్రమంలో నెలకొన్న స్వల్ప వివాదం అమాయకుడి ప్రాణాలు బలి తీసుకుంది.మియాపూర్ ఠాణా పరిధిలో శుక్రవారం ఈ దారుణ ఘటన జరిగింది. -
మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధికి రక్షణ శాఖ స్థలాలు!
[ 06-07-2024]
మూసీ నది పరివాహక అభివృద్ధి కోసం పథకాన్ని రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం నదికి అటు, ఇటు ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు కార్యాచరణ చేపట్టింది. -
మాట్లాడుతుండగా ఫోన్ లాక్కున్నాడని హత్య
[ 06-07-2024]
ఫోన్ కోసం జరిగిన గొడవతో మద్యం మత్తులో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ అనుదీప్, స్థానికుల వివరాల ప్రకారం.. -
ఏకరూప దుస్తులు.. ఎప్పటికి అందేనో?
[ 06-07-2024]
పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోపు ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు అందరికీ ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన విద్యాశాఖ అధికారులు తరగతులు మొదలై ఇరవై రోజులైనా ఇంకా పంపిణీ కొనసాగిస్తున్నారు -
మోడల్ మార్కెట్ను అందుబాటులోకి తీసుకురండి
[ 06-07-2024]
కర్మన్ఘాట్ నిరుపయోగంగా ఉన్న మోడల్ మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు -
వాసన లేకుండా.. వ్యర్థాల నిర్వహణ
[ 06-07-2024]
చెత్త నుంచి బయోగ్యాస్, సేంద్రియ ఎరువు తయారుచేసే ఆధునిక పద్ధతిపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది -
ఓయూలో విద్యార్థుల అరెస్టు
[ 06-07-2024]
పలు నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఓయూ పోలీసులు విద్యార్థి నేతలను ముందస్తు అరెస్టుచేశారు. క్యాంపస్లోని వసతిగృహాలకువెళ్లి అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. -
అనిశా వలలో సర్కిల్ ఏఈ
[ 06-07-2024]
గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ఏఈ బలవంత్రెడ్డి శుక్రవారం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు చిక్కాడు. -
వసతి..ఏంటీ దుర్గతి..?
[ 06-07-2024]
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులను హాస్టల్ ఫీజులు బెంబేలెత్తిస్తున్నాయి. -
వేళకు రారు.. వేదన తప్పదు
[ 06-07-2024]
వికారాబాద్ పురపాలక సంఘంలో ఉద్యోగులు వేళకు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలు దాటినా విధులకు హాజరు కాలేదు. -
20 మంది గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
[ 06-07-2024]
అపరిశుభ్ర పరిసరాలు, కలుషిత ఆహారం విద్యార్థుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. వికారాబాద్ పట్టణ శివారు అనంతగిరిపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఇదే దుస్థితి నెలకొంది -
తొలగిన అవరోధం.. విస్తరణకు మోక్షం!
[ 06-07-2024]
హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి ఇరుకుగా, మలుపులతో ప్రమాదకరంగా మారింది. -
మనస్తాపంతో రైతు ఆత్మహత్య
[ 06-07-2024]
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఏఎస్ఐ మల్లేషం, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం మండలంలోని బూచన్పల్లికి చెందిన మహిపాల్రెడ్డి (41) వ్యవసాయం, కూలీ పనులు చేస్తుంటాడు.
తాజా వార్తలు (Latest News)
-
గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో ముగిసిన సోదాలు.. సీబీఐ అదుపులో 8 మంది అధికారులు
-
బుల్లి వారసులతో ముకేశ్-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?
-
హాథ్రస్ తొక్కిసలాట.. తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా
-
రివ్యూ: శశి మథనం.. ప్రేమికుడు ఎరక్కపోయి ఇరుక్కుంటే?
-
మిర్యాలగూడ స్టేషన్లో నిలిచిన ఫలక్నుమా సూపర్ఫాస్ట్ రైలు
-
కోర్ బ్రాంచీల్లో చేరితే స్కాలర్షిప్