దిగుమతి తగ్గినా.. ఆదాయంలో అదే జోరు
బాటసింగారంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్కు మామిడి సీజన్.. ఏటా భారీగా ఆదాయం చేకూరుస్తోంది.
పండ్ల మార్కెట్లో మామిడి సీజన్ తీరు
అబ్దుల్లాపూర్మెట్, న్యూస్టుడే
బాటసింగారంలోని మార్కెట్లో మామిడి
బాటసింగారంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్కు మామిడి సీజన్.. ఏటా భారీగా ఆదాయం చేకూరుస్తోంది. మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్కు మామిడికాయలు భారీగా విక్రయానికి వస్తాయి. అయితే ఈ ఏడాది అంతటా మామిడి దిగుబడి కొంత తగ్గిన విషయం తెలిసిందే. అయితే పండ్ల మార్కెట్ ఆదాయంపై మాత్రం ఆ ప్రభావం పడలేదనే చెప్పాలి. దీంతో పాటు దిగుబడి తగ్గినప్పటికీ ధరల్లో నిలకడ మూలంగా రైతుల రాబడి ఆశాజనకంగానే ఉన్నట్లు మార్కెట్కు వచ్చిన రైతులు పలువురు పేర్కొన్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పండ్ల మార్కెట్కు వచ్చిన మామిడి తక్కువే. అయినా.. వ్యాపారం, మార్కెట్ ఆదాయంలో మాత్రం పెద్దగా తేడా లేదు.
గతేడాదిలో పోల్చితే..
2023 మామిడి సీజన్లో జూన్ నెలాఖరు వరకు బాటసింగారం మార్కెట్కు మామిడి లోడ్తో 55,574 వాహనాలు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 50,341 వాహనాల్లో మామిడి మార్కెట్కు తరలివచ్చింది. ఈ సంవత్సరం ఆయా ప్రాంతాల్లో మామిడి దిగుబడి తగ్గిందనే విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. గతేడాది 1,20,000 మెట్రిక్ టన్నుల మామిడి దిగుమతి అయితే.. ఈ ఏడాది జూన్ 27వ తేదీ నాటికి 1,11,000 మెట్రిక్ టన్నులుగా ఉంది.
వ్యాపారంతో కాసుల పంట
బాటసింగారంలోని పండ్ల మార్కెట్లో గతేడాది రూ.315 కోట్ల టర్నోవర్ నమోదైతే.. ఈ ఏడాది రూ.314 కోట్లుగా ఉంది. మామిడి దిగుమతిలో 9వేల మెట్రిక్ టన్నుల వరకు తగ్గుదలే దీనికి కారణంగా తెలుస్తోంది. అయితే దిగుబడి తగ్గినా.. ధరలు మాత్రం ఆశాజనకంగానే ఉండటంతో మార్కెట్ ఆదాయంపై ఆ ప్రభావం పడలేదు. గతేడాది మామిడి వ్యాపారంతో మార్కెట్కు రూ.3.15 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది గత నెల 27వ తేదీ నాటికి రూ.3.14 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సీజన్ ముగిసే నాటికి మరింత లాభం వచ్చే అవకాశ ఉంది. అంటే గతేడాదితో పోల్చితే మార్కెట్కు దిగుమతి అయిన మామిడి కంటే.. ఈ ఏడాది దిగుమతి అయిన మామిడి తక్కువే అయినప్పటికీ ఆదాయంలో మాత్రం క్షీణత కనిపించకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హుకుం జారీ చేసినా.. ఊహూ
[ 06-07-2024]
రాజధాని పరిధిలో ప్రతిపక్ష భారాసలో అసలేం జరుగుతోంది? పార్టీ అధిష్ఠానం మాటలను కార్పొరేటర్లు, ఇతర నేతలు పెడచెవిన పెడుతున్నారా? పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తోందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే చెబుతున్నారు. -
నీళ్లు పట్టుకున్నందుకు కొట్టి చంపారు
[ 06-07-2024]
దప్పిక తీర్చుకునేందుకు టీ దుకాణం వద్ద మంచి నీళ్లు పట్టుకునేందుకు వెళ్లిన క్రమంలో నెలకొన్న స్వల్ప వివాదం అమాయకుడి ప్రాణాలు బలి తీసుకుంది.మియాపూర్ ఠాణా పరిధిలో శుక్రవారం ఈ దారుణ ఘటన జరిగింది. -
మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధికి రక్షణ శాఖ స్థలాలు!
[ 06-07-2024]
మూసీ నది పరివాహక అభివృద్ధి కోసం పథకాన్ని రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం నదికి అటు, ఇటు ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు కార్యాచరణ చేపట్టింది. -
భూమికి భూమి ఎక్కడ కేటాయించాలో ?
[ 06-07-2024]
రాజీవ్ రహదారిలోని జింఖానా మైదానం నుంచి హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్, తూంకుంట, శామీర్పేట ఓఆర్ఆర్ వరకు మొత్తం 11.12 కిలోమీటర్ల పరిధిలో 300 ప్రైవేటు నిర్మాణాలను గుర్తించారు -
మాట్లాడుతుండగా ఫోన్ లాక్కున్నాడని హత్య
[ 06-07-2024]
ఫోన్ కోసం జరిగిన గొడవతో మద్యం మత్తులో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ అనుదీప్, స్థానికుల వివరాల ప్రకారం.. -
ఏకరూప దుస్తులు.. ఎప్పటికి అందేనో?
[ 06-07-2024]
పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోపు ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు అందరికీ ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన విద్యాశాఖ అధికారులు తరగతులు మొదలై ఇరవై రోజులైనా ఇంకా పంపిణీ కొనసాగిస్తున్నారు -
మోడల్ మార్కెట్ను అందుబాటులోకి తీసుకురండి
[ 06-07-2024]
కర్మన్ఘాట్ నిరుపయోగంగా ఉన్న మోడల్ మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు -
వాసన లేకుండా.. వ్యర్థాల నిర్వహణ
[ 06-07-2024]
చెత్త నుంచి బయోగ్యాస్, సేంద్రియ ఎరువు తయారుచేసే ఆధునిక పద్ధతిపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది -
ఓయూలో విద్యార్థుల అరెస్టు
[ 06-07-2024]
పలు నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఓయూ పోలీసులు విద్యార్థి నేతలను ముందస్తు అరెస్టుచేశారు. క్యాంపస్లోని వసతిగృహాలకువెళ్లి అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. -
అనిశా వలలో సర్కిల్ ఏఈ
[ 06-07-2024]
గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ఏఈ బలవంత్రెడ్డి శుక్రవారం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు చిక్కాడు. -
వసతి..ఏంటీ దుర్గతి..?
[ 06-07-2024]
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులను హాస్టల్ ఫీజులు బెంబేలెత్తిస్తున్నాయి. -
వేళకు రారు.. వేదన తప్పదు
[ 06-07-2024]
వికారాబాద్ పురపాలక సంఘంలో ఉద్యోగులు వేళకు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలు దాటినా విధులకు హాజరు కాలేదు. -
20 మంది గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
[ 06-07-2024]
అపరిశుభ్ర పరిసరాలు, కలుషిత ఆహారం విద్యార్థుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. వికారాబాద్ పట్టణ శివారు అనంతగిరిపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఇదే దుస్థితి నెలకొంది -
తొలగిన అవరోధం.. విస్తరణకు మోక్షం!
[ 06-07-2024]
హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి ఇరుకుగా, మలుపులతో ప్రమాదకరంగా మారింది. -
మనస్తాపంతో రైతు ఆత్మహత్య
[ 06-07-2024]
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఏఎస్ఐ మల్లేషం, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం మండలంలోని బూచన్పల్లికి చెందిన మహిపాల్రెడ్డి (41) వ్యవసాయం, కూలీ పనులు చేస్తుంటాడు.