విస్తరణ వివాదాస్పదం.. పనులకు అంతరాయం
జిల్లాలో అతిపెద్ద దైన తాండూరు వ్యవసాయ విపణి విస్తరణ పనులు ఆగిపోయాయి. గడచిన మార్చిలో అధికారులు విస్తరణ పనులు వేగంగా నిర్వహించారు.
విపణి నిర్మించాల్సిన స్థలం
న్యూస్టుడే,తాండూరు,వికారాబాద్ మున్సి పాలిటీ: జిల్లాలో అతిపెద్ద దైన తాండూరు వ్యవసాయ విపణి విస్తరణ పనులు ఆగిపోయాయి. గడచిన మార్చిలో అధికారులు విస్తరణ పనులు వేగంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని చదును చేసే పనులు చేపట్టారు. అయితే 11 మంది రైతులు తమ పొలాల్లో తమకు తెలియకుండా విస్తరణ పనులు నిర్వహించడమేమిటనే విషయంలో ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించి పనులను ఆపేశారు. దీంతో విపణి విస్తరణపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
రూ.10 కోట్లు.. 30 ఎకరాల స్థలం
తాండూరు వ్యవసాయ విపణిని విస్తరించేందుకు ప్రభుత్వం పట్టణ శివారులో 30 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. మొదటి దశలో కార్యాలయ భవనం, ప్రహరీ, ఆర్వో ప్లాంటు, శౌచాలయాల బ్లాకులు, విద్యుద్దీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఇవి పూర్తి కాగానే రెండో దశ పనులు చేపట్టాలన్నది ప్రణాళిక. రెండోదశలో వ్యాపార దుకాణాలు, షెడ్లు, ఫ్లాట్ఫారాలు, క్యాంటిన్ వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. మొదటి దశ పనులకు ప్రభుత్వం రూ.10 కోట్లను మంజూరు చేసింది. వీటితో కేటాయించిన స్థలంలో గుట్టలను, పెద్ద పెద్ద రాళ్లను తొలగించారు. నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమౌతున్న సమయంలో సమీపంలోని పొలాలకు చెందిన 11 మంది రైతులు విపణి విస్తరణలో తమ భూములు పోతున్నాయి. అధికారులు ఎవరూ తమను సంప్రదించకుండా పనులు చేపడుతున్నారు. పరిహారం చెల్లించే విషయంలోనూ విస్మరించారని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో వేగంగా జరుగుతున్న పనులకు ఉన్నట్టుండి న్యాయస్థానం జోక్యంతో బ్రేక్ పడింది.
స్వాతంత్య్రానికి ముందే ఆవిర్భావం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రంగారెడ్డి జిల్లాలో స్వాతంత్య్రానికి ముందే తాండూరు వ్యవసాయ విపణి ఆవిర్భవించింది. మొత్తం 7 ఎకరాల స్థలాన్ని కార్యకలాపాలు నిర్వహించడానికి అప్పట్లో కేటాయించారు. ఇందులో 4 ఎకరాల పశువుల విక్రయానికి సంబంధించిన స్థలం అయితే కేవలం 3 ఎకరాలు మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు కేటాయించారు. ఈ స్థలంలో వ్యవసాయ ఉత్పత్తుల క్రయ, విక్రయాలు నిర్వహించడం ఇబ్బందిగా మారింది.
సంవత్సరానికి రూ.450 కోట్ల లావాదేవీలు
ఈ విపణిలో ఏటా రూ.450 కోట్ల విలువ చేసే ఉత్పత్తులు విపణిలో విక్రయమౌతాయి. సరిపోను స్థలం లేక ఉత్పత్తులను రైతులు రహదారుల వారగా నిల్వ చేస్తున్నారు. ఈ పరిణామం విపణికి వచ్చి పోయే లోడింగ్, అన్లోడింగ్ వాహనాలకు ఇబ్బందిగా మారింది. స్థలా భావం వల జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) సవ్యంగా అమలు కావడం లేదు. రైతులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవు. ముఖ్యంగా ఉత్పత్తుల తూకాల సమయంలో సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. వ్యాపారులు, రైతులు కోరిన మేరకు ప్రభుత్వం విపణి విస్తరణకు నిర్ణయం తీసుకుంది.
న్యాయ స్థానం నుంచి తీర్పు వచ్చాకే ఏదైనా..: రాజేశ్వరి, విపణి ప్రత్యేక శ్రేణి కార్యదర్శి, తాండూరు
ప్రస్తుతం ఆగిపోయిన విపణి విస్తరణ పనులను న్యాయస్థానం నుంచి అనుకూల తీర్పు వెలువడ్డాకే పనులు చేపడతాం. 11 మంది రైతులు వివిధ కారణాలను చూపుతూ న్యాయస్థానానికి వెళ్లడంతో పనులు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఉన్నతాధికారులకు విషయాన్ని వివరించాం. న్యాయ స్థానంలో అప్పీలు చేయాలనే విషయాన్ని ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధికి రక్షణ శాఖ స్థలాలు!
[ 06-07-2024]
మూసీ నది పరివాహక అభివృద్ధి కోసం పథకాన్ని రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం నదికి అటు, ఇటు ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు కార్యాచరణ చేపట్టింది. -
భూమికి భూమి ఎక్కడ కేటాయించాలో ?
[ 06-07-2024]
రాజీవ్ రహదారిలోని జింఖానా మైదానం నుంచి హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్, తూంకుంట, శామీర్పేట ఓఆర్ఆర్ వరకు మొత్తం 11.12 కిలోమీటర్ల పరిధిలో 300 ప్రైవేటు నిర్మాణాలను గుర్తించారు -
నీళ్లు పట్టుకున్నందుకు కొట్టి చంపారు
[ 06-07-2024]
దప్పిక తీర్చుకునేందుకు టీ దుకాణం వద్ద మంచి నీళ్లు పట్టుకునేందుకు వెళ్లిన క్రమంలో నెలకొన్న స్వల్ప వివాదం అమాయకుడి ప్రాణాలు బలి తీసుకుంది.మియాపూర్ ఠాణా పరిధిలో శుక్రవారం ఈ దారుణ ఘటన జరిగింది. -
మాట్లాడుతుండగా ఫోన్ లాక్కున్నాడని హత్య
[ 06-07-2024]
ఫోన్ కోసం జరిగిన గొడవతో మద్యం మత్తులో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ అనుదీప్, స్థానికుల వివరాల ప్రకారం.. -
ఏకరూప దుస్తులు.. ఎప్పటికి అందేనో?
[ 06-07-2024]
పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోపు ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు అందరికీ ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన విద్యాశాఖ అధికారులు తరగతులు మొదలై ఇరవై రోజులైనా ఇంకా పంపిణీ కొనసాగిస్తున్నారు -
మోడల్ మార్కెట్ను అందుబాటులోకి తీసుకురండి
[ 06-07-2024]
కర్మన్ఘాట్ నిరుపయోగంగా ఉన్న మోడల్ మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు -
వాసన లేకుండా.. వ్యర్ధాల నిర్వహణ
[ 06-07-2024]
చెత్త నుంచి బయోగ్యాస్, సేంద్రియ ఎరువు తయారుచేసే ఆధునిక పద్ధతిపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది -
ఓయూలో విద్యార్థుల అరెస్టు
[ 06-07-2024]
పలు నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఓయూ పోలీసులు విద్యార్థి నేతలను ముందస్తు అరెస్టుచేశారు. క్యాంపస్లోని వసతిగృహాలకువెళ్లి అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. -
అనిశా వలలో సర్కిల్ ఏఈ
[ 06-07-2024]
గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ఏఈ బలవంత్రెడ్డి శుక్రవారం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు చిక్కాడు. -
వసతి ..ఏంటి దుర్గతి..?
[ 06-07-2024]
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులను హాస్టల్ ఫీజులు బెంబేలెత్తిస్తున్నాయి. -
వేళకు రారు.. వేదన తప్పదు
[ 06-07-2024]
వికారాబాద్ పురపాలక సంఘంలో ఉద్యోగులు వేళకు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలు దాటినా విధులకు హాజరు కాలేదు. -
20 మంది గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
[ 06-07-2024]
అపరిశుభ్ర పరిసరాలు, కలుషిత ఆహారం విద్యార్థుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. వికారాబాద్ పట్టణ శివారు అనంతగిరిపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఇదే దుస్థితి నెలకొంది -
తొలగిన అవరోధం.. విస్తరణకు మోక్షం!
[ 06-07-2024]
హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి ఇరుకుగా, మలుపులతో ప్రమాదకరంగా మారింది. -
మనస్తాపంతో రైతు ఆత్మహత్య
[ 06-07-2024]
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఏఎస్ఐ మల్లేషం, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం మండలంలోని బూచన్పల్లికి చెందిన మహిపాల్రెడ్డి (41) వ్యవసాయం, కూలీ పనులు చేస్తుంటాడు.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/07/24)
-
చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్లో మాళవిక మెరుపులు!
-
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
-
మోదీ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..! లాలూ
-
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!