అటవీ శాఖలో అవినీతి కలకలం!
అవినీతి, అక్రమాలకు చోటులేదని భావించే జిల్లా అటవీ శాఖపై తాజాగా అవినీతి మరక పడింది. వికారాబాద్, తాండూరు అటవీ క్షేత్రాధికారులు (ఆర్ఎఫ్ఓ) అరుణ, శ్యాంసుందర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడటంతో సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. దీంతో సర్వత్రా చర్చనీయాంశమైంది.
రూ.53.72 లక్షల తునికాకు బోనస్ చెల్లింపులో చేతివాటం
ఇద్దరు ఆర్ఎఫ్ఓలపై వేటుతో చర్చ
న్యూస్టుడే, వికారాబాద్, తాండూరు
అవినీతి, అక్రమాలకు చోటులేదని భావించే జిల్లా అటవీ శాఖపై తాజాగా అవినీతి మరక పడింది. వికారాబాద్, తాండూరు అటవీ క్షేత్రాధికారులు (ఆర్ఎఫ్ఓ) అరుణ, శ్యాంసుందర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడటంతో సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. దీంతో సర్వత్రా చర్చనీయాంశమైంది.
బయటపడిందిలా..: జిల్లాలోని 8 యూనిట్లకు 2017లో రూ.49.19 లక్షలు, 2018లో రూ.1.63 లక్షలు, 2021లో నాలుగు యూనిట్లకు రూ.2.90 లక్షలు బోనస్గా వచ్చాయి. రూపాయి ఖర్చుకు రెండున్నర రూపాయల ఆదాయం తునికాకు సేకరణ ద్వారా రావడంతో తునికాకు సేకరణ జరిపిన కూలీలకు రూ.53.72 లక్షల బోనస్ మంజూరు చేశారు. ఈ డబ్బును దస్త్రాలను పరిశీలించి అప్పట్లో కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. కానీ గుట్టుచప్పుడు కాకుండా తమ అనుకూలురైన వ్యక్తుల ఖాతాల్లో జమ చేశారు.
డ్రైవర్ ఖాతాలోకి మళ్లింపు
వికారాబాద్ మండలం గొట్టిముక్ల యూనిట్కు సంబంధించి రూ.7.51 లక్షలను ఆర్ఎఫ్ఓ అరుణ అటవీశాఖ కార్యాలయంలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న ఒప్పంద ఉద్యోగి చిన్నయ్య, ఈయన భార్య యాదమ్మ ఖాతాల్లో జమ చేయాలని అరుణ ఆదేశించారు. ఈలోపు డ్రైవర్ చిన్నయ్య అనారోగ్యంతో మృతి చెందగా, భార్య యాదమ్మను భర్త స్థానంలో ఒప్పంద ఉద్యోగిగా తీసుకున్నారు. అనంతరం రూ.7.51 లక్షలు ఖాతాల్లో జమయ్యాయి. ఈ విషయం యాదమ్మకు తెలియదు. ఈ డబ్బును బ్యాంకు నుంచి డ్రా చేసి తీసుకురావాలని ఇటీవలే పదవీ విరమణ చేసిన కిష్టయ్య అనే ఒప్పంద ఉద్యోగిని అరుణ పురమాయించింది. దీంతో ఆయన యాదమ్మ దగ్గరికి వెళ్లి రూ.7.51 లక్షల విషయం తెలిపి, ఆ డబ్బుల్లో నుంచి రూ.31 వేలు ఉంచుకొని మిగతా ఆర్ఎఫ్ఓ అరుణకు ఇవ్వాలని సూచించారు. ఇందుకు యాదమ్మ అంగీకరించకపోవడంతో మొత్తం వ్యవహారం బహిర్గతమైంది. దీనిపై నిగ్గు తేల్చాలని విజిలెన్స్ డీఎఫ్ఓ రాజశేఖర్ను విచారణాధికారిగా నియమించింది. గత జూన్ 3న ఆయన విచారణ చేయగా, వ్యవహారం అంతా బయటపడింది. బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన రూ.7.51 లక్షలను అటవీశాఖ తిరిగి తీసుకుంది.
తాండూరులో విచారణ చేయగా, అక్కడ కూడా పెద్దేముల్ మండలం తట్లేపల్లి యూనిట్ కూలీలకు జమ చేయాల్సిన రూ.8.8 లక్షలను తమ అనుకూలురైన కూలీల ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని గుర్తించారు. జిల్లా మొత్తం 8 యూనిట్లకు మంజూరైన డబ్బులు కూలీలకు అందలేదని విచారణలో తేలింది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందింది.
కంప్యూటరీకరణ చేసినా..
గతంలో తునికాకు సేకరణ జరిపే గుత్తేదారు నుంచి కూలీలకు పని దినాల ఆధారంగా డబ్బులు అందేవి. పది రోజులు పని చేస్తే 20 రోజులు పని చేసినట్లుగా చూపించి మధ్యలో కూలీల నుంచి తునికాకు సేకరించే కల్లెదారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా అటవీశాఖాధికారులు గుర్తించారు. వీటిని నియంత్రించడానికి 2022-23లో కంప్యూటరీకరణ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయినా అక్రమాలకు కళ్లెం పడలేదు. కల్లెదారులకు బదులుగా అటవీశాఖ అధికారులే అవినీతికి పాల్పడ్డారు. విషయం వెల్లడి కావడంతో అటవీ సిబ్బంది ఉలిక్కిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హుకుం జారీ చేసినా.. ఊహూ
[ 06-07-2024]
రాజధాని పరిధిలో ప్రతిపక్ష భారాసలో అసలేం జరుగుతోంది? పార్టీ అధిష్ఠానం మాటలను కార్పొరేటర్లు, ఇతర నేతలు పెడచెవిన పెడుతున్నారా? పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తోందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే చెబుతున్నారు. -
నీళ్లు పట్టుకున్నందుకు కొట్టి చంపారు
[ 06-07-2024]
దప్పిక తీర్చుకునేందుకు టీ దుకాణం వద్ద మంచి నీళ్లు పట్టుకునేందుకు వెళ్లిన క్రమంలో నెలకొన్న స్వల్ప వివాదం అమాయకుడి ప్రాణాలు బలి తీసుకుంది.మియాపూర్ ఠాణా పరిధిలో శుక్రవారం ఈ దారుణ ఘటన జరిగింది. -
మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధికి రక్షణ శాఖ స్థలాలు!
[ 06-07-2024]
మూసీ నది పరివాహక అభివృద్ధి కోసం పథకాన్ని రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం నదికి అటు, ఇటు ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు కార్యాచరణ చేపట్టింది. -
భూమికి భూమి ఎక్కడ కేటాయించాలో ?
[ 06-07-2024]
రాజీవ్ రహదారిలోని జింఖానా మైదానం నుంచి హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్, తూంకుంట, శామీర్పేట ఓఆర్ఆర్ వరకు మొత్తం 11.12 కిలోమీటర్ల పరిధిలో 300 ప్రైవేటు నిర్మాణాలను గుర్తించారు -
మాట్లాడుతుండగా ఫోన్ లాక్కున్నాడని హత్య
[ 06-07-2024]
ఫోన్ కోసం జరిగిన గొడవతో మద్యం మత్తులో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ అనుదీప్, స్థానికుల వివరాల ప్రకారం.. -
ఏకరూప దుస్తులు.. ఎప్పటికి అందేనో?
[ 06-07-2024]
పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోపు ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు అందరికీ ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన విద్యాశాఖ అధికారులు తరగతులు మొదలై ఇరవై రోజులైనా ఇంకా పంపిణీ కొనసాగిస్తున్నారు -
మోడల్ మార్కెట్ను అందుబాటులోకి తీసుకురండి
[ 06-07-2024]
కర్మన్ఘాట్ నిరుపయోగంగా ఉన్న మోడల్ మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు -
వాసన లేకుండా.. వ్యర్థాల నిర్వహణ
[ 06-07-2024]
చెత్త నుంచి బయోగ్యాస్, సేంద్రియ ఎరువు తయారుచేసే ఆధునిక పద్ధతిపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది -
ఓయూలో విద్యార్థుల అరెస్టు
[ 06-07-2024]
పలు నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఓయూ పోలీసులు విద్యార్థి నేతలను ముందస్తు అరెస్టుచేశారు. క్యాంపస్లోని వసతిగృహాలకువెళ్లి అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. -
అనిశా వలలో సర్కిల్ ఏఈ
[ 06-07-2024]
గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ఏఈ బలవంత్రెడ్డి శుక్రవారం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు చిక్కాడు. -
వసతి..ఏంటీ దుర్గతి..?
[ 06-07-2024]
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులను హాస్టల్ ఫీజులు బెంబేలెత్తిస్తున్నాయి. -
వేళకు రారు.. వేదన తప్పదు
[ 06-07-2024]
వికారాబాద్ పురపాలక సంఘంలో ఉద్యోగులు వేళకు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలు దాటినా విధులకు హాజరు కాలేదు. -
20 మంది గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
[ 06-07-2024]
అపరిశుభ్ర పరిసరాలు, కలుషిత ఆహారం విద్యార్థుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. వికారాబాద్ పట్టణ శివారు అనంతగిరిపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఇదే దుస్థితి నెలకొంది -
తొలగిన అవరోధం.. విస్తరణకు మోక్షం!
[ 06-07-2024]
హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి ఇరుకుగా, మలుపులతో ప్రమాదకరంగా మారింది. -
మనస్తాపంతో రైతు ఆత్మహత్య
[ 06-07-2024]
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఏఎస్ఐ మల్లేషం, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం మండలంలోని బూచన్పల్లికి చెందిన మహిపాల్రెడ్డి (41) వ్యవసాయం, కూలీ పనులు చేస్తుంటాడు.