ఈవీలకు ఛార్జింగ్ పాయింట్లే కీలకం
కాలుష్యాన్ని తగ్గించే విద్యుత్తు వాహనాలు పెరగాలంటే మౌలిక వసతులైన ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు కీలకం.
సెల్లార్లలో కార్ల వరకు అనుమతిస్తున్నాం
‘ఈనాడు’తో ప్రభుత్వ ప్రధాన విద్యుత్తు తనిఖీ అధికారి శ్రీనివాసరావు
ఈనాడు, హైదరాబాద్: కాలుష్యాన్ని తగ్గించే విద్యుత్తు వాహనాలు పెరగాలంటే మౌలిక వసతులైన ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు కీలకం. భద్రత దృష్ట్యా వీటిని ఎక్కడ ఏర్పాటు చేయాలి? అపార్ట్మెంట్ల సెల్లార్లలో ఏర్పాటు చేయవచ్చా? వీటిపై సమాధానం ఇచ్చారు తెలంగాణ ప్రధాన విద్యుత్తు తనిఖీ అధికారి (సీఈఐజీ) ఎస్.శ్రీనివాస్రావు.
ధ్రువీకరణ తప్పనిసరి
కార్లకు సంబంధించి బ్యాటరీలు పేలడం, ఛార్జింగ్ పాయింట్ల సమస్యలు మా దృష్టికి రాలేదు. బైకులకు ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఏఐ) తప్పనిసరి చేశాం. ఇది లేకపోతే అనుమతి ఉండదు.
భద్రతాపరంగా రాజీలేదు
విద్యుత్తు వాహనాల ఛార్జింగ్ పాయింట్లకు సీఈఐజీ నిబంధనల మేరకు నడుచుకుంటున్నాం. కార్ల వరకు సెల్లార్లలో అనుమతి ఇస్తున్నాం. వీటికి 7.3 కిలోవాట్ సామర్థ్యం కల్గిన ఛార్జింగ్ పాయింట్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. వీటికోసం ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్, ప్యానల్ బోర్డు, మీటర్లుండాలి. బైకులకు సెల్లార్లలో కాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసుకోవాలి.
పాలసీ లేక..
ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు రాష్ట్రస్థాయిలో ఒక పాలసీ రూపొందించేందుకు గతంలో ఆస్కి బాధ్యత తీసుకుంది. మేం కూడా భాగస్వాములయ్యాం. 2030 నాటికి 30 శాతం విద్యుత్తు వాహనాలు ఉండాలనే లక్ష్యం చేరుకోవాలంటే ఛార్జింగ్ కేంద్రాలు ముఖ్యం.
ప్రాణ నష్టం తగ్గింది.. గతేడాది వేసవితో పోలిస్తే ఈసారి విద్యుత్తు ప్రమాదాలు తగ్గాయి. మా అధికార బృందం ఎప్పటికప్పుడు కంపెనీలు, మాల్స్, ఆసుపత్రులు తనిఖీలు చేస్తూ భద్రతాపరంగా చేపట్టాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు.
ఖాళీ పోస్టుల భర్తీపై ఆశాభావం
సీఈఐజీలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 12 ఏఈ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీకి లేఖ రాశాం. రెండు రోజుల క్రితం మరో ఇద్దరు అధికారులు పదవీ విరమణ చేశారు. తాను సైతం ఆగస్టులో పదవీ విరమణ చేస్తున్నాను. కొత్త వారి చేరిక, పాతవారికి పదోన్నతులతో త్వరలోనే ఖాళీ పోస్టులు భర్తీ అవుతాయని ఆశిస్తున్నా.
ఇప్పటివరకు ఒకే దరఖాస్తు
ఈవీ ఛార్జింగ్ పాయింట్లకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క కమ్యూనిటీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఒక సంస్థ దరఖాస్తు చేసుకుంది. డ్రాయింగ్స్ పరిశీలనలో ఉన్నాయి. అనుమతి లేకుండా ఎవరు ఏర్పాటు చేసుకున్నా అక్రమమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హుకుం జారీ చేసినా.. ఊహూ
[ 06-07-2024]
రాజధాని పరిధిలో ప్రతిపక్ష భారాసలో అసలేం జరుగుతోంది? పార్టీ అధిష్ఠానం మాటలను కార్పొరేటర్లు, ఇతర నేతలు పెడచెవిన పెడుతున్నారా? పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తోందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే చెబుతున్నారు. -
నీళ్లు పట్టుకున్నందుకు కొట్టి చంపారు
[ 06-07-2024]
దప్పిక తీర్చుకునేందుకు టీ దుకాణం వద్ద మంచి నీళ్లు పట్టుకునేందుకు వెళ్లిన క్రమంలో నెలకొన్న స్వల్ప వివాదం అమాయకుడి ప్రాణాలు బలి తీసుకుంది.మియాపూర్ ఠాణా పరిధిలో శుక్రవారం ఈ దారుణ ఘటన జరిగింది. -
మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధికి రక్షణ శాఖ స్థలాలు!
[ 06-07-2024]
మూసీ నది పరివాహక అభివృద్ధి కోసం పథకాన్ని రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం నదికి అటు, ఇటు ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు కార్యాచరణ చేపట్టింది. -
భూమికి భూమి ఎక్కడ కేటాయించాలో ?
[ 06-07-2024]
రాజీవ్ రహదారిలోని జింఖానా మైదానం నుంచి హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్, తూంకుంట, శామీర్పేట ఓఆర్ఆర్ వరకు మొత్తం 11.12 కిలోమీటర్ల పరిధిలో 300 ప్రైవేటు నిర్మాణాలను గుర్తించారు -
మాట్లాడుతుండగా ఫోన్ లాక్కున్నాడని హత్య
[ 06-07-2024]
ఫోన్ కోసం జరిగిన గొడవతో మద్యం మత్తులో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ అనుదీప్, స్థానికుల వివరాల ప్రకారం.. -
ఏకరూప దుస్తులు.. ఎప్పటికి అందేనో?
[ 06-07-2024]
పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోపు ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు అందరికీ ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన విద్యాశాఖ అధికారులు తరగతులు మొదలై ఇరవై రోజులైనా ఇంకా పంపిణీ కొనసాగిస్తున్నారు -
మోడల్ మార్కెట్ను అందుబాటులోకి తీసుకురండి
[ 06-07-2024]
కర్మన్ఘాట్ నిరుపయోగంగా ఉన్న మోడల్ మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు -
వాసన లేకుండా.. వ్యర్థాల నిర్వహణ
[ 06-07-2024]
చెత్త నుంచి బయోగ్యాస్, సేంద్రియ ఎరువు తయారుచేసే ఆధునిక పద్ధతిపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది -
ఓయూలో విద్యార్థుల అరెస్టు
[ 06-07-2024]
పలు నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఓయూ పోలీసులు విద్యార్థి నేతలను ముందస్తు అరెస్టుచేశారు. క్యాంపస్లోని వసతిగృహాలకువెళ్లి అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. -
అనిశా వలలో సర్కిల్ ఏఈ
[ 06-07-2024]
గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ఏఈ బలవంత్రెడ్డి శుక్రవారం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు చిక్కాడు. -
వసతి..ఏంటీ దుర్గతి..?
[ 06-07-2024]
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులను హాస్టల్ ఫీజులు బెంబేలెత్తిస్తున్నాయి. -
వేళకు రారు.. వేదన తప్పదు
[ 06-07-2024]
వికారాబాద్ పురపాలక సంఘంలో ఉద్యోగులు వేళకు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలు దాటినా విధులకు హాజరు కాలేదు. -
20 మంది గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
[ 06-07-2024]
అపరిశుభ్ర పరిసరాలు, కలుషిత ఆహారం విద్యార్థుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. వికారాబాద్ పట్టణ శివారు అనంతగిరిపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఇదే దుస్థితి నెలకొంది -
తొలగిన అవరోధం.. విస్తరణకు మోక్షం!
[ 06-07-2024]
హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి ఇరుకుగా, మలుపులతో ప్రమాదకరంగా మారింది. -
మనస్తాపంతో రైతు ఆత్మహత్య
[ 06-07-2024]
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఏఎస్ఐ మల్లేషం, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం మండలంలోని బూచన్పల్లికి చెందిన మహిపాల్రెడ్డి (41) వ్యవసాయం, కూలీ పనులు చేస్తుంటాడు.