నాలుగ్గోడల జీవితానికి స్వేచ్ఛ
తెలిసో తెలియకో క్షణికావేశంలో చేసిన తప్పిదం వారిని బందీలను చేసింది. సమాజానికి, కుటుంబానికి దూరంగా నాలుగు గోడల మధ్య ఉంటూ.. తీవ్ర మనోవేదన అనుభవించారు.
అధికారుల సూచనతో ప్రతిజ్ఞ చేస్తున్న విడుదలైన ఖైదీలు
ఈనాడు- హైదరాబాద్, కాప్రా, న్యూస్టుడే: తెలిసో తెలియకో క్షణికావేశంలో చేసిన తప్పిదం వారిని బందీలను చేసింది. సమాజానికి, కుటుంబానికి దూరంగా నాలుగు గోడల మధ్య ఉంటూ.. తీవ్ర మనోవేదన అనుభవించారు. జైలు అధికారుల సాయంతో నైపుణ్యాలకు సానబెట్టుకున్నారు. మానసిక నిపుణుల సూచనలతో చేసిన తప్పు తెలుసుకున్నారు. సత్ప్రవర్తనతో నడుచుకుంటున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని జైళ్లలో మగ్గుతున్న 213 మంది ఖైదీలను బుధవారం విడుదల చేసింది. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన ఖైదీలను ‘ఈనాడు’ పలకరించింది. వివరాలు వారి మాటల్లోనే..
11 ఏళ్లుగా జైలు గోడల మధ్యే..: అండాలమ్మ
హత్య కేసులో జైలుకొచ్చాను. 11 ఏళ్లుగా జైలు గోడల మధ్యే జీవితం గడిచిపోయింది. తెలిసీ తెలియక చేసిన తప్పు విలువ.. జైలుకు వచ్చాక అర్థమైంది. జైల్లో అల్లికలు, కుట్టు మిషన్ పనులు నేర్చుకున్నా. ఇక నుంచి స్వశక్తితో రెండో జీవితం ప్రారంభిస్తా. భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
జీవితమంటే తెలిసింది: కె.రాజేశ్, కరీంనగర్
ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో 15 ఏళ్ల క్రితం శిక్ష పడింది. జైలుకొచ్చా. ఇక్కడికొచ్చాక జీవితం విలువ అర్థమైంది. పెట్రోలు బంకులో పనిచేశా. ఇప్పుడు విడుదలవడం, నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మరో తప్పు జరగకుండా చూసుకుంటా. నాకు ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి.
కొత్త జీవితం ప్రారంభిస్తా
నా పేరు దాసరి మురళి. నిజామాబాద్ జిల్లా. ఆర్ఎంపీ వైద్యుడిని. 14 ఏళ్ల క్రితం భూ వివాదంలో నిగ్రహం కోల్పోయి దాడి చేయగా ఒకరు మరణించారు. జీవితకాల శిక్ష పడింది. ఇద్దరు పిల్లలున్నారు. వారి చదువులకు ఫీజు కట్టలేదని పిల్లల్ని కళాశాల నుంచి పంపించడం.. ఆర్థిక ఇబ్బందులతో మరింత కుంగిపోయా. ఇక్కడే డిగ్రీ, ఎంఏ సైకాలజీ చేశా. వివిధ కేసుల్లో జైలుకొచ్చే తోటి ఖైదీలకు కౌన్సెలింగ్ ఇచ్చా. ఇక కొత్త జీవితం ప్రారంభిస్తా.
దాసరి మురళి, నిజామాబాద్
యవ్వనమంతా ఇక్కడే
19 ఏళ్ల వయసులో హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడింది. 22 ఏళ్లుగా జైల్లో ఉంటూ యవ్వనాన్ని, తల్లిదండ్రుల ఆప్యాయత కోల్పోయా. కరోనా సమయంలో తోటి ఖైదీలతో కలిసి 5 వేల లీటర్ల శానిటైజర్ తయారుచేశా. సబ్బులు, సర్ఫ్, ఫినాయిల్, పరిశుభ్రతకు సంబంధించి ఉత్పత్తుల తయారీ నేర్చుకున్నా. బిహార్ వెళ్లాక అమ్మను బాగా చూసుకుంటా. నన్ను జైలు నుంచి విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
మున్నా ఉపాధ్యాయ్, బిహార్
కోల్పోయిన స్వేచ్ఛను ఆస్వాదిస్తా..
పొరపాటున చేసిన తప్పునకు 10 ఏళ్ల క్రితం అరెస్టయి జైలుకొచ్చా. జీవితకాల శిక్ష పడడంతో ఇంకేం చేయలేని దుస్థితి. జైల్లో అనారోగ్యంతో సతమతమయ్యే నాకు అధికారులు అండగా నిలిచారు. యోగాతో కోలుకున్నా. కుట్టు మిషన్, బేకరి ఉత్పత్తుల తయారీ వంటి స్వయం ఉపాధి పనులు నేర్చుకున్నా. పదేళ్లుగా కోల్పోయిన స్వేచ్ఛను కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలను ఆస్వాదిస్తా. జైల్లో నేర్చుకున్న నైపుణ్యాలతో సొంతంగా పనులు చేసుకుంటూ జీవిస్తా.
రాజేశ్వరి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హుకుం జారీ చేసినా.. ఊహూ
[ 06-07-2024]
రాజధాని పరిధిలో ప్రతిపక్ష భారాసలో అసలేం జరుగుతోంది? పార్టీ అధిష్ఠానం మాటలను కార్పొరేటర్లు, ఇతర నేతలు పెడచెవిన పెడుతున్నారా? పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తోందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే చెబుతున్నారు. -
నీళ్లు పట్టుకున్నందుకు కొట్టి చంపారు
[ 06-07-2024]
దప్పిక తీర్చుకునేందుకు టీ దుకాణం వద్ద మంచి నీళ్లు పట్టుకునేందుకు వెళ్లిన క్రమంలో నెలకొన్న స్వల్ప వివాదం అమాయకుడి ప్రాణాలు బలి తీసుకుంది.మియాపూర్ ఠాణా పరిధిలో శుక్రవారం ఈ దారుణ ఘటన జరిగింది. -
మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధికి రక్షణ శాఖ స్థలాలు!
[ 06-07-2024]
మూసీ నది పరివాహక అభివృద్ధి కోసం పథకాన్ని రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం నదికి అటు, ఇటు ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు కార్యాచరణ చేపట్టింది. -
భూమికి భూమి ఎక్కడ కేటాయించాలో ?
[ 06-07-2024]
రాజీవ్ రహదారిలోని జింఖానా మైదానం నుంచి హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్, తూంకుంట, శామీర్పేట ఓఆర్ఆర్ వరకు మొత్తం 11.12 కిలోమీటర్ల పరిధిలో 300 ప్రైవేటు నిర్మాణాలను గుర్తించారు -
మాట్లాడుతుండగా ఫోన్ లాక్కున్నాడని హత్య
[ 06-07-2024]
ఫోన్ కోసం జరిగిన గొడవతో మద్యం మత్తులో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ అనుదీప్, స్థానికుల వివరాల ప్రకారం.. -
ఏకరూప దుస్తులు.. ఎప్పటికి అందేనో?
[ 06-07-2024]
పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోపు ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు అందరికీ ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన విద్యాశాఖ అధికారులు తరగతులు మొదలై ఇరవై రోజులైనా ఇంకా పంపిణీ కొనసాగిస్తున్నారు -
మోడల్ మార్కెట్ను అందుబాటులోకి తీసుకురండి
[ 06-07-2024]
కర్మన్ఘాట్ నిరుపయోగంగా ఉన్న మోడల్ మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు -
వాసన లేకుండా.. వ్యర్థాల నిర్వహణ
[ 06-07-2024]
చెత్త నుంచి బయోగ్యాస్, సేంద్రియ ఎరువు తయారుచేసే ఆధునిక పద్ధతిపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది -
ఓయూలో విద్యార్థుల అరెస్టు
[ 06-07-2024]
పలు నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఓయూ పోలీసులు విద్యార్థి నేతలను ముందస్తు అరెస్టుచేశారు. క్యాంపస్లోని వసతిగృహాలకువెళ్లి అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. -
అనిశా వలలో సర్కిల్ ఏఈ
[ 06-07-2024]
గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ఏఈ బలవంత్రెడ్డి శుక్రవారం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు చిక్కాడు. -
వసతి..ఏంటీ దుర్గతి..?
[ 06-07-2024]
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులను హాస్టల్ ఫీజులు బెంబేలెత్తిస్తున్నాయి. -
వేళకు రారు.. వేదన తప్పదు
[ 06-07-2024]
వికారాబాద్ పురపాలక సంఘంలో ఉద్యోగులు వేళకు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలు దాటినా విధులకు హాజరు కాలేదు. -
20 మంది గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
[ 06-07-2024]
అపరిశుభ్ర పరిసరాలు, కలుషిత ఆహారం విద్యార్థుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. వికారాబాద్ పట్టణ శివారు అనంతగిరిపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఇదే దుస్థితి నెలకొంది -
తొలగిన అవరోధం.. విస్తరణకు మోక్షం!
[ 06-07-2024]
హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి ఇరుకుగా, మలుపులతో ప్రమాదకరంగా మారింది. -
మనస్తాపంతో రైతు ఆత్మహత్య
[ 06-07-2024]
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఏఎస్ఐ మల్లేషం, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం మండలంలోని బూచన్పల్లికి చెందిన మహిపాల్రెడ్డి (41) వ్యవసాయం, కూలీ పనులు చేస్తుంటాడు.