మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
కొద్దిరోజుల్లో జరిగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రాజధానికి ప్రాతినిధ్యం లభించబోతోందని తెలుస్తోంది. కాంగ్రెస్ వర్గాలూ ఇదే స్పష్టం చేస్తున్నాయి. ఈ వారంలో మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిద్ధమవుతున్నారు.
మంత్రివర్గ విస్తరణలో రాజధానికి అవకాశం
తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఇద్దరు నేతలు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
కొద్దిరోజుల్లో జరిగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రాజధానికి ప్రాతినిధ్యం లభించబోతోందని తెలుస్తోంది. కాంగ్రెస్ వర్గాలూ ఇదే స్పష్టం చేస్తున్నాయి. ఈ వారంలో మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిద్ధమవుతున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు స్థానం లభించలేదు. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలే గెలవడంతోపాటు ఇక్కడ కాంగ్రెస్ నుంచి మైనార్టీల ప్రాతినిధ్యం లేకపోవడంతో రేవంత్రెడ్డి మంత్రివర్గంలో గెలిచిన వీరెవరికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తమకు మంత్రివర్గం స్థానంలో కల్పించాలంటూ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈనేపథ్యంలో ఒకరికి స్థానం లభించే అవకాశం ఉంది. మొన్నటి ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 29 స్థానాలకుగాను ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, షాద్నగర్ నుంచి వీర్ల శంకర్, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నార్యాయణరెడ్డి గెలుపొందారు. వీరిలో వీర్లపల్లి శంకర్, నారాయణరెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మల్రెడ్డి మాత్రం మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. కాంగ్రెస్ నుంచి రెండోసారి ఎన్నికయ్యారు. తానే సీనియర్ కాబట్టి తనకు మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కూడా కలిశారు. దిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కూడా రెండు మూడుసార్లు కలిసి వచ్చారు.
లోక్సభ ఎన్నికలకు ముందు ఖైరతాబాద్ భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరారు. ఆ తరువాత సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్లో చేరే సమయంలో.. ఒకవేళ ఎంపీగా ఓడిపోతే మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. తనకు మంత్రివర్గంలో తప్పక స్థానం లభిస్తుందన్న ఆశలో దానం ఉన్నారు. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు మాత్రమే స్థానం కల్పించాలని అధిష్ఠానం నిర్ణయించిందంటూ వారం కిందట దిల్లీలో రేవంత్ విలేకరులకు వెల్లడించారు. దీంతో దానం ఆశలు సన్నగిల్లాయి. అయినా తన ప్రయత్నాలను చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నగరంలో మైనార్టీలకు మొదటి మంత్రివర్గంలో స్థానం లభించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మైనార్టీ అభ్యర్థులెవరూ గెలవలేదు. ఈసారి ఆ వర్గానికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా అనే దానిపై స్పష్టత లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆస్తులను రక్షిస్తాం.. ఆక్రమణల అంతు తేలుస్తాం
[ 05-07-2024]
‘‘రాజధాని పరిధిలో రూ.వేల కోట్ల ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఆక్రమణకు గురైన వాటిని గుర్తించి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు మొదలుపెట్టాం. -
బల్దియా జాగాపై ప్రైవేటు జబర్దస్తీ!
[ 05-07-2024]
జీహెచ్ఎంసీ ఆస్తులతో ప్రైవేటు వ్యక్తులు రూ.కోట్లు సంపాదిస్తున్నారు. అక్రమ ప్రకటనల బోర్డుల ఏర్పాటుతోరూ.లక్షల్లో అద్దె వసూలు చేసుకుంటున్నారు. -
ఆరు మందులు రాస్తే.. ఐదు కొనుక్కోవాల్సిందే
[ 05-07-2024]
ప్రభుత్వ దవాఖానాలకు చికిత్సల కోసం వస్తున్న పేద రోగులపై మందుల రూపంలో పెను భారం పడుతోంది. చికిత్సల వరకు ఉచితంగా అందిస్తున్నా ఔషధాలను పూర్తి స్థాయిలో సరఫరా చేయడం లేదని రోగులు వాపోతున్నారు. -
కొణిజేటి రోశయ్యకు భారతరత్న ప్రకటించాలి
[ 05-07-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య చెరగని ముద్రవేశారని టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కోకన్వీనర్, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్త కొనియాడారు. -
చంద్రబాబుకు స్వాగత ఫ్లెక్సీలు
[ 05-07-2024]
ఆంధ్ర]ప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తొలిసారిగా హైదరాబాద్కు వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలుకుతూ తెదేపా శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటుచేశారు. -
నేలమట్టం చేసినా పుట్టుకొస్తున్నాయి
[ 05-07-2024]
చెరువులోని నిర్మాణాలను జీహెచ్ఎంసీ కూల్చడం.. కొంత కాలం తర్వాత మళ్లీ అక్కడ భవనాలు రావడం సర్వసాధారణమైంది. -
పార్లమెంటు ప్రాంగణంలో అల్లూరి విగ్రహం
[ 05-07-2024]
సమ సమాజ నిర్మాణాన్ని కాంక్షించడం సహా భారత దేశ విముక్తి కోసం బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని రాష్ట్ర మంత్రి సీతక్క కొనియాడారు. -
దొడ్డి కొమురయ్య విగ్రహం ఏర్పాటుకు కృషి
[ 05-07-2024]
రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్నా.. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహం రాజధానిలో ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. -
రామోజీరావు యువతకు స్ఫూర్తి ప్రదాత
[ 05-07-2024]
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ దివంగత రామోజీరావు యువతకు స్ఫూర్తి ప్రదాత అని మున్నూరు కాపు విద్యార్థి వసతిగృహం ట్రస్ట్బోర్డు ఛైర్మన్ ప్రొ.ఎంఆర్ వెంకట్రావు కొనియాడారు. -
కన్నతల్లిని కడతేర్చి.. సాధారణ మృతిగా చిత్రీకరించి..
[ 05-07-2024]
దైవదర్శనానికి వచ్చిన సందర్భంలో తల్లి అస్వస్థతకు గురికాగా అసహనానికి గురైన కుమారుడు ఆమెను హత్య చేశాడు. ఆమెది సహజ మరణమని చెబుతూ తప్పుదోవ పట్టించే యత్నం చేశాడు. -
కరుణించని వరుణుడు.. కదలని కాడి!
[ 05-07-2024]
వానాకాలం సాగుకు పదకొండు రోజులే గడువు ఉంది. జులై 15 వరకు పెసర, మినుములు మినహా అన్ని రకాల పంటలకు సంబంధించిన విత్తనాలు వేసుకునే అవకాశం ఉంది. -
శంకుస్థాపనతో సరి.. నిర్మాణం ఎప్పుడో మరి!
[ 05-07-2024]
తాండూరు పట్టణంలో ఆటోనగర్ నిర్మాణానికి 2023 అక్టోబరులో అప్పటి ప్రభుత్వం రూ.12.6 కోట్లు మంజూరు చేసింది. అంతారం గుట్ట సమీపంలో స్థలాన్ని కేటాయించి, పనులకు శంకుస్థాపన చేసినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. -
ముగిసిన జడ్పీ పాలన.. నేటి నుంచి ప్రత్యేక పాలన
[ 05-07-2024]
జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం ఈ నెల 4వ తేదీతో ముగిసింది. 5వ తేదీన ప్రత్యేకాధికారులు బాధ్యతలు స్వీకరించనున్నారు. -
ముగిసిన సర్వే.. ముమ్మరంగా పనులు!
[ 05-07-2024]
రాష్ట్రంలో కొడంగల్ను నమూనా నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
రైతుబజార్లో కమిషనర్ తనిఖీలు
[ 05-07-2024]
భరత్నగర్ కూరగాయల మార్కెట్, జేఎన్టీయూ రోడ్డులోని రైతుబజార్లో గురువారం ఉదయం కమిషనర్ ఆమ్రపాలి తనిఖీలు చేశారు. -
రయ్మంటూ దూసుకెళ్తే.. లైసెన్స్ రద్దే
[ 05-07-2024]
బైక్, కారుతో రోడ్డుపైకి వచ్చి ఇష్టారాజ్యం డ్రైవింగ్ చేశారంటే..చిక్కుల్లో పడ్డట్టే. ర్యాష్ డ్రైవింగ్పై రవాణాశాఖ సీరియస్గా దృష్టి సారిస్తోంది. -
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
[ 05-07-2024]
జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, సహాయ వైద్యాధికారులు, పారిశుద్ధ్య విభాగం ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి నగరంలో స్వచ్ఛతను సాకారం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి స్పష్టంచేశారు. -
పారిశుద్ధ్య కార్మికులకు మూడుసార్లు హాజరు
[ 05-07-2024]
నగరంలో పారిశుద్ధ్య కార్మికుల నుంచి ఇకపై రోజుకు మూడుసార్లు హాజరు తీసుకునేలా జీహెచ్ఎంసీ నిబంధన తీసుకొచ్చింది. -
నిమ్స్ డైరెక్టర్ పేరుతో సైబర్ నేరస్థుల గాలం
[ 05-07-2024]
సైబర్ నేరస్థులు నిమ్స్ డైరెక్టర్ పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప పేరుతో సైబర్ నేరస్థులు ఆస్పత్రి ఉద్యోగులు, నగరంలోని కొందరికి వాట్సప్ ద్వారా సందేశాలు పంపించారు. -
మాత్రల పొడితో నకిలీ ఔషధాలు
[ 05-07-2024]
ప్రజారోగ్యానికి హాని కలిగించే ఔషధాలు తయారుచేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మేడ్చల్ ఎస్వోటీ, పేట్బషీరాబాద్ పోలీసులు, ఔషధ నియంత్రణాధికారులు చేధించారు. -
మూడేళ్ల పాప అపహరణ
[ 05-07-2024]
మూడేళ్ల చిన్నారి అపహరణ కేసును మార్కెట్ పోలీసులు ఛేదించి నిందితులను రిమాండుకు తరలించారు.మార్కెట్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ కథనంప్రకారం.. -
భారాసకు భారీ షాక్.. కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
[ 05-07-2024]
భారత రాష్ట్ర సమితి (భారాస)కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. భారాస నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరుగుతున్నాయి.