logo

మూసీ అభివృద్ధికి ప్రణాళిక

అత్తాపూర్‌లోని మూసీ పరీవాహక ప్రాంతాన్ని మంగళవారం మూసీనది అభివృద్ధి సంస్థ(ఎంఆర్‌డీఏ) అధికారుల బృందం పరిశీలించింది.

Published : 03 Jul 2024 01:50 IST

రాజేంద్రనగర్, న్యూస్‌టుడే: అత్తాపూర్‌లోని మూసీ పరీవాహక ప్రాంతాన్ని మంగళవారం మూసీనది అభివృద్ధి సంస్థ(ఎంఆర్‌డీఏ) అధికారుల బృందం పరిశీలించింది. మూసీ నది అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రచించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అధికారులు మూసీ పరీవాహక ప్రాంతంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను తరచూ పరిశీలిస్తూ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గౌతమి ఆధ్వర్యంలో మంగళవారం డిప్యూటీ కలెక్టర్లు మాలతి, చంద్రకళ, రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ రాములు, చందర్‌రావు, లక్ష్మీరెడ్డి, క్రాంతికుమార్‌ తదితరులు మూసీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించి పలు విషయాలపై చర్చించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని