logo

కాంగ్రెస్‌లోకి మేడ్చల్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ దీపికారెడ్డి

మేడ్చల్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ దీపికారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు నక్కా ప్రభాకర్‌ గౌడ్‌ల సమక్షంలో ఆమె మంగళవారం ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

Published : 03 Jul 2024 01:47 IST

మేడ్చల్‌ రూరల్, న్యూస్‌టుడే: మేడ్చల్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ దీపికారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు నక్కా ప్రభాకర్‌ గౌడ్‌ల సమక్షంలో ఆమె మంగళవారం ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆమెతోపాటు కౌన్సిలర్లు ఎడ్ల శ్రీనివాస్‌రెడ్డి, మర్రి శ్రీనివాస్‌రెడ్డి, కోఆప్షన్‌ సభ్యురాలు గీత, పట్టణ భారాస అధ్యక్షుడు శేఖర్‌గౌడ్‌ హస్తం గూటికి చేరారు. ఛైర్‌పర్సన్‌ చేరికతో మేడ్చల్‌ పట్టణంలో భారాస దాదాపు ఖాళీ అయ్యింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని