బంగరు బాల్యం.. భవిత భద్రం
బాల్యం ఎంతో విలువైంది. వీరిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తెలియని తనం, కోపం తదితర కారణాలతో కొందరు పిల్లలు ఇంటినుంచి వెళ్లిపోతున్నారు. తిరిగి వద్దామన్నా సరైన అవగాహన లేక ఎక్కడో ఓ చోట పని చేసుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు.
తప్పిపోయిన పిల్లల రక్షణకు ఆపరేషన్ ముస్కాన్
న్యూస్టుడే, వికారాబాద్ మున్సిపాలిటీ, పరిగి
బాల్యం ఎంతో విలువైంది. వీరిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తెలియని తనం, కోపం తదితర కారణాలతో కొందరు పిల్లలు ఇంటినుంచి వెళ్లిపోతున్నారు. తిరిగి వద్దామన్నా సరైన అవగాహన లేక ఎక్కడో ఓ చోట పని చేసుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఇలాంటి పిల్లలను గుర్తించి వీరిని తల్లిదండ్రులకు అప్పగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా ‘ఆపరేషన్ ముస్కాన్’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈనెల 1న ప్రారంభించగా 31 వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు..
తప్పిపోయిన 6 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించి వారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలని సుప్రీంకోర్టు 2016లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఏటా జులై నెలలో ఆపరేషన్ ముస్కాన్, జనవరిలో ఆపరేషన్ స్మైల్ను రెండు నెలలపాటు నిర్వహిస్తున్నారు. బాలల కోసం పోలీసు శాఖ, బాల రక్షా కమిటీ, చైల్డ్ లైన్ కమిటీ, బాలల పరిరక్షణ విభాగం, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి.
వసతి గృహాల్లో 120 మంది ఆశ్రయం
బాలల కోసం ప్రత్యేకంగా జిల్లాలో 4 వసతి గృహాలున్నాయి. వికారాబాద్ ఎన్నెపల్లిలో బాలికలకు, ధన్నారంలో బాలలకు ఉన్నాయి. మోమిన్పేటలో హెల్ప్ ఆల్ సొసైటీ ఉంది. పరిగిలో ప్రత్యేకంగా బాలికలకు బాల సదనం, వికారాబాద్లో శిశుగృహ ఉంది. అన్ని కేంద్రాల్లో కలిపి సుమారుగా 120 మంది ఆశ్రయం పొందుతున్నారు.
మూడు బృందాలతో ప్రత్యేక తనిఖీలు
జిల్లాలో తనిఖీలు నిర్వహించటానికి మూడు బృందాలు ఏర్పాటు చేశారు. వీటిలోని సభ్యులు అనుమానం ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తారు. పిల్లలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. బడిఈడు పిల్లల్ని బడుల్లో చేర్పిస్తారు. ముఖ్యంగా ఇటుక బట్టీలు, పరిశ్రమలు, దుకాణాలు, హోటళ్లపై దృష్టి సారించి తనిఖీలు చేస్తున్నారు.
బాలల రక్షణ కోసం ప్రత్యేకంగా కమిటీని నియమించారు. దీన్లో స్టేషన్ హౌజ్ ఆఫీసర్, ఏఎస్ఐ, కానిస్టేబుళ్లు, కార్మిక, రెవెన్యూ శాఖాధికారులు, సభ్యులుగా ఉంటారు. దొరికిన పిల్లల్ని 24 గంటల్లో జిల్లాలోని చైల్డ్లైన్ 1098కు అప్పగిస్తారు.
శాఖల సమన్వయంతో తనిఖీల నిర్వహణ
- వెంకటేశం, ఛైర్మన్, బాలల సంక్షేమ కమిటీ, వికారాబాద్
జిల్లా సంక్షేమ అధికారి నేతృత్వంలో అన్ని శాఖల యంత్రాగం సమన్వయంతో తనిఖీలు చేపడుతున్నాం. గత సంవత్సరం జిల్లాకు చెందిన 40 మంది పిల్లలు తప్పిపోయారు. వీరిని గుర్తించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
పనిలో చేర్చుకుంటే చట్టపరంగా చర్యలు
- ధనసిరి ప్రకాశ్, బాలల సంక్షేమ కమిటీ సభ్యుడు, వికారాబాద్
బాలలు తమ బాల్యాన్ని బడిలోనే గడిపే విధంగా చూడాలి. బాలలతో పనులు చేయిస్తే చట్టపరంగా చర్యలు తప్పవు. పిల్లల్ని పోషించలేని పరిస్థితి ఉన్న తల్లిదండ్రులు బాల రక్షా కమిటీ కార్యాలయాన్ని సంప్రదించి తగిన సలహాలను, సూచనలు పొందవచ్చు. పిల్లల చదువులకు అండగా ఉంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు మందులు రాస్తే.. ఐదు కొనుక్కోవాల్సిందే
[ 05-07-2024]
ప్రభుత్వ దవాఖానాలకు చికిత్సల కోసం వస్తున్న పేద రోగులపై మందుల రూపంలో పెను భారం పడుతోంది. చికిత్సల వరకు ఉచితంగా అందిస్తున్నా ఔషధాలను పూర్తి స్థాయిలో సరఫరా చేయడం లేదని రోగులు వాపోతున్నారు. -
ఆస్తులను రక్షిస్తాం.. ఆక్రమణల అంతు తేలుస్తాం
[ 05-07-2024]
‘‘రాజధాని పరిధిలో రూ.వేల కోట్ల ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఆక్రమణకు గురైన వాటిని గుర్తించి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు మొదలుపెట్టాం. -
బల్దియా జాగాపై ప్రైవేటు జబర్దస్తీ!
[ 05-07-2024]
జీహెచ్ఎంసీ ఆస్తులతో ప్రైవేటు వ్యక్తులు రూ.కోట్లు సంపాదిస్తున్నారు. అక్రమ ప్రకటనల బోర్డుల ఏర్పాటుతోరూ.లక్షల్లో అద్దె వసూలు చేసుకుంటున్నారు. -
కొణిజేటి రోశయ్యకు భారతరత్న ప్రకటించాలి
[ 05-07-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య చెరగని ముద్రవేశారని టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కోకన్వీనర్, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్త కొనియాడారు. -
చంద్రబాబుకు స్వాగత ఫ్లెక్సీలు
[ 05-07-2024]
ఆంధ్ర]ప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తొలిసారిగా హైదరాబాద్కు వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలుకుతూ తెదేపా శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటుచేశారు. -
నేలమట్టం చేసినా పుట్టుకొస్తున్నాయి
[ 05-07-2024]
చెరువులోని నిర్మాణాలను జీహెచ్ఎంసీ కూల్చడం.. కొంత కాలం తర్వాత మళ్లీ అక్కడ భవనాలు రావడం సర్వసాధారణమైంది. -
పార్లమెంటు ప్రాంగణంలో అల్లూరి విగ్రహం
[ 05-07-2024]
సమ సమాజ నిర్మాణాన్ని కాంక్షించడం సహా భారత దేశ విముక్తి కోసం బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని రాష్ట్ర మంత్రి సీతక్క కొనియాడారు. -
దొడ్డి కొమురయ్య విగ్రహం ఏర్పాటుకు కృషి
[ 05-07-2024]
రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్నా.. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహం రాజధానిలో ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. -
రామోజీరావు యువతకు స్ఫూర్తి ప్రదాత
[ 05-07-2024]
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ దివంగత రామోజీరావు యువతకు స్ఫూర్తి ప్రదాత అని మున్నూరు కాపు విద్యార్థి వసతిగృహం ట్రస్ట్బోర్డు ఛైర్మన్ ప్రొ.ఎంఆర్ వెంకట్రావు కొనియాడారు. -
కన్నతల్లిని కడతేర్చి.. సాధారణ మృతిగా చిత్రీకరించి..
[ 05-07-2024]
దైవదర్శనానికి వచ్చిన సందర్భంలో తల్లి అస్వస్థతకు గురికాగా అసహనానికి గురైన కుమారుడు ఆమెను హత్య చేశాడు. ఆమెది సహజ మరణమని చెబుతూ తప్పుదోవ పట్టించే యత్నం చేశాడు. -
కరుణించని వరుణుడు.. కదలని కాడి!
[ 05-07-2024]
వానాకాలం సాగుకు పదకొండు రోజులే గడువు ఉంది. జులై 15 వరకు పెసర, మినుములు మినహా అన్ని రకాల పంటలకు సంబంధించిన విత్తనాలు వేసుకునే అవకాశం ఉంది. -
శంకుస్థాపనతో సరి.. నిర్మాణం ఎప్పుడో మరి!
[ 05-07-2024]
తాండూరు పట్టణంలో ఆటోనగర్ నిర్మాణానికి 2023 అక్టోబరులో అప్పటి ప్రభుత్వం రూ.12.6 కోట్లు మంజూరు చేసింది. అంతారం గుట్ట సమీపంలో స్థలాన్ని కేటాయించి, పనులకు శంకుస్థాపన చేసినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. -
ముగిసిన జడ్పీ పాలన.. నేటి నుంచి ప్రత్యేక పాలన
[ 05-07-2024]
జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం ఈ నెల 4వ తేదీతో ముగిసింది. 5వ తేదీన ప్రత్యేకాధికారులు బాధ్యతలు స్వీకరించనున్నారు. -
ముగిసిన సర్వే.. ముమ్మరంగా పనులు!
[ 05-07-2024]
రాష్ట్రంలో కొడంగల్ను నమూనా నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
రైతుబజార్లో కమిషనర్ తనిఖీలు
[ 05-07-2024]
భరత్నగర్ కూరగాయల మార్కెట్, జేఎన్టీయూ రోడ్డులోని రైతుబజార్లో గురువారం ఉదయం కమిషనర్ ఆమ్రపాలి తనిఖీలు చేశారు. -
రయ్మంటూ దూసుకెళ్తే.. లైసెన్స్ రద్దే
[ 05-07-2024]
బైక్, కారుతో రోడ్డుపైకి వచ్చి ఇష్టారాజ్యం డ్రైవింగ్ చేశారంటే..చిక్కుల్లో పడ్డట్టే. ర్యాష్ డ్రైవింగ్పై రవాణాశాఖ సీరియస్గా దృష్టి సారిస్తోంది. -
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
[ 05-07-2024]
జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, సహాయ వైద్యాధికారులు, పారిశుద్ధ్య విభాగం ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి నగరంలో స్వచ్ఛతను సాకారం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి స్పష్టంచేశారు. -
పారిశుద్ధ్య కార్మికులకు మూడుసార్లు హాజరు
[ 05-07-2024]
నగరంలో పారిశుద్ధ్య కార్మికుల నుంచి ఇకపై రోజుకు మూడుసార్లు హాజరు తీసుకునేలా జీహెచ్ఎంసీ నిబంధన తీసుకొచ్చింది. -
నిమ్స్ డైరెక్టర్ పేరుతో సైబర్ నేరస్థుల గాలం
[ 05-07-2024]
సైబర్ నేరస్థులు నిమ్స్ డైరెక్టర్ పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప పేరుతో సైబర్ నేరస్థులు ఆస్పత్రి ఉద్యోగులు, నగరంలోని కొందరికి వాట్సప్ ద్వారా సందేశాలు పంపించారు. -
మాత్రల పొడితో నకిలీ ఔషధాలు
[ 05-07-2024]
ప్రజారోగ్యానికి హాని కలిగించే ఔషధాలు తయారుచేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మేడ్చల్ ఎస్వోటీ, పేట్బషీరాబాద్ పోలీసులు, ఔషధ నియంత్రణాధికారులు చేధించారు. -
మూడేళ్ల పాప అపహరణ
[ 05-07-2024]
మూడేళ్ల చిన్నారి అపహరణ కేసును మార్కెట్ పోలీసులు ఛేదించి నిందితులను రిమాండుకు తరలించారు.మార్కెట్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ కథనంప్రకారం.. -
భారాసకు భారీ షాక్.. కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
[ 05-07-2024]
భారత రాష్ట్ర సమితి (భారాస)కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. భారాస నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరుగుతున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘అదానీ’పై హిండెన్బర్గ్ ఆరోపణల్లో చైనా హస్తం?.. మహేశ్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు!
-
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
‘మీర్జాపూర్’ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.. వాటిని పట్టించుకోవద్దు: విజయ్ వర్మ
-
అమరావతి నిర్మాణానికి తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విరాళం
-
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
-
పెద్ద అంబర్పేట సమీపంలో పోలీసుల కాల్పులు