ఆమ్రపాలి పగ్గాలు చేపట్టినా.. నిమ్మకు నీరెత్తినట్లే జీహెచ్ఎంసీ అధికారులు!
రాజధానిలో పారిశుద్ధ్యం రోడ్ల మీదకు చేరి అన్ని ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి.
ఇంకా సమస్యలపై దృష్టి సారించని కొత్త కమిషనర్
క్షేత్రస్థాయిలో కనిపించని జోనల్ కమిషనర్లు
పారిశుద్ధ్యం, వ్యాధులతో అల్లాడుతున్న ప్రజలు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, ఈనాడు, హైదరాబాద్: రాజధానిలో పారిశుద్ధ్యం రోడ్ల మీదకు చేరి అన్ని ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. వేలాది మంది రోగాల భారిన పడి ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు వర్షాకాలం మొదలవడంతో నగర రోడ్లు చెరువులుగా మారుతున్నాయి. చిన్నపాటి వర్షానికే వేలాది వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుంటున్నాయి. వర్షాకాలానికే ముందు నాలాల్లో పూడికతీత పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటి కొనసాగుతున్నాయి. నగరంలో చేపట్టిన ఆయా ప్రాజెక్టుల నిర్మాణం పనులు దాదాపు నిలిచిపోయాయి. నలుదిక్కులా సమస్యలు చుట్టుముట్టి ప్రజలు అల్లాడుతుంటే జీహెచ్ఎంసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి ఇప్పటి వరకు సమీక్షలు మొదలు పెట్టలేదు. జోనల్ స్థాయి అధికారులంతా కార్యాలయాల బాట పట్టడం లేదు. మహానగరంలో పాలన గాడి తప్పడంతో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటే..?
వర్షాకాలం కావడంతో పారిశుద్ధ్యంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ విభాగానికి పూర్తిస్థాయిలో అదనపు కమిషనర్ను నియమించలేదు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే వారు లేక.. కార్మికులు సక్రమంగా పనిచేయడం లేదు. కాలనీల్లో చెత్త పేరుకుపోతుంది. ఫాగింగ్ జరగడం లేదు.
- వారం కిందట ఆమ్రపాలిని బల్దియా కమిషనర్గా ప్రభుత్వం నియమించింది. వర్షాల నేపథ్యంలో తక్షణం యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన కొత్త కమిషనర్ ఆ దిశగా దృష్టి సారించడం లేదు. ఇప్పటివరకు కనీసం అధికారులతో సమీక్ష చేయలేదు. సోమవారం జరిగిన ప్రజావాణిలో పాల్గొంటారని అంతా అనుకున్నారు. దీన్ని ఆమె అసలు పట్టించుకోలేదు. తన కార్యాలయంలో రెండు గంటలు ఉండి.. బయట సమావేశాల పేరు ఆమె వెళ్లిపోతున్నారు. ఆమ్రపాలి ప్రస్తుతం హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్తోపాటు మూసీ అభివృద్ధి సంస్థ ఎండీ, గ్రోత్కారిడార్ ఎండీగా కూడా ఉన్నారు. దీంతో పూర్తిస్థాయిలో బల్దియాపై దృష్టిపెట్టలేక పోతున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి.
- బల్దియా పరిధిలో ఆరుగురు జోనల్ కమిషనర్లు ఉన్నారు. ఎల్బీనగర్, ఖైరతాబాద్, శేర్లింగంపల్లి, కూకట్పల్లి జోనల్ కమిషనర్లను కొత్తగా నియమించారు. నిబంధనల ప్రకారం నిత్యం ఉదయమే వీరంతా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పారిశుద్ధ్యం ఇతరత్రా విభాగాల పనితీరును పరిశీలించాలి. చాలామంది జోనల్ కమిషనర్లు కదలడం లేదు. కనీసం కార్యాలయాలకు కూడా సమయానికి రావడం లేదు. ఉద్యోగులూ వారినే అనుకరిస్తున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.
పరిష్కారం దిశగా చర్యలేవీ?
జీహెచ్ఎంసీలో చెత్త తరలింపే కీలకమైన పని. రవాణా విభాగానికి ఇప్పుడు అదనపు కమిషనర్ లేరు. జీహెచ్ఎంసీలోని ఈవీడీఎం (ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం బల్దియా నుంచి వేరు చేయాలని నిర్ణయించగా, గతంలో ఈవీడీఎం డైరెక్టర్ వద్దనున్న రవాణా, ప్రకటనల విభాగాల అదనపు కమిషనర్ పోస్టుపై స్పష్టత కొరవడింది. కవాడిగూడ, మలక్పేట, ఖైరతాబాద్ డిపోలు కేంద్రంగా రోజూ వందలాది డీజిల్ కూపన్లను అక్కడున్న అధికారులు దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నకిలీ ప్రకటనల బోర్డులను ప్రోత్సహిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తుండగా, ఉదయాన్నే డంపింగ్యార్డుకు తరలాల్సిన వ్యర్థాలు రోజంతా రోడ్లపైనే ఉంటుండటంతో ఆయా విభాగాలను సమీక్షించాల్సిన అవశ్యకత కనిపిస్తోంది. అయితే.. కమిషనర్ కార్యాలయం ఆ దిశగా ఎలాంటి చర్యలు ప్రారంభించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిపుణులున్నా.. సదుపాయాల్లేవ్
[ 04-07-2024]
అవయవ మార్పిడిలో రాజధాని ముందుంటోంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటులోనే ఈ శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి. -
కరెంట్ కట్.. రోగుల కటకట
[ 04-07-2024]
ఉస్మానియా ఆసుపత్రిలో బుధవారం మధ్యాహ్నం విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది. సుమారు అర గంట పాటు సరఫరా నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడ్డారు. -
క్షేత్రస్థాయిలో పర్యటించి.. సమస్యలు తెలుసుకొని
[ 04-07-2024]
నగర పారిశుద్ధ్యం, పరిపాలన వ్యవహారాలను చక్కదిద్దడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి దృష్టిపెట్టారు. -
గ్రేటర్ సమగ్ర అభివృద్ధికి ‘హైసిటీ’
[ 04-07-2024]
బల్దియా పరిధిలో మౌలిక వసతుల కల్పనకు సరికొత్త పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. -
మత్తు ఊబిలో ఎంబీఏ విద్యార్థులు
[ 04-07-2024]
గరంలో వ్యాపారులు, విద్యార్థులే లక్ష్యంగా ఖరీదైన మాదకద్రవ్యాలు చేరవేస్తున్న డ్రగ్ రాకెట్ను టీజీ న్యాబ్, కార్ఖానా పోలీసులు ఛేదించారు. -
దిగుమతి తగ్గినా.. ఆదాయంలో అదే జోరు
[ 04-07-2024]
బాటసింగారంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్కు మామిడి సీజన్.. ఏటా భారీగా ఆదాయం చేకూరుస్తోంది. -
రైలు ఢీకొని.. స్టేషన్ వరకు ఈడ్చుకొని
[ 04-07-2024]
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో రైలు ఇంజిన్కు వేలాడుతున్న వృద్ధుడి మృతదేహాన్ని కొందరూ ప్రయాణికులు సామాజిక మాధ్యమంలో బుధవారం పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. -
నెక్నాంపూర్ చెరువు.. పునరుద్ధరణ భేష్
[ 04-07-2024]
చెరువుల పునరుద్ధరణలో నెక్నాంపూర్ను ఆదర్శంగా తీసుకోవచ్చని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) ప్రకటించింది. -
విద్యార్థులు- ఉపాధ్యాయులు నిష్పత్తి సరి చేస్తారా?
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
విస్తరణ వివాదాస్పదం.. పనులకు అంతరాయం
[ 04-07-2024]
జిల్లాలో అతిపెద్ద దైన తాండూరు వ్యవసాయ విపణి విస్తరణ పనులు ఆగిపోయాయి. గడచిన మార్చిలో అధికారులు విస్తరణ పనులు వేగంగా నిర్వహించారు. -
నాలుగ్గోడల జీవితానికి స్వేచ్ఛ
[ 04-07-2024]
తెలిసో తెలియకో క్షణికావేశంలో చేసిన తప్పిదం వారిని బందీలను చేసింది. సమాజానికి, కుటుంబానికి దూరంగా నాలుగు గోడల మధ్య ఉంటూ.. తీవ్ర మనోవేదన అనుభవించారు. -
ఈవీలకు ఛార్జింగ్ పాయింట్లే కీలకం
[ 04-07-2024]
కాలుష్యాన్ని తగ్గించే విద్యుత్తు వాహనాలు పెరగాలంటే మౌలిక వసతులైన ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు కీలకం. -
అటవీ శాఖలో అవినీతి కలకలం!
[ 04-07-2024]
అవినీతి, అక్రమాలకు చోటులేదని భావించే జిల్లా అటవీ శాఖపై తాజాగా అవినీతి మరక పడింది. వికారాబాద్, తాండూరు అటవీ క్షేత్రాధికారులు (ఆర్ఎఫ్ఓ) అరుణ, శ్యాంసుందర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడటంతో సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. దీంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. -
ఉద్యోగం పేరిట యువతిపై ఇద్దరి అత్యాచారం
[ 04-07-2024]
ఉద్యోగం పేరుతో యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో జరిగింది. -
‘హిస్సా’ ఇస్తామని మోసం
[ 04-07-2024]
బక్రీద్ పండుగనాడు ఆచరించే సంప్రదాయాన్ని అవకాశం చేసుకొని మోసానికి తెగబడ్డారు. నిరక్షరాస్యులు, పేద కుటుంబాలకు చెందిన వారికి మాంసంలో భాగం(హిస్సా) ఇస్తామని రూ.లక్షలు వసూలు చేసి ముఖం చాటేశారు. -
తెరుచుకున్న గుండ్లమడుగు తండా పాఠశాల
[ 04-07-2024]
తాండూరు మండలం గుండ్లమడుగు తండా పాఠశాల ఎట్టకేలకు తెరుచు కుంది.‘ఈనాడు’లో..‘20 రోజులుగా పాఠశాల మూత’ శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనానికి తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య స్పందించారు. -
6 నెలలు.. 10 చోరీలు
[ 04-07-2024]
టాస్క్ఫోర్స్ సౌత్ ఈస్ట్జోన్, బండ్లగూడ ఠాణా పోలీసులు సంయుక్తంగా పథకం ప్రకారం.. ఘరానా దొంగను పట్టుకుని రిమాండుకు తరలించారు. -
పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్ రూ.5 వేలు
[ 04-07-2024]
విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం గ్రేటర్ ఆర్టీసీ ‘పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్’ను ప్రవేశపెట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
రాజధాని అమరావతి స్థితిగతులివీ..
-
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
-
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
-
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన