సొంతింటి ఆశ.. కేటుగాళ్ల మాయ
సకల హంగులతో కార్యాలయాలు.. ఆకట్టుకునేలా బ్రోచర్లు.. వందల కోట్ల ఎకరాల భూములు తమ పరిధిలో ఉన్నాయంటూ ప్రకటనలు.
ప్రీలాంచింగ్ ‘రియల్’దందా
ఏటా రూ.1000 కోట్లకు పైగా సామాన్యులకు నష్టం
ఆయనో సాధారణ ఉద్యోగి.. కూడబెట్టుకున్న రూ.70లక్షలతో స్థలం కొనుగోలు చేశారు. అవసరానికి ఆ స్థలం విక్రయించే సమయంలో డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినట్టు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ స్థలం అమ్మిన రియల్ సంస్థ చాలామందిని ఇదే తరహాలో మోసం చేసినట్టు నిర్ధారించారు. ఇందులో ఓ సబ్రిజిస్ట్రార్ ప్రమేయమూ ఉందని తేలింది.
బాచుపల్లి సమీపంలో 10 మంది కలసి స్థలం కొనుగోలు చేశారు. రూ.2కోట్ల అడ్వాన్స్ చెల్లించారు. భూముల ధరలు పెరగటంలో స్థిరాస్తి సంస్థ రిజిస్రేషన్ వాయిదా వేస్తూ వచ్చింది. డబ్బు తిరిగి ఇవ్వమంటే మరోచోట స్థలాన్ని చూపారు. వాటి గురించి ఆరా తీస్తే ఆ సర్వేనెంబర్ల పేరుతో భువనగిరిలో భూములున్నట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈనాడు, హైదరాబాద్: సకల హంగులతో కార్యాలయాలు.. ఆకట్టుకునేలా బ్రోచర్లు.. వందల కోట్ల ఎకరాల భూములు తమ పరిధిలో ఉన్నాయంటూ ప్రకటనలు. కాస్త పెట్టుబడి పెడితే రాబోయే రెండు మూడేళ్లలో కోటీశ్వరులు కావచ్చంటూ ఉపన్యాసం. ఇంకేముంది.. ఎగువ మధ్యతరగతి కుటుంబాలు తాము దాచుకున్న డబ్బును కుమ్మరిస్తున్నాయి. తీరా తాము మోసపోయినట్టు గుర్తించి.. అసలు సొమ్ములిస్తే చాలంటూ వ్యాపారులు, పోలీసుల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. అప్పటికే రూ.కోట్లు కూడబెట్టిన రియల్ కేటుగాళ్లు.. వ్యవస్థలను అనువుగా మలచుకొని దర్జాగా బయట తిరుగుతున్నారు. చట్టాలను బూచిగా చూపుతూ కొన్నిసార్లు పోలీసులు చేతులెత్తేస్తున్నారు. ఉన్నతాధికారులు సివిల్ పంచాయితీల్లో చేతులు పెట్టొద్దాన్నారంటూ ఎస్హెచ్వోలు తప్పించుకుంటున్నారు.
అవగాహనలోపంతో చిక్కి.. భారతి బిల్డర్స్, జీఎస్ఆర్ ఇన్ఫ్రా, సాహితీ, మిమాంశ, నిఖిత.. వంటి సంస్థలు మోసాల బాగోతంతో పోలీసు రికార్డుల్లోకి ఎక్కాయి. ప్రీలాంఛింగ్ ముసుగులో ఈ సంస్థలు వసూలు చేసిన సొమ్మే అక్షరాలా రూ.3,500 కోట్లు. మహానగరం విస్తరిస్తున్న ప్రాంతాల్లో వీధికో రియల్ సంస్థ వెలిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లి, బాచుపల్లి, నిజాంపేట్ ప్రాంతాల్లో ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని ఏజెంట్లను నియమించుకుంటున్నారు. విల్లాలు, రిసార్ట్లు, ఫామ్హౌస్లు అంటూ ఊదరగొడుతున్నారు. వాస్తవాలు గుర్తించలేని మధ్యతరగతి కుటుంబాలు రుణాలు తీసుకొని రియల్ సంస్థల చేతుల్లో గుమ్మరిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఏటా సుమారు రూ.1000-1500 కోట్ల మేర మోసపోతున్నారని ఓ డీసీపీ వివరించారు.
సబ్రిజిస్ట్రార్లపై విచారణ!
రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్నగర్, సంగారెడ్డి జిల్లాల్లో కొందరు సబ్రిజిస్ట్రార్లు కూడా అక్రమ రిజిస్ట్రేషన్లలో భాగం పంచుకుంటున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయని నగరానికి చెందిన పోలీసు ఉన్నతాధికారి వివరించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. డబుల్ రిజిస్ట్రేషన్లు, నకిలీ ఆధార్కార్డులని తెలిసినా సహకరించిన సబ్ రిజిస్ట్రార్లపై ఉన్నతస్థాయిలో విచారణ జరుగుతుందని.. త్వరలో కొందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిపుణులున్నా.. సదుపాయాల్లేవ్
[ 04-07-2024]
అవయవ మార్పిడిలో రాజధాని ముందుంటోంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటులోనే ఈ శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి. -
కరెంట్ కట్.. రోగుల కటకట
[ 04-07-2024]
ఉస్మానియా ఆసుపత్రిలో బుధవారం మధ్యాహ్నం విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది. సుమారు అర గంట పాటు సరఫరా నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడ్డారు. -
క్షేత్రస్థాయిలో పర్యటించి.. సమస్యలు తెలుసుకొని
[ 04-07-2024]
నగర పారిశుద్ధ్యం, పరిపాలన వ్యవహారాలను చక్కదిద్దడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి దృష్టిపెట్టారు. -
గ్రేటర్ సమగ్ర అభివృద్ధికి ‘హైసిటీ’
[ 04-07-2024]
బల్దియా పరిధిలో మౌలిక వసతుల కల్పనకు సరికొత్త పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. -
మత్తు ఊబిలో ఎంబీఏ విద్యార్థులు
[ 04-07-2024]
గరంలో వ్యాపారులు, విద్యార్థులే లక్ష్యంగా ఖరీదైన మాదకద్రవ్యాలు చేరవేస్తున్న డ్రగ్ రాకెట్ను టీజీ న్యాబ్, కార్ఖానా పోలీసులు ఛేదించారు. -
దిగుమతి తగ్గినా.. ఆదాయంలో అదే జోరు
[ 04-07-2024]
బాటసింగారంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్కు మామిడి సీజన్.. ఏటా భారీగా ఆదాయం చేకూరుస్తోంది. -
రైలు ఢీకొని.. స్టేషన్ వరకు ఈడ్చుకొని
[ 04-07-2024]
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో రైలు ఇంజిన్కు వేలాడుతున్న వృద్ధుడి మృతదేహాన్ని కొందరూ ప్రయాణికులు సామాజిక మాధ్యమంలో బుధవారం పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. -
నెక్నాంపూర్ చెరువు.. పునరుద్ధరణ భేష్
[ 04-07-2024]
చెరువుల పునరుద్ధరణలో నెక్నాంపూర్ను ఆదర్శంగా తీసుకోవచ్చని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) ప్రకటించింది. -
విద్యార్థులు- ఉపాధ్యాయులు నిష్పత్తి సరి చేస్తారా?
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
విస్తరణ వివాదాస్పదం.. పనులకు అంతరాయం
[ 04-07-2024]
జిల్లాలో అతిపెద్ద దైన తాండూరు వ్యవసాయ విపణి విస్తరణ పనులు ఆగిపోయాయి. గడచిన మార్చిలో అధికారులు విస్తరణ పనులు వేగంగా నిర్వహించారు. -
నాలుగ్గోడల జీవితానికి స్వేచ్ఛ
[ 04-07-2024]
తెలిసో తెలియకో క్షణికావేశంలో చేసిన తప్పిదం వారిని బందీలను చేసింది. సమాజానికి, కుటుంబానికి దూరంగా నాలుగు గోడల మధ్య ఉంటూ.. తీవ్ర మనోవేదన అనుభవించారు. -
ఈవీలకు ఛార్జింగ్ పాయింట్లే కీలకం
[ 04-07-2024]
కాలుష్యాన్ని తగ్గించే విద్యుత్తు వాహనాలు పెరగాలంటే మౌలిక వసతులైన ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు కీలకం. -
అటవీ శాఖలో అవినీతి కలకలం!
[ 04-07-2024]
అవినీతి, అక్రమాలకు చోటులేదని భావించే జిల్లా అటవీ శాఖపై తాజాగా అవినీతి మరక పడింది. వికారాబాద్, తాండూరు అటవీ క్షేత్రాధికారులు (ఆర్ఎఫ్ఓ) అరుణ, శ్యాంసుందర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడటంతో సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. దీంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. -
ఉద్యోగం పేరిట యువతిపై ఇద్దరి అత్యాచారం
[ 04-07-2024]
ఉద్యోగం పేరుతో యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో జరిగింది. -
‘హిస్సా’ ఇస్తామని మోసం
[ 04-07-2024]
బక్రీద్ పండుగనాడు ఆచరించే సంప్రదాయాన్ని అవకాశం చేసుకొని మోసానికి తెగబడ్డారు. నిరక్షరాస్యులు, పేద కుటుంబాలకు చెందిన వారికి మాంసంలో భాగం(హిస్సా) ఇస్తామని రూ.లక్షలు వసూలు చేసి ముఖం చాటేశారు. -
తెరుచుకున్న గుండ్లమడుగు తండా పాఠశాల
[ 04-07-2024]
తాండూరు మండలం గుండ్లమడుగు తండా పాఠశాల ఎట్టకేలకు తెరుచు కుంది.‘ఈనాడు’లో..‘20 రోజులుగా పాఠశాల మూత’ శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనానికి తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య స్పందించారు. -
6 నెలలు.. 10 చోరీలు
[ 04-07-2024]
టాస్క్ఫోర్స్ సౌత్ ఈస్ట్జోన్, బండ్లగూడ ఠాణా పోలీసులు సంయుక్తంగా పథకం ప్రకారం.. ఘరానా దొంగను పట్టుకుని రిమాండుకు తరలించారు. -
పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్ రూ.5 వేలు
[ 04-07-2024]
విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం గ్రేటర్ ఆర్టీసీ ‘పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్’ను ప్రవేశపెట్టింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రంలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?
-
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ
-
కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి ఫొటోలు
-
కల్కి సినిమా టికెట్ ధర పెంపుపై హైకోర్టులో పిల్
-
పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్