నిబంధనలు అవుట్!
ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఆపరేటర్లు అదును చిక్కితే చాలు తమ చేతివాటం చూపించి అడ్డదారుల్లో ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు.
కార్యాలయాల్లో తిష్ఠ వేసిన అక్రమార్కులు
మంచాల తహసీల్దార్ కార్యాలయం
మంచాల, అబ్దుల్లాపూర్మెట్, న్యూస్టుడే: ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఆపరేటర్లు అదును చిక్కితే చాలు తమ చేతివాటం చూపించి అడ్డదారుల్లో ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా రెవెన్యూ కార్యాలయాల్లో సంబంధిత అధికారుల కళ్లుగప్పి అనర్హులకు పత్రాలు జారీ చేయిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల తహసీల్దార్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఆపరేటర్.. నగర శివారులోని ఓ మీసేవా కేంద్రం నిర్వాహకుడితో జతకట్టి అనర్హులకు ఆదాయ, కుల ధ్రువపత్రాల జారీ చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉలిక్కిపడి ఆరా మొదలెట్టి.. వనస్థలిపురం ప్రాంతంలోని ఓ మీసేవా కేంద్రం నుంచి వచ్చిన దరఖాస్తులతో మంచాల తహసీల్దార్ కార్యాలయంలోని అవుట్ సోర్సింగ్ ఆపరేటర్ వెంటవెంటనే ధ్రువపత్రాలు జారీ చేస్తున్నాడు. మీసేవా నిర్వాహకుడితో ముందస్తు ఒప్పందంతోనే పత్రాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల విదేశాల్లో చదువుల కోసం ఓ విద్యార్థినికి జారీ చేసిన ఆదాయ ధ్రువపత్రం సరైనదేనా అనే విషయంపై రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ నుంచి తహసీల్దార్ కార్యాలయానికి ఫైల్ రావడంతో క్షేత్రస్థాయి పరిశీలనతో ధ్రువ పత్రాల జారీలో అక్రమాలు తహసీల్దార్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఆరా తీస్తే ఇటీవల ఒకే మీసేవా కేంద్రం నుంచి వచ్చిన పలు దరఖాస్తులు ఆమోదం పొంది ధ్రువపత్రాలు మంజూరైనట్లు ఆయన గుర్తించారు. వెంటనే బాధ్యులపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడీ విషయం జిల్లాలోని ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లోని అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. సోమవారం పలు కార్యాలయాల్లోని అధికారులు తమ పరిధిలో జారీ అయిన ధ్రువపత్రాల వివరాలను సరిచూస్తూ, ఏమైనా అక్రమాలున్నాయా అన్న విషయంపై దృష్టిపెట్టి పరిశీలనతో ముగినిపోయారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం..
-అనంతరెడ్డి, ఆర్డీవో, ఇబ్రహీంపట్నం
అనర్హులు ధ్రువపత్రాలు పొందినట్లు మా దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సంబంధిత తహసీల్దార్కు చెప్పాను. వెంటనే పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తు నివేదిక వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిపుణులున్నా.. సదుపాయాల్లేవ్
[ 04-07-2024]
అవయవ మార్పిడిలో రాజధాని ముందుంటోంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటులోనే ఈ శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి. -
కరెంట్ కట్.. రోగుల కటకట
[ 04-07-2024]
ఉస్మానియా ఆసుపత్రిలో బుధవారం మధ్యాహ్నం విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది. సుమారు అర గంట పాటు సరఫరా నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడ్డారు. -
క్షేత్రస్థాయిలో పర్యటించి.. సమస్యలు తెలుసుకొని
[ 04-07-2024]
నగర పారిశుద్ధ్యం, పరిపాలన వ్యవహారాలను చక్కదిద్దడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి దృష్టిపెట్టారు. -
గ్రేటర్ సమగ్ర అభివృద్ధికి ‘హైసిటీ’
[ 04-07-2024]
బల్దియా పరిధిలో మౌలిక వసతుల కల్పనకు సరికొత్త పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. -
మత్తు ఊబిలో ఎంబీఏ విద్యార్థులు
[ 04-07-2024]
గరంలో వ్యాపారులు, విద్యార్థులే లక్ష్యంగా ఖరీదైన మాదకద్రవ్యాలు చేరవేస్తున్న డ్రగ్ రాకెట్ను టీజీ న్యాబ్, కార్ఖానా పోలీసులు ఛేదించారు. -
దిగుమతి తగ్గినా.. ఆదాయంలో అదే జోరు
[ 04-07-2024]
బాటసింగారంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్కు మామిడి సీజన్.. ఏటా భారీగా ఆదాయం చేకూరుస్తోంది. -
రైలు ఢీకొని.. స్టేషన్ వరకు ఈడ్చుకొని
[ 04-07-2024]
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో రైలు ఇంజిన్కు వేలాడుతున్న వృద్ధుడి మృతదేహాన్ని కొందరూ ప్రయాణికులు సామాజిక మాధ్యమంలో బుధవారం పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. -
నెక్నాంపూర్ చెరువు.. పునరుద్ధరణ భేష్
[ 04-07-2024]
చెరువుల పునరుద్ధరణలో నెక్నాంపూర్ను ఆదర్శంగా తీసుకోవచ్చని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) ప్రకటించింది. -
విద్యార్థులు- ఉపాధ్యాయులు నిష్పత్తి సరి చేస్తారా?
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
విస్తరణ వివాదాస్పదం.. పనులకు అంతరాయం
[ 04-07-2024]
జిల్లాలో అతిపెద్ద దైన తాండూరు వ్యవసాయ విపణి విస్తరణ పనులు ఆగిపోయాయి. గడచిన మార్చిలో అధికారులు విస్తరణ పనులు వేగంగా నిర్వహించారు. -
నాలుగ్గోడల జీవితానికి స్వేచ్ఛ
[ 04-07-2024]
తెలిసో తెలియకో క్షణికావేశంలో చేసిన తప్పిదం వారిని బందీలను చేసింది. సమాజానికి, కుటుంబానికి దూరంగా నాలుగు గోడల మధ్య ఉంటూ.. తీవ్ర మనోవేదన అనుభవించారు. -
ఈవీలకు ఛార్జింగ్ పాయింట్లే కీలకం
[ 04-07-2024]
కాలుష్యాన్ని తగ్గించే విద్యుత్తు వాహనాలు పెరగాలంటే మౌలిక వసతులైన ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు కీలకం. -
అటవీ శాఖలో అవినీతి కలకలం!
[ 04-07-2024]
అవినీతి, అక్రమాలకు చోటులేదని భావించే జిల్లా అటవీ శాఖపై తాజాగా అవినీతి మరక పడింది. వికారాబాద్, తాండూరు అటవీ క్షేత్రాధికారులు (ఆర్ఎఫ్ఓ) అరుణ, శ్యాంసుందర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడటంతో సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. దీంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. -
ఉద్యోగం పేరిట యువతిపై ఇద్దరి అత్యాచారం
[ 04-07-2024]
ఉద్యోగం పేరుతో యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో జరిగింది. -
‘హిస్సా’ ఇస్తామని మోసం
[ 04-07-2024]
బక్రీద్ పండుగనాడు ఆచరించే సంప్రదాయాన్ని అవకాశం చేసుకొని మోసానికి తెగబడ్డారు. నిరక్షరాస్యులు, పేద కుటుంబాలకు చెందిన వారికి మాంసంలో భాగం(హిస్సా) ఇస్తామని రూ.లక్షలు వసూలు చేసి ముఖం చాటేశారు. -
తెరుచుకున్న గుండ్లమడుగు తండా పాఠశాల
[ 04-07-2024]
తాండూరు మండలం గుండ్లమడుగు తండా పాఠశాల ఎట్టకేలకు తెరుచు కుంది.‘ఈనాడు’లో..‘20 రోజులుగా పాఠశాల మూత’ శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనానికి తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య స్పందించారు. -
6 నెలలు.. 10 చోరీలు
[ 04-07-2024]
టాస్క్ఫోర్స్ సౌత్ ఈస్ట్జోన్, బండ్లగూడ ఠాణా పోలీసులు సంయుక్తంగా పథకం ప్రకారం.. ఘరానా దొంగను పట్టుకుని రిమాండుకు తరలించారు. -
పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్ రూ.5 వేలు
[ 04-07-2024]
విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం గ్రేటర్ ఆర్టీసీ ‘పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్’ను ప్రవేశపెట్టింది.