పరిశ్రమలకు ప్రోత్సాహం.. ఉపాధికి ఊతం
యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఓవైపు శకి క్యాంటిన్ల నిర్వహణతో పాటు స్టార్టప్లను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతోంది.
ఎదురుచూస్తున్న యువత
గ్రామీణ మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్ది కోటీశ్వరులగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం.
ఇటీవల మహిళా శక్తి క్యాంటిన్ల ప్రారంభోత్సవంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క.
వివిధ వ్యాపారాలను నిర్వహించేందుకు వడ్డీలేని రుణాలను ప్రభుత్వం మంజూరుచేస్తుంది.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.
న్యూస్టుడే, పరిగి, వికారాబాద్ కలెక్టరేట్: యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఓవైపు శకి క్యాంటిన్ల నిర్వహణతో పాటు స్టార్టప్లను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతోంది. దీంతో జిల్లా యువతలో ఆశలు రేకెత్తుతున్నాయి. పూడూరు, పరిగి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో పారిశ్రామిక వాడల ఏర్పాటుకు గతంలోనే అంకురార్పణ జరిగినా అనుకున్న స్థాయిలో ముందడుగులు పడలేదు. తాజాగా ప్రభుత్వం మహిళా శక్తి క్యాంటిన్లు, స్వయం ఉపాధి ప్రోత్సాహకాలు వంటివి చేపడుతుంటంతో జిల్లా యువత సానుకూల ఆశావాదాన్ని వ్యక్తం చేస్తున్నారు.
2008లోనే పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రతిపాదన: పూడూరు మండలం తిర్మలాపూర్, పూడూరు గ్రామ పంచాయతీల పరిధిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. సర్వే నంబరు 5లోని పేదల బతుకు తెరువు కోసం ఇచ్చిన భూములను గుర్తించారు. హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి కలిగి ఉండటంతో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రవాణా పరంగా తగిన సౌకర్యంగా ఉంటుందని భావించారు. అనువైన ప్రదేశం కావటంతో పాటు పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉండటంతో 2008లో అధికారులు పారిశ్రామికవాడ ఏర్పాటుకు ప్రతిపాదించారు. మొత్తం 113 ఎకరాలను స్వాధీనం చేసుకుని పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి అప్పగించారు. ఈ ప్రదేశంలో సదుపాయాలు కల్పించేందుకు అప్పట్లో రూ.30 కోట్లతో నీటి సదుపాయం, రెండు వరుసల బీటీ రోడ్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు వంటి వివిధ పనులు పూర్తి చేయించారు. ఇక్కడ మొత్తం 38 పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉంది. ప్రారంభంలో నిర్వాహకులు ముందుకు రాకపోవటంతో చాలకాలంగా ఈ స్థలం ఖాళీగానే కనిపించింది.
శీతలీకరణ గిడ్డంగులు, ఆహారశుద్ధి కేంద్రాలు: జిల్లా అచ్చంగా వ్యవసాయాధారిత ప్రాంతం. కూరగాయలు దాదాపు 20వేల ఎకరాల్లో పండిస్తున్నారు. రాజధాని వాసుల అవసరాలను తీరుస్తున్నారు. కానీ శీతలీకరణ గిడ్డంగులు, ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడంతో నష్టపోతున్నారు. పొదుపు సంఘ సభ్యులను ప్రోత్సహించడంలో భాగంగా రాకంచర్లలో ఇలాంటి వాటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
హైదరాబాద్ శివారు కాటేదాన్ ప్రాంతంలో కొనసాగుతున్న వివిధ పరిశ్రమలను రాకంచర్లకు రప్పించేందుకు గత భారాస ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాటేదాన్ ప్రాంతంలోని ఆయా కంపెనీల యజమానులకు రాకంచర్లలో ప్లాట్లు కేటాయించారు. ఇంతచేసినా ఇప్పటివరకు పదికి మించి రాలేదు. తాజాగా ప్రభుత్వ యోచనతో జిల్లాలో పరిశ్రమలు వృద్ధి చెంది యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
అర్కతలలో ఆహార శుద్ధి కేంద్రం ఏర్పాటు
ప్రభుత్వం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు తగిన చొరవ తీసుకుంటోంది. నవాబ్పేట మండలం అర్కతల గ్రామంలో ఆహార శుద్ధి కేంద్రం (ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్)ను నెలకొల్పనున్నారు. జిల్లాలో 2024-25 సంవత్సరానికి గాను 30 పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించారు. వీటిలో 10 యూనిట్లకు మంజూరు లభించింది.
వినయ్కుమార్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, వికారాబాద్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిపుణులున్నా.. సదుపాయాల్లేవ్
[ 04-07-2024]
అవయవ మార్పిడిలో రాజధాని ముందుంటోంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటులోనే ఈ శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి. -
కరెంట్ కట్.. రోగుల కటకట
[ 04-07-2024]
ఉస్మానియా ఆసుపత్రిలో బుధవారం మధ్యాహ్నం విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది. సుమారు అర గంట పాటు సరఫరా నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడ్డారు. -
క్షేత్రస్థాయిలో పర్యటించి.. సమస్యలు తెలుసుకొని
[ 04-07-2024]
నగర పారిశుద్ధ్యం, పరిపాలన వ్యవహారాలను చక్కదిద్దడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి దృష్టిపెట్టారు. -
గ్రేటర్ సమగ్ర అభివృద్ధికి ‘హైసిటీ’
[ 04-07-2024]
బల్దియా పరిధిలో మౌలిక వసతుల కల్పనకు సరికొత్త పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. -
మత్తు ఊబిలో ఎంబీఏ విద్యార్థులు
[ 04-07-2024]
గరంలో వ్యాపారులు, విద్యార్థులే లక్ష్యంగా ఖరీదైన మాదకద్రవ్యాలు చేరవేస్తున్న డ్రగ్ రాకెట్ను టీజీ న్యాబ్, కార్ఖానా పోలీసులు ఛేదించారు. -
దిగుమతి తగ్గినా.. ఆదాయంలో అదే జోరు
[ 04-07-2024]
బాటసింగారంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్కు మామిడి సీజన్.. ఏటా భారీగా ఆదాయం చేకూరుస్తోంది. -
రైలు ఢీకొని.. స్టేషన్ వరకు ఈడ్చుకొని
[ 04-07-2024]
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో రైలు ఇంజిన్కు వేలాడుతున్న వృద్ధుడి మృతదేహాన్ని కొందరూ ప్రయాణికులు సామాజిక మాధ్యమంలో బుధవారం పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. -
నెక్నాంపూర్ చెరువు.. పునరుద్ధరణ భేష్
[ 04-07-2024]
చెరువుల పునరుద్ధరణలో నెక్నాంపూర్ను ఆదర్శంగా తీసుకోవచ్చని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) ప్రకటించింది. -
విద్యార్థులు- ఉపాధ్యాయులు నిష్పత్తి సరి చేస్తారా?
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
విస్తరణ వివాదాస్పదం.. పనులకు అంతరాయం
[ 04-07-2024]
జిల్లాలో అతిపెద్ద దైన తాండూరు వ్యవసాయ విపణి విస్తరణ పనులు ఆగిపోయాయి. గడచిన మార్చిలో అధికారులు విస్తరణ పనులు వేగంగా నిర్వహించారు. -
నాలుగ్గోడల జీవితానికి స్వేచ్ఛ
[ 04-07-2024]
తెలిసో తెలియకో క్షణికావేశంలో చేసిన తప్పిదం వారిని బందీలను చేసింది. సమాజానికి, కుటుంబానికి దూరంగా నాలుగు గోడల మధ్య ఉంటూ.. తీవ్ర మనోవేదన అనుభవించారు. -
ఈవీలకు ఛార్జింగ్ పాయింట్లే కీలకం
[ 04-07-2024]
కాలుష్యాన్ని తగ్గించే విద్యుత్తు వాహనాలు పెరగాలంటే మౌలిక వసతులైన ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు కీలకం. -
అటవీ శాఖలో అవినీతి కలకలం!
[ 04-07-2024]
అవినీతి, అక్రమాలకు చోటులేదని భావించే జిల్లా అటవీ శాఖపై తాజాగా అవినీతి మరక పడింది. వికారాబాద్, తాండూరు అటవీ క్షేత్రాధికారులు (ఆర్ఎఫ్ఓ) అరుణ, శ్యాంసుందర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడటంతో సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. దీంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. -
ఉద్యోగం పేరిట యువతిపై ఇద్దరి అత్యాచారం
[ 04-07-2024]
ఉద్యోగం పేరుతో యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో జరిగింది. -
‘హిస్సా’ ఇస్తామని మోసం
[ 04-07-2024]
బక్రీద్ పండుగనాడు ఆచరించే సంప్రదాయాన్ని అవకాశం చేసుకొని మోసానికి తెగబడ్డారు. నిరక్షరాస్యులు, పేద కుటుంబాలకు చెందిన వారికి మాంసంలో భాగం(హిస్సా) ఇస్తామని రూ.లక్షలు వసూలు చేసి ముఖం చాటేశారు. -
తెరుచుకున్న గుండ్లమడుగు తండా పాఠశాల
[ 04-07-2024]
తాండూరు మండలం గుండ్లమడుగు తండా పాఠశాల ఎట్టకేలకు తెరుచు కుంది.‘ఈనాడు’లో..‘20 రోజులుగా పాఠశాల మూత’ శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనానికి తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య స్పందించారు. -
6 నెలలు.. 10 చోరీలు
[ 04-07-2024]
టాస్క్ఫోర్స్ సౌత్ ఈస్ట్జోన్, బండ్లగూడ ఠాణా పోలీసులు సంయుక్తంగా పథకం ప్రకారం.. ఘరానా దొంగను పట్టుకుని రిమాండుకు తరలించారు. -
పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్ రూ.5 వేలు
[ 04-07-2024]
విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం గ్రేటర్ ఆర్టీసీ ‘పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్’ను ప్రవేశపెట్టింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కన్నబిడ్డ కసిరింది.. కన్నపేగు కుమిలింది
-
ఆరు నెలల చిన్నారి చికిత్సకు.. ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు
-
క్షమించండి.. నెలలో తిరిగిస్తా.. ఉత్తరం రాసి చోరీకి పాల్పడ్డ దొంగ
-
తూర్పుగోదావరి జిల్లాలో ప్రాణం నిలిపిన పింఛను!
-
కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి చిత్రాలు
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?