హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
నగరంలో ఓ ఐపీఎస్, ఎమ్మెల్యే మధ్య వ్యవహారం అటు పోలీసు శాఖలో అటు ప్రజా ప్రతినిధులలో చర్చనీయాంశం అవుతోంది.
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: నగరంలో ఓ ఐపీఎస్, ఎమ్మెల్యే మధ్య వ్యవహారం అటు పోలీసు శాఖలో అటు ప్రజా ప్రతినిధులలో చర్చనీయాంశం అవుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. నగరంలోని సంపన్నుల ప్రాంతంలో నివసించే ఓ ఎమ్మెల్యే ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లారు. ప్రభుత్వం ఆయనకు కేటాయించిన గన్మెన్లు ఎమ్మెల్యే ఇంటి వద్దనే ఉంటున్నారు. ఈ విషయంపై దృష్టి పెట్టిన ఒక ఐపీఎస్ ఎమ్మెల్యే లేని కారణంగా గన్మెన్లను పోలీసు కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విదేశాల నుంచి నేరుగా సదరు అధికారికి ఫోన్ చేశారు. తాను లేకున్నా.. తన కుటుంబ సభ్యులున్నారని, వారికి రక్షణ కావాలి కదా.. అన్నారు. అందుకు ఐపీఎస్ ససేమిరా అన్నారు. గన్మెన్లను కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని తేల్చిచెప్పారు. దీంతో ఎమ్మెల్యే చిన్నబుచ్చుకున్నారు. తాను తిరిగి వచ్చిన తరువాత ఈ విషయం తెల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. అసలే.. ముప్పు ఉన్న ఎమ్మెల్యే కావడంతో ఈ విషయపై ఇరువర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
[ 03-07-2024]
కొద్దిరోజుల్లో జరిగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రాజధానికి ప్రాతినిధ్యం లభించబోతోందని తెలుస్తోంది. కాంగ్రెస్ వర్గాలూ ఇదే స్పష్టం చేస్తున్నాయి. ఈ వారంలో మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిద్ధమవుతున్నారు. -
ఆగస్టు 15 నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లు
[ 03-07-2024]
కొత్తగా వందే భారత్ స్లీపర్ రైళ్లు ఆగస్టు 15న ప్రారంభం కానున్నాయి. వీటిని కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి నడపాలని ద.మ రైల్వే అధికారులు ప్రతిపాదించారు. -
ఆరుపలకల దేహం.. స్టెరాయిడ్స్తో ఆగమాగం!
[ 03-07-2024]
అందమైన దేహం.. ఆకట్టుకునే రూపం ఆతృతలో కొందరు తప్పటడుగులు వేస్తున్నారు. యువకుల ఆసక్తిని అవకాశంగా కొన్ని జిమ్ సెంటర్లు స్టెరాయిడ్స్ను అలవాటు చేస్తున్నాయి. -
రూ.707 కోట్ల నష్టాలు
[ 03-07-2024]
రాష్ట్రంలోనే అత్యధిక నష్టాల్లో ఉన్న హైదరాబాద్ సౌత్ సర్కిల్లో ఏటా నష్టాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 42.23శాతం నష్టాలొచ్చాయి. 1013 మిలియన్ యూనిట్లు ‘లాస్ యూనిట్లు’గా టీజీఎస్పీడీసీఎల్ పేర్కొంది. -
హాస్టల్ విద్యార్థులకు దోమ కాటు!
[ 03-07-2024]
హైదరాబాద్లోని పలు కళాశాలలకు చెందిన హాస్టళ్లు, ప్రైవేటు వసతిగృహాల్లో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఉన్నత విద్యాభ్యాసానికి కళాశాల హాస్టల్లో, పోటీ పరీక్షల నిమిత్తం ప్రైవేటు హాస్టళ్లలో ఉంటున్న అభ్యర్థులు దోమ కాటుకు గురవుతున్నారు. -
భయపడితే.. ఖాతాలో సొమ్మంతా మాయమే
[ 03-07-2024]
‘‘మేం ఫెడెక్స్ నుంచి మాట్లాడుతున్నాం. మీ ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్లు ఇవేనా..! మీ ఖాతాల నుంచి రూ.లక్షల్లో అక్రమ లావాదేవీలు జరిగాయి. -
పత్రాలు సృష్టించి.. దర్జాగా విక్రయించి
[ 03-07-2024]
నగరంలో ఐటీ కారిడార్ సర్కారు భూములపై కన్నేసిన అక్రమార్కులు పహాణీ, ఆర్.ఒ.ఆర్. రికార్డుల్లో స్వల్ప లోపాలను గుర్తించి వాటిని ప్రైవేటు భూములుగా చిత్రీకరించి మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. -
మూడు రోజుల్లో ఇవ్వకపోతే ఎలా?
[ 03-07-2024]
కొత్త నేర న్యాయ చట్టాల్లో ఫిర్యాదు చేసే విధానం మరింత సరళీకృతం చేసినా.. పోలీసులకు కొన్ని సవాళ్లు ఎదురు కానున్నాయి. -
మూసీ అభివృద్ధికి ప్రణాళిక
[ 03-07-2024]
అత్తాపూర్లోని మూసీ పరీవాహక ప్రాంతాన్ని మంగళవారం మూసీనది అభివృద్ధి సంస్థ(ఎంఆర్డీఏ) అధికారుల బృందం పరిశీలించింది. -
కుండపోతతో తడిసిన నగరం
[ 03-07-2024]
నగర వ్యాప్తంగా మంగళవారం రాత్రి పది గంటల సమయంలో కుండపోత వాన కురిసింది. అరగంటలోనే హిమాయత్ నగర్లో 3.6 సెం.మీ గరిష్ఠ వర్షపాతం నమోదైంది. -
ఖాతాదారు డబ్బు మాయం... యూనియన్ బ్యాంకుకు జరిమానా
[ 03-07-2024]
ఖాతాదారుడికి అందించాల్సిన సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన యూనియన్ బ్యాంకుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. -
కాంగ్రెస్లోకి మేడ్చల్ మున్సిపల్ ఛైర్పర్సన్ దీపికారెడ్డి
[ 03-07-2024]
మేడ్చల్ మున్సిపల్ ఛైర్పర్సన్ దీపికారెడ్డి కాంగ్రెస్లో చేరారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, కాంగ్రెస్ నేతలు నక్కా ప్రభాకర్ గౌడ్ల సమక్షంలో ఆమె మంగళవారం ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. -
ఆడుకుంటూ రైలెక్కి.. ఆపదలో చిక్కుకుని
[ 03-07-2024]
ఎటువెళ్తున్నారో తెలియకుండానే ఆడుకుంటూ రైలెక్కిన చిన్నారులు.. గమ్యం తెలియక మరో స్టేషన్లో దిగి బయటకు వెళ్తుండగా ఓ ఆటో డ్రైవర్ వారిని అపహరించడానికి యత్నించగా ట్రాఫిక్ పోలీసులు రక్షించారు. -
ఉద్యోగంలోకి తీసుకోండి సారూ..!
[ 03-07-2024]
అనుకోకుండా చేసిన తప్పులతో తమను ఉద్యోగాలనుంచే తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, క్షమించి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆర్టీసీలో సస్పెండైన కార్మికులు ప్రజాభవన్లో విజ్ఞప్తిచేశారు. -
కొత్త చట్టం ప్రకారం ఆబ్కారీ శాఖలో తొలి కేసు
[ 03-07-2024]
కొత్తగా అమల్లోకి వచ్చిన నేర న్యాయ చట్టాల కింద ఆబ్కారీ శాఖ తొలి కేసు నమోదు చేసింది. -
బంగరు బాల్యం.. భవిత భద్రం
[ 03-07-2024]
బాల్యం ఎంతో విలువైంది. వీరిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తెలియని తనం, కోపం తదితర కారణాలతో కొందరు పిల్లలు ఇంటినుంచి వెళ్లిపోతున్నారు. తిరిగి వద్దామన్నా సరైన అవగాహన లేక ఎక్కడో ఓ చోట పని చేసుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. -
టార్గెట్ 26
[ 03-07-2024]
మూడు జిల్లాల పరిధిలో వందలాది రెడ్ కేటగిరీ పరిశ్రమలుండగా ప్రతి పరిశ్రమను ఆరు నెలలకోసారి తనిఖీ చేయాలని సీపీసీబీ(కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి) నిబంధనలు చెబుతున్నాయి. -
హుస్సేన్సాగర్లో సెయిలింగ్ వారోత్సవాలు షురూ
[ 03-07-2024]
హుస్సేన్సాగర్లో ఆహ్లాదకర వాతావరణంలో సెయిలింగ్ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. 38వ హైదరాబాద్ సెయిలింగ్ వారోత్సవాలను ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్, లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. -
మానవతా దృక్పథంతో రోగులకు సేవలందించాలి
[ 03-07-2024]
వైద్యులు వ్యాపార ధోరణితో కాకుండా మానవతా దృక్పథంతో రోగులకు సేవలు అందించాలని లోక్సత్తా అధినేత డా.జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
విద్యార్థుల భవితను తీర్చిదిద్దేది గురువులే
[ 03-07-2024]
గురువుల విశిష్ట పాత్ర విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు దోహదపడుతుందని, కళాశాల యాజమాన్యం కమిటీ సభ్యుల సమష్టి కృషి వల్లే 50 వసంతాల ప్రయాణం సులభతరమైందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. -
అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి
[ 03-07-2024]
ర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. -
డెంగీ జ్వరాల కట్టడికి యత్నం
[ 03-07-2024]
డెంగీ జ్వరాలను కట్టడి చేయాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకుంది. మంగళవారం అదనపు కమిషనర్, సికింద్రాబాద్ జడ్సీ రవికిరణ్ సమీక్ష నిర్వహించారు. -
డాక్టర్ రాజేంద్రనాథ్కు ‘వైద్యరత్న’ పురస్కారం
[ 03-07-2024]
రామానుజ ట్రస్టు ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కింగ్కోఠి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ను రాజ్భవన్లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ‘వైద్యరత్న’ పురస్కారంతో సత్కరించారు. -
20 రోజులుగా పాఠశాల మూత
[ 03-07-2024]
వికారాబాద్ జిల్లా, తాండూరు మండలం గుండ్లమడుగుతండాలో ప్రభుత్వ పాఠశాల ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 రోజులుగా తెరుచుకోవడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
-
మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
-
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి