- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. ఎస్సార్నగర్లో ఘటన
పెళ్లి చేసుకోవడానికి వరుడిని వెతుకుతున్న యువతికి యాప్ ద్వారా పరిచయమైన ఓ ప్రబుద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.
అమీర్పేట, న్యూస్టుడే: పెళ్లి చేసుకోవడానికి వరుడిని వెతుకుతున్న యువతికి యాప్ ద్వారా పరిచయమైన ఓ ప్రబుద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఉప్పల్ ఠాణాలో జీరో ఎఫ్ఐఆర్ అయిన ఈ కేసు ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్కు బదిలీ కావడంతో కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్ ప్రాంతానికి చెందిన యువతి(27)... వివాహం చేసుకోవడానికి యాప్లో శోధిస్తుండగా.. ఎస్సార్నగర్ ఠాణా పరిధిలోని జయప్రకాష్నగర్లో ఫొటో స్టూడియో నిర్వహిస్తున్న ముత్తుమ్ముల రాజశేఖర్(30) పరిచయమయ్యాడు. తాను ఫొటోగ్రాఫర్నని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పరిచయం పెంచుకున్నాడు. యువతికి చెందిన ఈ-మెయిల్ ఐడీని కూడా వినియోగించేవాడు. గత నెల 24న యువతికి ఫోన్ చేసిన రాజశేఖర్ తన ఫోటో స్టూడియోకు రమ్మని పిలిచాడు. మరుసటి రోజు స్టూడియోకు వెళ్లిన యువతిని బెదిరించాడు. తాను చెప్పినట్లు వినకపోతే మెయిల్ ద్వారా లభ్యమైన నీ ఫొటోలను అందరికీ పంపి పరువు తీస్తానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని హెచ్చరించాడు. బాధితురాలు అక్కడి నుంచి బయటపడి సమీప బంధువైన మహిళకు విషయం చెప్పింది. వారు ఉప్పల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి జీరో ఎఫ్ఐఆర్ ఎస్సార్నగర్కు బదిలీ కావడంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్యకు యత్నించిన తల్లి, కుమార్తె మృతి
కుటుంబ కలహాలతో కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని గజ్జిగూడ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని తల్లీ, ముగ్గురు కుమార్తెలు సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. -
భారీగా చౌక బియ్యం పట్టివేత
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజుపేటలోని రైస్మిల్లు కేంద్రంగా వైకాపా నాయకుల అండతో గత ఐదేళ్లుగా యథేచ్ఛగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. -
రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
వైఎస్సార్ జిల్లా పోలీసులు భారీస్థాయిలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. కడపలో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. -
మధుకాన్ సంస్థలో కోల్కతా పోలీసుల సోదాలు
సబ్కాంట్రాక్టు ఇచ్చి పనులు చేయించుకుని డబ్బులు చెల్లించకుండా మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో జూబ్లీహిల్స్లోని మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో బుధవారం కోల్కతా పోలీసులు సోదాలు నిర్వహించారు. -
బాలురపై లైంగిక దాడి కూడా శిక్షార్హమే
బ్రిటిష్ కాలంనాటి భారత శిక్షా స్మృతి (ఐపీసీ) స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లైంగిక నేరాల విషయంలో లింగ భేదాలకు స్వస్తి పలికింది. -
బెయిల్కు 2 నెలల కాలపరిమితి సరికాదు
మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద అరెస్టు అయిన వ్యక్తికి రెండు నెలల కాల పరిమితి విధిస్తూ బెయిల్ మంజూరు చేసిన ఒరిస్సా హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వంచకుడు అంజాద్పై కేసు.. పెళ్లి చేసుకుంటానని బలవంతాన తీసుకెళ్లినట్లు తేజస్విని స్టేట్మెంట్
-
జగన్ రంగుల మాయకు రూ.కోట్ల ఖర్చు!
-
గురువెక్కడో మేమూ అక్కడే.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు
-
నేటి నుంచి ఎప్సెట్ కౌన్సెలింగ్