పుట్టిన రోజునే వృద్ధురాలి అంత్యక్రియలు
తల్లి పుట్టిన రోజు జరపాల్సిన రోజు ఆమె అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం తీవ్ర విషాదానికి గురిచేసింది.
మధుబాయి
రెజిమెంటల్బజార్, న్యూస్టుడే: తల్లి పుట్టిన రోజు జరపాల్సిన రోజు ఆమె అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం తీవ్ర విషాదానికి గురిచేసింది. కుమారుల వద్దకు వెళ్లేందుకు రైలెక్కిన తల్లి కొద్దిసేపటికే మృతి చెందింది. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం... నెల్లూరులో ఉంటున్న మధుబాయి(65), రమేష్మాల్ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. భర్త చనిపోవడంతో ఆమె నెల్లూరులో కుమారుల వద్ద ఉంటోంది. పెద్దకుమార్తె మియాపూర్లో ఉంటోంది. వారి వద్దకు ఆమె గత నెల 2న వచ్చింది. తిరిగి కుమారుల వద్దకు వెళ్లేందుకు గత నెల 30న రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు కుమార్తెతో కలిసి వచ్చింది. సింహపురి ఎక్స్ప్రెస్ రైలు 10వ నంబరు ప్లాట్ఫాంపై ఉంది. అక్కడికి వెళ్లే సరికి ఆమె తీవ్ర ఆయాసానికి గురైంది. రైలు ఎక్కిన కాసేపటికే కుమార్తె తల్లికి ఫోన్ చేయగా ఓ ప్రయాణికురాలు మాట్లాడుతూ వాంతి చేసుకుని పడిపోయిందని చెప్పింది. అప్పటికి రైలు కదల్లేదు. వెంటనే ప్రయాణికుల సహాయంతో ప్లాట్ఫాంపై తల్లిని దింపి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మధుబాయి పుట్టినరోజు జులై 1న అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం విషాదానికి గురి చేసిందని కుమారులు, కుమార్తెలు వాపోయారు.
యువతిపై అత్యాచారం.. దోషికి తుదిశ్వాస వరకు కారాగారం
వంశీకృష్ణ
రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్టుడే: ఓ యువతిని అపహరించి, అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం ‘జీవిత కాలం శిక్ష’(తుదిశ్వాస వదిలే వరకు), రూ.21,000 జరిమానా విధించింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత బర్ల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం కురుమర్తికి చెందిన ఇంద్రకంటి వంశీకృష్ణ అలియాస్ బబ్లూ(19) హయత్నగర్ శాంతినగర్లో ఉంటూ మెకానిక్గా పనిచేసేవాడు. ప్రేమిస్తున్నానంటూ ఇంటర్ చదివే ఓ యువతి(17) వెంట పడేవాడు. 2017 డిసెంబరు 10న బంధువుల ఇంటికెళ్లి ఆటోలో తిరిగొస్తున్న యువతిని మధ్యలో ఆపి.. ఇంటి వద్ద దింపుతానని బైక్పై ఎక్కించుకొని.. తన ఇంటికి తీసుకెళ్లి రెండ్రోజులు నిర్బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హయత్నగర్ పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడిని రిమాండుకు తరలించారు. బాధితురాలికి సుల్తాన్బజార్ ప్రసూతి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మేజిస్ట్రేట్ పర్యవేక్షణలో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. దర్యాప్తు తర్వాత నిందితుడిపై భారత శిక్షా స్మృతిలోని పలు సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎంకే పద్మావతి సోమవారం తుది తీర్పు వెల్లడించారు. బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం మంజూరు చేశారు.
ఈఎంఐ చెల్లించేందుకు గొలుసు చోరీలు
నిజాంపేట, న్యూస్టుడే: నిందితుడు 2012 నుంచి 2015 వరకు పలు ఠాణాల్లో 36 దోపిడీలకు పాల్పడి జైలుకు వెళ్లాడు. రెండేళ్ల తర్వాత విడుదలై రాజస్థాన్ వెళ్లి స్థిరపడ్డాడు. బతుకుదెరువు కోసం ఇటీవల విశాఖపట్నానికి మకాం మార్చాడు. అయితే బ్యాంకులో తీసుకున్న రుణం తాలూకు ఈఎంఐ చెల్లించే స్తోమత లేకపోవడంతో తిరిగి పాతబాట పట్టాడు. నిందితుడిని బాచుపల్లి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. బాలానగర్ డీసీపీ కె.సురేష్కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. మహేందర్సింగ్(42) గతనెల 24న ప్రగతినగర్ ఇన్కాయిస్ రోడ్డులో కోటేశ్వరమ్మ అనే మహిళ మెడలోంచి 3 తులాల బంగారు గొలసును బైక్పై వచ్చి లాక్కొని పరారయ్యాడు. మరుసటి రోజు రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న యువతి మెడలోంచి గొలసు లాక్కునే ప్రయత్నం చేశాడు. బాధితురాలు చాకచక్యంగా తప్పించుకుంది. 20 నిమిషాల వ్యవధిలోనే మరో మహిళ మెడలోంచి 3 తులాల గొలుసును లాక్కున్నాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆయా ఘటనా స్థలాల్లోని సీసీ పుటేజీలను పరిశీలించిన నిందితుడు ఒక్కడే అని గుర్తించారు. బాచుపల్లి మమతా ఆసుపత్రి వద్ద సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా.. అదే సమయంలో అటుగా వస్తున్న మహేందర్సింగ్ను పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న రూ.5లక్షల విలువైన 6 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కూకట్పల్లి ఏసీపీ కె.శ్రీనివాసరావు, బాచుపల్లి సీఐ జె.ఉపేందర్ పాల్గొన్నారు.
హత్య కేసులో ముగ్గురు రౌడీషీటర్లకు జీవిత ఖైదు
ముజాహిద్ , జిలానీ పాషా , ఫిరోజ్ఖాన్
కూకట్పల్లి, న్యూస్టుడే: కలిసి వేసిన వెంచర్లోని ప్లాట్లన్నీ ఒక్కడే అమ్ముకోవడమే కాకుండా వాటా అడిగినందుకు తోటి రౌడీషీటర్ను హత్యచేసిన కేసులో ముగ్గురు రౌడీషీటర్లకు కూకట్పల్లి 6వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి సి.పావని జీవితఖైదు విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ యెలగపురి నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. దొమ్మరపోచంపల్లి గాయత్రీనగర్కు చెందిన రియల్ వ్యాపారి, రౌడీషీటర్ ముజాహిద్ అలియాస్ ముజ్జు(50), నవాబ్కుంటకు చెందిన రౌడీషీటర్ సయ్యద్ ఇస్మాయిల్(40) పలు హత్య కేసుల్లో 2020కి ముందు జైలులో ఉన్నారు. అక్కడ స్నేహితులైన వీరిద్దరు బెయిల్పై వచ్చి ఫయాజ్ అనే వ్యక్తితో కలిసి 2021లో జహీరాబాద్లో కొంత భూమి కొనుగోలు చేసి వెంచర్ చేశారు. పెట్టుబడి కోసం నవాబ్కుంటలోని తన 500గజాల స్థలాన్ని ఇస్మాయిల్ అప్పట్లోనే ముజాహిద్ పేరుతో రిజిష్టర్ చేశాడు. బెయిల్ గడువు ముగియడంతో ఇస్మాయిల్ను పోలీసులు అరెస్టుచేసి కోర్టుకు పంపారు. ఈ క్రమంలో ముజాహిద్ వెంచర్లో ప్లాట్లన్నీ అమ్మి సొమ్ము చేసుకున్నాడు. 2022లో జైలునుంచి విడుదలైన ఇస్మాయిల్ తన వాటాపై ముజాహిద్ను ప్రశ్నించడంతో ఘర్షణ జరిగింది. కనీసం తన 500గజాల ప్లాటు ఇవ్వాలని ఇస్మాయిల్ డిమాండ్ చేశాడు. చివరికి రూ.20లక్షలిచ్చేందుకు ముజాహిద్ అంగీకరించాడు. డబ్బు ఇవ్వకుండా ఇస్మాయిల్ను హతమార్చాలనుకున్నాడు. రౌడీషీటర్లు యూసుఫ్గూడ ప్రభాత్నగర్వాసి జిలానీ పాషా(25), రాజేంద్రనగర్ జిన్నారంకాలనీకి చెందిన ఫిరోజ్ఖాన్(31)కు ఇస్మాయిల్ హత్య బాధ్యత అప్పగించాడు. 2022 జులై 31న రాత్రి సెటిల్మెంట్కని ముజాహిద్ ఫోన్ చేయగా, నమ్మిన ఇస్మాయిల్ మాదాపూర్ వెళ్లాడు. అక్కడే ఇస్మాయిల్, ముజాహిద్ మాట్లాడుతుండగా పథకం ప్రకారం ద్విచక్ర వాహనంపై ఫిరోజ్తో కలిసి వచ్చిన జిలానీపాషా గన్తో ఇస్మాయిల్ తలపైకాల్చడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు 2022, ఆగస్టు 1న ముజాహిద్, జిలానీ, ఫిరోజ్ను అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు అధికారులు రవీంద్రప్రసాద్, తిరుపతి చాకచక్యంగా హత్య వివరాలను కోర్టుకు సమర్పించడంతో సోమవారం కూకట్పల్లి 6వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి సి.పావని ముగ్గురికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
నమ్మించి నట్టేట ముంచి..!
రూ.23.32 కోట్ల వసూలు చేసి ఉడాయించిన వైనం
హయత్నగర్, న్యూస్టుడే: చిట్టీలు, వడ్డీల పేరిట ఓ వ్యక్తి పలువురిని నమ్మించి రూ.కోట్లు వసూలుచేసి ఉడాయించిన ఘటన హయత్నగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనబోలుకు చెందిన చిట్టెటి మధుసూదన్రెడ్డి కుటుంబంతో కొన్నేళ్లుగా హయత్నగర్ రాజరాజేశ్వరి కాలనీలో ఉంటున్నాడు. ఓ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సదరు కళాశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పడిన పరిచయాలను ఆసరాగా చేసుకొని చిట్టీలు, వడ్డీ వ్యాపారం ప్రారంభించాడు. స్వగ్రామంలో 100ఎకరాల మామిడి తోట, హయత్నగర్లో సొంతిల్లు, ప్లాట్లు ఉన్నాయని నమ్మించాడు. దాదాపుగా 137మంది నుంచి రూ.23.32కోట్లు తీసుకొని కొద్ది రోజులుగా ముఖం చాటేశాడు. పలువురు బాధితులు ఆదివారం రాత్రి హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హయత్నగర్ సీఐ రామకృష్ణ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డికి నిరసన సెగ
[ 04-07-2024]
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డికి నిరసన సెగ తగిలింది. -
క్రెడిట్ కార్డు చెల్లింపుల పేరుతో సైబర్ నేరగాళ్ల వల
[ 04-07-2024]
క్రెడిట్ కార్డు చెల్లింపుల పేరుతో నగరానికి ఓ బాధితురాలికి సైబర్ నేరగాళ్లు వల విసిరారు. -
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కె.కేశవరావు
[ 04-07-2024]
రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు (కేకే) రాజీనామా చేశారు. -
ఉద్యోగం పేరిట యువతిపై ఇద్దరి అత్యాచారం
[ 04-07-2024]
ఉద్యోగం పేరుతో యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో జరిగింది. -
మత్తు ఊబిలో ఎంబీఏ విద్యార్థులు.. డ్రగ్ రాకెట్ను ఛేదించిన టీజీ న్యాబ్ పోలీసులు
[ 04-07-2024]
గరంలో వ్యాపారులు, విద్యార్థులే లక్ష్యంగా ఖరీదైన మాదకద్రవ్యాలు చేరవేస్తున్న డ్రగ్ రాకెట్ను టీజీ న్యాబ్, కార్ఖానా పోలీసులు ఛేదించారు. -
పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్ రూ.5 వేలు
[ 04-07-2024]
విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం గ్రేటర్ ఆర్టీసీ ‘పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్’ను ప్రవేశపెట్టింది. -
నిపుణులున్నా.. సదుపాయాల్లేవ్
[ 04-07-2024]
అవయవ మార్పిడిలో రాజధాని ముందుంటోంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటులోనే ఈ శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి. -
కరెంట్ కట్.. రోగుల కటకట
[ 04-07-2024]
ఉస్మానియా ఆసుపత్రిలో బుధవారం మధ్యాహ్నం విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది. సుమారు అర గంట పాటు సరఫరా నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడ్డారు. -
క్షేత్రస్థాయిలో పర్యటించి.. సమస్యలు తెలుసుకొని
[ 04-07-2024]
నగర పారిశుద్ధ్యం, పరిపాలన వ్యవహారాలను చక్కదిద్దడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి దృష్టిపెట్టారు. -
గ్రేటర్ సమగ్ర అభివృద్ధికి ‘హైసిటీ’
[ 04-07-2024]
బల్దియా పరిధిలో మౌలిక వసతుల కల్పనకు సరికొత్త పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. -
దిగుమతి తగ్గినా.. ఆదాయంలో అదే జోరు
[ 04-07-2024]
బాటసింగారంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్కు మామిడి సీజన్.. ఏటా భారీగా ఆదాయం చేకూరుస్తోంది. -
రైలు ఢీకొని.. స్టేషన్ వరకు ఈడ్చుకొని
[ 04-07-2024]
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో రైలు ఇంజిన్కు వేలాడుతున్న వృద్ధుడి మృతదేహాన్ని కొందరూ ప్రయాణికులు సామాజిక మాధ్యమంలో బుధవారం పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. -
నెక్నాంపూర్ చెరువు.. పునరుద్ధరణ భేష్
[ 04-07-2024]
చెరువుల పునరుద్ధరణలో నెక్నాంపూర్ను ఆదర్శంగా తీసుకోవచ్చని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) ప్రకటించింది. -
విద్యార్థులు- ఉపాధ్యాయులు నిష్పత్తి సరి చేస్తారా?
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
విస్తరణ వివాదాస్పదం.. పనులకు అంతరాయం
[ 04-07-2024]
జిల్లాలో అతిపెద్ద దైన తాండూరు వ్యవసాయ విపణి విస్తరణ పనులు ఆగిపోయాయి. గడచిన మార్చిలో అధికారులు విస్తరణ పనులు వేగంగా నిర్వహించారు. -
నాలుగ్గోడల జీవితానికి స్వేచ్ఛ
[ 04-07-2024]
తెలిసో తెలియకో క్షణికావేశంలో చేసిన తప్పిదం వారిని బందీలను చేసింది. సమాజానికి, కుటుంబానికి దూరంగా నాలుగు గోడల మధ్య ఉంటూ.. తీవ్ర మనోవేదన అనుభవించారు. -
ఈవీలకు ఛార్జింగ్ పాయింట్లే కీలకం
[ 04-07-2024]
కాలుష్యాన్ని తగ్గించే విద్యుత్తు వాహనాలు పెరగాలంటే మౌలిక వసతులైన ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు కీలకం. -
అటవీ శాఖలో అవినీతి కలకలం!
[ 04-07-2024]
అవినీతి, అక్రమాలకు చోటులేదని భావించే జిల్లా అటవీ శాఖపై తాజాగా అవినీతి మరక పడింది. వికారాబాద్, తాండూరు అటవీ క్షేత్రాధికారులు (ఆర్ఎఫ్ఓ) అరుణ, శ్యాంసుందర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడటంతో సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. దీంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. -
‘హిస్సా’ ఇస్తామని మోసం
[ 04-07-2024]
బక్రీద్ పండుగనాడు ఆచరించే సంప్రదాయాన్ని అవకాశం చేసుకొని మోసానికి తెగబడ్డారు. నిరక్షరాస్యులు, పేద కుటుంబాలకు చెందిన వారికి మాంసంలో భాగం(హిస్సా) ఇస్తామని రూ.లక్షలు వసూలు చేసి ముఖం చాటేశారు. -
తెరుచుకున్న గుండ్లమడుగు తండా పాఠశాల
[ 04-07-2024]
తాండూరు మండలం గుండ్లమడుగు తండా పాఠశాల ఎట్టకేలకు తెరుచు కుంది.‘ఈనాడు’లో..‘20 రోజులుగా పాఠశాల మూత’ శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనానికి తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య స్పందించారు. -
6 నెలలు.. 10 చోరీలు
[ 04-07-2024]
టాస్క్ఫోర్స్ సౌత్ ఈస్ట్జోన్, బండ్లగూడ ఠాణా పోలీసులు సంయుక్తంగా పథకం ప్రకారం.. ఘరానా దొంగను పట్టుకుని రిమాండుకు తరలించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మైక్రోసాఫ్ట్లో మరోసారి ఉద్యోగాల కోత
-
విశ్వవిజేతల విజయ యాత్ర.. క్రికెట్ ఫ్యాన్స్తో జనసంద్రంగా మారిన ముంబయి
-
పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు.. జనసేన కార్యాలయంలో సూర్యారాధన
-
ఇజ్రాయెల్ పైకి 200 రాకెట్లు.. హెజ్బొల్లా ప్రతీకార దాడులు!
-
రోహిత్.. పిచ్ మట్టి రుచి ఎలా ఉంది?: మోదీ
-
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డికి నిరసన సెగ