ఖాళీ స్థలాలకు పన్ను కట్టండి
జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం పలు పౌర సేవలను పునరుద్ధరించింది. మూడేళ్ల కిందట నిలిచిన నోటరీ స్థలాలకు ఇంటి నంబర్ల జారీ ప్రక్రియను, ఖాళీ స్థలాల పన్ను(వీఎల్టీ), జీఐఎస్ సర్వే వంటి కార్యక్రమాలను తాజాగా ప్రారంభించింది.
నోటరీ స్థలాలకు ఇంటి నంబర్ల జారీ షురూ
పలు సేవలను పునరుద్ధరించిన జీహెచ్ఎంసీ
ఈనాడు, హైదరాబాద్: జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం పలు పౌర సేవలను పునరుద్ధరించింది. మూడేళ్ల కిందట నిలిచిన నోటరీ స్థలాలకు ఇంటి నంబర్ల జారీ ప్రక్రియను, ఖాళీ స్థలాల పన్ను(వీఎల్టీ), జీఐఎస్ సర్వే వంటి కార్యక్రమాలను తాజాగా ప్రారంభించింది. తద్వారా పౌరులకు, బల్దియాకు మేలు జరగనుందని అధికారులు చెబుతున్నారు. జీఐఎస్ సర్వేతో నగరంలోని ప్రతి నిర్మాణాలన్నీ ఆన్లైన్ అవుతాయని, దీంతో ఆస్తిపన్ను పరిధిలో లేని భవనాలు, తక్కువ చెల్లిస్తున్న ఇళ్ల వివరాలను గుర్తించగలమని అధికారులు వెల్లడించారు.
యజమానులకు నోటీసులు.. మూడేళ్లుగా ఖాళీ స్థలాలు, నిర్మాణాల రిజిస్ట్రేషన్లు ‘ధరణి’ ద్వారానే జరుగుతున్నాయి. కొత్త ఇళ్లయితే రిజిస్ట్రేషన్తోపాటు ఆస్తిపన్ను ఏకరూప సంఖ్య, పన్ను మదింపు అప్పటికప్పుడే పూర్తవుతున్నాయి. పాత ఇళ్లయితే ఆస్తిపన్ను రికార్డుల్లో కొనుగోలుదారు పేరు చేరిపోతోంది. ఆ ప్రక్రియను మ్యుటేషన్ అంటారు. ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్తోపాటు వీఎల్టీ మదింపు జరుగుతోంది. దాని విలువ రిజిస్ట్రేషన్ విలువలో 0.5శాతం ఉంటుంది. యజమానుల నుంచి వీఎల్టీ వసూలుకాలేదు. చాలా సేవలు నిలిపివేశారు. సర్కారు మారడంతో.. నిలిచిన సేవలన్నింటినీ పట్టాలెక్కిస్తున్నారు. ఈ క్రమంలో వీఎల్టీ చెల్లించాల్సిన యజమానుల ఫోన్ నంబర్లకు డిజిటల్ నోటీసు వివరాలను చేరవేశామని బల్దియా తెలిపింది.
నోటరీ స్థలాలకు..
అక్రమ నిర్మాణాలు, నోటరీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇవ్వాలని జీహెచ్ఎంసీ చట్టం చెబుతోంది. కొన్నేళ్లుగా బల్దియా ఆ సేవలను అమలు చేయలేదు. తాజాగా ‘సూపర్ స్ట్రక్చర్’ కింద యంత్రాంగం ఆ సేవలను ప్రారంభించింది. నిర్మాణానికి ఇంటి నంబరు మాత్రమే మంజూరవుతుందని, యజమాని పేరు అందులో ఉండదని అధికారులు గుర్తుచేస్తున్నారు. అనుమతి లేని కట్టడాలకు, నోటరీ స్థలాలకు రెండింతల ఆస్తిపన్ను ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
జీఐఎస్ సర్వే
ప్రతి భవనానికి ఓ ఏకరూప సంఖ్యను జారీ చేసి, నిర్మాణాల 3డీ ఫొటోలను డిజిటల్ పటంలో చేర్చే జీఐఎస్ సర్వే నగరంలో మొదలైంది. జీహెచ్ఎంసీ ఇచ్చే ఏకరూప సంఖ్య జిల్లా, మండలం, కాలనీ పేరు, ఇతర వివరాలను తెలిపేదిగా ఉంటుందని, వాటన్నింటినీ డిజిటల్ పటంలో పొందుపర్చడంతో భవిష్యత్తులో ఏ ఇంటి చిరునామానైనా సులువుగా తెలుసుకునే సౌలభ్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మొదట డ్రోన్లతో నగరం మొత్తాన్ని ఫొటో తీసి, తర్వాత క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ప్రతి భవనం ఫొటోలను, వీధుల్లోని పార్కులు, రోడ్లు, మ్యాన్హోళ్లు, చెట్లను కూడా 3డీ పటంలో చేరుస్తామని అధికారులు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పగ్గాలు చేపట్టినా.. నిద్రాణంలో పాలన
[ 02-07-2024]
రాజధానిలో పారిశుద్ధ్యం రోడ్ల మీదకు చేరి అన్ని ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. -
ఒక్క సందేశంతో ఫిర్యాదు
[ 02-07-2024]
కేసు నమోదు చేసినా.. బాధితుల చేతికి ఎఫ్ఐఆర్ వచ్చేందుకు రోజుల తరబడి ఎదురుచూపులు.. కేసు దర్యాప్తు ఏ స్థితిలో ఉందో.. నిందితుల్ని అరెస్టు చేశారో లేదో తెలియని పరిస్థితి.. -
సొంతింటి ఆశ.. కేటుగాళ్ల మాయ
[ 02-07-2024]
సకల హంగులతో కార్యాలయాలు.. ఆకట్టుకునేలా బ్రోచర్లు.. వందల కోట్ల ఎకరాల భూములు తమ పరిధిలో ఉన్నాయంటూ ప్రకటనలు. -
నిబంధనలు అవుట్!
[ 02-07-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఆపరేటర్లు అదును చిక్కితే చాలు తమ చేతివాటం చూపించి అడ్డదారుల్లో ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు. -
పేదలకు అండగా సర్కారు దవాఖానా ఉందిగా
[ 02-07-2024]
అండాశయ కేన్సర్తో బాధపడుతున్న ఓ మహిళను కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రముఖ కేన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. -
పీల్చే గాలే పిప్పి చేస్తోంది
[ 02-07-2024]
నగరంలో పెరుగుతున్న కాలుష్యం నిశ్శబ్ద హంతకిగా మారుతోంది. క్రమక్రమంగా విషవాయువులు పీలుస్తున్న జనాలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. -
చిన్న మొత్తాలపై.. చిన్నచూపు
[ 02-07-2024]
సైబర్ నేరాలను కొందరు పోలీసులు చిన్నచూపు చూస్తున్నారు. -
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
[ 02-07-2024]
ఉన్నతాధికారుల నిర్లక్ష్యమో...అమ్యామ్యాలకు ఆ కార్యాలయం నిలయంగా మారడమో కానీ అక్కడి కొంతమంది అధికారులు చేసే దందాకు లెక్కేలేకుండా పోతోంది. -
పరిశ్రమలకు ప్రోత్సాహం.. ఉపాధికి ఊతం
[ 02-07-2024]
యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఓవైపు శకి క్యాంటిన్ల నిర్వహణతో పాటు స్టార్టప్లను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతోంది. -
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
[ 02-07-2024]
నగరంలో ఓ ఐపీఎస్, ఎమ్మెల్యే మధ్య వ్యవహారం అటు పోలీసు శాఖలో అటు ప్రజా ప్రతినిధులలో చర్చనీయాంశం అవుతోంది. -
విమాన టిక్కెట్ల రద్దు.. ప్రయాణికుడికి అసౌకర్యం
[ 02-07-2024]
ప్రయాణికురాలి ప్రమేయం లేకుండా టిక్కెట్లు రద్దుచేసి అసౌకర్యాన్ని కలిగించిన ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో ఎయిర్లైన్స్)కు రంగారెడ్డి వినియోగదారుల కమిషన్ మొట్టికాయలు వేసింది. -
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. కేసు నమోదు
[ 02-07-2024]
పెళ్లి చేసుకోవడానికి వరుడిని వెతుకుతున్న యువతికి యాప్ ద్వారా పరిచయమైన ఓ ప్రబుద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. -
వివాహేతర సంబంధానికి ఒత్తిడి తెచ్చాడని అంతమొందించారు
[ 02-07-2024]
వివాహేతర సంబంధం కోసం గృహిణిపై ఒత్తిడి తీసుకురావడంతోనే దుబాయ్ ఇంజినీరు హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. -
పుట్టిన రోజునే వృద్ధురాలి అంత్యక్రియలు
[ 02-07-2024]
తల్లి పుట్టిన రోజు జరపాల్సిన రోజు ఆమె అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం తీవ్ర విషాదానికి గురిచేసింది.