logo

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఒకే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు 37 ఏళ్ల తరువాత ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. ఘట్‌కేసర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1982-87 వరకు చదివిన 108 మంది పూర్వవిద్యార్థులు

Published : 01 Jul 2024 03:35 IST

నాటి గురువులతో పూర్వ విద్యార్థులు

ఘట్‌కేసర్, న్యూస్‌టుడే: ఒకే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు 37 ఏళ్ల తరువాత ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. ఘట్‌కేసర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1982-87 వరకు చదివిన 108 మంది పూర్వవిద్యార్థులు ఆదివారం అన్నోజిగూడలోని ఓ హోటల్‌లో కలుసుకున్నారు. నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందంగా గడిపారు. అప్పటి గురువులను ఆహ్వానించారు. అప్పటి ప్రధానోపాధ్యాయుడు సుదర్శన్, ఉపాధ్యాయులు సింగలాచారి, కృష్ణమూర్తి, బచ్చు మారయ్య గుప్త, చింతపండు సంజీవయ్య, లక్ష్మీ నరసమ్మ, సుశీల, వెంకట్రాంరెడ్డి, రమేష్, పోచిరెడ్డి, సల్వాద్రి ఎల్లయ్యలను పూర్వ విద్యార్థులు రామిరెడ్డి, సత్యనారాయణ, నర్సింహారెడ్డి, జంగయ్యయాదవ్, వేణుగోపాల్, పద్మారావు, కేశవనాదంగౌడ్, సుధాకర్, ప్రమోద్‌గుప్తా తదితరులు  సత్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు