logo

నిరుద్యోగ జేఏసీతో చర్చలు విఫలం

గాంధీ ఆసుపత్రిలో వారం రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్‌ నాయక్‌తో ఆదివారం రాత్రి ఎమ్మెల్సీ, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, నాయకులు రియాజ్,

Updated : 01 Jul 2024 03:32 IST

బల్మూరి వెంకట్‌ కారును అడ్డుకుంటున్న ఓయూ జేఏసీ ఛైర్మన్‌ సురేశ్‌ యాదవ్,  బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేశ్, విద్యార్థి నాయకులు 

గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: గాంధీ ఆసుపత్రిలో వారం రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్‌ నాయక్‌తో ఆదివారం రాత్రి ఎమ్మెల్సీ, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, నాయకులు రియాజ్, మానవతారాయ్‌ తదితరులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.  మోతీలాల్‌తో చర్చలు జరిపేందుకు రావటంతో ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆసుపత్రి ప్రధాన భవనం లోనికి వెళ్లే ద్వారం వరకు నేతలను వెంబడించి నిలువరించే ప్రయత్నం చేయటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని నిరుద్యోగులను శాంతపర్చి, నేతలను లోనికి పంపించారు. లోపలికి వెళ్లిన నేతలు రెండు గంటలపాటు అతడితో డిమాండ్లపై చర్చించారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడతామని, దీక్ష విరమించాలని కోరారు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల, గ్రూపు ఉద్యోగాల్లో పోస్టులు పెంపుపై స్పష్టమైన హామీ ఇచ్చేవరకు దీక్ష సాగిస్తానని చెప్పడంతో వీరి ప్రయత్నం విఫలమైంది. ఆసుపత్రి బయట వందలాది నిరుద్యోగులు గుమిగూడి నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేశారు. ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలపై స్పందించకపోతే పెద్దఎత్తున ఆందోళనకు సిద్ధమని నిరుద్యోగ జేఏసీ నాయకులు హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని