అరచేతిలో ఆట.. ఉపాధికి బాట
హైదరాబాద్ను గేమింగ్పరంగానూ హబ్గా మార్చేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు మొబైల్ ఆటలను విదేశాల్లో అక్కడి థీమ్స్తో తయారు చేసేవారు.
మొబైల్ గేమింగ్కు పెరుగుతున్న ప్రాచుర్యం
హైదరాబాద్ హబ్గా మారేందుకు అవకాశాలు
ఇమేజ్ టవర్లో స్టూడియోలు, అంకుర సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహం
మైదానంలో కాళ్లు ఆడించడం తగ్గించేసి ఇప్పుడంతా ఫోన్లలోనే మెరుపు వేగంతో ఆటలు ఆడేస్తున్నారు. సరదాగా ఆడిన ఆటలు కొందరిని గేమర్గా మారేలా చేస్తున్నాయి. లక్షల మందిని దాటుకుని కొందరు గేమర్లు తమ ప్రతిభతో అబ్బురపరుస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో అలాంటి జాతీయ స్థాయి బాటిల్ గ్రౌండ్ మొబైల్ సిరీస్ పోటీ జరుగుతోంది.
ఇమేజ్ టవర్ నమూనా
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ను గేమింగ్పరంగానూ హబ్గా మార్చేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు మొబైల్ ఆటలను విదేశాల్లో అక్కడి థీమ్స్తో తయారు చేసేవారు. ఇప్పుడు మన నేపథ్యానికి తగ్గ ఆటలు మనవాళ్లతో ఇక్కడే డిజైన్ చేయిస్తున్నాయి. ఇందుకు డెవలపర్లు, స్టూడియోలు కావాలి. అంకుర సంస్థల ఏర్పాటుకు ఇంక్యుబేటర్లు కావాలి. రాయదుర్గంలో భారీ ఎత్తున ఇమేజ్ టవర్ సిద్ధమవుతోంది. 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలు గేమింగ్, యానిమేషన్ కోసం తీర్చిదిద్దుతున్నారు. దీని రాకతో కొత్తగా సుమారు 20వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ రంగంలో 2025 నాటికి 2.5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉంటాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
హైటెక్స్లో బీజీఐఎస్ పోటీల్లో గేమర్లు
- భారత్లో గేమింగ్ మార్కెట్ ఏటా 20 శాతం వృద్ధితో 2028 నాటికి 7.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
- 2023 ఆర్థిక సంవత్సరంలో 15.4 బిలియన్ల భారతీయులు గేమ్స్ డౌన్లోడ్ చేసుకున్నారు.
- మన దేశంలో 568 మిలియన్ల మంది మొబైల్ గేమర్లు ఉన్నారు.
- మొబైల్ గేమ్ డౌన్లోడ్లలో మనదే అగ్రస్థానం.
- చైనా తర్వాత ఎక్కువ మంది మొబైల్ గేమర్లు భారత్లోనే ఉన్నారు.
- 2021లో 1.5 లక్షలున్న ఈ స్పోర్ట్స్ గేమర్లు 2022 నాటికి 6 లక్షలకు చేరుకున్నారు. 2027 నాటికి 1.5 మిలియన్లకు చేరుకుంటారని అంచనా.
భారత్ ఇతివృత్తం నేపథ్యంగా గేమ్స్
తమ సంస్థ భారత్లో 2021లో అడుగు పెట్టింది. 160 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాం. వచ్చే రెండు మూడేళ్లలో మరో 150 కోట్లను ఇండియాలో పెట్టుబడి పెట్టనున్నట్లు గత ఆగస్టులో ప్రకటించాం. ఇటీవల క్రాఫ్టన్ ఇండియా గేమింగ్ ఇక్యుబేటర్ ని ఏర్పాటు చేశాం. ఇటీవల బుల్లెట్ ఎకో ఇండియా, గరుగ సాగా భారత్ నేపథ్యం ఉన్న ఇతివృత్తంతో విడుదల చేసిన గేమ్స్కు మంచి స్పందన వచ్చింది.
కరణ్ పాఠక్, అసోసియేట్ డైరెక్టర్, ఈస్పోర్ట్స్, క్రాఫ్టన్
తల్లిదండ్రులు ఆందోళన చెందినా...
నేను కొన్ని గేమ్స్ ఆడిన తర్వాత వీటిపై ఆసక్తి ఏర్పడింది. ఆడేటప్పుడు ఉత్సాహం, వ్యూహాలతో పాటు విభిన్న ప్రపంచంలో లీనమయ్యే అనుభూతి కలుగుతుంది. తరువాత గేమింగ్ అభిరుచిగా మారింది. ఈ రంగం కెరీర్ అంటే మొదట తల్లిదండ్రులు కంగారు పడ్డారు. పరిశ్రమ పెరుగుతున్న తీరు, ఈ స్పోర్ట్స్, గేమ్ డెవలప్మెంట్ పాత్రల పెరుగుదలతో వస్తున్న అవకాశాలను చూసి ఇప్పుడు వారు అర్థం చేసుకున్నారు.
ఈవిల్, ఇన్సెన్ ఈస్పోర్ట్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిరవధిక నిరాహార దీక్ష విరమించిన ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్
[ 02-07-2024]
ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత మోతీలాల్ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దానిని విరమిస్తున్నట్లు ప్రకటించారు. -
ఆమ్రపాలి పగ్గాలు చేపట్టినా.. నిమ్మకు నీరెత్తినట్లే జీహెచ్ఎంసీ అధికారులు!
[ 02-07-2024]
రాజధానిలో పారిశుద్ధ్యం రోడ్ల మీదకు చేరి అన్ని ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. -
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. ఎస్సార్నగర్లో ఘటన
[ 02-07-2024]
పెళ్లి చేసుకోవడానికి వరుడిని వెతుకుతున్న యువతికి యాప్ ద్వారా పరిచయమైన ఓ ప్రబుద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. -
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
[ 02-07-2024]
ఉన్నతాధికారుల నిర్లక్ష్యమో...అమ్యామ్యాలకు ఆ కార్యాలయం నిలయంగా మారడమో కానీ అక్కడి కొంతమంది అధికారులు చేసే దందాకు లెక్కేలేకుండా పోతోంది. -
విమాన టిక్కెట్ల రద్దు.. ప్రయాణికుడికి అసౌకర్యం
[ 02-07-2024]
ప్రయాణికురాలి ప్రమేయం లేకుండా టిక్కెట్లు రద్దుచేసి అసౌకర్యాన్ని కలిగించిన ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో ఎయిర్లైన్స్)కు రంగారెడ్డి వినియోగదారుల కమిషన్ మొట్టికాయలు వేసింది. -
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
[ 02-07-2024]
నగరంలో ఓ ఐపీఎస్, ఎమ్మెల్యే మధ్య వ్యవహారం అటు పోలీసు శాఖలో అటు ప్రజా ప్రతినిధులలో చర్చనీయాంశం అవుతోంది. -
ఒక్క సందేశంతో ఫిర్యాదు
[ 02-07-2024]
కేసు నమోదు చేసినా.. బాధితుల చేతికి ఎఫ్ఐఆర్ వచ్చేందుకు రోజుల తరబడి ఎదురుచూపులు.. కేసు దర్యాప్తు ఏ స్థితిలో ఉందో.. నిందితుల్ని అరెస్టు చేశారో లేదో తెలియని పరిస్థితి.. -
సొంతింటి ఆశ.. కేటుగాళ్ల మాయ
[ 02-07-2024]
సకల హంగులతో కార్యాలయాలు.. ఆకట్టుకునేలా బ్రోచర్లు.. వందల కోట్ల ఎకరాల భూములు తమ పరిధిలో ఉన్నాయంటూ ప్రకటనలు. -
నిబంధనలు అవుట్!
[ 02-07-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఆపరేటర్లు అదును చిక్కితే చాలు తమ చేతివాటం చూపించి అడ్డదారుల్లో ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు. -
పేదలకు అండగా సర్కారు దవాఖానా ఉందిగా
[ 02-07-2024]
అండాశయ కేన్సర్తో బాధపడుతున్న ఓ మహిళను కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రముఖ కేన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. -
పీల్చే గాలే పిప్పి చేస్తోంది
[ 02-07-2024]
నగరంలో పెరుగుతున్న కాలుష్యం నిశ్శబ్ద హంతకిగా మారుతోంది. క్రమక్రమంగా విషవాయువులు పీలుస్తున్న జనాలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. -
చిన్న మొత్తాలపై.. చిన్నచూపు
[ 02-07-2024]
సైబర్ నేరాలను కొందరు పోలీసులు చిన్నచూపు చూస్తున్నారు. -
పరిశ్రమలకు ప్రోత్సాహం.. ఉపాధికి ఊతం
[ 02-07-2024]
యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఓవైపు శకి క్యాంటిన్ల నిర్వహణతో పాటు స్టార్టప్లను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతోంది. -
వివాహేతర సంబంధానికి ఒత్తిడి తెచ్చాడని అంతమొందించారు
[ 02-07-2024]
వివాహేతర సంబంధం కోసం గృహిణిపై ఒత్తిడి తీసుకురావడంతోనే దుబాయ్ ఇంజినీరు హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. -
పుట్టిన రోజునే వృద్ధురాలి అంత్యక్రియలు
[ 02-07-2024]
తల్లి పుట్టిన రోజు జరపాల్సిన రోజు ఆమె అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం తీవ్ర విషాదానికి గురిచేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీషర్ట్, చిరిగిన జీన్స్ ధరించి కాలేజీకి రావొద్దు!
-
మీకు వచ్చింది 99/100 కాదు.. 99/543: కాంగ్రెస్పై మోదీ సెటైర్లు
-
‘నీపై దయచూపడమా..?’: కుమార్తె గర్భానికి కారణమైన తండ్రికి 101 ఏళ్ల జైలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ముంబయి అల్లర్ల నిందితుడు.. 31 ఏళ్ల తర్వాత చిక్కాడు!
-
తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీకి ఏర్పాట్లు