ఎవరి దారి వారిదే
ఏదైనా పని చేపట్టే ముందు భవిష్యత్తునూ ఆలోచించాలి. శాఖల మధ్య సమన్వయం ఉండాలి.. ఇవేవీ పట్టించుకోకుండా వ్యవహరిస్తే ప్రజాధనం వృథా అవుతుంది.
ఎన్హెచ్, మెట్రోమధ్య సమన్వయ లోపం
ఒకే మార్గంలో రెండేసిసార్లు పనులతో ప్రజాధనం వృథా
వనస్థలిపురంలో జాతీయ రహదారుల సంస్థ మొదలెట్టిన పైవంతెన పనులు
ఈనాడు, హైదరాబాద్: ఏదైనా పని చేపట్టే ముందు భవిష్యత్తునూ ఆలోచించాలి. శాఖల మధ్య సమన్వయం ఉండాలి.. ఇవేవీ పట్టించుకోకుండా వ్యవహరిస్తే ప్రజాధనం వృథా అవుతుంది. ఇందుకు మెట్రో, జాతీయ రహదారుల సంస్థ తీరే నిదర్శనం. వనస్థలిపురంలో జాతీయ రహదారుల సంస్థ ఫ్లైఓవర్ నిర్మాణం మొదలెట్టింది. హయత్నగర్తో పాటూ ఈ మార్గంలో ఆరు చోట్ల అండర్ పాస్ కోసం పైవంతెనలు కట్టబోతున్నారు. ఇదే మార్గంలో మెట్రోరైలు విస్తరణ ప్రతిపాదనలు ఉన్నాయి. రెండు పనులు ఒకేసారి చేస్తే.. కనీసం స్తంభాల వరకైనా వేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి. జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థ సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ ఎవరి దారి వారు చూసుకున్నారు. ఎన్హెచ్ ఇప్పటికే పైవంతెన కోసం స్తంభాల పనులు మొదలెట్టింది. మెట్రో రైలు అధికారులేమో ఇప్పుడు వారితో చర్చలకు పూనుకున్నారు.
ప్రత్యామ్నాయాల కోసం సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పుడిక ఫ్లైఓవర్ పక్క నుంచి తప్ప మెట్రోకి మరో మార్గం లేదు. ఫలితంగా రహదారి ఇరుకుగా మారనుంది. చందానగర్-రాంచంద్రాపురం మార్గంలోనూ ఇదే సమస్య. ప్రభుత్వం చొరవ చూపకపోవడం, శాఖల మధ్య సమన్వయ లోపం, ముందుచూపు కొరవడడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
అప్పటి మంత్రి ఆదేశించినా..
నగరంలో జాతీయ రహదారులపై పైవంతెనలు నిర్మిస్తే అదే మార్గంలో మెట్రోరైలు ప్రతిపాదనలు ఉంటే సమన్వయం చేసుకోవాలని గతంలో ఆ శాఖ కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ అధికారులను ఆదేశించారు. అవసరమైతే డబుల్ డెక్ ఫ్లైఓవర్ డిజైన్లు రూపొందించాలని సూచించారు. మొదటి అంతస్తులో వాహనాల కోసం.. ఆపైన రెండో అంతస్తులో మెట్రో వెళ్లేలా డిజైన్ను పరిశీలించాలని చెప్పారు. దీంతో ఎన్హెచ్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి, మెట్రోరైలు సంస్థకి లేఖలు రాశారు. జాతీయ రహదారులపై మెట్రో విస్తరణ ప్రణాళికలు ఉంటే వాటి డిజైన్లు పంపాలని కోరారు. మెట్రోరైలు సంస్థ స్పందించకపోవడంతో ఎన్హెచ్ సంస్థ వారి పనులను ఒక్కోటిగా మొదలెట్టింది. ప్రభుత్వం ఆదేశించి డీపీఆర్ రూపొందిస్తే తప్ప తమ దగ్గర డిజైన్లు ఎలా ఉంటాయనేది మెట్రో వాదన. దీనిపై సర్కారు నుంచి విధానపరమైన నిర్ణయం లేకపోవడమూ లోపమే.
ప్రణాళిక లేకుండా..
- జాతీయ రహదారిపై చందానగర్ నుంచి రాంచంద్రాపురం వరకు పైవంతెన పనులు ఏడాది కిందట మొదలయ్యాయి. ఇదే మార్గంలో మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్, అక్కడి నుంచి పటాన్చెరు ఓఆర్ఆర్ వరకు మెట్రో ప్రతిపాదనలు ఉన్నాయి. ఎన్హెచ్ సంస్థ డబుల్ డెక్ డిజైన్ల కోసం ఎదురుచూసినా మెట్రోరైలు సంస్థ సమకూర్చలేకపోయింది. దీంతో జాతీయ రహదారుల సంస్థ ఫ్లైఓవర్ పనులను చేపట్టింది.
- ఎల్బీనగర్, హయత్నగర్ మార్గంలో జాతీయ రహదారుల సంస్థ ఫ్లైఓవర్లను చేపడుతోంది. మెట్రో విస్తరణ ప్రణాళికలూ ఈ మార్గంలో ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి చేయాలని స్థానిక ప్రజలు, కొంతమంది అధికారులు మెట్రోరైలు సంస్థ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. ఇప్పుడు మెట్రో వద్ద ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు ప్రాథమికంగా రూపొందించిన డీపీఆర్ ఉంది.
- వనస్థలిపురం మార్గంలో నిర్మించేవి వాహనాల అండర్పాస్ వంతెనలని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికీ డివైడర్ భాగంలో మెట్రో స్తంభాలకు అవకాశం ఉంటుందని అంటున్నారు. కానీ స్తంభాలు వేయాలంటే డీపీఆర్కు సర్కారు, కేంద్రం ఆమోదం వేయాలి. నిధులు కావాలి. అప్పటివరకు జాతీయ రహదారుల సంస్థ ఆగే పరిస్థితి ఉండదు.
గతంలో ఎస్ఆర్డీపీలోనూ...
బీహెచ్ఈఎల్ నుంచి వయా కొండాపూర్ మీదుగా లక్డీకాపూల్ మెట్రో ప్రతిపాదన ఉండేది. ఇక్కడ ఎస్ఆర్డీపీలో ఫ్లైఓవర్లు నిర్మించారు. మెట్రోకు సంబంధించి డీపీఆర్ కూడా సిద్ధమైంది. ఎస్ఆర్డీపీ ప్రాజెక్ట్తో సమన్వయం చేసిఉంటే మెట్రో వచ్చేది. నిధుల సమస్యతో చేపట్టలేదు. సర్కారు పైవంతెనలకే మొగ్గుచూపింది. ఇప్పుడు ఇక్కడ మెట్రో చేపట్టాలంటే భారీగా ఆస్తుల సేకరణ చేయాలి. దీంతో అటకెక్కించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమ్రపాలి పగ్గాలు చేపట్టినా.. నిమ్మకు నీరెత్తినట్లే జీహెచ్ఎంసీ అధికారులు!
[ 02-07-2024]
రాజధానిలో పారిశుద్ధ్యం రోడ్ల మీదకు చేరి అన్ని ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. -
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. ఎస్సార్నగర్లో ఘటన
[ 02-07-2024]
పెళ్లి చేసుకోవడానికి వరుడిని వెతుకుతున్న యువతికి యాప్ ద్వారా పరిచయమైన ఓ ప్రబుద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. -
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
[ 02-07-2024]
ఉన్నతాధికారుల నిర్లక్ష్యమో...అమ్యామ్యాలకు ఆ కార్యాలయం నిలయంగా మారడమో కానీ అక్కడి కొంతమంది అధికారులు చేసే దందాకు లెక్కేలేకుండా పోతోంది. -
విమాన టిక్కెట్ల రద్దు.. ప్రయాణికుడికి అసౌకర్యం
[ 02-07-2024]
ప్రయాణికురాలి ప్రమేయం లేకుండా టిక్కెట్లు రద్దుచేసి అసౌకర్యాన్ని కలిగించిన ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో ఎయిర్లైన్స్)కు రంగారెడ్డి వినియోగదారుల కమిషన్ మొట్టికాయలు వేసింది. -
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
[ 02-07-2024]
నగరంలో ఓ ఐపీఎస్, ఎమ్మెల్యే మధ్య వ్యవహారం అటు పోలీసు శాఖలో అటు ప్రజా ప్రతినిధులలో చర్చనీయాంశం అవుతోంది. -
ఒక్క సందేశంతో ఫిర్యాదు
[ 02-07-2024]
కేసు నమోదు చేసినా.. బాధితుల చేతికి ఎఫ్ఐఆర్ వచ్చేందుకు రోజుల తరబడి ఎదురుచూపులు.. కేసు దర్యాప్తు ఏ స్థితిలో ఉందో.. నిందితుల్ని అరెస్టు చేశారో లేదో తెలియని పరిస్థితి.. -
సొంతింటి ఆశ.. కేటుగాళ్ల మాయ
[ 02-07-2024]
సకల హంగులతో కార్యాలయాలు.. ఆకట్టుకునేలా బ్రోచర్లు.. వందల కోట్ల ఎకరాల భూములు తమ పరిధిలో ఉన్నాయంటూ ప్రకటనలు. -
నిబంధనలు అవుట్!
[ 02-07-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఆపరేటర్లు అదును చిక్కితే చాలు తమ చేతివాటం చూపించి అడ్డదారుల్లో ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు. -
పేదలకు అండగా సర్కారు దవాఖానా ఉందిగా
[ 02-07-2024]
అండాశయ కేన్సర్తో బాధపడుతున్న ఓ మహిళను కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రముఖ కేన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. -
పీల్చే గాలే పిప్పి చేస్తోంది
[ 02-07-2024]
నగరంలో పెరుగుతున్న కాలుష్యం నిశ్శబ్ద హంతకిగా మారుతోంది. క్రమక్రమంగా విషవాయువులు పీలుస్తున్న జనాలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. -
చిన్న మొత్తాలపై.. చిన్నచూపు
[ 02-07-2024]
సైబర్ నేరాలను కొందరు పోలీసులు చిన్నచూపు చూస్తున్నారు. -
పరిశ్రమలకు ప్రోత్సాహం.. ఉపాధికి ఊతం
[ 02-07-2024]
యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఓవైపు శకి క్యాంటిన్ల నిర్వహణతో పాటు స్టార్టప్లను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతోంది. -
వివాహేతర సంబంధానికి ఒత్తిడి తెచ్చాడని అంతమొందించారు
[ 02-07-2024]
వివాహేతర సంబంధం కోసం గృహిణిపై ఒత్తిడి తీసుకురావడంతోనే దుబాయ్ ఇంజినీరు హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. -
పుట్టిన రోజునే వృద్ధురాలి అంత్యక్రియలు
[ 02-07-2024]
తల్లి పుట్టిన రోజు జరపాల్సిన రోజు ఆమె అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం తీవ్ర విషాదానికి గురిచేసింది.