దేశ భద్రతకు నూతన సాంకేతిక ఆవిష్కరణలు దోహదం
ప్రపంచం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకు దూసుకెళ్తున్న ప్రస్తుత తరుణంలో ఎంసీఈఎంఈలో శిక్షణను పూర్తిచేసుకున్న యువ అధికారులు సాంకేతికంగా అన్ని అంశాల్లో భారత సైన్యం పటిష్టపడేలా కృషిచేయాలని
స్టూడెంట్ ఆఫీసర్లతో రమేష్ కంచర్ల, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్, అధీష్ సిన్హా
కంటోన్మెంట్, న్యూస్టుడే: ప్రపంచం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకు దూసుకెళ్తున్న ప్రస్తుత తరుణంలో ఎంసీఈఎంఈలో శిక్షణను పూర్తిచేసుకున్న యువ అధికారులు సాంకేతికంగా అన్ని అంశాల్లో భారత సైన్యం పటిష్టపడేలా కృషిచేయాలని రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రి సీఎండీ డాక్టర్ రమేశ్ కంచర్ల అన్నారు. తిరుమలగిరిలోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసీఈఎంఈ) ఆడిటోరియంలో శనివారం టెక్నికల్ ఎంట్రీ స్కీం (టీఈఎస్)-41కోర్సు 105వ స్నాతకోత్సవం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ రమేశ్ కంచర్ల, ఎంసీఈఎంఈ కమాండెంట్, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వార్స్నేతో కలిసి కోర్సులో శిక్షణను పూర్తి చేసుకున్న భారత యువ అధికారులతోపాటు స్నేహపూర్వక దేశాలైన రాయల్ భూటాన్, శ్రీలంకలకు చెందిన అధికారులకు బీటెక్ డిగ్రీ పట్టాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. భారత సైన్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వృద్ధిచేసి సైన్యాన్ని పటిష్ఠం చేసే దిశగా యువ అధికారులు కృషి చేయాలని సూచించారు. శిక్షణకాలంలో ప్రతిభను కనబరిచిన లెఫ్టినెంట్ థోరట్ సందేశ్ సంజయ్, లెఫ్టినెంట్ హర్షిద్ ద్వివేదిలకు కమాండెంట్స్ రజత పతకాలు, డీజీఈఎంఈ బంగారు పతకం, జీవోసీ-ఇన్-ఆర్ట్రాక్ ట్రోఫీ, బుక్ప్రైజ్లను అందజేశారు. ఎయిర్ మార్షల్ శ్రీనివాస్తోపాటు వివిధ విభాగాల అధికారులు, యువ అధికారుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమాన టిక్కెట్ల రద్దు.. ప్రయాణికుడికి అసౌకర్యం
[ 02-07-2024]
ప్రయాణికురాలి ప్రమేయం లేకుండా టిక్కెట్లు రద్దుచేసి అసౌకర్యాన్ని కలిగించిన ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో ఎయిర్లైన్స్)కు రంగారెడ్డి వినియోగదారుల కమిషన్ మొట్టికాయలు వేసింది. -
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
[ 02-07-2024]
ఉన్నతాధికారుల నిర్లక్ష్యమో...అమ్యామ్యాలకు ఆ కార్యాలయం నిలయంగా మారడమో కానీ అక్కడి కొంతమంది అధికారులు చేసే దందాకు లెక్కేలేకుండా పోతోంది. -
పగ్గాలు చేపట్టినా.. నిద్రాణంలో పాలన
[ 02-07-2024]
రాజధానిలో పారిశుద్ధ్యం రోడ్ల మీదకు చేరి అన్ని ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. -
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. కేసు నమోదు
[ 02-07-2024]
పెళ్లి చేసుకోవడానికి వరుడిని వెతుకుతున్న యువతికి యాప్ ద్వారా పరిచయమైన ఓ ప్రబుద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. -
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
[ 02-07-2024]
నగరంలో ఓ ఐపీఎస్, ఎమ్మెల్యే మధ్య వ్యవహారం అటు పోలీసు శాఖలో అటు ప్రజా ప్రతినిధులలో చర్చనీయాంశం అవుతోంది. -
ఒక్క సందేశంతో ఫిర్యాదు
[ 02-07-2024]
కేసు నమోదు చేసినా.. బాధితుల చేతికి ఎఫ్ఐఆర్ వచ్చేందుకు రోజుల తరబడి ఎదురుచూపులు.. కేసు దర్యాప్తు ఏ స్థితిలో ఉందో.. నిందితుల్ని అరెస్టు చేశారో లేదో తెలియని పరిస్థితి.. -
సొంతింటి ఆశ.. కేటుగాళ్ల మాయ
[ 02-07-2024]
సకల హంగులతో కార్యాలయాలు.. ఆకట్టుకునేలా బ్రోచర్లు.. వందల కోట్ల ఎకరాల భూములు తమ పరిధిలో ఉన్నాయంటూ ప్రకటనలు. -
నిబంధనలు అవుట్!
[ 02-07-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఆపరేటర్లు అదును చిక్కితే చాలు తమ చేతివాటం చూపించి అడ్డదారుల్లో ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు. -
పేదలకు అండగా సర్కారు దవాఖానా ఉందిగా
[ 02-07-2024]
అండాశయ కేన్సర్తో బాధపడుతున్న ఓ మహిళను కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రముఖ కేన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. -
పీల్చే గాలే పిప్పి చేస్తోంది
[ 02-07-2024]
నగరంలో పెరుగుతున్న కాలుష్యం నిశ్శబ్ద హంతకిగా మారుతోంది. క్రమక్రమంగా విషవాయువులు పీలుస్తున్న జనాలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. -
చిన్న మొత్తాలపై.. చిన్నచూపు
[ 02-07-2024]
సైబర్ నేరాలను కొందరు పోలీసులు చిన్నచూపు చూస్తున్నారు. -
పరిశ్రమలకు ప్రోత్సాహం.. ఉపాధికి ఊతం
[ 02-07-2024]
యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఓవైపు శకి క్యాంటిన్ల నిర్వహణతో పాటు స్టార్టప్లను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతోంది. -
వివాహేతర సంబంధానికి ఒత్తిడి తెచ్చాడని అంతమొందించారు
[ 02-07-2024]
వివాహేతర సంబంధం కోసం గృహిణిపై ఒత్తిడి తీసుకురావడంతోనే దుబాయ్ ఇంజినీరు హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. -
పుట్టిన రోజునే వృద్ధురాలి అంత్యక్రియలు
[ 02-07-2024]
తల్లి పుట్టిన రోజు జరపాల్సిన రోజు ఆమె అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం తీవ్ర విషాదానికి గురిచేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
లోక్సభ ప్యానెల్ స్పీకర్గా తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు