కొలనోస్కోపీతో పేగు క్యాన్సర్కు ముందే నిర్ధారణ
జీర్ణకోశ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా గతంతో పోల్చితే పెద్ద పేగు, కాలేయ, క్లోమగ్రంథి క్యాన్సర్లు పెరుగుతున్న దృష్ట్యా ముందే పరీక్షలు చేయించుకుంటే అడ్డుకట్ట వేయవచ్చునన్నారు.
మాట్లాడుతున్న డా. గురు ఎన్ రెడ్డి. చిత్రంలో ప్రొ.అన్నా షుహ్, ప్రొ.శ్రవణ్కుమార్, ప్రొ.జాన్ కీసీల్, డా.జగన్నాథ్, ప్రొ.ప్రసాద్ అయ్యర్
ఈనాడు, హైదరాబాద్: జీర్ణకోశ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా గతంతో పోల్చితే పెద్ద పేగు, కాలేయ, క్లోమగ్రంథి క్యాన్సర్లు పెరుగుతున్న దృష్ట్యా ముందే పరీక్షలు చేయించుకుంటే అడ్డుకట్ట వేయవచ్చునన్నారు. నగరంలోని నానక్రాంగూడ కాంటినెంటల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల గ్యాస్ట్రోఎంటరాలజీ సదస్సు సందర్భంగా పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అమెరికాలోని మయోక్లినిక్ ప్రొఫెసర్ జాన్ కీసీల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కొలనోస్కోపీతో పెద్దపేగు క్యాన్సర్ను గుర్తిస్తున్నామని, మున్ముందు రోగి నుంచి సేకరించిన మలం పరీక్షించి పెద్దపేగు క్యాన్సర్ గుట్టురట్టు చేయవచ్చు అన్నారు. కాంటినెంటల్ ఆసుపత్రి ఛైర్మన్ డా.గురు ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్దపేగు క్యాన్సర్ తగ్గదనేది అపోహ మాత్రమేనని, ప్రస్తుత అధునాతన చికిత్సలతో 1, 2 దశల్లో ఉన్న క్యాన్సర్ రోగులకు పూర్తిగా నియంత్రించే అవకాశం ఉందన్నారు. పేగుల్లో ఎలాంటి కణుతులు లేనట్లు పరీక్షల్లో తేలితే...మళ్లీ పదేళ్ల వరకు కొలనోస్కోపీ అవసరం లేదన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ అన్నా షుహ్ మాట్లాడుతూ.. ఒక్క రక్తపు బొట్టుతో అన్ని రకాల క్యాన్సర్లను గుర్తించే ఆధునిక పరీక్షలు అందుబాటులోకి రానున్నాయన్నారు. జీనోమ్ సీక్వెన్సీ ద్వారా క్యాన్సర్ల గుట్టును రట్టు చేయవచ్చునని తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ప్రొ.ప్రసాద్ అయ్యర్, క్యాన్సర్ నిపుణులు డాక్టర్ పి.జగన్నాథ్, గాంధీ ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ శ్రవణ్ తదితరులు మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిరవధిక నిరాహార దీక్ష విరమించిన ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్
[ 02-07-2024]
ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత మోతీలాల్ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దానిని విరమిస్తున్నట్లు ప్రకటించారు. -
ఆమ్రపాలి పగ్గాలు చేపట్టినా.. నిమ్మకు నీరెత్తినట్లే జీహెచ్ఎంసీ అధికారులు!
[ 02-07-2024]
రాజధానిలో పారిశుద్ధ్యం రోడ్ల మీదకు చేరి అన్ని ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. -
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. ఎస్సార్నగర్లో ఘటన
[ 02-07-2024]
పెళ్లి చేసుకోవడానికి వరుడిని వెతుకుతున్న యువతికి యాప్ ద్వారా పరిచయమైన ఓ ప్రబుద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. -
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
[ 02-07-2024]
ఉన్నతాధికారుల నిర్లక్ష్యమో...అమ్యామ్యాలకు ఆ కార్యాలయం నిలయంగా మారడమో కానీ అక్కడి కొంతమంది అధికారులు చేసే దందాకు లెక్కేలేకుండా పోతోంది. -
విమాన టిక్కెట్ల రద్దు.. ప్రయాణికుడికి అసౌకర్యం
[ 02-07-2024]
ప్రయాణికురాలి ప్రమేయం లేకుండా టిక్కెట్లు రద్దుచేసి అసౌకర్యాన్ని కలిగించిన ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో ఎయిర్లైన్స్)కు రంగారెడ్డి వినియోగదారుల కమిషన్ మొట్టికాయలు వేసింది. -
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
[ 02-07-2024]
నగరంలో ఓ ఐపీఎస్, ఎమ్మెల్యే మధ్య వ్యవహారం అటు పోలీసు శాఖలో అటు ప్రజా ప్రతినిధులలో చర్చనీయాంశం అవుతోంది. -
ఒక్క సందేశంతో ఫిర్యాదు
[ 02-07-2024]
కేసు నమోదు చేసినా.. బాధితుల చేతికి ఎఫ్ఐఆర్ వచ్చేందుకు రోజుల తరబడి ఎదురుచూపులు.. కేసు దర్యాప్తు ఏ స్థితిలో ఉందో.. నిందితుల్ని అరెస్టు చేశారో లేదో తెలియని పరిస్థితి.. -
సొంతింటి ఆశ.. కేటుగాళ్ల మాయ
[ 02-07-2024]
సకల హంగులతో కార్యాలయాలు.. ఆకట్టుకునేలా బ్రోచర్లు.. వందల కోట్ల ఎకరాల భూములు తమ పరిధిలో ఉన్నాయంటూ ప్రకటనలు. -
నిబంధనలు అవుట్!
[ 02-07-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఆపరేటర్లు అదును చిక్కితే చాలు తమ చేతివాటం చూపించి అడ్డదారుల్లో ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు. -
పేదలకు అండగా సర్కారు దవాఖానా ఉందిగా
[ 02-07-2024]
అండాశయ కేన్సర్తో బాధపడుతున్న ఓ మహిళను కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రముఖ కేన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. -
పీల్చే గాలే పిప్పి చేస్తోంది
[ 02-07-2024]
నగరంలో పెరుగుతున్న కాలుష్యం నిశ్శబ్ద హంతకిగా మారుతోంది. క్రమక్రమంగా విషవాయువులు పీలుస్తున్న జనాలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. -
చిన్న మొత్తాలపై.. చిన్నచూపు
[ 02-07-2024]
సైబర్ నేరాలను కొందరు పోలీసులు చిన్నచూపు చూస్తున్నారు. -
పరిశ్రమలకు ప్రోత్సాహం.. ఉపాధికి ఊతం
[ 02-07-2024]
యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఓవైపు శకి క్యాంటిన్ల నిర్వహణతో పాటు స్టార్టప్లను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతోంది. -
వివాహేతర సంబంధానికి ఒత్తిడి తెచ్చాడని అంతమొందించారు
[ 02-07-2024]
వివాహేతర సంబంధం కోసం గృహిణిపై ఒత్తిడి తీసుకురావడంతోనే దుబాయ్ ఇంజినీరు హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. -
పుట్టిన రోజునే వృద్ధురాలి అంత్యక్రియలు
[ 02-07-2024]
తల్లి పుట్టిన రోజు జరపాల్సిన రోజు ఆమె అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం తీవ్ర విషాదానికి గురిచేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మాకు 80 సీట్లు వచ్చినా ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్ యాదవ్
-
రెవెన్యూ రికవరీ యాక్ట్తో వైకాపా నేతల అక్రమార్జనను రాబట్టాలి: చంద్రబాబుకు యనమల లేఖ
-
ఆ యాప్స్లో కరెంట్ బిల్లులు చెల్లించలేరు.. కారణం ఇదే..!
-
అమెరికాలో బిలియన్ డాలర్ల స్కామ్లో భారతీయులకు జైలు
-
కాకినాడ కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష