స్వస్థలాలకు కార్మికుల మృతదేహాలు
షాద్నగర్ నియోజకవర్గం బూర్గుల శివారులో సౌత్గ్లాస్ పరిశ్రమలో శుక్రవారం పేలుడు ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం శనివారం ఉస్మానియాకి తరలించారు.
పోలీసుల నుంచి సంఘటన వివరాలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్నగర్, షాద్నగర్ న్యూటౌన్: షాద్నగర్ నియోజకవర్గం బూర్గుల శివారులో సౌత్గ్లాస్ పరిశ్రమలో శుక్రవారం పేలుడు ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం శనివారం ఉస్మానియాకి తరలించారు. ఈ ఘటనలో 5గురు చనిపోగా 13మంది గాయపడ్డారు. ఘటనాస్థలంలో మృతుల శరీర భాగాలు ముక్కలయ్యాయి. వీటిని డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీవా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులకు ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. మృతుల్లో నికిత్కుమార్, రామ్సేథ్ ఉత్తర్ప్రదేశ్కు, రామ్ప్రకాష్, చిత్తరంజన్ బిహార్కు, రథీకాంత్ ఒడిశాకు చెందినవారు.వీరి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.
యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం: యాజమాన్యాలు కనీస రక్షణచర్యలు పాటించకపోవడంతోనే తరచూ పరిశ్రమల్లో దారుణాలు చోటు చేసుకుంటున్నాయని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం బూర్గుల పరిధిలోని సౌత్గ్లాస్ పరిశ్రమను సందర్శించారు. ప్రమాదంపై సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడానని, కార్మికులకు పరిహారం ఇప్పించే ఏర్పాటు చేస్తానన్నారు. అనంతరం వీవా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించారు. ఎమ్మెల్సీ నవీన్రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. యాజమాన్యంపై హత్యానేరం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భాజపా నేతలు విష్ణువర్దన్రెడ్డి, అందె బాబయ్య, సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షుడు సాయిబాబా, శీనునాయక్, సీపీఎం జిల్లా కార్యదర్శి మధుసూదన్రెడ్డి, సామెల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
పోలీసుల తీరుపై ఆగ్రహం: పరిశ్రమలో సంఘటనా స్థలం వద్ద శుక్రవారం తనతో పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ ఎమ్మెల్యే, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల వివరాలు కోరగా ఏసీపీ రంగస్వామి వాగ్వివాదానికి దిగారన్నారు. ఈ వ్యవహారంపై సైబరాబాద్ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మరోవైపు పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంపై భాజపా నేత శ్రీవర్ధన్రెడ్డి హైదరాబాద్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డిని కలిసి వివరించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆసుపత్రిలో బాధితులను పరామర్శిస్తున్న ఎమ్మెల్సీ నవీన్రెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిరవధిక నిరాహార దీక్ష విరమించిన ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్
[ 02-07-2024]
ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత మోతీలాల్ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దానిని విరమిస్తున్నట్లు ప్రకటించారు. -
ఆమ్రపాలి పగ్గాలు చేపట్టినా.. నిమ్మకు నీరెత్తినట్లే జీహెచ్ఎంసీ అధికారులు!
[ 02-07-2024]
రాజధానిలో పారిశుద్ధ్యం రోడ్ల మీదకు చేరి అన్ని ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. -
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. ఎస్సార్నగర్లో ఘటన
[ 02-07-2024]
పెళ్లి చేసుకోవడానికి వరుడిని వెతుకుతున్న యువతికి యాప్ ద్వారా పరిచయమైన ఓ ప్రబుద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. -
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
[ 02-07-2024]
ఉన్నతాధికారుల నిర్లక్ష్యమో...అమ్యామ్యాలకు ఆ కార్యాలయం నిలయంగా మారడమో కానీ అక్కడి కొంతమంది అధికారులు చేసే దందాకు లెక్కేలేకుండా పోతోంది. -
విమాన టిక్కెట్ల రద్దు.. ప్రయాణికుడికి అసౌకర్యం
[ 02-07-2024]
ప్రయాణికురాలి ప్రమేయం లేకుండా టిక్కెట్లు రద్దుచేసి అసౌకర్యాన్ని కలిగించిన ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో ఎయిర్లైన్స్)కు రంగారెడ్డి వినియోగదారుల కమిషన్ మొట్టికాయలు వేసింది. -
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
[ 02-07-2024]
నగరంలో ఓ ఐపీఎస్, ఎమ్మెల్యే మధ్య వ్యవహారం అటు పోలీసు శాఖలో అటు ప్రజా ప్రతినిధులలో చర్చనీయాంశం అవుతోంది. -
ఒక్క సందేశంతో ఫిర్యాదు
[ 02-07-2024]
కేసు నమోదు చేసినా.. బాధితుల చేతికి ఎఫ్ఐఆర్ వచ్చేందుకు రోజుల తరబడి ఎదురుచూపులు.. కేసు దర్యాప్తు ఏ స్థితిలో ఉందో.. నిందితుల్ని అరెస్టు చేశారో లేదో తెలియని పరిస్థితి.. -
సొంతింటి ఆశ.. కేటుగాళ్ల మాయ
[ 02-07-2024]
సకల హంగులతో కార్యాలయాలు.. ఆకట్టుకునేలా బ్రోచర్లు.. వందల కోట్ల ఎకరాల భూములు తమ పరిధిలో ఉన్నాయంటూ ప్రకటనలు. -
నిబంధనలు అవుట్!
[ 02-07-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఆపరేటర్లు అదును చిక్కితే చాలు తమ చేతివాటం చూపించి అడ్డదారుల్లో ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు. -
పేదలకు అండగా సర్కారు దవాఖానా ఉందిగా
[ 02-07-2024]
అండాశయ కేన్సర్తో బాధపడుతున్న ఓ మహిళను కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రముఖ కేన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. -
పీల్చే గాలే పిప్పి చేస్తోంది
[ 02-07-2024]
నగరంలో పెరుగుతున్న కాలుష్యం నిశ్శబ్ద హంతకిగా మారుతోంది. క్రమక్రమంగా విషవాయువులు పీలుస్తున్న జనాలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. -
చిన్న మొత్తాలపై.. చిన్నచూపు
[ 02-07-2024]
సైబర్ నేరాలను కొందరు పోలీసులు చిన్నచూపు చూస్తున్నారు. -
పరిశ్రమలకు ప్రోత్సాహం.. ఉపాధికి ఊతం
[ 02-07-2024]
యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఓవైపు శకి క్యాంటిన్ల నిర్వహణతో పాటు స్టార్టప్లను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతోంది. -
వివాహేతర సంబంధానికి ఒత్తిడి తెచ్చాడని అంతమొందించారు
[ 02-07-2024]
వివాహేతర సంబంధం కోసం గృహిణిపై ఒత్తిడి తీసుకురావడంతోనే దుబాయ్ ఇంజినీరు హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. -
పుట్టిన రోజునే వృద్ధురాలి అంత్యక్రియలు
[ 02-07-2024]
తల్లి పుట్టిన రోజు జరపాల్సిన రోజు ఆమె అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం తీవ్ర విషాదానికి గురిచేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీషర్ట్, చిరిగిన జీన్స్ ధరించి కాలేజీకి రావొద్దు!
-
మీకు వచ్చింది 99/100 కాదు.. 99/543: కాంగ్రెస్పై మోదీ సెటైర్లు
-
‘నీపై దయచూపడమా..?’: కుమార్తె గర్భానికి కారణమైన తండ్రికి 101 ఏళ్ల జైలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ముంబయి అల్లర్ల నిందితుడు.. 31 ఏళ్ల తర్వాత చిక్కాడు!
-
తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీకి ఏర్పాట్లు