వాయు కాలుష్యం.. కబళిస్తోంది ఆరోగ్యం
జిల్లాలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న తాండూరు పట్టణంలో గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్ ఏర్పాటు అవసరాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విస్మరించింది.
గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్ కలేనా..
కేంద్రం ప్రకటించిన జాబితాలో దక్కని చోటు
తాండూరులో 2015లో వాయు కాలుష్యాన్ని కొలిచేందుకు ఏర్పాటుచేసిన యంత్రం
న్యూస్టుడే, తాండూరు: జిల్లాలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న తాండూరు పట్టణంలో గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్ ఏర్పాటు అవసరాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విస్మరించింది. ఏళ్ల నాటి విన్నపాలు బుట్టదాఖలవుతున్నాయే తప్ప అధికారులు పట్టించుకోవడంలేదు. తాజాగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర వ్యాప్తంగా ఆమోదం తెలిపిన 40 గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్ల జాబితాల్లో తాండూరుకు చోటు లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. విమర్శలు తావిస్తోంది..
ఇక్కడే ఎందుకు అవసరమంటే..
నాపరాయి, సుద్ద, లేటరైట్ ఖనిజాల లోడ్తో రాకపోకలు నిర్వహించే వేల కొద్ది వాహనాలకు పట్టణమే అడ్డా. తద్వారా దుమ్ము, దూళి పైకి లేచి ప్రాణ వాయువు కలుషితం అవుతోంది. పట్టణానికి 10 కిలో మీటర్లకు పైగా దూరంలో ఉన్న 3 సిమెంటు కర్మాగారాల నుంచి వెలువడే వాయు కాలుష్యంతో సమీప గ్రామాల ప్రజలు ఉబ్బసం, చర్మ వ్యాధులు, ఊపిరితిత్తులు, నేత్ర సంబంధ వంటి వ్యాధులకు గురవుతున్నారు. పైర్లపై దుమ్ము, దూళి చేరడంతో దిగుబడులు తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్ ఏర్పాటైతే ఇక్కడి గాలి స్వచ్ఛమైనదా? లేదా? అనే విషయంలో స్టేషన్ సిబ్బంది స్పష్టత ఇస్తారు. ప్రజల్ని అప్రమత్తం చేస్తారు.
2015లో కాలుష్యాన్ని కొలిచిన పీసీబీ
తాండూరు పట్టణంలో 2015 డిసెంబరు 17న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి లారీ పార్కింగ్ వద్ద ప్రత్యేక పరికరం ఏర్పాటు చేసింది. ఇది ఆ రోజున మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు కాలుష్యం కొలిచింది. నేషనల్ యాంబియెంట్ ఏర్ క్వాలిటీ స్టాండర్డ్ (ఎన్ఎఎక్యూఎలస్) లెక్కల ప్రకారం 100 పీఎం (పర్టిక్యులర్ మేటర్) గాఢత 100 లోపు ఉంటే సంతృప్తికరం. కాని తాండూరులో 622గా నమోదైంది. దీంతో అప్పట్లోనే వాయు కాలుష్య నియంత్రణ యంత్రాలు ఏర్పాటు చేయాలని పీసీబీ నిర్ణయానికి వచ్చినా అది జరగలేదు. ఆ తర్వాత జాతీయ స్థాయి అధికారులు పర్యటించి నిర్ధరించినా నేటికీ అతీగతీ లేదు.
పీఎం గాఢత (నాణ్యత) ఎలా ఉండాలంటే..
- 0.5 పాయింట్లతో ఉంటే ఉత్తమం.
- 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరం.
- 100 నుంచి 200 వరకు ఉంటే మధ్యస్థం. ఇలాంటి పరిస్థితిలో ఆస్తమా, గుండె జబ్బులు, ఊపిరితిత్తులసమస్యతో బాధపడేవారికి ఇబ్బంది.
- 201 నుంచి 300 వరకు ఉంటే గాలి నాణ్యత బాగుండదు. శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతాయి.
- 301 నుంచి 400 పాయింట్లు ఉంటే గాలి అస్సలు బాగుండదు.
- 401 నుంచి 500 పాయింట్లు ఉంటే ప్రమాదకర పరిస్థితి.
ఎక్స్రేలో బయట పడుతోంది: డాక్టర్ మూర్తి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్
వాయు కాలుష్యానికి లోనైన వారు రోగాల బారిన పడి ఆసుపత్రికి వస్తున్నారు. వారికి ఎక్స్రే తీస్తున్నపుడు ఊపిరితిత్తుల్లో సమస్యలు ఉన్నట్లు గుర్తిస్తున్నాం. గనులు, నాపరాతి పాలీష్ యూనిట్లలో పనిచేస్తున్న కార్మికులు మాస్క్లు ధరించాలి. సాధారణ ప్రజలు ప్రయాణం చేయాల్సి వస్తే మాస్క్లు ధరించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిరవధిక నిరాహార దీక్ష విరమించిన ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్
[ 02-07-2024]
ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత మోతీలాల్ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దానిని విరమిస్తున్నట్లు ప్రకటించారు. -
ఆమ్రపాలి పగ్గాలు చేపట్టినా.. నిమ్మకు నీరెత్తినట్లే జీహెచ్ఎంసీ అధికారులు!
[ 02-07-2024]
రాజధానిలో పారిశుద్ధ్యం రోడ్ల మీదకు చేరి అన్ని ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. -
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. ఎస్సార్నగర్లో ఘటన
[ 02-07-2024]
పెళ్లి చేసుకోవడానికి వరుడిని వెతుకుతున్న యువతికి యాప్ ద్వారా పరిచయమైన ఓ ప్రబుద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. -
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
[ 02-07-2024]
ఉన్నతాధికారుల నిర్లక్ష్యమో...అమ్యామ్యాలకు ఆ కార్యాలయం నిలయంగా మారడమో కానీ అక్కడి కొంతమంది అధికారులు చేసే దందాకు లెక్కేలేకుండా పోతోంది. -
విమాన టిక్కెట్ల రద్దు.. ప్రయాణికుడికి అసౌకర్యం
[ 02-07-2024]
ప్రయాణికురాలి ప్రమేయం లేకుండా టిక్కెట్లు రద్దుచేసి అసౌకర్యాన్ని కలిగించిన ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో ఎయిర్లైన్స్)కు రంగారెడ్డి వినియోగదారుల కమిషన్ మొట్టికాయలు వేసింది. -
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
[ 02-07-2024]
నగరంలో ఓ ఐపీఎస్, ఎమ్మెల్యే మధ్య వ్యవహారం అటు పోలీసు శాఖలో అటు ప్రజా ప్రతినిధులలో చర్చనీయాంశం అవుతోంది. -
ఒక్క సందేశంతో ఫిర్యాదు
[ 02-07-2024]
కేసు నమోదు చేసినా.. బాధితుల చేతికి ఎఫ్ఐఆర్ వచ్చేందుకు రోజుల తరబడి ఎదురుచూపులు.. కేసు దర్యాప్తు ఏ స్థితిలో ఉందో.. నిందితుల్ని అరెస్టు చేశారో లేదో తెలియని పరిస్థితి.. -
సొంతింటి ఆశ.. కేటుగాళ్ల మాయ
[ 02-07-2024]
సకల హంగులతో కార్యాలయాలు.. ఆకట్టుకునేలా బ్రోచర్లు.. వందల కోట్ల ఎకరాల భూములు తమ పరిధిలో ఉన్నాయంటూ ప్రకటనలు. -
నిబంధనలు అవుట్!
[ 02-07-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఆపరేటర్లు అదును చిక్కితే చాలు తమ చేతివాటం చూపించి అడ్డదారుల్లో ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు. -
పేదలకు అండగా సర్కారు దవాఖానా ఉందిగా
[ 02-07-2024]
అండాశయ కేన్సర్తో బాధపడుతున్న ఓ మహిళను కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రముఖ కేన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. -
పీల్చే గాలే పిప్పి చేస్తోంది
[ 02-07-2024]
నగరంలో పెరుగుతున్న కాలుష్యం నిశ్శబ్ద హంతకిగా మారుతోంది. క్రమక్రమంగా విషవాయువులు పీలుస్తున్న జనాలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. -
చిన్న మొత్తాలపై.. చిన్నచూపు
[ 02-07-2024]
సైబర్ నేరాలను కొందరు పోలీసులు చిన్నచూపు చూస్తున్నారు. -
పరిశ్రమలకు ప్రోత్సాహం.. ఉపాధికి ఊతం
[ 02-07-2024]
యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఓవైపు శకి క్యాంటిన్ల నిర్వహణతో పాటు స్టార్టప్లను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతోంది. -
వివాహేతర సంబంధానికి ఒత్తిడి తెచ్చాడని అంతమొందించారు
[ 02-07-2024]
వివాహేతర సంబంధం కోసం గృహిణిపై ఒత్తిడి తీసుకురావడంతోనే దుబాయ్ ఇంజినీరు హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. -
పుట్టిన రోజునే వృద్ధురాలి అంత్యక్రియలు
[ 02-07-2024]
తల్లి పుట్టిన రోజు జరపాల్సిన రోజు ఆమె అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం తీవ్ర విషాదానికి గురిచేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాజాసాబ్’ స్టోరీ లైన్ వైరల్.. ఫన్నీ రిప్లై ఇచ్చిన నిర్మాత
-
శారదా పీఠానికి కేటాయించిన ఆ 15 ఎకరాలు రద్దు చేయాలి: శ్రీనివాసానంద సరస్వతి
-
టీజీఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్
-
ఈ నెలలోనే అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే!
-
టీ20 ప్రపంచ కప్ 2026 స్వరూపం ఇదే! 12 జట్లకు నేరుగా అర్హత
-
ఆ రోజు రోహిత్ శర్మ ఫోన్ చేయకపోయి ఉంటే..: ద్రవిడ్