మధ్యాహ్న భోజనం.. మాటలకే పరిమితమా..!
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరుగుతోంది.
కళాశాలల్లో అమలుకాక విద్యార్థుల అవస్థలు
వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల
న్యూస్టుడే, వికారాబాద్ కలెక్టరేట్, పరిగి: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరుగుతోంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అమలుచేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అమలు చేయాల్సిందిగా కళాశాల విద్యార్థులు కోరుతున్నారు. ఈ పథకాన్ని గతంలో అమలు చేస్తామని అధికారులు ప్రకటించారు. ప్రభుత్వం మారటంతో దీని గురించి మాట్లాడే వారు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్టుడే’ కథనం.
ప్రభుత్వ కళాశాలల్లో 3,984 మంది విదార్థులు
జిల్లాలోని 19 మండలాల్లో కలిపి 12 ప్రభుత్వ జూనియర్ కళాశాలున్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 16 వేలకు పైగా విద్యార్థులున్నారు. వీరిలో ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న వారు 3,984 మంది ఉన్నారు.
- ప్రభుత్వ కళాశాలల్లో ఎక్కువగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుతుంటారు. దీనికి తోడు వీరు దాదాసే 20 కి.మీ. దూరం నుంచి వస్తున్నారు. వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నవాబ్పేట, ధారూర్, పూడూరు, మోమిన్పేట మండలాల నుంచి వచ్చే వారున్నారు. ఉదయం ఇంట్లో భోజనం సిద్ధం కాక లంచ్ బాక్స్ తెచ్చుకోవటం లేదు. దీంతో మధ్యాహ్నం చాలా మంది ఖాళీ కడుపుతోనే కాలం నెట్టుకొస్తున్నారు. ఆకలితో విద్యార్థులు చదువుపై తగిన దృష్టిని పెట్టలేకపోతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తే విద్యార్థులకు సౌకర్యంగా మారుతుందని అధ్యాపకులు అన్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం ఆర్.ఎం.సురేశ్వర స్వామి, ప్రిన్సిపల్, ప్రభుత్వ జూ.కళాశాల, వికారాబాద్
అధిక శాతం పేద కుటుంబాల విద్యార్థులే చదువుకునే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ప్రిన్సిపాల్స్ సమావేశంలో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చాం. ఈ పథకం అమలు చేస్తే ప్రవేశాలు పెరిగే అవకాశం ఉంది.
ఎంతో మేలు చేసినట్లవుతుంది : స్వాతి, సీఈసీ, ద్వితీయ
జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలి. తద్వారా పేద, గ్రామీణ విద్యార్థులకు ఎంతో మేలు చేసిన వారవుతారు. ఉదయం కాలేజీకి వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్లే వరకు భోజనం లేకుండా ఉండటం వల్ల చదువుపై కూడా దృషి సారించలేకపోతున్నారు.
చాలా మంది బాక్స్లు తెచ్చుకోలేరు: సాయివిలాసిని, హెచ్ఈసీ, ద్వితీయ
వికారాబాద్ కళాశాలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల్లో అధిక శాతం టిఫిన్స్ బాక్స్లు తెచ్చుకునే పరిస్థితి ఉండదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉండాలంటే కష్టమే. మధ్యాహ్న భోజన పథకం అమలు చేయటం వల్ల కాలేజీ మానేసి వారి సంఖ్య కూడా తగ్గుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పగ్గాలు చేపట్టినా.. నిద్రాణంలో పాలన
[ 02-07-2024]
రాజధానిలో పారిశుద్ధ్యం రోడ్ల మీదకు చేరి అన్ని ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. -
ఒక్క సందేశంతో ఫిర్యాదు
[ 02-07-2024]
కేసు నమోదు చేసినా.. బాధితుల చేతికి ఎఫ్ఐఆర్ వచ్చేందుకు రోజుల తరబడి ఎదురుచూపులు.. కేసు దర్యాప్తు ఏ స్థితిలో ఉందో.. నిందితుల్ని అరెస్టు చేశారో లేదో తెలియని పరిస్థితి.. -
సొంతింటి ఆశ.. కేటుగాళ్ల మాయ
[ 02-07-2024]
సకల హంగులతో కార్యాలయాలు.. ఆకట్టుకునేలా బ్రోచర్లు.. వందల కోట్ల ఎకరాల భూములు తమ పరిధిలో ఉన్నాయంటూ ప్రకటనలు. -
నిబంధనలు అవుట్!
[ 02-07-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఆపరేటర్లు అదును చిక్కితే చాలు తమ చేతివాటం చూపించి అడ్డదారుల్లో ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు. -
పేదలకు అండగా సర్కారు దవాఖానా ఉందిగా
[ 02-07-2024]
అండాశయ కేన్సర్తో బాధపడుతున్న ఓ మహిళను కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రముఖ కేన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. -
పీల్చే గాలే పిప్పి చేస్తోంది
[ 02-07-2024]
నగరంలో పెరుగుతున్న కాలుష్యం నిశ్శబ్ద హంతకిగా మారుతోంది. క్రమక్రమంగా విషవాయువులు పీలుస్తున్న జనాలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. -
చిన్న మొత్తాలపై.. చిన్నచూపు
[ 02-07-2024]
సైబర్ నేరాలను కొందరు పోలీసులు చిన్నచూపు చూస్తున్నారు. -
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
[ 02-07-2024]
ఉన్నతాధికారుల నిర్లక్ష్యమో...అమ్యామ్యాలకు ఆ కార్యాలయం నిలయంగా మారడమో కానీ అక్కడి కొంతమంది అధికారులు చేసే దందాకు లెక్కేలేకుండా పోతోంది. -
పరిశ్రమలకు ప్రోత్సాహం.. ఉపాధికి ఊతం
[ 02-07-2024]
యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఓవైపు శకి క్యాంటిన్ల నిర్వహణతో పాటు స్టార్టప్లను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతోంది. -
ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
[ 02-07-2024]
నగరంలో ఓ ఐపీఎస్, ఎమ్మెల్యే మధ్య వ్యవహారం అటు పోలీసు శాఖలో అటు ప్రజా ప్రతినిధులలో చర్చనీయాంశం అవుతోంది. -
విమాన టిక్కెట్ల రద్దు.. ప్రయాణికుడికి అసౌకర్యం
[ 02-07-2024]
ప్రయాణికురాలి ప్రమేయం లేకుండా టిక్కెట్లు రద్దుచేసి అసౌకర్యాన్ని కలిగించిన ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో ఎయిర్లైన్స్)కు రంగారెడ్డి వినియోగదారుల కమిషన్ మొట్టికాయలు వేసింది. -
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. కేసు నమోదు
[ 02-07-2024]
పెళ్లి చేసుకోవడానికి వరుడిని వెతుకుతున్న యువతికి యాప్ ద్వారా పరిచయమైన ఓ ప్రబుద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. -
వివాహేతర సంబంధానికి ఒత్తిడి తెచ్చాడని అంతమొందించారు
[ 02-07-2024]
వివాహేతర సంబంధం కోసం గృహిణిపై ఒత్తిడి తీసుకురావడంతోనే దుబాయ్ ఇంజినీరు హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. -
పుట్టిన రోజునే వృద్ధురాలి అంత్యక్రియలు
[ 02-07-2024]
తల్లి పుట్టిన రోజు జరపాల్సిన రోజు ఆమె అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం తీవ్ర విషాదానికి గురిచేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/07/24)
-
రకుల్ప్రీత్ మోటివేషన్.. నభా ప్రమోషన్.. రుహానీ శర్మ సెల్ఫీ!
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
అందుకే ‘భారతీయుడు 2’ తీశా.. పార్ట్ 3 రిలీజ్ అప్పుడే: శంకర్
-
పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. సీఎం చంద్రబాబు సీరియస్
-
‘కల్కి 2898 ఏడీ’ సాధించిన టాప్-10 బాక్సాఫీస్ రికార్డులివే!