పర్యాటక రంగ అభివృద్ధితో పేదలకు ఉపాధి: స్పీకర్
వికారాబాద్-అనంతగిరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయటంలో భాగంగా పేద ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్
వికారాబాద్ కలెక్టరేట్, న్యూస్టుడే: వికారాబాద్-అనంతగిరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయటంలో భాగంగా పేద ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో అనంతగిరి పర్యాటక అభివృద్ధిపై చేపట్టాల్సిన పనుల గురించి చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్తో కలిసి సమీక్షించారు. పర్యావరణ, పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు వివరాలను ఎల్ అండ్ టీ ప్రాజెక్టు మేనేజర్ సుమతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యావరణ పర్యాటక రంగాల అభివృద్ధికి స్వచ్ఛ దర్శన్ పథకం కింద రూ.110 కోట్లు నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఈ నిధులతో 213 ఎకరాల్లో పనులు చేపట్టడానికి ప్రణాళికలను రూపొందించారన్నారు. నిధులు వృథా చేయకుండా అవసరమైనవి, ప్రజలకు ఉపయోగపడే పనులను చేపట్టాలని సూచించారు. ఇదే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అధికంగా కల్పించాలని కోరారు.
జిల్లా రూపు రేఖలు మారిపోతాయి: ఎంపీ
ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తే జిల్లాలోని పలు ప్రాంతాల రూపురేఖలు అద్భుతంగా మారతాయన్నారు. అనంతగిరితో పాటు కోట్పల్లి, సర్పన్పల్లి, శివసాగర్, లక్నాపూర్, ప్రాజెక్టులు, దామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ జిల్లా అధికారిణి రేణుక, ఈఈ సుందర్, అటవీ శాఖాధికారి జ్ఞానేశ్వర్, జిల్లా యువజన, క్రీడల అధికారి హన్మంత్రావు, మత్స్య శాఖాధికారిణి సౌజన్య, దేవాదాయ శాఖాధికారి నరేందర్, కమిషనర్ జాకీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
[ 02-07-2024]
నగరంలో ఓ ఐపీఎస్, ఎమ్మెల్యే మధ్య వ్యవహారం అటు పోలీసు శాఖలో అటు ప్రజా ప్రతినిధులలో చర్చనీయాంశం అవుతోంది. -
పగ్గాలు చేపట్టినా.. నిద్రాణంలో పాలన
[ 02-07-2024]
రాజధానిలో పారిశుద్ధ్యం రోడ్ల మీదకు చేరి అన్ని ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. -
ఒక్క సందేశంతో ఫిర్యాదు
[ 02-07-2024]
కేసు నమోదు చేసినా.. బాధితుల చేతికి ఎఫ్ఐఆర్ వచ్చేందుకు రోజుల తరబడి ఎదురుచూపులు.. కేసు దర్యాప్తు ఏ స్థితిలో ఉందో.. నిందితుల్ని అరెస్టు చేశారో లేదో తెలియని పరిస్థితి.. -
సొంతింటి ఆశ.. కేటుగాళ్ల మాయ
[ 02-07-2024]
సకల హంగులతో కార్యాలయాలు.. ఆకట్టుకునేలా బ్రోచర్లు.. వందల కోట్ల ఎకరాల భూములు తమ పరిధిలో ఉన్నాయంటూ ప్రకటనలు. -
నిబంధనలు అవుట్!
[ 02-07-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఆపరేటర్లు అదును చిక్కితే చాలు తమ చేతివాటం చూపించి అడ్డదారుల్లో ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు. -
పేదలకు అండగా సర్కారు దవాఖానా ఉందిగా
[ 02-07-2024]
అండాశయ కేన్సర్తో బాధపడుతున్న ఓ మహిళను కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రముఖ కేన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. -
పీల్చే గాలే పిప్పి చేస్తోంది
[ 02-07-2024]
నగరంలో పెరుగుతున్న కాలుష్యం నిశ్శబ్ద హంతకిగా మారుతోంది. క్రమక్రమంగా విషవాయువులు పీలుస్తున్న జనాలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. -
చిన్న మొత్తాలపై.. చిన్నచూపు
[ 02-07-2024]
సైబర్ నేరాలను కొందరు పోలీసులు చిన్నచూపు చూస్తున్నారు. -
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
[ 02-07-2024]
ఉన్నతాధికారుల నిర్లక్ష్యమో...అమ్యామ్యాలకు ఆ కార్యాలయం నిలయంగా మారడమో కానీ అక్కడి కొంతమంది అధికారులు చేసే దందాకు లెక్కేలేకుండా పోతోంది. -
పరిశ్రమలకు ప్రోత్సాహం.. ఉపాధికి ఊతం
[ 02-07-2024]
యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఓవైపు శకి క్యాంటిన్ల నిర్వహణతో పాటు స్టార్టప్లను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతోంది. -
విమాన టిక్కెట్ల రద్దు.. ప్రయాణికుడికి అసౌకర్యం
[ 02-07-2024]
ప్రయాణికురాలి ప్రమేయం లేకుండా టిక్కెట్లు రద్దుచేసి అసౌకర్యాన్ని కలిగించిన ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో ఎయిర్లైన్స్)కు రంగారెడ్డి వినియోగదారుల కమిషన్ మొట్టికాయలు వేసింది. -
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. కేసు నమోదు
[ 02-07-2024]
పెళ్లి చేసుకోవడానికి వరుడిని వెతుకుతున్న యువతికి యాప్ ద్వారా పరిచయమైన ఓ ప్రబుద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. -
వివాహేతర సంబంధానికి ఒత్తిడి తెచ్చాడని అంతమొందించారు
[ 02-07-2024]
వివాహేతర సంబంధం కోసం గృహిణిపై ఒత్తిడి తీసుకురావడంతోనే దుబాయ్ ఇంజినీరు హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. -
పుట్టిన రోజునే వృద్ధురాలి అంత్యక్రియలు
[ 02-07-2024]
తల్లి పుట్టిన రోజు జరపాల్సిన రోజు ఆమె అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం తీవ్ర విషాదానికి గురిచేసింది.