logo

రూ.10కి గొడవ.. ఆటోడ్రైవర్‌ మృతి

గొడవలో గాయపడిన ఆటో డ్రైవర్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన శాలిబండ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Published : 30 Jun 2024 02:47 IST

చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: గొడవలో గాయపడిన ఆటో డ్రైవర్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన శాలిబండ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఫలక్‌నుమా వట్టేపల్లికి చెందిన ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ అన్వర్‌(37) ఆటోలో ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన బాలుడు(16) ఈ నెల 12న ఫలక్‌నుమా నుంచి షంషీర్‌గంజ్‌ వరకు ప్రయాణం చేశాడు. ఆటో దిగి రూ.10 ఇవ్వగా అన్వర్‌ రూ.20 ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. బాలుడు అందుకు నిరాకరించాడు. మద్యం మత్తులో ఉన్న ఆటోడ్రైవర్‌ అన్వర్‌ బాలుడిని దుర్భాషలాడడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అంతటితో ఆగకుండా పరస్పరం చేయి చేసుకున్నారు. బాలుడు నెట్టి వేయడంతో ఆటోడ్రైవర్‌ కిందపడి పోయాడు. ఈ ఘటనలో అన్వర్‌ తల రాయికి తగలడంతో గాయమైంది. అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని