ప్రాణాలు చెల్లాచెదురు
ఎప్పటిలాగే పనుల్లో నిమగ్నమయ్యారు. మరికొద్ది నిమిషాల్లో విధులు ముగించుకుని ఇళ్లకు చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. అంతలోనే చెవులు చిల్లులుపడేలా ఒక్కసారిగా పేలుడు. భీతావహ వాతావరణం. శరీరాలు ముక్కలై చెల్లాచెదురుగా నేలరాలాయి..
ముక్కలైన కార్మికుల మృతదేహాలు
సౌత్గ్లాస్ పరిశ్రమలో భీతావహ వాతావరణం
కార్మికుడి మృతదేహం
ఎప్పటిలాగే పనుల్లో నిమగ్నమయ్యారు. మరికొద్ది నిమిషాల్లో విధులు ముగించుకుని ఇళ్లకు చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. అంతలోనే చెవులు చిల్లులుపడేలా ఒక్కసారిగా పేలుడు. భీతావహ వాతావరణం. శరీరాలు ముక్కలై చెల్లాచెదురుగా నేలరాలాయి.. ఇదీ ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామ పరిధిలోని సౌత్గ్లాస్ పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదం పరిస్థితి. క్షణకాలంలో జరిగిన పేలుడులో ఐదుగురు కార్మికులు విగతజీవులుగా మారగా.. 13 మంది గాయపడ్డారు. అక్కడే ఇతర విభాగాల్లో పని చేస్తున్న కార్మికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పరుగులు తీశారు. ఏమైందో అర్థంకాని పరిస్థితి.
న్యూస్టుడే, షాద్నగర్, షాద్నగర్ న్యూటౌన్
ప్రమాదం జరిగిన ప్రాంతం
ఈ పరిశ్రమలో 250 మంది కార్మికులు పని చేస్తుంటారు. వీరంతా ఉత్తర్పదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఉంటున్నారు. రెండు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు మొదటి షిఫ్టు అయిపోతుంది. సరిగ్గా 4.45 గంటల సమయంలో విధులు ముగించుకొని వెళ్లడానికి సిద్ధమవుతుండగా.. వాహనాలకు ఉపయోగించే గాజును కరిగించే యంత్రం ఒక్కసారిగా పేలిపోయింది. అందులో కరిగిన వేడి రసాయనం కార్మికులపై పడింది. పేలుడు సంభవించిన సమయంలో అక్కడే పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు తునాతునకలై ఎక్కడెక్కడో ఎగిరిపడ్డారు. ప్రమాదం కారణంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలో మృతదేహాలను గుర్తించడానికే పోలీసులకు చాలా సమయం పట్టింది. ఘటనా స్థలానికి వెళ్లడానికి అక్కడి వారు భయపడ్డారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆసుపత్రికి తీసుకెళ్లుండగా మృతి చెందారు. హించని ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన కార్మికులు తేరుకోలేకోపోతున్నారు. ఇక్కడ పనిచేసిన కార్మికులందరూ 20 నుంచి 35 ఏళ్లలోపు వారే. కుటుంబ సభ్యులను సొంత రాష్ట్రంలోనే వదిలేసి పొట్ట చేతపట్టుకొని వచ్చారు. అలా వేలాది మంది కార్మికులు ఉన్నారు. చాలామంది ప్రమాదాల బారిన పడి అర్ధాంతరంగా రాలిపోతున్నారు. కనీస రక్షణ ప్రమాణాలు పాటించని యాజమాన్యాల చేతుల్లో వారి జీవితాలు తెల్లారుతున్నాయి.
నిపుణులు ఎక్కడ?.. సాంకేతిక పరమైన పనుల్లో నైపుణ్యం లేని కార్మికులను నియమించడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. గతంలో జీడిమెట్ల, కాటేదాన్, నాచారం, మల్లాపూర్ తదితర పరిశ్రమల్లో జరిగిన ఘటనల్లోనూ అనేక మంది బలయ్యారు. గాయపడిన వారి పరిస్థితి దుర్భరంగా మారింది. కనీసం వారి కుటుంబాల బాగోగులు, ఆర్థికంగానూ సహాయం అందించడంలో పరిశ్రమల నిర్వాహకులు నిర్లక్ష్యం వవహిస్తున్నారు.
ఘటనాస్థలిలో మృతులు, తెగిపడిన వారి శరీర భాగాలు
ఇలా చేస్తే మేలు..
విధుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు చట్టపరంగా రావాల్సిన పరిహారం ఇప్పించాలి.
- సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం కేసు నమోదు చేయాలి.
- మరణించిన కార్మికుడికి ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యం లేకపోతే కార్మికశాఖ ద్వారా బాధిత కుటుంబాలకు పరిహారం ఇప్పించాలి. ప్రమాదాల్లో అంగవైకల్యం పొందిన కార్మికులకు పింఛన్లు అందించాలి.
- ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతి కంపెనీలో విధిగా వర్క్ పర్మిట్ సిస్టమ్ అమలు చేయాలి.
- ప్రతి పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించాలి. రియాక్టర్ల పనితీరు పర్యవేక్షించాలి. ప్రమాదాల నివారణపై కార్మికులకు అవగాహన కల్పించాలి.
- ఈఎస్ఐ ఆసుపత్రుల్లో 24గంటల వైద్య సేవలు అందించాలి. లేబర్ ఆఫీసు, కాలుష్య నియంత్రణ మండలి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కార్యాలయాలను జీడిమెట్లలో చేయాలి.
కలగా మారిన భద్రత
కార్మికుల రక్షణ విస్మరిస్తున్న యాజమాన్యాలు
ఈనాడు, హైదరాబాద్: పరిశ్రమల్లో లోపించిన భద్రతా ప్రమాణాలతో విధులకు వెళ్లిన కార్మికులు క్షేమంగా ఇల్లు చేరేవరకూ అనుమానమేనన్న పరిస్థితి నెలకొంది. తాజాగా షాద్నగర్ జరిగిన ప్రమాదంలో పొట్టకూటి కోసం వచ్చిన అమాయకులు బలయ్యారు. కనీస రక్షణ చర్యలు లేకపోవడం, నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించుకోకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నట్టు అధికారుల ప్రాథమికంగా నిర్ధారించారు. ముఖ్యంగా ప్రమాదాలకు కారణమయ్యే రియాక్టర్లు బాంబుల్లా పేలుతున్నాయి. కీలక ప్రాంతాల్లో నిపుణులైన కార్మికులు పనిచేయాల్సి ఉండగా..తక్కువ జీతాలకు పనిచేసేందుకు వస్తున్నారని.. కనీస అవగాహన లేని తాత్కాలిక, కాంట్రాక్ట్ కార్మికుల చేత పనులు చేయిస్తున్నారు. రియాక్టర్ల ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించకపోవడం, కెమికల్ రియాక్షన్ను నివారించడంలో విఫలం కావడంతో పేలుళ్లు సంభవిస్తున్నాయి. జీడిమెట్ల, నాచారం, కాటేదాన్, షాద్నగర్లలో మూడేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 15 మంది మృతి చెందగా 50 మంది గాయాల పాలయ్యారు.
స్థానికేతరులే ఎక్కువగా.. విధులు నిర్వహించే వారిలో అధికంగా స్థానికేతరులే ఉండటంతో వారి తరఫున పరిశ్రమలపై పోరాటం చేసే వారు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. పైగా శివార్లలోని పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన వెంటనే చికిత్స కోసం తరలించేందుకు అంబులెన్స్లాంటి వాహనాలు లేక నగరానికి చేరేలోపు మరణిస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. పరిశ్రమల్లో రక్షణ చర్యలు సక్రమంగా లేకున్నా..వాటిని పరిశీలించి వెంటనే చర్యలు చేపట్టడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
[ 01-07-2024]
రాష్ట్రంలోని వికారాబాద్-సంగారెడ్డి-కర్ణాటకలోని బీదర్ పట్టణాల మధ్య రహదారి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆరు రోజుల క్రితం దిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర పురోగతితో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలతో -
బతకాలని ఉన్నా.. ఆత్మహత్య చేసుకుంటున్నా
[ 01-07-2024]
జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నాకు చనిపోవాలని లేదు.. అయినా ధైర్యం కూడగట్టుకుని బలవంతంగా ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని సెల్ఫీ వీడియోలో మాట్లాడిన మాటలు అందరినీ కలిచివేశాయి. -
కూడళ్ల విస్తరణకు సై
[ 01-07-2024]
ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు యుద్ధ ప్రాతిపదికన నగరంలోని ఇరుకు కూడళ్లను విస్తరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే మూడు పోలీస్ కమిషనరేట్లు కూడళ్ల జాబితాను జీహెచ్ఎంసీకి అందించింది. -
ఖజానా వెల వెల.. పనులు చేసేదెలా..?
[ 01-07-2024]
రాజధానిలో కీలకమైన ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఆచూతూచి అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మూసీ నదిపై 14 వంతెనలను నిర్మించాలన్న గత ప్రభుత్వం ప్రతిపాదనల్లో ఒక్కటి మినహా మిగిలినవి పక్కన పెట్టాలని నిర్ణయించింది. -
కాలానికి తగ్గట్టు నైపుణ్యంతో సాన పట్టు
[ 01-07-2024]
ప్రపంచంతో పోటీ పడాలంటే మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఏ ఉద్యోగైనా నైపుణ్యం పెంచుకోవాల్సిందే.. వృత్తి నిపుణులు ఇందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2025లో 85 శాతం వృత్తి నిపుణులు నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించనున్నట్లు ‘అప్స్కిల్లింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ 2024-25’ నివేదిక వెల్లడించింది. -
అడ్డదారి.. అపాయకారి
[ 01-07-2024]
బడికెళ్లే పిల్లలకు ప్రభుత్వ చట్టాలు, నిబంధనల గురించి అవగాహన కల్పిస్తేనే భవిష్యత్తులో పాటిస్తారు. మంచి పౌరులుగా ఎదుగుతారు. అలాంటి చిన్నారుల కళ్ల ముందే అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తే...! -
ఖాళీ స్థలాలకు పన్ను కట్టండి
[ 01-07-2024]
జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం పలు పౌర సేవలను పునరుద్ధరించింది. మూడేళ్ల కిందట నిలిచిన నోటరీ స్థలాలకు ఇంటి నంబర్ల జారీ ప్రక్రియను, ఖాళీ స్థలాల పన్ను(వీఎల్టీ), జీఐఎస్ సర్వే వంటి కార్యక్రమాలను తాజాగా ప్రారంభించింది. -
ఎఫ్టీఎల్లో ఫంక్షన్హాళ్లు.. సర్కారు భూముల్లో రోడ్లు
[ 01-07-2024]
శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో సర్కారు భూములు, చెరువులను కబ్జా చేస్తున్న కొందరు.. ఏకంగా హిమాయత్సాగర్ చెరువునే లక్ష్యంగా చేసుకున్నారు. -
పాఠశాల బాగుపడేలా.. ఫలితం మెరుగుపడేలా
[ 01-07-2024]
విద్యా వ్యవస్థ సజావుగా సాగేందుకు సర్కారు రకరకాల యత్నాలు చేస్తోంది. విద్యార్థులు పాఠశాలలకు రావడం, తరగతులు జరగడం వంటివి నిత్యకృత్యమైనా ఫలితాల దగ్గరకొచ్చే సరికి ఎక్కడో అడుగున ఉంటున్నారు. -
నేటి నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
[ 01-07-2024]
రహదారి ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. అందుకే ఈ నెల 1 నుంచి నూతన రహదారి నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. -
గంజాయి స్మగ్లర్లు కటకటాల పాలు
[ 01-07-2024]
సినీఫక్కీలో పనస పండ్ల మధ్య 33 కిలోల గంజాయిని బొలెరో వాహనంలో తరలిస్తున్న స్మగ్లర్ల ముఠాను సైబరాబాద్ పోలీసులు శామీర్పేట టోల్గేట్ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
[ 01-07-2024]
ఒకే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు 37 ఏళ్ల తరువాత ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. ఘట్కేసర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1982-87 వరకు చదివిన 108 మంది పూర్వవిద్యార్థులు -
గోవా గవర్నర్ రచనకు తెలుగు అనువాదం ‘రామ చిలుక’
[ 01-07-2024]
గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై మళయాలంలో రాసిన ‘తథా వరతికిల్ల’ కథల సంపుటికి తెలుగు అనువారం‘రామ చిలుక’ పుస్తకాన్ని తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కొలకలూరి ఇనాక్ ఆవిష్కరించారు. -
నిరుద్యోగ జేఏసీతో చర్చలు విఫలం
[ 01-07-2024]
గాంధీ ఆసుపత్రిలో వారం రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్తో ఆదివారం రాత్రి ఎమ్మెల్సీ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, నాయకులు రియాజ్, -
సైక్లింగ్తో అన్నివిధాలా ఆరోగ్యం
[ 01-07-2024]
ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా శరీరం నిత్య నూతనంగా ఉంటుందని జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. -
బాలికపై అత్యాచారం కేసులో 10 మందికి రిమాండ్
[ 01-07-2024]
కాచిగూడకు చెందిన 12 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటనలో నేరేడ్మెట్ పోలీసులు 10 మందిని ఆదివారం రిమాండ్కు తరలించారు. జూన్ 25న కాచిగూడ ఠాణాలో జీరో ఎఫ్ఐఆర్ చేసి కేసును నేరేడ్మెట్కు బదిలీ చేశారు. -
మాదకద్రవ్యాలపై నిఘా.. పబ్లలో జాగిలాలతో తనిఖీలు
[ 01-07-2024]
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టల్లోని పబ్లపై మాదకద్రవ్యాల నిరోధక శాఖ అధికారులు, పోలీసులు దృష్టి సారించారు. -
పరిగిలో దొంగల హల్చల్
[ 01-07-2024]
తాళాలు వేసిన పలు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. బాధితులు, ఎస్సై సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి పురపాలికలోని టీచర్స్ కాలనీ, వెంకటేశ్వరకాలనీల్లో నివాసముంటున్న ఆనంద్రావు, శ్రీకాంత్, శ్రీనివాస్, సాయిరాం,
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
-
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
-
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై ఘాటుగా స్పందించిన లోకేశ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కృష్ణా జలాల్లో కొత్త ద్వీపం.. అందం అదరహో..!
-
ఎంపీ లాడ్స్ ఆన్లైన్లో!