logo

అత్తామామ కలిసే కోడలిని కడతేర్చారు

చాయ్‌ పెట్టలేదనే ఆగ్రహంతో కోడల్ని చంపిన హత్యకేసులో మామ కూడా సహకరించినట్లు అత్తాపూర్‌ పోలీసులు తేల్చారు.

Published : 29 Jun 2024 02:34 IST

అత్తాపూర్‌ పోలీసుల వెల్లడి.. నిందితుల రిమాండ్‌

రాజేంద్రనగర్, న్యూస్‌టుడే: చాయ్‌ పెట్టలేదనే ఆగ్రహంతో కోడల్ని చంపిన హత్యకేసులో మామ కూడా సహకరించినట్లు అత్తాపూర్‌ పోలీసులు తేల్చారు. అత్త ఫర్జానాబేగం, మామ మహ్మద్‌నూర్‌ ఇద్దరూ కలిసే కోడలి మెడకు చున్నీని బిగించి హత్య చేశారని ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రామిరెడ్డి తెలిపారు. నిందితులిద్దరిని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. అజ్మీరాబేగం(28) గతంలో ఇళ్లలో పనిచేసి మానేసింది. దీంతో ఆమెను ఇళ్లలో పనులకు వెళ్లాలని అత్తామామతో పాటు భర్త వేధించారు. అజ్మీరా పలుమార్లు వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ మండలం టేకులపల్లిలోని పుట్టింటికి వెళ్లింది. పెద్దలతో చర్చించి కొంతకాలం క్రితం తీసుకొచ్చారు. ఇటీవల భర్త అబ్బాస్‌ బాగా చూసుకుంటానని నచ్చజెప్పి ఈ నెల 26న ఆమెను, పిల్లలను ఇంటికి తీసుకొచ్చాడు. 27న ఉదయమే చాయ్‌ విషయంలో వివాదం తలెత్తడంతో అత్తామామ కలిసి ఆమెను హత్య చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని