సర్కారు బడులకు వెళ్తామన్నా.. వదలని ప్రైవేటు స్కూళ్లు
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల బాధ భరించలేక సర్కారు బడుల్లో పిల్లలను చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్న తల్లిదండ్రులను ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు వదలడం లేదు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు
ఈనాడు, హైదరాబాద్, ముషీరాబాద్, జీడిమెట్ల, న్యూస్టుడే: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల బాధ భరించలేక సర్కారు బడుల్లో పిల్లలను చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్న తల్లిదండ్రులను ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు వదలడం లేదు. వారికి టీసీలు ఇవ్వకపోగా.. తమ వద్ద సదరు విద్యార్థి లేరంటూ ఆన్లైన్లో వివరాలనూ నమోదు చేయకుండా యాజమాన్యాలు ఇబ్బందులు పెడుతున్నాయి. దీంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించినా హాజరుపట్టీలో పేర్లు ఉండకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నగరంలోని బహదూర్పురా, చార్మినార్, ఆసిఫ్నగర్, ముషీరాబాద్, అమీర్పేట్, కుత్బుల్లాపూర్ మండలాలతో పాటు సైదాబాద్, మలక్పేట్ ప్రాంతాల్లోని ఐదు వేల మందికిపైగా ఈ తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. విద్యాశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఉన్నతాధికారులు తక్షణం చొరవతీసుకుని ఆయా సమస్యలు పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆంగ్లభాష నేర్పిస్తారని..
ప్రైవేటు స్కూళ్లు.. కార్పొరేటు విద్యాసంస్థల్లో పిల్లలకు ఆంగ్లభాష బాగా నేర్పిస్తారన్న ఆశతో రూ.వేలకువేలు ఫీజులు చెల్లించిన తల్లిదండ్రులు.. పిల్లలకు ఆంగ్లం సరిగా రావడం లేదని గ్రహిస్తున్నారు. ఫీజుల భారం భరించలేని వారిలో కొందరు.. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఒక జిల్లాలోని విద్యార్థి అదే జిల్లాలో వేరే పాఠశాలలో చేరితే.. తొలుత చదివిన పాఠశాల యాజమాన్యం ఆ విద్యార్థి వివరాలను ఆన్లైన్లోని డ్రాప్బాక్స్లో నమోదు చేయాలి. ఇలా చేయకపోతే వేరే పాఠశాలలో విద్యార్థి చదువుతున్నా పాత బడిలోనే వివరాలుంటాయి. మండలాలవారీగా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలి. ఇందుకుభిన్నంగా హైదరాబాద్ విద్యాశాఖ అధికారులు ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. చార్మినార్ మండల పరిధిలోని కొన్ని ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులు బహదూర్పురలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నా...ఇప్పటికీ ప్రైవేటు స్కూళ్లల్లోనే వారి పేర్లున్నాయి. కొందరు సిబ్బంది ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల నుంచి మామూళ్లు తీసుకుని ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
[ 01-07-2024]
రహదారి ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. అందుకే ఈ నెల 1 నుంచి నూతన రహదారి నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. -
గంజాయి స్మగ్లర్లు కటకటాల పాలు
[ 01-07-2024]
సినీఫక్కీలో పనస పండ్ల మధ్య 33 కిలోల గంజాయిని బొలెరో వాహనంలో తరలిస్తున్న స్మగ్లర్ల ముఠాను సైబరాబాద్ పోలీసులు శామీర్పేట టోల్గేట్ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
[ 01-07-2024]
ఒకే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు 37 ఏళ్ల తరువాత ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. ఘట్కేసర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1982-87 వరకు చదివిన 108 మంది పూర్వవిద్యార్థులు -
గోవా గవర్నర్ రచనకు తెలుగు అనువాదం ‘రామ చిలుక’
[ 01-07-2024]
గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై మళయాలంలో రాసిన ‘తథా వరతికిల్ల’ కథల సంపుటికి తెలుగు అనువారం‘రామ చిలుక’ పుస్తకాన్ని తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కొలకలూరి ఇనాక్ ఆవిష్కరించారు. -
నిరుద్యోగ జేఏసీతో చర్చలు విఫలం
[ 01-07-2024]
గాంధీ ఆసుపత్రిలో వారం రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్తో ఆదివారం రాత్రి ఎమ్మెల్సీ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, నాయకులు రియాజ్, -
బతకాలని ఉన్నా.. ఆత్మహత్య చేసుకుంటున్నా
[ 01-07-2024]
జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నాకు చనిపోవాలని లేదు.. అయినా ధైర్యం కూడగట్టుకుని బలవంతంగా ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని సెల్ఫీ వీడియోలో మాట్లాడిన మాటలు అందరినీ కలిచివేశాయి. -
సైక్లింగ్తో అన్నివిధాలా ఆరోగ్యం
[ 01-07-2024]
ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా శరీరం నిత్య నూతనంగా ఉంటుందని జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. -
బాలికపై అత్యాచారం కేసులో 10 మందికి రిమాండ్
[ 01-07-2024]
కాచిగూడకు చెందిన 12 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటనలో నేరేడ్మెట్ పోలీసులు 10 మందిని ఆదివారం రిమాండ్కు తరలించారు. జూన్ 25న కాచిగూడ ఠాణాలో జీరో ఎఫ్ఐఆర్ చేసి కేసును నేరేడ్మెట్కు బదిలీ చేశారు. -
మాదకద్రవ్యాలపై నిఘా.. పబ్లలో జాగిలాలతో తనిఖీలు
[ 01-07-2024]
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టల్లోని పబ్లపై మాదకద్రవ్యాల నిరోధక శాఖ అధికారులు, పోలీసులు దృష్టి సారించారు. -
పరిగిలో దొంగల హల్చల్
[ 01-07-2024]
తాళాలు వేసిన పలు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. బాధితులు, ఎస్సై సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి పురపాలికలోని టీచర్స్ కాలనీ, వెంకటేశ్వరకాలనీల్లో నివాసముంటున్న ఆనంద్రావు, శ్రీకాంత్, శ్రీనివాస్, సాయిరాం,
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/07/24)
-
రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక
-
దీదీ.. ఈ ఘోరం మీకు కనిపించలేదా?ఇదేనా మీ పాలన?
-
ఖుషీ స్వెట్టర్ కోరిక.. చీరలో వేదిక.. కోర్టులో రెజీనా
-
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
-
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్