ఇసుకలో.. కాసుల వేట
జిల్లాల్లోని యాలాల మండలంలో కాగ్నానది పరివాహక ప్రాంతాలైన కోకట్, బెన్నూర్ సంపు, సంగెంకుర్థు, విశ్వనాథ్పూర్, నాగాసాముందార్, దేవనూర్, యాలాల కాకరవేణి నది ఉండడంతో ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నాయి
ప్రభుత్వ అనుమతుల పేరుతో అక్రమ దందా
కాగ్నానది పరిసరాల్లోంచి తరలింపు
కాగ్నా నది వద్ద పట్టుబడిన ట్రాక్టర్లు
జిల్లాల్లోని యాలాల మండలంలో కాగ్నానది పరివాహక ప్రాంతాలైన కోకట్, బెన్నూర్ సంపు, సంగెంకుర్థు, విశ్వనాథ్పూర్, నాగాసాముందార్, దేవనూర్, యాలాల కాకరవేణి నది ఉండడంతో ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో అక్రమార్కుల దృష్టి వాటిపై పడింది. కలెక్టర్ ఆదేశాలతో యాలాల, తాండూరు మండలాల తహసీల్దార్లు ఇసుకకు అనుమతులు ఇస్తున్నారు. అయితే అనుమతులున్న ప్రాంతంలో ఇసుక వేయకుండా మరోచోటుకు తరలించి అందినంత జేబులో వేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి.
వారం రోజుల నుంచి బెన్నూర్ సంపు దగ్గర ఇసుక దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, ఇంటి నిర్మాణాలకు అధికారుల దగ్గర అనుమతి పత్రాలు తీసుకొని ఎంపికచేసిన చోటు కాకుండా మరో చోటుకు ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ప్రతి రోజు దాదాపు 150 ట్రిప్పులపైనే రవాణా జరుగుతోంది. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలకు ఇసుక తప్పనిసరి కావడంతో ప్రభుత్వ పనుల పేరుతో తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్లో మూడు క్యూబిక్ మీటర్ల ఇసుకకు రూ.600 చొప్పున జిల్లా కలెక్టర్ పేరిట డీడీ సంబంధిత బ్యాంకులో కట్టి తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించి అనుమతులు తీసుకుంటున్నారు. నాలుగు ట్రిప్పులకు పర్మిషన్ తీసుకొని ఎనిమిది నుంచి పది ట్రిప్పుల తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్కు సుమారు రూ.5 వేల చొప్పున అమ్ముకొని జేబులు నింపుకొంటున్నారు. తాండూరు పట్టణం, మండలంతో పాటు, యాలాల మండలం, కొడంగల్ మండలాలకు ఇసుకను తరలిస్తున్నారు.
పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా...
అనుమతులు లేకుండానే గత వారంలో మూడు సార్లు కాగ్నానదిలో దాదాపు 15 ట్రాక్టర్లలో ఇసుక తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వాటిని పట్టుకొని స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేశారు. మరికొన్నింటికి జరిమానా విధిస్తున్నారు. అయినా ఫలితం లేకుండా పోతోంది. యథేచ్ఛగా రవాణా కొనసాగుతోంది.
క్షేత్రస్థాయిలో కరవైన పర్యవేక్షణ
తహసీల్దార్ కార్యాలయంలో అనుమతులు ఇస్తున్నప్పటికి క్షేత్రస్థాయిలో అందుకు అనుగుణంగా అధికారులు పర్యవేక్షణ కరవైంది. ఇసుక తరలించే చోట సంబంధిత అధికారులు ఉండి ఎన్ని ట్రాక్టర్లకు అనుమతులు ఇచ్చాం, ఎన్ని ట్రిప్పులు తీసుకెళ్తున్నారో పరిశీలించాలి. కానీ అధికారులెవరూ అందుబాటులో లేకపోవడంతో ఇదే అదనుగా భావించి రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక రవాణా జరుగుతోంది.
కఠిన చర్యలు తీసుకుంటాం
ఇసుక అక్రమంగా రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తాం. ఈ విషయమై సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. ఇప్పటికే 10 ట్రాక్టర్లపై కేసులు నమోదు చేశాం. ఇక నుంచి నిరంతరం నిఘా ఉంచుతాం.
-విఠల్రెడ్డి, యాలాల ఎస్సై.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూడళ్ల విస్తరణకు సై
[ 01-07-2024]
ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు యుద్ధ ప్రాతిపదికన నగరంలోని ఇరుకు కూడళ్లను విస్తరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే మూడు పోలీస్ కమిషనరేట్లు కూడళ్ల జాబితాను జీహెచ్ఎంసీకి అందించింది. -
ఖజానా వెల వెల.. పనులు చేసేదెలా..?
[ 01-07-2024]
రాజధానిలో కీలకమైన ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఆచూతూచి అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మూసీ నదిపై 14 వంతెనలను నిర్మించాలన్న గత ప్రభుత్వం ప్రతిపాదనల్లో ఒక్కటి మినహా మిగిలినవి పక్కన పెట్టాలని నిర్ణయించింది. -
కాలానికి తగ్గట్టు నైపుణ్యంతో సాన పట్టు
[ 01-07-2024]
ప్రపంచంతో పోటీ పడాలంటే మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఏ ఉద్యోగైనా నైపుణ్యం పెంచుకోవాల్సిందే.. వృత్తి నిపుణులు ఇందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2025లో 85 శాతం వృత్తి నిపుణులు నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించనున్నట్లు ‘అప్స్కిల్లింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ 2024-25’ నివేదిక వెల్లడించింది. -
అడ్డదారి.. అపాయకారి
[ 01-07-2024]
బడికెళ్లే పిల్లలకు ప్రభుత్వ చట్టాలు, నిబంధనల గురించి అవగాహన కల్పిస్తేనే భవిష్యత్తులో పాటిస్తారు. మంచి పౌరులుగా ఎదుగుతారు. అలాంటి చిన్నారుల కళ్ల ముందే అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తే...! -
ఖాళీ స్థలాలకు పన్ను కట్టండి
[ 01-07-2024]
జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం పలు పౌర సేవలను పునరుద్ధరించింది. మూడేళ్ల కిందట నిలిచిన నోటరీ స్థలాలకు ఇంటి నంబర్ల జారీ ప్రక్రియను, ఖాళీ స్థలాల పన్ను(వీఎల్టీ), జీఐఎస్ సర్వే వంటి కార్యక్రమాలను తాజాగా ప్రారంభించింది. -
ఎఫ్టీఎల్లో ఫంక్షన్హాళ్లు.. సర్కారు భూముల్లో రోడ్లు
[ 01-07-2024]
శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో సర్కారు భూములు, చెరువులను కబ్జా చేస్తున్న కొందరు.. ఏకంగా హిమాయత్సాగర్ చెరువునే లక్ష్యంగా చేసుకున్నారు. -
పాఠశాల బాగుపడేలా.. ఫలితం మెరుగుపడేలా
[ 01-07-2024]
విద్యా వ్యవస్థ సజావుగా సాగేందుకు సర్కారు రకరకాల యత్నాలు చేస్తోంది. విద్యార్థులు పాఠశాలలకు రావడం, తరగతులు జరగడం వంటివి నిత్యకృత్యమైనా ఫలితాల దగ్గరకొచ్చే సరికి ఎక్కడో అడుగున ఉంటున్నారు. -
నేటి నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
[ 01-07-2024]
రాష్ట్రంలోని వికారాబాద్-సంగారెడ్డి-కర్ణాటకలోని బీదర్ పట్టణాల మధ్య రహదారి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆరు రోజుల క్రితం దిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర పురోగతితో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలతో -
నేటి నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
[ 01-07-2024]
రహదారి ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. అందుకే ఈ నెల 1 నుంచి నూతన రహదారి నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. -
గంజాయి స్మగ్లర్లు కటకటాల పాలు
[ 01-07-2024]
సినీఫక్కీలో పనస పండ్ల మధ్య 33 కిలోల గంజాయిని బొలెరో వాహనంలో తరలిస్తున్న స్మగ్లర్ల ముఠాను సైబరాబాద్ పోలీసులు శామీర్పేట టోల్గేట్ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
[ 01-07-2024]
ఒకే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు 37 ఏళ్ల తరువాత ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. ఘట్కేసర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1982-87 వరకు చదివిన 108 మంది పూర్వవిద్యార్థులు -
గోవా గవర్నర్ రచనకు తెలుగు అనువాదం ‘రామ చిలుక’
[ 01-07-2024]
గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై మళయాలంలో రాసిన ‘తథా వరతికిల్ల’ కథల సంపుటికి తెలుగు అనువారం‘రామ చిలుక’ పుస్తకాన్ని తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కొలకలూరి ఇనాక్ ఆవిష్కరించారు. -
నిరుద్యోగ జేఏసీతో చర్చలు విఫలం
[ 01-07-2024]
గాంధీ ఆసుపత్రిలో వారం రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్తో ఆదివారం రాత్రి ఎమ్మెల్సీ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, నాయకులు రియాజ్, -
బతకాలని ఉన్నా.. ఆత్మహత్య చేసుకుంటున్నా
[ 01-07-2024]
జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నాకు చనిపోవాలని లేదు.. అయినా ధైర్యం కూడగట్టుకుని బలవంతంగా ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని సెల్ఫీ వీడియోలో మాట్లాడిన మాటలు అందరినీ కలిచివేశాయి. -
సైక్లింగ్తో అన్నివిధాలా ఆరోగ్యం
[ 01-07-2024]
ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా శరీరం నిత్య నూతనంగా ఉంటుందని జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. -
బాలికపై అత్యాచారం కేసులో 10 మందికి రిమాండ్
[ 01-07-2024]
కాచిగూడకు చెందిన 12 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటనలో నేరేడ్మెట్ పోలీసులు 10 మందిని ఆదివారం రిమాండ్కు తరలించారు. జూన్ 25న కాచిగూడ ఠాణాలో జీరో ఎఫ్ఐఆర్ చేసి కేసును నేరేడ్మెట్కు బదిలీ చేశారు. -
మాదకద్రవ్యాలపై నిఘా.. పబ్లలో జాగిలాలతో తనిఖీలు
[ 01-07-2024]
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టల్లోని పబ్లపై మాదకద్రవ్యాల నిరోధక శాఖ అధికారులు, పోలీసులు దృష్టి సారించారు. -
పరిగిలో దొంగల హల్చల్
[ 01-07-2024]
తాళాలు వేసిన పలు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. బాధితులు, ఎస్సై సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి పురపాలికలోని టీచర్స్ కాలనీ, వెంకటేశ్వరకాలనీల్లో నివాసముంటున్న ఆనంద్రావు, శ్రీకాంత్, శ్రీనివాస్, సాయిరాం,