PV Narasimha Rao: 16 భాషల పీవీ 16 అణాల ఠీవి
దేశానికి ఏకైక తెలుగు ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు కీర్తి ‘భారత రత్న’ పురస్కారంతో నింగినంటింది. 16 భాషలు తెలిసిన పదహారణాల పీవీ.. జన్మించింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయినా నాయకుడిగా ఎదిగింది నగరంలోనే. ఉస్మానియా విశ్వవిద్యాలయం ముద్దుబిడ్డగా పేరొందిన పీవీ.. ఆంగ్లేయులు నిషేధించిన ‘వందేమాతరం’ గీతాన్ని 1938లో వారి ఎదుటే సహచర విద్యార్థులతో కలిసి వర్సిటీలో ఆ గీతాన్ని ప్రాంగణమంతా ప్రతిధ్వనించేలా ఆలపించారు.
నగరంతో ఆత్మీయ అనుబంధం
దేశానికి ఏకైక తెలుగు ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు కీర్తి ‘భారత రత్న’ పురస్కారంతో నింగినంటింది. 16 భాషలు తెలిసిన పదహారణాల పీవీ.. జన్మించింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయినా నాయకుడిగా ఎదిగింది నగరంలోనే. ఉస్మానియా విశ్వవిద్యాలయం ముద్దుబిడ్డగా పేరొందిన పీవీ.. ఆంగ్లేయులు నిషేధించిన ‘వందేమాతరం’ గీతాన్ని 1938లో వారి ఎదుటే సహచర విద్యార్థులతో కలిసి వర్సిటీలో ఆ గీతాన్ని ప్రాంగణమంతా ప్రతిధ్వనించేలా ఆలపించారు. ఫలితంగా ఆయనతోపాటు పలువురికి ప్రవేశాలను వర్సిటీ రద్దు చేయటంతో పీవీ నాగ్పుర్లో డిగ్రీ చేశారు.
ఈనాడు, హైదరాబాద్, నారాయణగూడ, న్యూస్టుడే: ముఖ్యమంత్రిగా నగరాభివృద్ధికి అందించిన తోడ్పాటు కారణంగా ఆయన మరణాంతరం నెక్లెస్ రోటరీలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్మృతి వనాన్ని నెలకొల్పారు. నెక్లెస్రోడ్ను పీవీమార్గ్గా మార్చారు. మెహిదీపట్నం నుంచి విమానాశ్రయానికి వెళ్లే వారధికి పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వేగా నామకరణం చేశారు. తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయానికి ముందు పీవీ పేరు పెట్టారు. ఉస్మానియా పూర్వ విద్యార్థి పీవీకి భారతరత్న లభించడం ఎంతో గర్వంగా ఉందని వర్సిటీ వీసీ డి.రవీందర్ తెలిపారు.
తెలుగుపై మిక్కిలి మక్కువ...
తెలుగుభాషపై మక్కువ కలిగిన పీవీ నరసింహారావు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రెండుసార్లు సందర్శించారు. మహాకవి డా.సి.నారాయణరెడ్డి తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షులయ్యాక 1991లో రెండో స్నాతకోత్సవానికి స్వయంగా దిల్లీకి వెళ్లి పీవీని ఆహ్వానించారు. ఆయన అప్పటికింకా ప్రధాని కాలేదు. సినారెకు ఇచ్చిన మాట కోసం 1991 జులైలో నగరానికి వచ్చి స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో ‘దిల్లీకి రాజైనా తల్లికి కొడుకునే’ అని సగర్వంగా చెప్పుకొన్నారు. దేశ ప్రధాని అయ్యాక ఆయన పాల్గొన్న తొలి సమావేశం ఇదే. ప్రధాన మంత్రి తెలుగులో పూర్తి ప్రసంగం చేయడం కూడా ఇదే మొదటిసారి.
- 1993లో మరోమారు తెలుగు వర్సిటీలో జరిగిన నాటి స్వాతంత్య్ర సమరయోధుడు, భారతీయ విద్యాభవన్ ప్రిన్సిపల్గా ఉన్న వీహెచ్ దేశాయ్ విరచిత ‘వందేమాతరం టు జనగణమన’ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించి రచయితను అభినందించారు. జనసైనికుల నాయకుడు, స్వామి రామానందతీర్థ ఆశ్రమానికి అధ్యక్షుడుగా ఉన్నారు.
- పీవీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలుగు భాషాభివృద్ధికి ‘తెలుగు అకాడమీ’ని స్థాపించారు. ఆయనే దానికి మొదటి అధ్యక్షుడు.
అవధానంలో పీవీ..
రవీంద్రభారతిలో మాడుగుల నాగఫణి శర్మ సహస్రావధానంలో పీవీ పృచ్ఛకులుగా పాల్గొన్నారు. సమాజంలోని ప్రశ్నలకు పద్య రూపంలో ఎలాంటి సమాధానం చెబుతారని అడిగారట. దానికి అవధాని సమాధానపరిచారట.
నేటి యువతకు ఆదర్శం
ఈనాటి యువతకు పీవీ ఓ ఆదర్శం. ఆయన ఉన్నతవిద్యా పారంగికుడేకాక బహుభాషా కోవిదుడు. వాటిని ఆయన చాలా వేగంగా నేర్చుకున్నారు. ప్రధానిగా ఉన్నప్పుడే కంప్యూటర్లు వచ్చాయి. ఆంగ్లంలో టైప్చేయడం కొంత కష్టమైనా కొద్దిరోజుల్లోనే వినియోగించటం నేర్చారు. పాతికేళ్ల క్రితం కంప్యూటర్లో తెలుగుభాషను టైప్ చేసేందుకు ఫాంట్లు, సాఫ్ట్వేర్ రాగా అప్పుడు కూడా వేగంగా టైప్చేయడం నేర్చుకున్నారు. ఆర్థిక శాస్త్రంలో నిపుణుడిగా పేరొందారు.
లోపలి మనిషి.. బాగున్నాడా?..
ఆత్మకథను రాసుకున్న పీవీ రవీంద్రభారతిలో ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలతో సమావేశమయ్యారు. ఆంగ్లంలో రాసిన ‘ది ఇన్సైడర్’ను అనువదించి ‘లోపలి మనిషి’గా ప్రచురిస్తున్నామని, బాగుందో లేదో చెప్పాలన్నారు. వారు బాగుందన్నాకే 2002 అక్టోబరులో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. అన్ని భాషల్లో కలిపి 20 వేల ప్రతులు అమ్ముడై, రెండో ముద్రణకు సిద్ధమయింది. మరోవైపు అప్పటికే రెండోభాగం రాసిన పీవీ తాను మరణించాక ముద్రించాలని కుటుంబసభ్యులను కోరారు. త్వరలో ఎమెస్కో బుక్స్ ద్వారా ప్రచురితం కానుంది.
పీవీ కలల సౌధం.. స్వామి రామానంద తీర్థ స్మారక కేంద్రం
బేగంపేట, న్యూస్టుడే: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడంపట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఆయనకు నగరంతో ముఖ్యంగా బేగంపేటలోని స్వామి రామానంద తీర్థ స్మారక కేంద్రంతో విడదీయరాని అనుబంధం ఉంది. నిజాం పాలన, రజాకార్ల అరాచకాల నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగించాలని స్వామి రామానంద తీర్థ సారథ్యంలో పోరాటం చేశారు పీవీ. ఇందుకు స్వామి రామానంద తీర్థ బేగంపేట బ్రాహ్మణవాడిలో నివాసం కోసం ఏర్పాటు చేసుకున్న భవనమే వేదిక కావడం విశేషం. పీవీ ఎల్ఎల్బీ పూర్తిచేసి, బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్గా పనిచేస్తున్నా తన వృత్తిని వీడి రామానంద తీర్థ ఏర్పాటు చేసిన బృందంలో చేరారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలనేది వీరి లక్ష్యం. కర్ణాటకలో పుట్టి, మహారాష్ట్రలో విద్యాభ్యాసం చేసి హైదరాబాద్ సంస్థానం విమోచన కోసం పోరుబాట పట్టిన స్వామి రామానంద తీర్థ సారథ్యంలో చదువులు, వృత్తి, వ్యాపారాలు వదిలి ఉద్యమంలో పాల్గొన్నవారంతా బేగంపేటలోని రామానంద తీర్థ నివాసంలోనే సమావేశమయ్యేవారు. అప్పట్లో స్వామిజీకి పీవీ ప్రియ శిష్యుడు. అలా ఆయనకు బేగంపేటతో అనుబంధం ఏర్పడింది. తర్వాతి పరిణామాల్లో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమవ్వడం.. ఈ క్రతువులో భాగస్వాములైన రామానంద తీర్థ శిష్యుల్లో పీవీతోపాటు పాటిల్, ఎస్.బి.చవాన్లు కూడా తదనంతరం ముఖ్యమంత్రులు కావడం విశేషం. స్వామి రామానంద తీర్థ బేగంపేటలోనే ఉంటూ 1973లో మరణించారు. బేగంపేటలోని నివాస ప్రాంగణంలోనే ఆయనకు సమాధి కట్టారు. ఆ నివాసాన్నే 1975లో ఆయన పేరిట స్మారక కేంద్రంగా ఏర్పాటు చేశారు పీవీ.
సామాజిక సంక్షేమమే లక్ష్యం
స్వామి రామానంద తీర్థ స్మారక కేంద్రం వేదికగా పీవీ ఏర్పాటు చేసిన కమిటీ సామాజిక సంక్షేమం లక్ష్యంగా పనిచేసేది. యోగాభ్యాసంలో శిక్షణ, దేశభక్తి కార్యక్రమాలతో పాటు ఆది ఆయుర్వేదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే కాంక్షతో పీవీ కృషిచేశారు. ఔషధ మొక్కల పెంపకం, ఆయుర్వేద విశిష్టతల గురించి ప్రచారం చేసేవారు. తదనుగుణంగానే తర్వాత మొయినాబాద్లో ఈ కేంద్రం ఆధ్వర్యంలో ఔషధ వనాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.
పీవీకి ఇష్టమైన కారు..
పీవీ విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉండగా సొంత ఖర్చులతో ఓ కారు కొనుగోలు చేశారు. ఎంతో ఇష్టమైన దానిలోనే ఆయన నగరంలో ఎక్కువగా తిరుగుతుండేవారు. ఈ కారు స్వామి రామానందతీర్థ స్మారక కేంద్రంలో ఇప్పటికీ భద్రంగా ఉంది.
స్మారక గ్రంథాలయానికి విశేష ఆదరణ
సుమారు పదివేల అరుదైన పుస్తకాలు కలిగిన పీవీ నరసింహారావు స్మారక గ్రంథాలయం రామానంద తీర్థ కేంద్రంలోనే ఉంది. స్వాతంత్య్రోద్యమం నాటి నుంచి పీవీ హయాం వరకు చోటుచేసుకున్న ఘట్టాలు, ప్రముఖల జీవిత విశేషాలు, జాతీయ నేతల అరుదైన ప్రసంగాలు, అనాడు లోక్సభ, రాజ్యసభల్లో జరిగిన చర్చల విశేషాలు 1996లో ఏర్పాటైన ఈ గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయి. ఆయన సేకరించుకున్న, రచయితలు బహుమతిగా ఇచ్చిన పుస్తకాలున్నాయి.
బేగంపేట ఇష్టమైన ప్రాంతం
పీవీ నరసింహారావు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆపై భారత ప్రధానిగా విరామం లేకుండా ఉన్నా వీలు చిక్కినపుడల్లా బేగంపేటలోని రామానంద తీర్థ స్మారక కేంద్రానికి తప్పక వచ్చేవారు. తరువాతి క్రమంలో పీవీ కుమార్తె, ప్రస్తుత ఎమ్మెల్సీ వాణీదేవి, పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్రావు ఈ స్మారక కేంద్రం బాధ్యతలు చేపట్టి సమర్థంగా కొనసాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూసీ ప్రక్షాళనకు రూ.4వేల కోట్లు ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
[ 22-07-2024]
సోమవారం జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భేటీ అయ్యారు. -
ఆరోగ్యశ్రీ చికిత్స ధరలు సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం
[ 22-07-2024]
తెలంగాణలో ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలను ప్రభుత్వం సవరించింది. -
వర్షాలు.. భద్రాద్రి, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు: సీఎస్
[ 22-07-2024]
తెలంగాణలో వర్షాలు, వరదల ప్రభావంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. -
పొంగులేటికి మంత్రిగా కొనసాగే అర్హత లేదు: ఏలేటి
[ 22-07-2024]
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కంపెనీపై భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపణలు చేశారు. -
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
[ 22-07-2024]
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
కొత్త న్యాయ చట్టాలపై మీ వైఖరి చెప్పండి: ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ
[ 22-07-2024]
కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, వాటిపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
రుణమాఫీలో కోతలు పెట్టేందుకే ఆ నిబంధనలు: హరీశ్రావు
[ 22-07-2024]
రైతు రుణమాఫీకి రేషన్కార్డు, పీఎం కిసాన్ నిబంధన అమలు చేస్తున్నారని భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
స్మితా సభర్వాల్ ఫిజికల్లీ ఫిట్.. మెంటల్లీ అన్ఫిట్: బాల లత
[ 22-07-2024]
స్మితా సభర్వాల్ పోస్టు దివ్యాంగులను ఆందోళనకు గురి చేస్తోందని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ చీఫ్ బాల లత తెలిపారు. -
వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి.. పంటలు బాగా పండుతాయి: స్వర్ణలత భవిష్యవాణి
[ 22-07-2024]
నగరంలోని ఉజ్జయిని మహాకాళి బోనాల వేడుకలో భాగంగా భక్తురాలు స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. -
జూబ్లీహిల్స్లోని పబ్పై నార్కోటిక్స్ బ్యూరో పోలీసుల దాడులు
[ 22-07-2024]
జూబ్లీహిల్స్లోని జోరా పబ్లో నార్కోటిక్ బ్యూరో పోలీసులు తనిఖీలు చేశారు. ఓ ఈవెంట్లో పాల్గొన్న పలువురికి పరీక్షలు నిర్వహించారు. -
జగజ్జనని ఉజ్జయిని
[ 22-07-2024]
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. శివసత్తుల పూనకాలు.. పోతరాజుల వీరంగంతో ఆలయ పరిసరాలు హోరెత్తాయి. మహిళలు బోనాలు, సాక సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. -
మత్తు వీడేలా చదువుకునేలా..
[ 22-07-2024]
‘చదువులో ఒత్తిడి.. జీవితంలో స్థిరపడగలమా అనే ఆందోళనల నుంచి బయటపడేందుకు అప్పుడప్పుడు వీడ్ తీసుకుంటున్నాం. అదీ మిత్రుడి ద్వారా అలవాటైంది. తప్పని తెలిసినా మరో మార్గం లేక మత్తు ద్వారా ఒత్తిడిని అధిగమిస్తున్నాం. -
కాజేసిన సొమ్మునే దోచేసి
[ 22-07-2024]
కాయకష్టం చేయకుండా కేవలం ఫోన్కాల్తో రూ.కోట్లు కొట్టేస్తున్నారు. కాజేసిన సొమ్మును క్షణాల్లో పలు బ్యాంకు ఖాతాల్లోకి మార్చి పోలీసులను ఏమార్చుతున్నారు. -
యువకుడిని బలిగొన్న గుంతలు
[ 22-07-2024]
రోడ్డుపై గుంతల్లో వెళ్తుండగా బైక్ వెనక కూర్చున్న యువకుడు జారిపడగా అతనిపై మరో వాహనం వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయారు. అమీన్పూర్ ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. -
వెంచర్ వేద్దాం.. ప్రవాహాన్ని తిప్పేద్దాం..
[ 22-07-2024]
శంషాబాద్ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అభివృద్ది పనులకు శ్రీకారం చుడుతుండడంతో అంతేవేగంగా అక్రమార్కులు జలవనరులను కబ్జా చేస్తున్నారు. -
సామాజిక సేవ.. మరిచారా!
[ 22-07-2024]
సహజ వనరుల్ని ఉపయోగించుకుని లాభాలు గడిస్తున్న కర్మాగారాలు ప్రభావిత గ్రామాల్లో సేవా కార్యక్రమాల్ని చేపట్టాలి. ఇందుకోసమే ప్రభుత్వం ‘సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ..సీఎస్ఆర్)’ను అమలుచేస్తోంది. -
హోదా పెరిగి ఆరేళ్లు.. ఖాళీల భర్తీకి ఎన్నేళ్లో..
[ 22-07-2024]
జిల్లాలో దశాబ్దాలుగా తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీలు అందరికీ సుపరిచితం. తెలంగాణ ఆవిర్భావం, తరువాత కొత్త జిల్లాలు, మున్సిపాలిటీలపై గత ప్రభుత్వం దృష్టి సారించింది. -
ప్రజాస్వామ్యయుతంగా ఉండేది భాజపా మాత్రమే
[ 22-07-2024]
సిద్ధాంతపరంగా, కార్యకర్తల ఆధారంగా, ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునే పార్టీ భాజపా ఒక్కటేనని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. -
వానాకాలం.. జాగ్రత్తగా ఉందాం
[ 22-07-2024]
అసలే ఇది వర్షాకాలం జాగ్రత్తగా లేకుంటే ప్రమాదం బారిన పడక తప్పదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అన్ని ప్రాంతాలు తడిగా ఉంటాయి. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. -
విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి
[ 22-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ కోరారు. -
కబ్జాకు వత్తాసు ఉద్యానస్థలం ఖల్ల్లాస్
[ 22-07-2024]
గత లేఅవుట్లోని ఉద్యాన స్థలాలపై కన్నేశారు. ఎలాగైనా వాటిని కబ్జా చేసి సొమ్ము చేసుకోవాలనుకున్నారు. దీంతో పాత లేఅవుట్ స్థానంలో మరో లేఅవుట్ను(నిర్దేశించిన ఉద్యాన స్థలాలు లేకుండా) సృష్టించారు. -
ప్రభుత్వ లాంఛనాలతో జవాన్కు కన్నీటి వీడ్కోలు
[ 22-07-2024]
నంద్యాల జిల్లా అవుకు మండలం జూనుంతలకు చెందిన సీఐఎస్ఎఫ్ జవాన్ వెంకటేశ్వర్లు (32) హైదరాబాద్లో తుపాకీ పేలడంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. -
పబ్బుల గుప్పిట్లో హెరాయిన్
[ 22-07-2024]
మత్తు వ్యాపారులకు భయం లేకుండా పోతోంది. ప్రభుత్వం ప్రత్యేక విభాగాలతో నిఘా పెడుతున్నా రాజధానిలో డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి. -
9 మంది కబ్జాదారుల అరెస్ట్
[ 22-07-2024]
అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ స్థలం కబ్జాకు యత్నించిన 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ వెంకటరామిరెడ్డి వివరాల ప్రకారం.. -
ఉస్మానియాలో కూలిన సీలింగ్
[ 22-07-2024]
కురుస్తున్న వర్షాలకు ఉస్మానియా అవుట్ పేషంట్(ఓపీ) నమోదు కేంద్రం వద్ద ప్రమాదవశాత్తు పైకప్పు(సీలింగ్) కూలింది. శనివారం సాయంత్రం 4 నుంచి 6 వరకు ఓపీ కేంద్రంలో రోగులకు చీటీలు జారీ చేశారు. -
ఆన్లైన్లో కంప్యూటర్ శిక్షణ
[ 22-07-2024]
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆన్లైన్లో కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు ప్రోగ్రామ్ కోర్డినేటర్ శ్రీమాన్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడారు. -
బ్యాటరీ గోదాంలో రూ.50 లక్షల చోరీ
[ 22-07-2024]
బ్యాటరీ గోదాములోని అల్మారాలో దాచిపెట్టిన రూ.50 లక్షల నగదు చోరీకి గురయింది. ఈ సంఘటన కాటేదాన్లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... -
కొత్త బైక్ అదుపు తప్పి..ఒకరి మృతి
[ 22-07-2024]
కొత్త ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తున్న ఇద్దరు మిత్రులు అదుపు తప్పి ఫుట్పాత్పై పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రి లో చికిత్స పొందుతూ ఒకరు చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. -
సేవా లోపాలు.. సంస్థలకు జరిమానాలు
[ 22-07-2024]
సేవాలోపాలకు పాల్పడిన సంస్థలకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ కొరడా ఝుళిపించింది. వినియోగదారులు పడిన మానసిక వేదనకు పరిహారం, కేసు ఖర్చులు 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
గోదావరికి పోటెత్తుతున్న వరద.. భద్రాచలం వద్ద 49.04 అడుగుల నీటిమట్టం
-
అబుధాబి-దిల్లీ విమానంలో సాంకేతిక లోపం.. మస్కట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
మూసీ ప్రక్షాళనకు రూ.4వేల కోట్లు ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
-
ఆ జంట హద్దు మీరింది.. బిగ్బాస్ షోను ఆపండి: పోలీసులకు ఫిర్యాదు
-
భూ మార్పిడి పత్రాల మాయానికి యత్నం.. ప్రభుత్వం అనుమానం
-
వీటి ఆధారంగా ‘కల్కి’ రెండు భాగాలు: ఫొటో పంచుకున్న నాగ్ అశ్విన్