Hyderabad: సర్కారు జాగా దర్జాగా కబ్జా.. ఇంటి నంబర్లతో వెయ్యి గజాలకు దరఖాస్తు
గచ్చిబౌలి ఐటీ కారిడార్లో కొందరు అక్రమార్కులు తప్పుడు పత్రాలతో మాయాజాలం ప్రదర్శించి వెయ్యిగజాల సర్కారు స్థలాన్ని కబ్జా చేశారు.
జీవో నంబర్ 59తో క్రమబద్ధీకరణ
భవన నిర్మాణానికి జీహెచ్ఎంసీ అనుమతులు
ప్రభుత్వ స్థలంలో నిర్మించిన భవనం..
ఈనాడు,హైదరాబాద్, రాయదుర్గం, న్యూస్టుడే: గచ్చిబౌలి ఐటీ కారిడార్లో కొందరు అక్రమార్కులు తప్పుడు పత్రాలతో మాయాజాలం ప్రదర్శించి వెయ్యిగజాల సర్కారు స్థలాన్ని కబ్జా చేశారు. ఖాజాగూడలోని దిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా నివాసముంటున్న వీరు.. వెయ్యి గజాల స్థలాన్ని సొంతం చేసుకునేందుకు ఏళ్ల తరబడి ఆ స్థలంలో ఉంటున్నామంటూ తాముంటున్న ఇంటినంబర్లతోనే జీవో నంబర్ 59తో క్రమబద్దీకరించుకున్నారు. అనంతరం భవన నిర్మాణానికి జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకుని భవనాలు నిర్మిస్తున్నారు. ఇదంతా కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే పూర్తిచేశారు. తాముంటున్న ఇళ్లపై బ్యాంకులో రుణాలు కూడా తీసుకున్నారు. క్రమబద్దీకరించేటప్పుడు శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు పరిశీలించకపోవడం, జీహెచ్ఎంసీ అధికారులు వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా అనుమతులిచ్చేశారు.
జీహెచ్ఎంసీ అధికారులూ ఇలా చేశారు..
ఖాజాగూడలో రహదారి విస్తరణకు జీహెచ్ఎంసీ అధికారులు ఐదేళ్ల క్రితం స్థల సేకరణ చేపట్టారు. 1242 గజాల స్థలంలో 204 గజాలను తీసుకున్నారు. నష్టపరిహారంగా టీడీఆర్(ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్)ను అందజేశారు.
- తప్పుడు పత్రాలతో కబ్జాచేసుకున్న 1002 గజాల స్థలం ఉండగా... రెండేళ్ల క్రితం ప్రభుత్వ స్థలంలో మరో 234గజాల స్థలాన్ని కబ్జా చేసి మొత్తం 1236.5గజాల స్థలాన్ని ఓ స్థిరాస్తి సంస్థతో అభివృద్ధికి ఒప్పందం కుదుర్చుకున్నారు.
- గతేడాది ఏప్రిల్లో ఆ స్థలంలో రెండు సెల్లార్లు, ఒకగ్రౌండ్ ఫ్లోర్ సహా నాలుగు అంతస్థుల భవనం నిర్మించేందుకు జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును పరిశీలించిన జీహెచ్ఎంసీ అధికారులు పదిశాతం స్థలాన్ని మార్టిగేజ్ చేసుకుని నిర్మాణానికి అనుమతులిచ్చారు.
అలా కన్నేశారు... ఇలా ఆక్రమించుకున్నారు..
- ఖాజాగూడ సర్వే నం.28లో దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం 1982లో కోళ్లఫారాలు ఏర్పాటు చేసుకునేందుకు ఒక్కొక్కరికీ 242 గజాల చొప్పున స్థలాలను కేటాయించింది. వీటిని విక్రయించకూడదు.. బదిలీ చేయకూడదన్న నిబంధనలతో ప్రభుత్వం కేటాయించగా... కొన్నేళ్లయ్యాక చాలామంది లబ్ధిదారులు సొంతంగా ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారు. ఇందులో రెండు ఇళ్ల యజమానుల వారసులు నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు విక్రయించి సేల్డీడ్ చేశారు. వాటిని 2010లో పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
లబ్ధిదారుల నుంచి ఇళ్లను కొనుగోలు చేసిన వ్యక్తులు 2015లో పుప్పాలగూడలోని ఓ బ్యాంకులో తనఖా ఉంచి రూ.1.08కోట్ల రుణాన్ని తీసుకున్నారు.
రికార్డులు పరిశీలిస్తాం: కె.వెంకట్రెడ్డి, ఆర్డీవో రాజేంద్రనగర్
ఖాళీ స్థలాన్ని వేరే నిర్మాణానికి జతచేస్తే నిబంధల ప్రకారం జీవో నంబర్ 59తో క్రమబద్దీకరించకూడదు. ఆరేళ్ల క్రితం క్రమబద్దీకరించారంటే రికార్డులు పరిశీలిస్తాం. అక్రమాలు జరిగాయని తేలితే.. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బతకాలని ఉన్నా.. ఆత్మహత్య చేసుకుంటున్నా
[ 01-07-2024]
జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నాకు చనిపోవాలని లేదు.. అయినా ధైర్యం కూడగట్టుకుని బలవంతంగా ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని సెల్ఫీ వీడియోలో మాట్లాడిన మాటలు అందరినీ కలిచివేశాయి. -
నేటి నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
[ 01-07-2024]
రాష్ట్రంలోని వికారాబాద్-సంగారెడ్డి-కర్ణాటకలోని బీదర్ పట్టణాల మధ్య రహదారి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆరు రోజుల క్రితం దిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర పురోగతితో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలతో -
కూడళ్ల విస్తరణకు సై
[ 01-07-2024]
ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు యుద్ధ ప్రాతిపదికన నగరంలోని ఇరుకు కూడళ్లను విస్తరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే మూడు పోలీస్ కమిషనరేట్లు కూడళ్ల జాబితాను జీహెచ్ఎంసీకి అందించింది. -
ఖజానా వెల వెల.. పనులు చేసేదెలా..?
[ 01-07-2024]
రాజధానిలో కీలకమైన ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఆచూతూచి అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మూసీ నదిపై 14 వంతెనలను నిర్మించాలన్న గత ప్రభుత్వం ప్రతిపాదనల్లో ఒక్కటి మినహా మిగిలినవి పక్కన పెట్టాలని నిర్ణయించింది. -
కాలానికి తగ్గట్టు నైపుణ్యంతో సాన పట్టు
[ 01-07-2024]
ప్రపంచంతో పోటీ పడాలంటే మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఏ ఉద్యోగైనా నైపుణ్యం పెంచుకోవాల్సిందే.. వృత్తి నిపుణులు ఇందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2025లో 85 శాతం వృత్తి నిపుణులు నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించనున్నట్లు ‘అప్స్కిల్లింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ 2024-25’ నివేదిక వెల్లడించింది. -
అడ్డదారి.. అపాయకారి
[ 01-07-2024]
బడికెళ్లే పిల్లలకు ప్రభుత్వ చట్టాలు, నిబంధనల గురించి అవగాహన కల్పిస్తేనే భవిష్యత్తులో పాటిస్తారు. మంచి పౌరులుగా ఎదుగుతారు. అలాంటి చిన్నారుల కళ్ల ముందే అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తే...! -
ఖాళీ స్థలాలకు పన్ను కట్టండి
[ 01-07-2024]
జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం పలు పౌర సేవలను పునరుద్ధరించింది. మూడేళ్ల కిందట నిలిచిన నోటరీ స్థలాలకు ఇంటి నంబర్ల జారీ ప్రక్రియను, ఖాళీ స్థలాల పన్ను(వీఎల్టీ), జీఐఎస్ సర్వే వంటి కార్యక్రమాలను తాజాగా ప్రారంభించింది. -
ఎఫ్టీఎల్లో ఫంక్షన్హాళ్లు.. సర్కారు భూముల్లో రోడ్లు
[ 01-07-2024]
శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో సర్కారు భూములు, చెరువులను కబ్జా చేస్తున్న కొందరు.. ఏకంగా హిమాయత్సాగర్ చెరువునే లక్ష్యంగా చేసుకున్నారు. -
పాఠశాల బాగుపడేలా.. ఫలితం మెరుగుపడేలా
[ 01-07-2024]
విద్యా వ్యవస్థ సజావుగా సాగేందుకు సర్కారు రకరకాల యత్నాలు చేస్తోంది. విద్యార్థులు పాఠశాలలకు రావడం, తరగతులు జరగడం వంటివి నిత్యకృత్యమైనా ఫలితాల దగ్గరకొచ్చే సరికి ఎక్కడో అడుగున ఉంటున్నారు. -
నేటి నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
[ 01-07-2024]
రహదారి ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. అందుకే ఈ నెల 1 నుంచి నూతన రహదారి నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. -
గంజాయి స్మగ్లర్లు కటకటాల పాలు
[ 01-07-2024]
సినీఫక్కీలో పనస పండ్ల మధ్య 33 కిలోల గంజాయిని బొలెరో వాహనంలో తరలిస్తున్న స్మగ్లర్ల ముఠాను సైబరాబాద్ పోలీసులు శామీర్పేట టోల్గేట్ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
[ 01-07-2024]
ఒకే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు 37 ఏళ్ల తరువాత ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. ఘట్కేసర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1982-87 వరకు చదివిన 108 మంది పూర్వవిద్యార్థులు -
గోవా గవర్నర్ రచనకు తెలుగు అనువాదం ‘రామ చిలుక’
[ 01-07-2024]
గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై మళయాలంలో రాసిన ‘తథా వరతికిల్ల’ కథల సంపుటికి తెలుగు అనువారం‘రామ చిలుక’ పుస్తకాన్ని తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కొలకలూరి ఇనాక్ ఆవిష్కరించారు. -
నిరుద్యోగ జేఏసీతో చర్చలు విఫలం
[ 01-07-2024]
గాంధీ ఆసుపత్రిలో వారం రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్తో ఆదివారం రాత్రి ఎమ్మెల్సీ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, నాయకులు రియాజ్, -
సైక్లింగ్తో అన్నివిధాలా ఆరోగ్యం
[ 01-07-2024]
ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా శరీరం నిత్య నూతనంగా ఉంటుందని జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. -
బాలికపై అత్యాచారం కేసులో 10 మందికి రిమాండ్
[ 01-07-2024]
కాచిగూడకు చెందిన 12 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటనలో నేరేడ్మెట్ పోలీసులు 10 మందిని ఆదివారం రిమాండ్కు తరలించారు. జూన్ 25న కాచిగూడ ఠాణాలో జీరో ఎఫ్ఐఆర్ చేసి కేసును నేరేడ్మెట్కు బదిలీ చేశారు. -
మాదకద్రవ్యాలపై నిఘా.. పబ్లలో జాగిలాలతో తనిఖీలు
[ 01-07-2024]
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టల్లోని పబ్లపై మాదకద్రవ్యాల నిరోధక శాఖ అధికారులు, పోలీసులు దృష్టి సారించారు. -
పరిగిలో దొంగల హల్చల్
[ 01-07-2024]
తాళాలు వేసిన పలు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. బాధితులు, ఎస్సై సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి పురపాలికలోని టీచర్స్ కాలనీ, వెంకటేశ్వరకాలనీల్లో నివాసముంటున్న ఆనంద్రావు, శ్రీకాంత్, శ్రీనివాస్, సాయిరాం,
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
-
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్