Hyderabad Metro: మెట్రో ఎక్కండి.. దిగాక టికెట్ కొనండి.. ఓపెన్ లూప్ టికెటింగ్కు కసరత్తు
హైదరాబాద్ మెట్రోలో మరింత అధునాతన టికెటింగ్ విధానం చూడబోతున్నామా? అవుననే అంటోంది ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ.
దూరాన్ని బట్టి ఛార్జీల వసూలు
హైదరాబాద్ మెట్రోలో మరింత అధునాతన టికెటింగ్ విధానం చూడబోతున్నామా? అవుననే అంటోంది ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ. విదేశాల్లో మాదిరి ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ(ఓటీఎస్)ను తీసుకురాబోతోంది. ముందే టికెట్ తీసుకోవాల్సిన పనిలేదు.. దిగిన తర్వాత ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీ వసూలు చేస్తారు. కొత్త విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టాలనే ప్రణాళికలో మెట్రోరైలు సంస్థ ఉంది. అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండనుంది.
ఈనాడు, హైదరాబాద్
ప్రస్తుతం ఇలా..
ప్రజారవాణాలో టికెట్లు, వాటికి చెల్లింపు పద్ధతులపై ఇటీవల గణనీయమైన మార్పులు వచ్చాయి. కౌంటర్లలో సిబ్బంది విక్రయించే టికెట్లు మొదలు.. టికెట్ వెండింగ్ యంత్రాల ద్వారా పొందే విధానం, స్మార్ట్కార్డులు, మొబైల్ నుంచి వాట్సాప్లో టికెట్ పొందే వీలు.. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ల వ్యవస్థల ద్వారా వాటిని అనుమతించడం వరకు హైదరాబాద్ మెట్రోలో ఇప్పటివరకు చూసినవే.
లోపాలు
ప్రస్తుతం ఉన్న క్లోజ్డ్ లూప్ టికెటింగ్ విధానంలో ముందే టికెట్ తీసుకోవాలి. దిల్సుఖ్నగర్లో మెట్రో ఎక్కి ఖైరతాబాద్ వరకు టికెట్ తీసుకుని.. మనసు మార్చుకుని అమీర్పేటలో దిగుతామంటే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ల వ్యవస్థ అనుమతించదు. స్టేషన్ సిబ్బందికి చెబితే.. అదనంగా ప్రయాణించిన దూరానికి డబ్బులు తీసుకున్న తర్వాత బయటికి పంపిస్తారు. గమ్యస్థానానికి ముందే దిగుదామన్నా గేటు తెర్చుకోలేదు. స్టేషన్ సిబ్బందిని సంప్రదించాల్సిందే. ఓటీఎస్తో ఇలాంటి సమస్యలు ఉండదు. ప్రయాణించిన తర్వాతే దూరాన్ని బట్టి చెల్లింపులు చేస్తారు.
కొత్తగా
ఇప్పుడు ప్రజారవాణాలో ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగిస్తున్నారు. దీన్నే ఇక్కడా ప్రవేశపెట్టబోతున్నారు. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు(ఎన్సీఎంసీ) ద్వారా దీన్ని అమలు చేయాలనేది ప్రణాళిక. ఇప్పటికే మెట్రోరైలు స్టేషన్లలో ఎన్సీఎంసీకి సంబంధించిన టికెట్ వ్యవస్థలను అన్ని స్టేషన్లలో ఏర్పాటు చేశారు. ఇది అందుబాటులోకి వస్తే బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్ అన్నింటికీ ఒకటే కార్డుతో చెల్లించవచ్చు. మన దేశంలో 2022లో హరియాణా బస్సుల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. బస్సు ఎక్కేటప్పుడు కార్డును యంత్రం వద్ద చూపించాలి.. మళ్లీ దిగేటప్పుడు చూపిస్తే జీపీఎస్ ఆధారంగా ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీ తీసుకుంటుంది
విదేశాల్లో ఎప్పటినుంచో...
ఓపెన్ లూప్ చెల్లింపుల విధానం ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ 2012లోనే ప్రవేశపెట్టింది. అక్కడ విజయవంతం కావడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రజారవాణా వ్యవస్థల్లో అమలు చేస్తున్నారు. విదేశాలకు వెళ్లిన మనవాళ్లకు ఈ విధానం పరిచయమే. త్వరలో హైదరాబాద్లో మన మెట్రోలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఓపెన్ లూప్ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కంపెనీ కృషి చేస్తోంది ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ తమ ఆర్థిక నివేదికలో వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమకు అడ్డొస్తున్నాడని అంతమొందించారు
[ 29-06-2024]
ప్రేమకు అడ్డొస్తునాడని స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని రైలుపట్టాలపై పారేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. -
సర్కారు జాగా దర్జాగా కబ్జా.. ఇంటి నంబర్లతో వెయ్యి గజాలకు దరఖాస్తు
[ 29-06-2024]
గచ్చిబౌలి ఐటీ కారిడార్లో కొందరు అక్రమార్కులు తప్పుడు పత్రాలతో మాయాజాలం ప్రదర్శించి వెయ్యిగజాల సర్కారు స్థలాన్ని కబ్జా చేశారు. -
ఊదమంటే.. బ్రీత్ ఎనలైజర్ లాక్కెళ్లాడు!
[ 29-06-2024]
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసుల ఏమరుపాటును అదనుగా తీసుకున్న ఓ వాహనదారుడు బ్రీత్ ఎనలైజర్ను లాక్కుని వెళ్లాడు. -
ఏటీఎంలో డబ్బు.. ఎలా వచ్చిందబ్బా
[ 29-06-2024]
ఏటీంఎలో డబ్బు డ్రా చేసేందుకు యత్నించగా ఆలస్యం అవడం.. డబ్బు నిల్వ లేదనుకుని ఖాతాదారు వెళ్లి పోయిన తరువాత నగదు ప్రత్యక్షమైన ఘటన పాతబస్తీ హాషామాబాద్లో చోటుచేసుకుంది. -
ప్రాణాలు చెల్లాచెదురు
[ 29-06-2024]
ఎప్పటిలాగే పనుల్లో నిమగ్నమయ్యారు. మరికొద్ది నిమిషాల్లో విధులు ముగించుకుని ఇళ్లకు చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. అంతలోనే చెవులు చిల్లులుపడేలా ఒక్కసారిగా పేలుడు. భీతావహ వాతావరణం. శరీరాలు ముక్కలై చెల్లాచెదురుగా నేలరాలాయి.. -
గుప్పిట గులాబీ
[ 29-06-2024]
రాజధానిలో కాంగ్రెస్ బలం పెంచుకోవడానికి వేసిన వ్యూహంలో భారాస ఎమ్మెల్యేలు చిక్కుకుంటున్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్యతో మొదలైన మార్పు కొనసాగింపేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. -
11 నిమిషాలు.. రూ.18 లక్షలు
[ 29-06-2024]
సైబర్ నేరస్థుల చేతిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మోసపోయిన డబ్బుకు పోలీసులు నిమిషాల వ్యవధిలో అడ్డుకట్ట వేశారు. -
నిర్లక్ష్యంగా నీటి గుంత.. చిన్నారి మృత్యువాత
[ 29-06-2024]
అటవీశాఖ నర్సరీలో మొక్కలకు నీరందించేందుకు తవ్విన భారీ గుంతను నిర్లక్ష్యంగా వదిలివేయడంతో రెండేళ్ల బాలుడు మృత్యువాత పడిన ఘటన శామీర్పేటలో శుక్రవారం జరిగింది. -
అత్తామామ కలిసే కోడలిని కడతేర్చారు
[ 29-06-2024]
చాయ్ పెట్టలేదనే ఆగ్రహంతో కోడల్ని చంపిన హత్యకేసులో మామ కూడా సహకరించినట్లు అత్తాపూర్ పోలీసులు తేల్చారు. -
ఒకటికి నాలుగింతల లాభాలంటూ బురిడీ!
[ 29-06-2024]
అదో నకిలీ కంపెనీ. అక్కడ పెట్టుబడితో అద్భుతమైన లాభాలు వస్తాయంటూ సామాన్యులను నమ్మించి నట్టేట ముంచిన ఘరానా మోసగాడు కడప జిల్లా రాజంపేటకు చెందిన గాదిరాజు గురుప్రసాద్ రాజు (32)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్ తెలిపారు. -
నీటి, మురుగు సమస్యలపై నేడు డయల్ యువర్ ఎండీ
[ 29-06-2024]
జలమండలిలో శనివారం డయల్ యువర్ ఎండీ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 నుంచి 5.30 గంటల మధ్య ప్రజల నుంచి వచ్చే సమస్యలపై జలమండలి ఎండీ ఆశోక్రెడ్డి సమాధానాలు ఇస్తారు. -
సర్కారు బడులకు వెళ్తామన్నా.. వదలని ప్రైవేటు స్కూళ్లు
[ 29-06-2024]
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల బాధ భరించలేక సర్కారు బడుల్లో పిల్లలను చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్న తల్లిదండ్రులను ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు వదలడం లేదు. -
పబ్ల్లో డీజేలు.. మాదక ద్రవ్యాల విక్రేతలు
[ 29-06-2024]
జూబ్లీహిల్స్లోని పలు పబ్లలో డీజేలుగా వ్యవహరించే ఇద్దరు నిషేధిత మత్తుపదార్థాలతో అమీర్పేట ఆబ్కారీ అధికారులకు చిక్కారు. -
ఇసుకలో.. కాసుల వేట
[ 29-06-2024]
జిల్లాల్లోని యాలాల మండలంలో కాగ్నానది పరివాహక ప్రాంతాలైన కోకట్, బెన్నూర్ సంపు, సంగెంకుర్థు, విశ్వనాథ్పూర్, నాగాసాముందార్, దేవనూర్, యాలాల కాకరవేణి నది ఉండడంతో ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నాయి
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాసుల మత్తులో ‘దందా’నతాన.. అనుచరుల బార్ల కోసం మద్యం దుకాణాల మార్పు
-
కేయూ హాస్టల్ గదిలో ఊడిపడిన ఫ్యాను.. విద్యార్థినికి తీవ్ర గాయం
-
రాజీనామాపై దోబూచులాట.. వైవీయూ వీసీ, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని ఆందోళన
-
‘మర్డర్ ఆఫ్ రేణుకాస్వామి’ పేరిట వికీపీడియాలో కొత్త పేజీ..!
-
ఈవీఎంలను తప్పుపట్టడం హాస్యాస్పదం: సోము వీర్రాజు
-
సర్కారు జాగా దర్జాగా కబ్జా.. ఇంటి నంబర్లతో వెయ్యి గజాలకు దరఖాస్తు