- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Revanth Reddy: చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ కీలక సూచన.. అలాగైతేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి!
తెలంగాణలో ఉన్న సినిమా థియేటర్ల యజమానులు సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సూచించారు. దీనికి సంబంధించిన వీడియోలను థియేటర్లలో కచ్చితంగా ప్రదర్శించాలన్నారు. అలా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులు జారీ చేస్తామన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ సినీనటుడు చిరంజీవి ముందుకొచ్చి ఓ వీడియోను రికార్డు చేసి పంపించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
‘‘సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు నా సూచన. కొత్త సినిమా విడుదలైనప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు కానీ, సామాజిక సమస్యలైన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీ వంతు బాధ్యత వహించడం లేదని మా ప్రభుత్వం భావిస్తోంది. నేను మా అధికారులకు ఒక సూచన చేస్తున్నా. ఇక నుంచి ఎవరైనా కొత్త సినిమా విడుదలవుతున్న సందర్భంగా టికెట్ ధరలు పెంచమంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే, వాళ్లు డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణకు కృషి చేస్తూ ఒక వీడియో చేయాలి. మీరు విడుదల చేస్తున్న సినిమాలోని స్టార్స్తో ఆ వీడియో రూపొందించాలి. ఇది కచ్చితమైన షరతు. ఇండస్ట్రీలో ఎంత పెద్ద వాళ్లు వచ్చి రిక్వెస్ట్ చేసినా సరే, ఆ మూవీ తారగణంతో ఒకట్రెండు నిమిషాల నిడివి గల వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్లకు వెసులుబాటు, రాయితీలు ఇవ్వండి. ఎందుకంటే సమాజం నుంచి వాళ్లు ఎంతో తీసుకుంటున్నారు. సమాజానికి వాళ్లు కొంతైనా ఇవ్వాలి. అది వాళ్ల బాధ్యత. సినిమా కోసం వందల కోట్లు పెట్టుబడి పెట్టి, టికెట్లు రేట్లు పెంచుకుని సంపాదించుకుంటామన్న ఆలోచన మంచిదే. అది వ్యాపారం. కానీ, సామాజిక బాధ్యత కూడా అవసరం. డ్రగ్స్, సైబర్ క్రైమ్ను నియంత్రించకపోతే సమాజం నిర్వీర్యమవుతుంది. ఈ సమాజాన్ని కాపాడటానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉంది. ప్రభుత్వ నుంచి సహకారం కోరే వారు సమాజానికి సహకరించాలి. ఇదొక్కటే మా కండీషన్. సినిమా షూటింగ్ల అనుమతి కోసం వచ్చినప్పుడే ఈ సూచన చేయాల్సిందిగా పోలీస్శాఖను కోరుతున్నా. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ సినీనటుడు చిరంజీవి (Chiranjeevi) ముందుకొచ్చి ఓ వీడియోను రికార్డు చేసి పంపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా’’
‘‘60 ఏళ్ల పోరాటం, వందలాది విద్యార్థుల త్యాగంతో తెలంగాణ ఏర్పాటైంది. సమాజంలో వచ్చిన మార్పు, బలహీనతలను ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని నేరాలకు పాల్పడుతున్నారు. నేరాల కట్టడికి అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం. వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నాం. సిబ్బందితో పాటు నిధులు కేటాయిస్తున్నాం. సైబర్ నేరాలు అతిపెద్ద సమస్యగా మారాయి. వీటి నియంత్రణకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు. బాధితులు పోగొట్టుకున్న సొమ్మును తిరిగి ఇస్తున్నారు. ఇందుకు వారిని అభినందిస్తున్నాను’’
‘‘గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం వల్ల నేడు కళాశాలలు, స్కూళ్లలోనూ గంజాయి దొరుకుతోంది. వీటిపై చర్యలు తీసుకునేందుకు సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నాం. కేవలం సంపన్నులే కాకుండా మధ్యతరగతి, పేద యువకులు కూడా గంజాయికి బానిసలుగా మారుతున్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ అరికట్టడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి పదోన్నతులు కల్పిస్తాం. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి దీనికి సంబంధించిన విధివిధానాలు సిద్ధం చేస్తాం. మీడియా కూడా రాజకీయ వ్యవహారాలే కాకుండా డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి కృషి చేయాలని కోరుతున్నాం’’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్లివే.. ‘మీర్జాపూర్ 3’ వచ్చేస్తోంది!
ఈ వారం ఓటీటీ వేదికగా సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ల వివరాలివే. ఏ ప్రాజెక్టు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే? -
ఆ డెసిషన్ నా లైఫ్ని మార్చేసింది: ఆసక్తిగా ‘జనక అయితే గనక’ టీజర్
సుహాస్ ప్రధాన పాత్రలో సందీప్రెడ్డి బండ్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘జనక అయితే గనక’. తాజాగా టీజర్ విడుదలైంది.
-
ఇంటర్నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న ధనుష్ చిత్రం
ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. -
శరవేగంగా ‘విశ్వంభర’.. లేటెస్ట్ అప్డేట్ ఇదే!
చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వంభర’ అప్డేట్ వచ్చేసింది. -
జపాన్లో విడుదలకు సిద్ధమైన ఇండియన్ సినిమాలు.. ఏవంటే
ప్రభాస్, షారుక్ ఖాన్ల సినిమాలు జపాన్లో విడుదలకు సిద్ధమయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో సందడి నెలకొంది. -
ఘనంగా వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్.. తారల సందడి
నటి వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
విజయ్కి జోడీగా సమంత జత కుదిరిందా?
ప్రస్తుతం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (గోట్)గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు తమిళ అగ్ర కథానాయకుడు విజయ్. దీని తర్వాత హెచ్.వినోద్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. -
అంతర్గత శత్రువులతో పోరుకి సిద్ధం
యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ చిత్రాలపై ప్రేక్షకులకు మొదట్నుంచీ భారీ అంచనాలే ఉంటాయి. ఇప్పుడందులో లేడీ ప్రధాన స్పై సినిమా రూపుదిద్దుకుంటోందంటే అవి ఆకాశాన్నంటుతాయి. -
మూడు పాత్రలతో..
వెంకటేశ్ - అనిల్ రావిపూడి కలయిక అనగానే ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ చిత్రాలు గుర్తొస్తాయి. ముచ్చటగా మూడో చిత్రం కోసం ఆ ఇద్దరూ జట్టు కట్టారు. ఈసారి మూడు పాత్రల చుట్టూ సాగే కథతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. -
ఐదుగంటలు మేకప్ వేసుకున్నా!
‘ముంజ్యా’ విజయంలో శార్వరీ వాఘ్ది కీలకపాత్ర. ప్రేక్షకుల్ని భయపెట్టి, నవ్వించి మొత్తానికి సినిమాని రూ.వంద కోట్ల క్లబ్లో చేర్చింది. కానీ ఈ పాత్ర కోసం తనెంతో కష్టపడ్డానంటోంది. -
కొత్త జంటకు దెయ్యం పాట్లు
అదొక శాపగ్రస్తమైన ఊరు. ఆ ఊరిలో ప్రతి ఇంటికి రెండు గుమ్మాలుంటాయి. ఒకటి పెద్దది, ఇంకోటి చిన్నది. ప్రతి మంగళవారం దెయ్యం రాకపోకల కోసం రెండోదాన్ని తెరిచి ఉంచాల్సిందే. -
షారుక్కి స్విట్జర్లాండ్ పురస్కారం
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రతిష్ఠాత్మక 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. ఆయనను ‘పార్డో అలా కెరియరే అస్కోనా-లోకర్నో టూరిజం’ అవార్డుతో ఆగస్టు 10న సత్కరించనున్నారు. -
కథ విన్నప్పుడు అమ్మే గుర్తొచ్చేది
మనందరి కథతో ‘35 చిన్న కథ కాదు’ చిత్రం తెరకెక్కిందన్నారు రానా దగ్గుబాటి. ఆయన సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న చిత్రమిది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
విష్వక్సేన్.. లైలా
ఓ కథానాయకుడు తెరపైన అటు అమ్మాయిగా, ఇటు అబ్బాయిగా కనిపించి సందడి చేయడం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. యువ కథానాయకుడు విష్వక్సేన్ కూడా ‘లైలా’తో ఆ తరహా ప్రయత్నం చేస్తున్నారు. -
హైదరాబాద్ను చుట్టేసిన నభా నటేశ్.. కృతి సనన్ స్టైలిష్ డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
సినిమాల్లో నటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్
సినిమాల్లో నటించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. -
మరో మైలురాయి దాటిన ‘కల్కి 2898 ఏడీ’.. వసూళ్లు ఎంతంటే?
కలెక్షన్స్ పరంగా ‘కల్కి 2898 ఏడీ’ మరో మైలురాయి దాటింది. ఈ మేరకు చిత్ర బృందం పోస్టర్ విడుదల చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆచూకీ లేని ‘భోలే బాబా’.. బాధితుల్లో ఆక్రోశం!
-
విడాకుల రూమర్స్ వేళ.. పాండ్యా సతీమణి పోస్టు వైరల్
-
టీడీఆర్ బాండ్లలో అక్రమాలపై విచారణ.. నివేదికలు వచ్చాకే చర్యలు: మంత్రి నారాయణ
-
ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్లివే.. ‘మీర్జాపూర్ 3’ వచ్చేస్తోంది!
-
విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ చొరవ తీసుకోవాలి: సీఎం రేవంత్
-
ప్రధాని మోదీకి టీమ్ఇండియా ‘జెర్సీ’ బహూకరణ.. నంబర్ ఎంతంటే?