- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Palla Rajeshwar Reddy: భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అరెస్ట్
భారాసకు చెందిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అరెస్ట్ అయ్యారు.
హైదరాబాద్: భారాసకు చెందిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అరెస్ట్ అయ్యారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్నాయక్ను పరామర్శించేందుకు పల్లా వెళ్లారు. ఈ క్రమంలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్కు తరలించారు.
ఇదేనా మీ ప్రజా పాలన?: హరీశ్రావు
భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా పలువురిని అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కరించాల్సింది పోయి.. పరామర్శించేందుకు వెళ్తున్నవారిని అడ్డుకోవడం అప్రమాస్వామికమన్నారు. ఇదేనా మీ ప్రజా పాలన? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన నేతలకు నిరుద్యోగుల ఆవేదన ఎందుకు అర్థం కావడం లేదని నిలదీశారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని భారాస పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శారదా పీఠానికి కేటాయించిన ఆ 15 ఎకరాలు రద్దు చేయాలి: శ్రీనివాసానంద సరస్వతి
శారద పీఠానికి వైకాపా ప్రభుత్వం కొత్తవలసలో కేటాయించిన 15 ఎకరాలకు పైగా భూ కేటాయింపులను రద్దు చేయాలని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి కోరారు. -
రెవెన్యూ రికవరీ యాక్ట్తో ‘వైకాపా’ అక్రమార్జనను రాబట్టాలి: చంద్రబాబుకు యనమల లేఖ
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)కు తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. -
కాకినాడ కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
కాకినాడ జిల్లా అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. -
నిరవధిక నిరాహార దీక్ష విరమించిన ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్
ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత మోతీలాల్ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దానిని విరమిస్తున్నట్లు ప్రకటించారు. -
పిన్నెల్లితో మాజీ మంత్రుల ములాఖత్
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, పలువురు కుటుంబ సభ్యులు సోమవారం పరామర్శించారు. -
ఏపీ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చండి: లోక్సభలో తెదేపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 90% సీట్లు.. 56% ఓట్లతో ఎన్డీయే కూటమికి అద్భుత విజయాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
నల్గొండలోని భారాస కార్యాలయాన్ని కూల్చేయండి
నల్గొండలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా భారాస జిల్లా కార్యాలయాన్ని నిర్మించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. -
నేను అందరివాడిని
ప్రతి ఒక్క కుటుంబం గురించి ఆలోచించి అందరికీ న్యాయం చేయడాన్ని బాధ్యతగా తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాను అందరివాడినే తప్ప ఏ ఒక్కరివాణ్నీ కాదని స్పష్టం చేశారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీయే కూటమి అభ్యర్థులను సోమవారం ఖరారు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు. -
విభజన చట్టం హామీ ప్రకారం అమరావతికి సాయం చేయండి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం సాయం చేయాలని జనసేన లోక్సభాపక్ష నాయకుడు వల్లభనేని బాలశౌరి డిమాండ్ చేశారు. -
అగ్నివీరులపై రాహుల్గాంధీ అసత్య ప్రచారాలు
అగ్నివీరులు విధి నిర్వహణలో మరణిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్ముపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి ధ్వజమెత్తారు. -
లోక్సభ ప్యానెల్ స్పీకర్గా తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా.. 9 మందితో కూడిన ప్యానెల్ స్పీకర్ల జాబితాను సోమవారం ప్రకటించారు. వారిలో బాపట్ల తెదేపా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కూడా ఉన్నారు. -
తప్పులన్నీ బయటకు తీస్తాం..
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు ఆగిపోతాయని భయపెట్టారని.. కానీ ఎక్కడా అలా జరగలేదని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్కల్యాణ్ పేర్కొన్నారు. -
పరువు నష్టం కేసులో టీఎంసీ ఎంపీకి రూ.50 లక్షల జరిమానా
పరువు నష్టం కేసులో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలేకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో మాజీ దౌత్యవేత్తకు రూ.50లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. -
ఎంపీలను సస్పెండ్ చేసి తీసుకొచ్చారు: ఖర్గే
పార్లమెంటులో ఎంపీలను సస్పెండ్ చేయటం ద్వారా కొత్త నేర న్యాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. -
కోట్ల మంది హిందువులను అవమానించారు
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై ఇంటా బయటా భాజపా ధ్వజమెత్తింది. హిందువులంతా హింసాత్మక వాదులంటూ ఆయన కోట్ల మందిని అవమానపరిచారని విమర్శించింది. -
హైకోర్టు తీర్పు కేసీఆర్కు చెంపపెట్టులాంటిది
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేయడం మాజీ సీఎం కేసీఆర్కు చెంపపెట్టు లాంటిదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. -
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు
‘శేషాచలం అడవుల్లో కొట్టేసి, అక్రమంగా తరలించిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది. వైకాపా ప్రభుత్వంలో ఇక్కడి చెక్పోస్టుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్రెడ్డి పేరు చెబితే వదిలేశారు. -
శాఖల్లో మార్పులు జరిగితే సీతక్కకు హోం!
రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా ఐదారుగురికి చోటు దక్కొచ్చని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. -
ఏపీకి ప్రత్యేక హోదా హామీ నెరవేరాలన్న జైరాం రమేశ్
వెంకయ్యనాయుడికి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ శుభాకాంక్షలు తెలిపారు. భాజపా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో రాజ్యసభలో ఇచ్చిన హామీ త్వరలోనే నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. -
ప్రత్యేక హోదాపై తీర్మానం చేయండి
ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మానం చేసి, దాన్ని కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాలని సీఎం చంద్రబాబుకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సూచించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారత్-పాక్ సంబంధాలపై.. అమెరికా ఏమందంటే!
-
కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రాలు.. ఏ ఓటీటీలో ఏదంటే?
-
బీసీసీఐ స్పెషల్ ఫ్లైట్.. బార్బడోస్ నుంచి భారత్కు రానున్న టీమ్ఇండియా
-
బీఎస్ఎన్ఎల్ రూ.249 ప్లాన్.. 45 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా
-
రోజులో ఆ టైమ్ నాకు ఇంపార్టెంట్: దినచర్య గురించి జెఫ్ బెజోస్ ఏం చెప్పారంటే?
-
చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ కీలక సూచన.. అలాగైతేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి!