Hyderabad: ఉద్యోగం పేరిట యువతిపై ఇద్దరి అత్యాచారం
ఉద్యోగం పేరుతో యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో జరిగింది.
బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి దారుణం
సంగారెడ్డి, జనార్దన్రెడ్డి
మియాపూర్, న్యూస్టుడే: ఉద్యోగం పేరుతో యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో జరిగింది. మియాపూర్ సీఐ దుర్గారామలింగ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఉద్యోగ అన్వేషణలో నగరానికి వచ్చి ఉప్పల్లోని ఓ హాస్టల్లో ఉంటుంది. ఈ ఏడాది జనవరి నుంచి మియాపూర్లోని ఓ స్థిరాస్తి సంస్థ సేల్స్ ఎగ్జిక్యూటివ్లు సంగారెడ్డి, జనార్దన్రెడ్డి ఆమెకు పరిచయమయ్యారు. తమ సంస్థలో ఉద్యోగం ఉందంటూ నమ్మించిన వారు జూన్ 30న మియాపూర్ రావాలని కోరారు. ఉదయం ఆమె మియాపూర్కు రాగా స్థానికంగా ఓ హాస్టల్లో చేర్చారు.
శిక్షణ పేరుతో.. ఆ యువతికి స్థిరాస్తి వ్యాపారంపై అనుభవం లేకపోవడంతో శిక్షణ ఇప్పిస్తామంటూ నమ్మించారు. అదే రోజు మధ్యాహ్నం యాదగిరిగుట్ట సమీపంలోని వెంచర్లో శిక్షణ ఉందంటూ ఆమెను కారులో తీసుకెళ్లారు. అక్కడ మీటింగ్ తరువాత రాత్రి 9 గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణమయ్యారు. కారు మరమ్మతుల పేరుతో జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతంలో నిలిపి బలవంతంగా మత్తుమందు కలిపిన కూల్డ్రింక్ తాగించారు. తరువాత తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. జులై 1న బాధితురాలు అస్వస్థతకు గురి కావడంతో 2న ఉప్పల్ వెళ్లి అక్కడ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. అక్కడి పోలీసులు ఈ కేసును మియాపూర్కు బదిలీ చేయడంతో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. జనార్దన్రెడ్డి, సంగారెడ్డిలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిమ్స్ ప్రొఫెసర్ ప్రాచీకార్ ఆత్మహత్య
[ 06-07-2024]
నిమ్స్లో విధులు నిర్వర్తించే అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకార్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. -
భూమికి భూమి ఎక్కడ కేటాయించాలో ?.. రక్షణ శాఖకు అప్పగించేందుకు అన్వేషిస్తున్న హెచ్ఎండీఏ
[ 06-07-2024]
రాజీవ్ రహదారిలోని జింఖానా మైదానం నుంచి హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్, తూంకుంట, శామీర్పేట ఓఆర్ఆర్ వరకు మొత్తం 11.12 కిలోమీటర్ల పరిధిలో 300 ప్రైవేటు నిర్మాణాలను గుర్తించారు -
హుకుం జారీ చేసినా.. ఊహూ
[ 06-07-2024]
రాజధాని పరిధిలో ప్రతిపక్ష భారాసలో అసలేం జరుగుతోంది? పార్టీ అధిష్ఠానం మాటలను కార్పొరేటర్లు, ఇతర నేతలు పెడచెవిన పెడుతున్నారా? పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తోందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే చెబుతున్నారు. -
నీళ్లు పట్టుకున్నందుకు కొట్టి చంపారు
[ 06-07-2024]
దప్పిక తీర్చుకునేందుకు టీ దుకాణం వద్ద మంచి నీళ్లు పట్టుకునేందుకు వెళ్లిన క్రమంలో నెలకొన్న స్వల్ప వివాదం అమాయకుడి ప్రాణాలు బలి తీసుకుంది.మియాపూర్ ఠాణా పరిధిలో శుక్రవారం ఈ దారుణ ఘటన జరిగింది. -
మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధికి రక్షణ శాఖ స్థలాలు!
[ 06-07-2024]
మూసీ నది పరివాహక అభివృద్ధి కోసం పథకాన్ని రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం నదికి అటు, ఇటు ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు కార్యాచరణ చేపట్టింది. -
మాట్లాడుతుండగా ఫోన్ లాక్కున్నాడని హత్య
[ 06-07-2024]
ఫోన్ కోసం జరిగిన గొడవతో మద్యం మత్తులో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ అనుదీప్, స్థానికుల వివరాల ప్రకారం.. -
ఏకరూప దుస్తులు.. ఎప్పటికి అందేనో?
[ 06-07-2024]
పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోపు ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు అందరికీ ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన విద్యాశాఖ అధికారులు తరగతులు మొదలై ఇరవై రోజులైనా ఇంకా పంపిణీ కొనసాగిస్తున్నారు -
మోడల్ మార్కెట్ను అందుబాటులోకి తీసుకురండి
[ 06-07-2024]
కర్మన్ఘాట్ నిరుపయోగంగా ఉన్న మోడల్ మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు -
వాసన లేకుండా.. వ్యర్థాల నిర్వహణ
[ 06-07-2024]
చెత్త నుంచి బయోగ్యాస్, సేంద్రియ ఎరువు తయారుచేసే ఆధునిక పద్ధతిపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది -
ఓయూలో విద్యార్థుల అరెస్టు
[ 06-07-2024]
పలు నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఓయూ పోలీసులు విద్యార్థి నేతలను ముందస్తు అరెస్టుచేశారు. క్యాంపస్లోని వసతిగృహాలకువెళ్లి అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. -
అనిశా వలలో సర్కిల్ ఏఈ
[ 06-07-2024]
గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ఏఈ బలవంత్రెడ్డి శుక్రవారం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు చిక్కాడు. -
వసతి..ఏంటీ దుర్గతి..?
[ 06-07-2024]
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులను హాస్టల్ ఫీజులు బెంబేలెత్తిస్తున్నాయి. -
వేళకు రారు.. వేదన తప్పదు
[ 06-07-2024]
వికారాబాద్ పురపాలక సంఘంలో ఉద్యోగులు వేళకు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలు దాటినా విధులకు హాజరు కాలేదు. -
20 మంది గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
[ 06-07-2024]
అపరిశుభ్ర పరిసరాలు, కలుషిత ఆహారం విద్యార్థుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. వికారాబాద్ పట్టణ శివారు అనంతగిరిపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఇదే దుస్థితి నెలకొంది -
తొలగిన అవరోధం.. విస్తరణకు మోక్షం!
[ 06-07-2024]
హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి ఇరుకుగా, మలుపులతో ప్రమాదకరంగా మారింది. -
మనస్తాపంతో రైతు ఆత్మహత్య
[ 06-07-2024]
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఏఎస్ఐ మల్లేషం, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం మండలంలోని బూచన్పల్లికి చెందిన మహిపాల్రెడ్డి (41) వ్యవసాయం, కూలీ పనులు చేస్తుంటాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నో హెచ్చుతగ్గులు చూశా.. నన్ను గేలిచేశారు: మోదీతో హార్దిక్ పాండ్య
-
మార్కెట్కు అనుగుణంగా నైపుణ్య శిక్షణ: ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇకపై హాస్పిటల్కు వెళ్లం: ప్రెగ్నెన్సీ రూమర్స్పై సోనాక్షి సిన్హా
-
రెండు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలి: ఎంపీ లక్ష్మణ్
-
నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ వాయిదా..