Cyber Crime: గృహిణికి భర్త ఏడుపు వినిపించిన సైబర్ నేరస్థులు.. వీడియో కాల్ కట్ చేసి..
నగరానికి చెందిన ఓ గృహిణికి మంగళవారం సైబర్ నేరస్థుల నుంచి వీడియో కాల్ వచ్చింది. తెలిసినవారనుకొని కాల్ లిఫ్ట్ చేసింది.
నారాయణగూడ, న్యూస్టుడే: నగరానికి చెందిన ఓ గృహిణికి మంగళవారం సైబర్ నేరస్థుల నుంచి వీడియో కాల్ వచ్చింది. తెలిసినవారనుకొని కాల్ లిఫ్ట్ చేసింది. ఇక అంతే ఎదురుగా పోలీసులు ప్రత్యక్షమయ్యారు.ఒక్కసారిగా షాక్కు గురైంది. తాము సీబీఐ పోలీసులమని పరిచయం చేసుకున్నారు. మీ భర్త, కుమారుడిని డ్రగ్, మనీలాండరింగ్ కేసులో ‘నాన్-బెయిల్ వారెంట్’పై అరెస్టు చేశామన్నారు. వారిని కేసు నుంచి తప్పించాలన్నా.. ఇంటికి పంపించాలన్నా.. వెంటనే రూ.50 వేలు తాము చెప్పిన ఖాతాకు బదిలీ చేయాలని హుకుం జారీ చేశారు. పోలీసు సిబ్బంది వారిపై లాఠీలతో దాడి చేస్తున్నారు. ఎలా ఏడుస్తున్నారో వినండి.. అంటూ ఏడ్పులు వినిపించారు. దాంతో ఆమె నిజమేననుకొని వణికిపోయింది. తమవారితో సంప్రదిస్తానని ఆమె చెబితే.. వీడియోకాల్ కట్ చేస్తే మీ వాళ్లు ఇంటికి కాదు.. నేరుగా జైలుకెళ్తారని.. నేరస్థులు బెదిరించారు. డబ్బుల కోసం తొందరపెడుతూ.. మానసికంగా వేధించారు. ఓ సందర్భంలో ఆమె డబ్బులు పంపిద్దామనే నిర్ణయానికి కూడా వచ్చారు. కానీ ధైర్యం చేసి ఆ వీడియో కాల్ కట్ చేసింది. వెంటనే తన భర్తకు ఫోన్ చేయగా.. ఆయన స్వరం విని ఊపిరి పీల్చుకుంది. జరిగిందంతా చెప్పారు. ఇంటికి వెళ్లిన ఆయన ఆమెకు ధైర్యం చెప్పారు. హైదరాబాద్ సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమకు అడ్డొస్తున్నాడని అంతమొందించారు
[ 29-06-2024]
ప్రేమకు అడ్డొస్తునాడని స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని రైలుపట్టాలపై పారేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. -
ఊదమంటే.. బ్రీత్ ఎనలైజర్ లాక్కెళ్లాడు!
[ 29-06-2024]
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసుల ఏమరుపాటును అదనుగా తీసుకున్న ఓ వాహనదారుడు బ్రీత్ ఎనలైజర్ను లాక్కుని వెళ్లాడు. -
సర్కారు జాగా దర్జాగా కబ్జా.. ఇంటి నంబర్లతో వెయ్యి గజాలకు దరఖాస్తు
[ 29-06-2024]
గచ్చిబౌలి ఐటీ కారిడార్లో కొందరు అక్రమార్కులు తప్పుడు పత్రాలతో మాయాజాలం ప్రదర్శించి వెయ్యిగజాల సర్కారు స్థలాన్ని కబ్జా చేశారు. -
ఏటీఎంలో డబ్బు.. ఎలా వచ్చిందబ్బా
[ 29-06-2024]
ఏటీంఎలో డబ్బు డ్రా చేసేందుకు యత్నించగా ఆలస్యం అవడం.. డబ్బు నిల్వ లేదనుకుని ఖాతాదారు వెళ్లి పోయిన తరువాత నగదు ప్రత్యక్షమైన ఘటన పాతబస్తీ హాషామాబాద్లో చోటుచేసుకుంది. -
ప్రాణాలు చెల్లాచెదురు
[ 29-06-2024]
ఎప్పటిలాగే పనుల్లో నిమగ్నమయ్యారు. మరికొద్ది నిమిషాల్లో విధులు ముగించుకుని ఇళ్లకు చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. అంతలోనే చెవులు చిల్లులుపడేలా ఒక్కసారిగా పేలుడు. భీతావహ వాతావరణం. శరీరాలు ముక్కలై చెల్లాచెదురుగా నేలరాలాయి.. -
గుప్పిట గులాబీ
[ 29-06-2024]
రాజధానిలో కాంగ్రెస్ బలం పెంచుకోవడానికి వేసిన వ్యూహంలో భారాస ఎమ్మెల్యేలు చిక్కుకుంటున్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్యతో మొదలైన మార్పు కొనసాగింపేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. -
11 నిమిషాలు.. రూ.18 లక్షలు
[ 29-06-2024]
సైబర్ నేరస్థుల చేతిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మోసపోయిన డబ్బుకు పోలీసులు నిమిషాల వ్యవధిలో అడ్డుకట్ట వేశారు. -
నిర్లక్ష్యంగా నీటి గుంత.. చిన్నారి మృత్యువాత
[ 29-06-2024]
అటవీశాఖ నర్సరీలో మొక్కలకు నీరందించేందుకు తవ్విన భారీ గుంతను నిర్లక్ష్యంగా వదిలివేయడంతో రెండేళ్ల బాలుడు మృత్యువాత పడిన ఘటన శామీర్పేటలో శుక్రవారం జరిగింది. -
అత్తామామ కలిసే కోడలిని కడతేర్చారు
[ 29-06-2024]
చాయ్ పెట్టలేదనే ఆగ్రహంతో కోడల్ని చంపిన హత్యకేసులో మామ కూడా సహకరించినట్లు అత్తాపూర్ పోలీసులు తేల్చారు. -
ఒకటికి నాలుగింతల లాభాలంటూ బురిడీ!
[ 29-06-2024]
అదో నకిలీ కంపెనీ. అక్కడ పెట్టుబడితో అద్భుతమైన లాభాలు వస్తాయంటూ సామాన్యులను నమ్మించి నట్టేట ముంచిన ఘరానా మోసగాడు కడప జిల్లా రాజంపేటకు చెందిన గాదిరాజు గురుప్రసాద్ రాజు (32)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్ తెలిపారు. -
నీటి, మురుగు సమస్యలపై నేడు డయల్ యువర్ ఎండీ
[ 29-06-2024]
జలమండలిలో శనివారం డయల్ యువర్ ఎండీ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 నుంచి 5.30 గంటల మధ్య ప్రజల నుంచి వచ్చే సమస్యలపై జలమండలి ఎండీ ఆశోక్రెడ్డి సమాధానాలు ఇస్తారు. -
సర్కారు బడులకు వెళ్తామన్నా.. వదలని ప్రైవేటు స్కూళ్లు
[ 29-06-2024]
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల బాధ భరించలేక సర్కారు బడుల్లో పిల్లలను చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్న తల్లిదండ్రులను ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు వదలడం లేదు. -
పబ్ల్లో డీజేలు.. మాదక ద్రవ్యాల విక్రేతలు
[ 29-06-2024]
జూబ్లీహిల్స్లోని పలు పబ్లలో డీజేలుగా వ్యవహరించే ఇద్దరు నిషేధిత మత్తుపదార్థాలతో అమీర్పేట ఆబ్కారీ అధికారులకు చిక్కారు. -
ఇసుకలో.. కాసుల వేట
[ 29-06-2024]
జిల్లాల్లోని యాలాల మండలంలో కాగ్నానది పరివాహక ప్రాంతాలైన కోకట్, బెన్నూర్ సంపు, సంగెంకుర్థు, విశ్వనాథ్పూర్, నాగాసాముందార్, దేవనూర్, యాలాల కాకరవేణి నది ఉండడంతో ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నాయి
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కొండగట్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్
-
చంద్రబాబు కార్యసాధకుడు.. అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తారు: సుమన్
-
మహిళలూ.. భర్తలతో తాగుడు ఇలా మాన్పించండి: మంత్రి టిప్ వైరల్
-
ఏయూలో జరిగిన అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తాం: సి.ఎం.రమేశ్