తమ్ముడు వైకాపా సర్పంచి.. అన్న తుళ్లూరు సీఐ
గుంటూరు జిల్లాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన తుళ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమితులైన మాతంగి శ్రీనివాసరావు సొంత తమ్ముడు రవిబాబు వైకాపా సర్పంచిగా కొనసాగుతున్నారు.
ఈనాడు, అమరావతి: గుంటూరు జిల్లాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన తుళ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమితులైన మాతంగి శ్రీనివాసరావు సొంత తమ్ముడు రవిబాబు వైకాపా సర్పంచిగా కొనసాగుతున్నారు. అయినా కూటమి ప్రభుత్వంలో శ్రీనివాసరావుకు కీలకమైన తుళ్లూరు పోస్టింగ్ దక్కడం గమనార్హం. పోలీసు, తెదేపా, వైకాపా వర్గాల్లో ఆయన పోస్టింగ్ వ్యవహారంపై పెద్దచర్చ జరుగుతోంది. అదెలా సాధ్యమైందని ఎవరికి వారు తలలు పట్టుకుంటున్నారు. సొంత తమ్ముడు ఒకవైపు వైకాపా సర్పంచిగా ఉన్నా ఆయనకు ప్రాధాన్య పోస్టింగ్ దక్కడంపై విస్మయం వ్యక్తమవుతోంది. శ్రీనివాసరావు సొంతూరు రేపల్లె మండలం చౌడాయిపాలెం. ఆ గ్రామానికి ఆయన తమ్ముడు రవిబాబు గత ఎన్నికల్లో వైకాపా మద్దతుతో పోటీ చేసి గెలుపొందారు. తమ్ముడు గెలుపు కోసం అప్పట్లో ఆయన గ్రామానికి వచ్చి తెరవెనుక ఉండి మంత్రాంగం నడిపారని ఆ గ్రామ తెదేపా వర్గాలు అంటున్నాయి. రేపల్లెలో ఓ మండల వైకాపా నేతతో సత్సంబంధాలు కలిగిన సీఐ శ్రీనివాసరావు గత వైకాపా ప్రభుత్వంలో గుంటూరులో కీలకమైన లాలాపేట పోస్టింగ్ దక్కించుకున్నారు. ఆ మండల నేత సాయంతో ఎంపీ ద్వారా సిఫార్సు చేయించుకుని నాడు వైకాపా ప్రభుత్వంలోనూ మంచి పోస్టింగ్ పొందారు. అయితే అక్కడ పనిచేసే సమయంలో ఓ డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎమ్మెల్యే బంధువుల పిల్లలను కేసు నుంచి తప్పించి సొంత లబ్ధి చూసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అప్పట్లో ఆయన్ని స్టేషన్ బాధ్యతల నుంచి తప్పించి వీఆర్కు పంపారు. అలాంటి వివాదాస్పద వ్యక్తికి మంచి పోస్టింగ్ రావడం ప్రశ్నార్థకమవుతోంది.
నాడు తెదేపా వారిని ఇబ్బంది పెట్టారు
ప్రకాశం జిల్లా కొండపి సర్కిల్ సీఐగా పనిచేసిన సమయంలో ఈ సీఐ అక్కడ తెదేపా కార్యకర్తలు, నాయకులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. అప్పట్లో కొండెపి తెదేపా ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామిపై దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి. ఇలా అడుగడుగునా తెదేపా వారిని ఇబ్బంది పెట్టినా.. వైకాపా వారితో సత్సంబంధాలు కలిగినా సదరు అధికారికి ప్రాధాన్యం కలిగిన రాజధానిలోని తుళ్లూరు సర్కిల్ దక్కడం వెనుక కారణం ఏమై ఉంటుందని ఎవరికి వారు తల పట్టుకుంటున్నారు. ఈయన అత్యంత వివాదాస్పద అధికారిగా శాఖలో ముద్రపడ్డారు. అలాంటి అధికారికి కీలకమైన స్టేషన్ బాధ్యతలు అప్పగించడంపై పోలీసు వర్గాలే కాదు తెదేపా వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లెపూల నుంచి ఆయిల్ ఉత్పత్తి
[ 03-07-2024]
-
త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!
[ 03-07-2024]
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్(పగిడిపల్లి) - నల్లపాడు మధ్య రెండో రైల్వే లైను నిర్మాణం, విద్యుదీకరణ పనులు ఎట్టకేలకు పట్టాలెక్కాయి. -
జడ్పీ భూముల్లో రాబందులు
[ 03-07-2024]
ప్రజాప్రతినిధులు అంటే ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. ఇందుకు భిన్నంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్తుకు చెందిన భూములను అయిన వారికి పంచి పెట్టేందుకు వైకాపా ప్రజాప్రతినిధులు పోటీపడ్డారు. -
డెల్టాకు పట్టిసీమ నీళ్లు
[ 03-07-2024]
ఐదేళ్ల తర్వాత మళ్లీ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు పుష్కలంగా పారనున్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లు పట్టిసీమను వట్టిసీమగా మార్చి గతేడాది మాత్రం 33 టీఎంసీలు అత్యవసరంగా తీసుకున్నారు. -
ఓట్ల తొలగింపు కథ కంచికేనా..!
[ 03-07-2024]
జిల్లాలో పర్చూరు నియోజకవర్గంలో తెదేపా, ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని ఉద్దేశపూర్వకంగా ఫారం-7 దరఖాస్తులు చేసిన వైకాపా నాయకులు, కార్యకర్తలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
మట్టిని మింగిన ఘనులు
[ 03-07-2024]
అడిగేవారు లేరని... అడ్డుకునేందుకు ఎవరూ రారని... పర్యవేక్షించాల్సిన వారు పట్టించుకోరని.. మట్టి మాఫియా చెలరేగిపోతోంది. నిరుపేదల సొంతింటి కలను నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తోంది. -
అర్జీ ఒకటైతే.. రసీదులో మరోలా నమోదు
[ 03-07-2024]
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న అర్జీల నమోదులో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నప్పుడు ఆ సమస్యను పూర్తిగా చదవకుండానే రసీదుపై ఏదో ఒకటి రాసిచ్చేస్తున్నారు. -
సకుటుంబ సపరివార సమేతం!
[ 03-07-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నియామకాల్లో నాటి వైకాపా ప్రభుత్వ హయాంలో పూర్తిగా రాజకీయ జోక్యమే రాజ్యమేలింది. -
వీరు మారరా?
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలతో అంటకాగిన కొందరు సీనియర్ పోలీసు అధికారులు తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక కూడా తమ తీరు మార్చుకోవడం లేదు. -
ప్చ్.. ఫలించని శివశంకర్ ప్రయత్నాలు
[ 03-07-2024]
పల్నాడు జిల్లా గేయం సృష్టికర్తలో భాగస్వామినయ్యా.. నవోదయం పేరిట వినూత్న కార్యక్రమం తీసుకొచ్చా. -
రాజధానిలో ఇసుక దందా
[ 03-07-2024]
రాజధానిలో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. రాజధాని గ్రామం ఉద్దండరాయునిపాలెంలో ముళ్లపొదల చాటున కొందరు వ్యక్తులు అక్రమంగా ఇసుక నిల్వ చేసి రాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. -
నిబంధనల మేరకే ఉపాధ్యాయుల బదిలీలు: మంత్రి లోకేశ్
[ 03-07-2024]
విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో మంగళవారం నిర్వహించిన ‘ప్రజాదర్బార్’కు రాష్ట్రం నలుమూలల నుంచి వినతులు వెల్లువెత్తాయి. -
గుంటూరు ఛానల్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
[ 03-07-2024]
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న గుంటూరు ఛానల్ అభివృద్ధికి తెదేపా కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు. -
రైతుల ముసుగులో వైకాపా నాయకుడి దోపిడీ
[ 03-07-2024]
రైతుల ముసుగులో వైకాపా నాయకుడు దోపిడీకి పాల్పడుతున్నారు. పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వరి విత్తనాల బస్తాలను స్థానిక నాయకుడు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.