Andhra news: కటకటాల్లో అన్న.. తమ్ముడెక్కడ?.. పిన్నెల్లి అరెస్టుతో పల్నాట చర్చ
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు, ఆపై జైలుకు తరలించడంతో ఇప్పుడు అందరి దృష్టి పరారీలో ఉన్న తమ్ముడు వెంకట్రామిరెడ్డిపై పడింది. కేసులు నమోదైన నేపథ్యంలో అన్నతో పాటు తొలుత మాచర్ల నుంచి హైదరాబాద్కు వెంకట్రామిరెడ్డి వెళ్లారు.
ఇంకా తెలియని వెంకట్రామిరెడ్డి జాడ
ఈనాడు డిజిటల్, నరసరావుపేట
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు, ఆపై జైలుకు తరలించడంతో ఇప్పుడు అందరి దృష్టి పరారీలో ఉన్న తమ్ముడు వెంకట్రామిరెడ్డిపై పడింది. కేసులు నమోదైన నేపథ్యంలో అన్నతో పాటు తొలుత మాచర్ల నుంచి హైదరాబాద్కు వెంకట్రామిరెడ్డి వెళ్లారు. అక్కడి నుంచి అన్నదమ్ములిద్దరూ పరారయ్యారు. ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రమే ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకోవడం.. జూన్ 6 వరకూ ఎటువంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ముందస్తు ఉత్తర్వులు జారీ చేయడంతో గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు. కానీ తమ్ముడు మాత్రం మే 22 నుంచి కనిపించడం లేదు.
మాచర్లలో అన్న రామకృష్ణారెడ్డి కంటే తమ్ముడు వెంకట్రామిరెడ్డినే నియోజకవర్గంపై పట్టు పెంచుకున్నారు. అన్నింటా ఆధిపత్యం చలాయించేవారు. అప్పట్లో ‘షాడో ఎమ్మెల్యే’ మాదిరి పనులు చక్కబెట్టేవాడు. పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన అల్లర్లలో అన్న రెంటచింతల, మాచర్ల మండలాల్లో జరిగిన దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొంటే.. తమ్ముడు మాచర్ల పట్టణం, వెలుర్తి మండలాల్లో జరిగిన దాడుల్లో పాల్గొని దొరికినవారిని దొరికినట్టు దాడులకు తెగబడ్డారు. ఎటువంటి పదవి లేకపోయినా.. ప్రజాప్రతినిధి కాకపోయినా సరే పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి పోలీసులు సలాం కొట్టేవారు. పల్నాడుతో అనుబంధం ఉన్న ఒక ఐపీఎస్ కనుసన్నల్లోనే వెంకట్రామిరెడ్డి పరారీలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. పిన్నెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్ జాడ తెలియలేదు. తురకా కిశోర్కు వాటా ఇవ్వకపోవడంతో నా వ్యాపార్ని మూయించాడు. ఇప్పుడు వాళ్లకు కూడా శిక్ష పడాల్సిందేనంటూ కొందరు మాచర్ల వ్యాపారులు సామాజిక మాధ్యమాల వేదికగా గళం విప్పుతున్నారు.
గురజాల డీఎస్పీగా పని చేస్తున్న శ్రీనివాసరావు పిన్నెల్లి సోదరుల కేసులు దర్యాప్తు అధికారిగా ఉన్నారు. పోలీసు డిపార్ట్మెంట్ మంచి పేరున్న శ్రీనివాసరావు ఎలాగైనా వెంకట్రామిరెడ్డిని పట్టుకుంటారని చెబుతున్నారు. పరారీలో ఉన్న వెంకట్రామిరెడ్డి, తురక కిశోర్ను పట్టుకొచ్చి కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బాణసంచా వెలుగులు
బాణసంచా కాల్చిన మాచర్ల వాసులు
మాచర్ల(వెల్దుర్తి). న్యూస్టుడే: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడిని పోలీసులు బుధవారం మాచర్ల కోర్టుకు తీసుకువచ్చారు. అదే సమయంలో తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేసుకున్నారు. మాచర్లకు పట్టిన శని పూర్తిస్థాయిలో అంతమైందని నినాదాలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ పీడ వదిలింది
[ 30-06-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని రాజకీయాలకు కేంద్ర బిందువుగా మార్చిన వీసీ పి.రాజశేఖర్ ఉపకులపతి పదవికి రాజీనామా చేశారు. -
లోక్ అదాలత్లో 1,454 కేసుల పరిష్కారం
[ 30-06-2024]
జిల్లాలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 1,454 కేసులు పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు నిర్వహించిన లోక్ అదాలత్లో -
అయిదేళ్లుగా జీజీహెచ్ని నిర్లక్ష్యం చేశారు
[ 30-06-2024]
సర్వజనాసుపత్రిలో గత అయిదేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, చాలా సమస్యలు ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
ఎయిమ్స్కు నీటి కష్టాలు తీరినట్లే
[ 30-06-2024]
మంగళగిరి ఎయిమ్స్లో నీటి సమస్య పరిష్కారానికి తెదేపా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ అంశంపై ఆసుపత్రి డైరెక్టర్ మాధవానంద కార్ శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసిన నేపథ్యంలో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. -
పింఛను పండగకు సర్వం సిద్ధం
[ 30-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ దూసుకుపోతోంది. జూలై ఒకటో తేదీన ఇంటి వద్దకే వెళ్లి పెంచిన మొత్తాన్ని అందించాలని నిర్ణయించింది. -
అక్షర యోధుడు రామోజీరావు
[ 30-06-2024]
చివరి క్షణం వరకు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సేవలు చిరస్మరణీయమని రాజధాని రైతులు, మహిళలు పేర్కొన్నారు. -
ఇష్టానుసారం తోడేస్తున్నారు!
[ 30-06-2024]
గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వకాలు పునః ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టింది. ఇసుక విధానం గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
సముద్ర తీరం.. నిర్మానుష్యం
[ 30-06-2024]
వారాంతపు సెలవులు వస్తే చాలు తీరం వెంట ప్రధానంగా తెలంగాణ, విజయవాడ, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు చీరాల నియోజవర్గంలోని వాడరేవు, రామాపురం చేరుకుని కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేవారు. -
బాధ్యతలు చేపట్టిన యంత్రాంగం
[ 30-06-2024]
సహకార రంగం ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం వడివడిగా చర్యలు చేపట్టింది. 2018లో సహకార సొసైటీల పాలకవర్గాల సమయం ముగిసింది. -
మళ్లీ నీటి పరీక్షలు..
[ 30-06-2024]
జిల్లాలో చాలాచోట్ల చెరువుల్లో నీరు అడుగంటడం, నీటి శుద్ధి సక్రమంగా లేకపోవడంతో పలుచోట్ల అతిసార కేసులు బయటపడుతున్నాయి. -
డిప్యూటీ డెమో పోస్టు వారెలా భర్తీ చేస్తారు?
[ 30-06-2024]
ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు(ఆర్డీ) జోన్-3 పరిధిలోని డిప్యూటీ డెమో పోస్టును కడప ప్రధాన కేంద్రంగా ఉన్న జోన్-4 అధికారులు భర్తీ చేయడంపై వివాదం జరుగుతోంది. -
‘మాజీ సీఎస్ జవహర్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయండి’
[ 30-06-2024]
దళితుడైన పల్నాడు జిల్లా మాజీ కలెక్టర్ శివశంకర్పై తప్పుడు నివేదిక ఇచ్చిన వైకాపా హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జవహర్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేయాలని డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ లిటరేచర్ ఫౌండేషన్ అధ్యక్షుడు బి.విల్సన్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
-
నేనెప్పుడూ గణాంకాలు చూడను.. భారత్ గెలుపే ముఖ్యం: రోహిత్
-
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు
-
ఇదెంతో ప్రత్యేకం.. గత ఆరు నెలలు ఎలా ఉన్నాయో తెలుసు: హార్దిక్
-
టీమ్ఇండియా విజయం.. సినీ ప్రముఖుల ఆనందం.. ఎవరేమన్నారంటే?
-
తొలుత పెళ్లి.. తర్వాత అంత్యక్రియలు.. వారే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి