జలవనరులకు జవసత్వాలు
ఐదేళ్ల వైకాపా పాలనలో జలవనరుల కనీస నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వీర్యమయ్యాయి. వర్షాలకు వచ్చిన నీరు వచ్చినట్లే లీకేజీల ద్వారా వాగుల్లోకి వెళ్లిపోవడంతో ఆయకట్టుకు సాగు నీరు అందని పరిస్థితి.
రూ.1.85 కోట్లతో చెరువుల మరమ్మతులకు ప్రతిపాదనలు
యుద్ధప్రాతిపదికన పనులు చేయడానికి కసరత్తు
ఈనాడు, అమరావతి
ఐదేళ్ల వైకాపా పాలనలో జలవనరుల కనీస నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వీర్యమయ్యాయి. వర్షాలకు వచ్చిన నీరు వచ్చినట్లే లీకేజీల ద్వారా వాగుల్లోకి వెళ్లిపోవడంతో ఆయకట్టుకు సాగు నీరు అందని పరిస్థితి. గతంలో భారీ వర్షాలకు కట్టలు తెగిపోయాయి. అలుగులు కోతకు గురయ్యాయి. షట్టర్లు తుప్పుపట్టిపోయాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జలవనరుల ప్రాధాన్యతను గుర్తించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయడానికి యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసింది. చిన్ననీటి పారుదలశాఖ ఇంజినీర్లు రూ.1.85కోట్ల అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. చెరువుల నుంచి నీరుపారే అలుగులు, స్లూయిజ్లు, తూములు, షట్టర్లు మరమ్మతు చేయనున్నారు. అదేవిధంగా బలహీనంగా ఉన్న కట్టలను బలోపేతం చేయనున్నారు. జులై నెలలోనే మరమ్మతులు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇందులో అత్యవసరమైన పనులకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతిపాదనలు పంపారు.
వర్షపు నీటిని ఒడిసిపట్టి..
వర్షం ద్వారా వచ్చే నీరు వృథాగా వాగుల్లోకి పోకుండా చెరువులకు చేరేలా చూస్తారు. ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి చెరువుల్లో నిల్వచేసేలా అంచనాలు సిద్ధం చేశారు. చెరువులకు చేరిన నీరు లీకేజీల ద్వారా వృథా కాకుండా మరమ్మతు ద్వారా అరికడతారు. సప్లయి ఛానళ్లను బాగు చేసి ఆయకట్టు పొలాలకు సాగు నీరు అందిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ముప్పాళ్ల, సత్తెనపల్లి, ఈపూరు, శ్యావల్యాపురం, గురజాల, రెంటచింతల, దుర్గి, తాడేపల్లి, యడ్లపాడు, నరసరావుపేట, రొంపిచర్ల, నకరికల్లు మండలాల్లో 19 చెరువులు మరమ్మతు చేస్తారు. ఇందుకు రూ.1.85కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రభుత్వానికి వెళ్లిన ప్రతిపాదనలపై ఈనెల 5న ఉన్నతాధికారులు సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. అక్కడి నుంచి ఆమోదం వచ్చిన వెంటనే స్వల్పకాలిక టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులు అప్పగించి పూర్తి చేస్తారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున వీలైనంత తొందరగా బాగు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. కొన్ని చెరువులకు వర్షాల ద్వారా నీరు చేరుతుండగా.. మరికొన్నింటకి సాగర్ కాలువల నుంచి నీరు చేరే వెసులుబాటు ఉంది. వీటి కింద వేల ఎకరాల్లో ఆయకట్టుకు కొన్నాళ్లుగా సాగునీరు అందని పరిస్థితి. వీటన్నిటిని బాగు చేస్తే పంటలకు సాగు నీరు అందడంతో పాటు భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి. చెరువులో నీటిని నిల్వ చేస్తే చేపల పెంపకానికి కూడా ఉపయోగపడతాయి. దీంతో ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చిన్ననీటి పారుదలశాఖ కార్యనిర్వాహక ఇంజినీరు ప్రసాద్ తెలిపారు. తొలుత రూ.10కోట్లతో అంచనాలు తయారు చేశామన్నారు. అత్యవసర పనులకు మాత్రమే అంచనాలు పంపాలని కోరడంతో మరోసారి క్షేత్రస్థాయి ఇంజినీర్లతో సమీక్షించి తాజాగా రూ.1.85కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు గొప్పలు.. నేడు తిప్పలు..
[ 06-07-2024]
బడుల రూపురేఖలు మార్చేస్తామని నాడు వైకాపా సర్కారు చెప్పింది నిజమే.. వాటి రూపును దారుణంగా మార్చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. -
పాత్రధారులు సరే.. సూత్రధారులు ఎక్కడ?
[ 06-07-2024]
ఉమ్మడి గుంటూరులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్, 1బీ, నకిలీ చిరునామా ధ్రువపత్రాలు పెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారు. -
ఉల్లంఘనలు దండి.. ఆదాయానికి గండి..
[ 06-07-2024]
గుంటూరు నగర పట్టణ ప్రణాళిక విభాగం అవినీతి, అక్రమాల్లో మునిగితేలుతోంది. భవన అనుమతుల ఫీజుల రూపేణా నగరపాలికకు రావాల్సిన ఆదాయానికి ప్రణాళికాధికారులే గండికొట్టి తమ సొంత జేబులు నింపుకొంటున్నారు. -
నాణ్యత డొల్ల.. కష్టాలు నిలువెల్లా
[ 06-07-2024]
‘నాడు-నేడు’ పనులతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం.. మునుపెన్నడూ లేనిరీతిలో తరగతి గదులు నిర్మించాం.. సకల సౌకర్యాలు కల్పించాం’ అంటూ ఊదరగొట్టిన మాజీ సీఎం జగన్ మాటలన్నీ బూటకాలేనని నాటి లోపాలు నేడు ఒక్కొకటిగా బయటపడుతున్నాయి. -
పిన్నెల్లి అరాచకాలపై చర్చిద్దామా?
[ 06-07-2024]
‘మీకు ధైర్యముంటే మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేద్దాం.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్ని ఆస్తులు దోపిడీ చేశాడో, ఎంత గ్రానైట్ తరలించాడో.. ఎంత గ్రావెల్ అమ్ముకున్నాడో చర్చిద్దామా?’ అంటూ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాజీ సీఎం జగన్కు సవాల్ విసిరారు. -
లక్ష్యం 100 రోజులు.. 3,600 ఇళ్లు
[ 06-07-2024]
జిల్లాలో గృహ నిర్మాణాలను వేగవంతం చేసి లబ్ధిదారులకు అందజేసేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. -
జలవనరులకు జవసత్వాలు
[ 06-07-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో జలవనరుల కనీస నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వీర్యమయ్యాయి. -
బాలికలూ.. ఇబ్బందులు ఎదురైతే చెప్పండి
[ 06-07-2024]
లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినులు వెంటనే తమకు జరిగిన అన్యాయం ఇంట్లో తల్లిదండ్రులు, పోలీసులకు తెలియజేయడం ద్వారా అటువంటి నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా బాలికా పరిరక్షణ అధికారులు శ్రీప్రియ, కృష్ణ పేర్కొన్నారు. -
ఓపీకి వెళితే బీపీ ఖాయం!
[ 06-07-2024]
గుంటూరులోని సర్వజన ఆసుపత్రిలో ఓపీ సేవలందించేందుకు 11 కౌంటర్లున్నాయి. 70 మందికిపైగా నర్సింగ్ విద్యార్థులను నియమించారు. -
ఆరు జీవితాలకు వరప్రసాదం!
[ 06-07-2024]
పుట్టెడు దుఃఖంలోనూ పలువురి ప్రాణాలు కాపాడేందుకు ఆ కుటుంబం ముందుకు వచ్చింది. -
‘పిన్నెల్లిని జగన్ పరామర్శించడం సిగ్గుచేటు’
[ 06-07-2024]
ప్రజలు తమ పవిత్రమైన ఓటు వేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ను ధ్వంసం చేసి జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి జైలుకు వెళ్లి పరామర్శించడం సిగ్గుచేటని -
జల్సాలకు అలవాటు పడ్డారు.. దొంగతనాల వైపు మళ్లారు
[ 06-07-2024]
జల్సాలకు అలవాటు పడిన యువకులు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతూ పొలీసులకు దొరికిపోయారు. -
హైకోర్టు న్యాయవాదికి జైలుశిక్ష, జరిమానా
[ 06-07-2024]
భార్యను వేధించిన కేసులో హైకోర్టు న్యాయవాది నిమ్మల ప్రేమ్రాజ్కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ మంగళగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు.