తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో
మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వైకాపా మూకలు 70 మందికి పైగా దౌర్జన్యంగా ప్రధాన గేటును ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు చెబుతున్నారు.
పోలీసుల దర్యాప్తు ముమ్మరం
కొత్తగా 27 మంది గుర్తింపు
ఈనాడు, అమరావతి
మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వైకాపా మూకలు 70 మందికి పైగా దౌర్జన్యంగా ప్రధాన గేటును ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు చెబుతున్నారు. 2021 అక్టోబరు 19న వైకాపా అల్లరిమూకలు మారణాయుధాలు, రాళ్లు, కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేసిన విషయం తెల్సిందే. దాడిలో కార్యాలయ సిబ్బందితో పాటు తెదేపా నాయకులు పలువురికి రక్తగాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వైద్య నివేదికను సేకరించిన పోలీసులు దర్యాప్తులో భాగంగా చేసుకున్నారు. కార్యాలయంలో సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు కూడా చోరీ చేశారు. పి.సాయిబద్రీనాథ్ ఫిర్యాదు మేరకు మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో వైకాపా అధికారంలో ఉండడంతో పోలీసులు కేసును పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారడం, అప్పట్లో ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ స్థానంలో తుషార్డూడీ రావడం, ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి వచ్చిన తర్వాత కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో తీసుకున్న సీసీ టీవీ ఫుటేజీలతో పాటు 8మంది సాక్షులను విచారించి వారిచ్చిన సమాచారం ఆధారంగా కేసు దర్యాప్తులో పోలీసులు మరికొన్ని సెక్షన్లు నమోదు చేశారు. 8 మంది సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా, బాధితుడు సాయిబద్రీనాథ్ ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు నిందితులను నిర్ధారించుకున్నారు. వీటితో పాటు కాజా టోల్ప్లాజా వద్ద సీసీ ఫుటేజీ సేకరించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలను పరిశీలించి నిందితులను గుర్తించారు. దాడి రోజు వినియోగించిన వాహనాలు, నిందితుల కదలికలు, టోల్ప్లాజా వద్ద తీసుకున్న సీసీటీవీ ఫుటేజీ కేసులో కీలక సాక్ష్యాలుగా మారాయి. మరికొందరు నిందితులను గుర్తించడానికి నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
కొత్తగా చేర్చిన పేర్లు ఇవే..
లేళ్ల అప్పిరెడ్డి, వైకాపా ఎమ్మెల్సీ (గుంటూరు), దేవినేని అవినాష్ (విజయవాడ), అంబేడ్కర్, కార్పొరేటర్ (విజయవాడ), అరవ సత్యం (విజయవాడ నగరపాలక సంస్థ వైకాపా ఫ్లోర్ లీడర్), అచ్చాల వెంకటరెడ్డి (30వ డివిజన్ కార్పొరేటర్) (గుంటూరు), బత్తుల దేవానంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ (గుంటూరు), బొచ్చు మురళి, చల్లా శీను, చల్లా వెంకటస్వామి (విజయవాడ), గేదెల రమేష్, 22వ డివిజన్ వైకాపా కార్పొరేటర్ భర్త (గుంటూరు), గిరిరాము (గుంటూరు), గోకమళ్ల ప్రసాద్, కసగాని దుర్గారావు (విజయవాడ), ఖాజా మెహిద్దీన్ (గుంటూరు), కొండ్ర కొండ ఆటోడ్రైవర్ (విజయవాడ), కృష్ణారెడ్డి (గుంటూరు మిర్చియార్డు మాజీ డైరెక్టర్), మద్దెల సాయి (విజయవాడ), మార్కెట్బాబు, నూనె ఉమామహేశ్వరరెడ్డి (గుంటూరు), పంతల సాయి, పోపల రాజా (విజయవాడ), రబ్బాని(ఏఆర్రబ్బానీ) లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు (గుంటూరు), సాదు రాజేష్, 23వ డివిజన్ వైకాపా కార్పొరేటర్ భర్త (గుంటూరు), సంతోష్ డీజే ఆపరేటర్ (విజయవాడ), షేక్ రోషన్(కార్పొరేషన్ రోషన్) (గుంటూరు), సిరాజ్ (విజయవాడ), స్టార్ మస్తాన్ టైర్ డిపో (గుంటూరు)కు చెందినవారిగా గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు గొప్పలు.. నేడు తిప్పలు..
[ 06-07-2024]
బడుల రూపురేఖలు మార్చేస్తామని నాడు వైకాపా సర్కారు చెప్పింది నిజమే.. వాటి రూపును దారుణంగా మార్చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. -
పాత్రధారులు సరే.. సూత్రధారులు ఎక్కడ?
[ 06-07-2024]
ఉమ్మడి గుంటూరులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్, 1బీ, నకిలీ చిరునామా ధ్రువపత్రాలు పెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారు. -
ఉల్లంఘనలు దండి.. ఆదాయానికి గండి..
[ 06-07-2024]
గుంటూరు నగర పట్టణ ప్రణాళిక విభాగం అవినీతి, అక్రమాల్లో మునిగితేలుతోంది. భవన అనుమతుల ఫీజుల రూపేణా నగరపాలికకు రావాల్సిన ఆదాయానికి ప్రణాళికాధికారులే గండికొట్టి తమ సొంత జేబులు నింపుకొంటున్నారు. -
నాణ్యత డొల్ల.. కష్టాలు నిలువెల్లా
[ 06-07-2024]
‘నాడు-నేడు’ పనులతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం.. మునుపెన్నడూ లేనిరీతిలో తరగతి గదులు నిర్మించాం.. సకల సౌకర్యాలు కల్పించాం’ అంటూ ఊదరగొట్టిన మాజీ సీఎం జగన్ మాటలన్నీ బూటకాలేనని నాటి లోపాలు నేడు ఒక్కొకటిగా బయటపడుతున్నాయి. -
పిన్నెల్లి అరాచకాలపై చర్చిద్దామా?
[ 06-07-2024]
‘మీకు ధైర్యముంటే మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేద్దాం.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్ని ఆస్తులు దోపిడీ చేశాడో, ఎంత గ్రానైట్ తరలించాడో.. ఎంత గ్రావెల్ అమ్ముకున్నాడో చర్చిద్దామా?’ అంటూ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాజీ సీఎం జగన్కు సవాల్ విసిరారు. -
లక్ష్యం 100 రోజులు.. 3,600 ఇళ్లు
[ 06-07-2024]
జిల్లాలో గృహ నిర్మాణాలను వేగవంతం చేసి లబ్ధిదారులకు అందజేసేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. -
జలవనరులకు జవసత్వాలు
[ 06-07-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో జలవనరుల కనీస నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వీర్యమయ్యాయి. -
బాలికలూ.. ఇబ్బందులు ఎదురైతే చెప్పండి
[ 06-07-2024]
లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినులు వెంటనే తమకు జరిగిన అన్యాయం ఇంట్లో తల్లిదండ్రులు, పోలీసులకు తెలియజేయడం ద్వారా అటువంటి నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా బాలికా పరిరక్షణ అధికారులు శ్రీప్రియ, కృష్ణ పేర్కొన్నారు. -
ఓపీకి వెళితే బీపీ ఖాయం!
[ 06-07-2024]
గుంటూరులోని సర్వజన ఆసుపత్రిలో ఓపీ సేవలందించేందుకు 11 కౌంటర్లున్నాయి. 70 మందికిపైగా నర్సింగ్ విద్యార్థులను నియమించారు. -
ఆరు జీవితాలకు వరప్రసాదం!
[ 06-07-2024]
పుట్టెడు దుఃఖంలోనూ పలువురి ప్రాణాలు కాపాడేందుకు ఆ కుటుంబం ముందుకు వచ్చింది. -
‘పిన్నెల్లిని జగన్ పరామర్శించడం సిగ్గుచేటు’
[ 06-07-2024]
ప్రజలు తమ పవిత్రమైన ఓటు వేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ను ధ్వంసం చేసి జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి జైలుకు వెళ్లి పరామర్శించడం సిగ్గుచేటని -
జల్సాలకు అలవాటు పడ్డారు.. దొంగతనాల వైపు మళ్లారు
[ 06-07-2024]
జల్సాలకు అలవాటు పడిన యువకులు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతూ పొలీసులకు దొరికిపోయారు. -
హైకోర్టు న్యాయవాదికి జైలుశిక్ష, జరిమానా
[ 06-07-2024]
భార్యను వేధించిన కేసులో హైకోర్టు న్యాయవాది నిమ్మల ప్రేమ్రాజ్కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ మంగళగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు.