విత్తన లోపం.. రైతుకు శాపం
2022లో దుగ్గిరాల.. 2023లో పొన్నూరు మండలాల్లో వరిలో కేళీలు వచ్చి రైతులు నష్టపోయారు. గతేడాది పొన్నూరు మండలంలోని సౌపాడు, జడవల్లి, వడ్డిముక్కల, నిడుబ్రోలు గ్రామాల్లో వరి పంటలో కేళీలు బయటపడ్డాయి.
వరిలో కేళీలతో కష్టాలు
ఏటా బయటపడుతుండడంతో నష్టాలు
ఈనాడు-అమరావతి
2022లో దుగ్గిరాల.. 2023లో పొన్నూరు మండలాల్లో వరిలో కేళీలు వచ్చి రైతులు నష్టపోయారు. గతేడాది పొన్నూరు మండలంలోని సౌపాడు, జడవల్లి, వడ్డిముక్కల, నిడుబ్రోలు గ్రామాల్లో వరి పంటలో కేళీలు బయటపడ్డాయి. పంట 100 రోజుల దశ దాటిన తర్వాత ఈనే దశలో విత్తన లోపాలు బహిర్గతమవుతున్నాయి. రైతులు కేళీలను గుర్తించి సంబంధిత కంపెనీ ప్రతినిధులకు సమాచారమిస్తే అరకొరగా పరిహారం ఇచ్చి సర్దుబాటు చేసుకుంటున్నారు. రైతుల వద్ద బిల్లులు లేకపోవడం, వ్యాపారులు విత్తనాలు విక్రయించే సమయంలో షరతులు విధించడంతో రైతులకు కొన్నిసార్లు నష్టపరిహారం అందడం లేదు. ఈ ఏడాది కూడా రెండు రోజుల వ్యవధిలో పొన్నూరు నియోజకవర్గంలో రెండు లారీల వరి విత్తనాలు తెలంగాణ రాష్ట్రం నుంచి రైతులు కొనుగోలు చేసి తీసుకువచ్చారు. వరి సాగుదారులకు ప్రభుత్వం నుంచి విత్తనాల సరఫరా లేకపోవడంతో పూర్తిగా ప్రైవేటు కంపెనీల విత్తనాలపైనే ఆధారపడుతున్నారు. దీనివల్ల ఏటా సమస్యలు వచ్చి రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఈసారి విత్తన కొరత ఎక్కువగా ఉండటంతో కేళీల సమస్య ఎక్కువగా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
రాయలసీమ, తెలంగాణ నుంచి సరఫరా
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 లక్షల హెక్టార్లకుపైగా వరి పంట సాగు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో సింహభాగం బీపీటీ-5204 రకం వరి విత్తనాన్ని రైతులు సాగు చేస్తారు. స్థానికంగా విత్తన లభ్యత లేకపోవడంతో రాయలసీమలోని నంద్యాల, తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, వరంగల్, హనుమకొండ ప్రాంతాల నుంచి ఇక్కడి రైతులు కొనుగోలు చేస్తున్నారు. ఆయా పట్టణాల కేంద్రంగా ఉన్న వరి విత్తన కంపెనీల నుంచి కొనుగోలు చేసి రైతులు ఇక్కడికి తెచ్చుకుంటున్నారు. జిల్లాలోని వ్యాపారులు సైతం అక్కడి కంపెనీల నుంచి తెప్పించి ఇక్కడి రైతులకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా పశ్చిమ డెల్టాలో రైతులు వరి సాగుకు సిద్ధం కావడంతో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుంచి వరి విత్తనాలు తెప్పిస్తున్నారు. డెల్టాలో ఒక్కొక్క గ్రామానికి చెందిన రైతులు బృందంగా ఏర్పడి ఎన్ని బస్తాలు కావాలో లెక్కించుకుని ఇద్దరు లేదా ముగ్గురు రైతులు తెలంగాణ, రాయలసీమ ప్రాంతానికి వెళ్లి వరి విత్తనాలు కొనుగోలు చేసి తెస్తున్నారు. బిల్లులు మొత్తం ఇద్దరు లేదా ముగ్గురు రైతుల పేర్లతో తీసుకొచ్చి ఇక్కడ గ్రామాల్లో విత్తనాలు పంపిణీ చేసుకుంటున్నారు. ఇది కొన్నేళ్లుగా సాగుతున్న ప్రక్రియ. అయితే ఇటీవల కాలంలో వరుసగా వరి విత్తనాల్లో కేళీలు వస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
కర్షకులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే..
- విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు గుర్తింపు పొందిన కంపెనీలనే ఎంపిక చేసుకోవాలి.
- నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న వ్యవసాయ ప్రయోగశాలలో వరి విత్తనాలు పరీక్షించుకుని నాణ్యత నిర్దారించుకోవచ్చు. ఇతర రకాలు కలిశాయో కూడా పరీక్షించుకోవచ్చు.
- లాంఫామ్లోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన ధ్రువీకరణ సంస్థ ప్రయోగశాలలోనూ పరీక్షించుకునే వెసులుబాటు ఉంది.
- విత్తన కొనుగోలు సమయంలో బిల్లు తీసుకుని పంట పూర్తయ్యే వరకు జాగ్రత్తగా పెట్టుకోవాలి.
ప్రైవేటు వ్యాపారులే ఆధారం..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో వరి సాగు చేసి కొంత మొత్తంలో విత్తనాలు రైతులకు విక్రయిస్తున్నారు. ఇవి కాకుండా ఏపీ సీడ్స్ ఆధ్వర్యంలో విత్తనాలు సేకరించి రైతులకు సరఫరా చేస్తున్నారు. ఇవన్నీ కూడా జిల్లాలో వరి సాగు చేసే పది శాతం విస్తీర్ణానికి మాత్రమే సరిపోతాయి. 90 శాతం విస్తీర్ణానికి రైతులు ప్రైవేటు కంపెనీలపైనే ఆధారపడుతున్నారు. వరి విత్తనాలు ఉత్పత్తి చేసే కంపెనీలు తెలంగాణ, రాయలసీమలో ఉండటంతో అక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు. ఏదైనా విత్తన సమస్యలు వస్తే రాయలసీమ, తెలంగాణ కేంద్రంగా కంపెనీలు ఉండటంతో రైతులు అక్కడికి వెళ్లి పరిష్కరించుకోలేకపోతున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి రైతులు ఆసక్తిచూపడం లేదు. స్థానిక వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేస్తే శాస్త్రవేత్తలను పంపి కేళీలు ఎంత శాతం ఉన్నాయి? ఎకరాకు ఎన్ని బస్తాల దిగుబడి నష్టపోయారు? వంటి వివరాలతో నివేదిక ఇస్తున్నారు. దీని ఆధారంగా కంపెనీపై కేసులు వేసి పరిహారం పొందే వెసులుబాటు ఉంది. రైతులు పోరాడలేక కంపెనీలతో ప్రైవేటు ఒప్పందాలు చేసుకుని నామమాత్ర పరిహారంతో సరిపెట్టుకున్నారు. ఈ విషయమై గుంటూరు జిల్లా వ్యవసాయాధికారి నున్నా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విత్తన నమూనాల సేకరణ, తనిఖీలు విస్తృతం చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ఒక్క నిర్ణయం.. ఆరు జీవితాలకు వరప్రసాదం!
[ 06-07-2024]
పుట్టెడు దుఃఖంలోనూ పలువురి ప్రాణాలు కాపాడేందుకు ఆ కుటుంబం ముందుకు వచ్చింది. -
నాడు గొప్పలు.. నేడు తిప్పలు..
[ 06-07-2024]
బడుల రూపురేఖలు మార్చేస్తామని నాడు వైకాపా సర్కారు చెప్పింది నిజమే.. వాటి రూపును దారుణంగా మార్చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. -
పాత్రధారులు సరే.. సూత్రధారులు ఎక్కడ?
[ 06-07-2024]
ఉమ్మడి గుంటూరులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్, 1బీ, నకిలీ చిరునామా ధ్రువపత్రాలు పెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారు. -
ఉల్లంఘనలు దండి.. ఆదాయానికి గండి..
[ 06-07-2024]
గుంటూరు నగర పట్టణ ప్రణాళిక విభాగం అవినీతి, అక్రమాల్లో మునిగితేలుతోంది. భవన అనుమతుల ఫీజుల రూపేణా నగరపాలికకు రావాల్సిన ఆదాయానికి ప్రణాళికాధికారులే గండికొట్టి తమ సొంత జేబులు నింపుకొంటున్నారు. -
నాణ్యత డొల్ల.. కష్టాలు నిలువెల్లా
[ 06-07-2024]
‘నాడు-నేడు’ పనులతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం.. మునుపెన్నడూ లేనిరీతిలో తరగతి గదులు నిర్మించాం.. సకల సౌకర్యాలు కల్పించాం’ అంటూ ఊదరగొట్టిన మాజీ సీఎం జగన్ మాటలన్నీ బూటకాలేనని నాటి లోపాలు నేడు ఒక్కొకటిగా బయటపడుతున్నాయి. -
పిన్నెల్లి అరాచకాలపై చర్చిద్దామా?
[ 06-07-2024]
‘మీకు ధైర్యముంటే మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేద్దాం.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్ని ఆస్తులు దోపిడీ చేశాడో, ఎంత గ్రానైట్ తరలించాడో.. ఎంత గ్రావెల్ అమ్ముకున్నాడో చర్చిద్దామా?’ అంటూ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాజీ సీఎం జగన్కు సవాల్ విసిరారు. -
లక్ష్యం 100 రోజులు.. 3,600 ఇళ్లు
[ 06-07-2024]
జిల్లాలో గృహ నిర్మాణాలను వేగవంతం చేసి లబ్ధిదారులకు అందజేసేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. -
జలవనరులకు జవసత్వాలు
[ 06-07-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో జలవనరుల కనీస నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వీర్యమయ్యాయి. -
బాలికలూ.. ఇబ్బందులు ఎదురైతే చెప్పండి
[ 06-07-2024]
లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినులు వెంటనే తమకు జరిగిన అన్యాయం ఇంట్లో తల్లిదండ్రులు, పోలీసులకు తెలియజేయడం ద్వారా అటువంటి నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా బాలికా పరిరక్షణ అధికారులు శ్రీప్రియ, కృష్ణ పేర్కొన్నారు. -
ఓపీకి వెళితే బీపీ ఖాయం!
[ 06-07-2024]
గుంటూరులోని సర్వజన ఆసుపత్రిలో ఓపీ సేవలందించేందుకు 11 కౌంటర్లున్నాయి. 70 మందికిపైగా నర్సింగ్ విద్యార్థులను నియమించారు. -
‘పిన్నెల్లిని జగన్ పరామర్శించడం సిగ్గుచేటు’
[ 06-07-2024]
ప్రజలు తమ పవిత్రమైన ఓటు వేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ను ధ్వంసం చేసి జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి జైలుకు వెళ్లి పరామర్శించడం సిగ్గుచేటని -
జల్సాలకు అలవాటు పడ్డారు.. దొంగతనాల వైపు మళ్లారు
[ 06-07-2024]
జల్సాలకు అలవాటు పడిన యువకులు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతూ పొలీసులకు దొరికిపోయారు. -
హైకోర్టు న్యాయవాదికి జైలుశిక్ష, జరిమానా
[ 06-07-2024]
భార్యను వేధించిన కేసులో హైకోర్టు న్యాయవాది నిమ్మల ప్రేమ్రాజ్కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ మంగళగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు షాక్.. కాంగ్రెస్లోకి మరో ఎమ్మెల్యే
-
ఉత్తరాఖండ్లో కొండచరియల బీభత్సం.. ఇద్దరు హైదరాబాదీల మృతి
-
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావు
-
కేరళలో ‘మెదడును తినే అమీబా’.. మరో కేసు నమోదు
-
ఎన్నో హెచ్చుతగ్గులు చూశా.. నన్ను గేలిచేశారు: మోదీతో హార్దిక్ పాండ్య
-
మార్కెట్కు అనుగుణంగా నైపుణ్య శిక్షణ: ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్